9:1, 9:2,3, 9:4, 9:5, 9:6, 9:7, 9:8-11, 9:12, 9:13-17, 9:18,19, 9:20,21, 9:22-23, 9:24,25, 9:26,27, 9:28,29
ఆదికాండము 9:1
మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
ఈ వచనంలో దేవుడు ఓడనుండి బయటకు వచ్చిన నోవహు కుటుంబానికి "మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి" అని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇవే మాటలను ఆయన తొలి మానవులైన ఆదాము హవ్వల విషయంలో ఉపయోగించారు (ఆదికాండము 1:27,28). ఎందుకంటే ఇప్పుడు నోవహు కుటుంబం కూడా ఆదాము హవ్వల వలే ఫలియించి అభివృద్ధి చెంది భూమిని నిండించాలి. ఈ మాటల ప్రకారం; ఫలియింపచేసేది దేవుడే అయినప్పటికీ, మనిషి ఆ దేవుని సంకల్పానికి లోబడుతూ మంచి వివాహ జీవితాన్ని కలిగియుండడం అతని బాధ్యత. కానీ విరోధియైన అపవాది దేవుని సంకల్పమైన ఈ వివాహ వ్యవస్థను నిర్వీర్యం చెయ్యాలనే ఉద్దేశంతో అనేకవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఒక్కటిగా కలిసియుండవలసిన స్త్రీ పురుషుల మధ్యలో ద్వేషం, వ్యభిచారం, స్వలింగసంపర్కం,...ఇలా వివాహ వ్యవస్థ నుండి మనిషిని దారితప్పిస్తున్నవన్నీ అందులో భాగమే. అందులో ఒకానొకటైన LGBTQ+ గురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
LGBTQ+ పై బైబిల్ దృక్పథం ఏంటి? బైబిల్ ప్రకారం మూడవ లింగం (Third Gender) ఉందా?
ఆదికాండము 9:2,3
మీ భయమును మీ బెదురును అడవి జంతువు లన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతికప్పగింపబడియున్నవి. ప్రాణముగల సమస్తచరములు మీకు ఆహారమగును. పచ్చని కూరమొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.
ఈ వచనాలలో దేవుడు నోవహు కుటుంబంతో మీ భయం మీ బెదురు జీవరాశులన్నిటికీ కలుగుతుందని తెలియచెయ్యడం మనం చూస్తాం. అందుకే క్రూరమృగాలు చాలామట్టుకు మనుషులకు దూరంగానే జీవిస్తున్నాయి. మిగిలిన చాలా జీవరాశులు మనిషికి భయపడుతూ లేక లోబడుతూ జీవిస్తున్నాయి. కొన్నిసార్లు వాటినుండి మానవుడికి ప్రమాదం సంభవించినప్పటికీ, అది మనిషి యొక్క పాపాన్ని బట్టి దేవుని అనుమతితోనే జరుగుతుంది.
యిర్మియా 5: 6 వారు తిరుగుబాటుచేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యమునుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణములయొద్ద పొంచి యుండును, వాటిలోనుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును.
అదేవిధంగా, ఇక్కడ దేవుడు "ప్రాణముగల సమస్తచరములు మీకు ఆహారమగును. పచ్చని కూరమొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను" అని పలికిన మాటలను కొందరు ఆధారం చేసుకుని జలప్రళయం తరువాతనే నరులు మాంసాహారం తినడం ప్రారంభించారని భావిస్తుంటారు. కానీ, మాంసాహారం తినడం అప్పుడే ప్రారంభించబడిందని మనం చెప్పలేము. ఎందుకంటే, ఈ అధ్యాయంలో దేవుడు మీరు ఫలియించి అభివృద్ధి చెందాలని (1వ) నరహత్య చెయ్యకూడదని (6వ) జలప్రళయానికి ముందున్న నియమాలనే మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఫలియించాలని దేవుడు ఆదాము హవ్వలతో చెప్పాడు (ఆదికాండము 1:27,28), నరహత్య చెయ్యడం నేరమని కయీనుకు శిక్షవిధించాడు (ఆదికాండము 4:8-14).
వాటినే దేవుడు మరలా నోవహుకూ అతని సంతానానికీ జ్ఞాపకం చెయ్యడాన్ని బట్టి, మాంసాహారం విషయంలో కూడా అదేవిధంగా జరిగిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఒకవిధంగా నూతనసృష్టి. నిజానికి ఆదాము హవ్వల పాపం తరువాత జంతువులను ఆయనకు బలిగా అర్పించడం ప్రారంభమైనప్పుడే అనగా జంతువులను చంపే అనుమతి వారికి లభించినప్పుడే మాంసాహారం తినడం కూడా ప్రారంభమైంది. గమనించండి. ఏదెనులో ఉన్నప్పుడు మనిషి జీవితం వేరు, ఏదెను నుండి గెంటివెయ్యబడ్డాక ఆ మనిషి జీవితం వేరు. ఏదెనులో పాపం లేని మనిషి ఏ జంతువునూ చంపవలసిన అవసరం లేదు. ఎందుకంటే అతనికి ఆహారానికి ఏ లోటూ లేదు. అలానే అతని పాపానికి బలి కూడా అవసరం లేదు. కానీ ఆ మనిషి ఏదెనునుండి గెంటివెయ్యబడ్డాక తన పాపప్రాయశ్చిత్తం కోసం జంతువులను చంపి దేవునికి బలులు అర్పించాలి. ఆ క్రమంలో అతని శారీరక శక్తికోసం వాటిని ఆహారంగా కూడా తినవచ్చు. ఎందుకంటే చంపే అనుమతి లభించినప్పుడే తినే అనుమతి కూడా లభించింది. దీనికి మరో కచ్చితమైన ఆధారం ఏంటంటే; హేబెలు గొర్రెల కాపరి (ఆదికాండము 4:2). వారు మాంసాహారం తినకుంటే గొర్రెలను ఎందుకు పెంచుతున్నట్టు? ఒకవేళ పాలు కోసం అంటారేమో, మరి దేవుడు ఎక్కడా పాలు త్రాగమని కూడా ఆజ్ఞాపించలేదుగా అవి మాత్రం ఎలా త్రాగుతున్నారు? కొందరు ఇంకాస్త తెలివిగా ఆలోచించి వారు గొర్రెలను పెంచుతుంది మాంసం కోసమూ కాదు, పాలకోసమూ కాదు కేవలం దేవునికి బలులను అర్పించడానికే అంటారేమో. అలాగైతే హేబెలు తన మందనుండి తొలిచూలు వాటిని అందులోనూ క్రొవ్వినవాటిని బలిగా తీసుకువచ్చాడు (ఆదికాండము 4:4) అంటే వారు దేవునికి మొదటపుట్టిన వాటినీ అందులోనూ శ్రేష్టమైనవాటినీ బలులుగా ఇచ్చేవారు. మరి తరువాత పుట్టినవాటినీ, బలంగా లేనటువంటి వాటినీ తినకుండా ఏం చేసేవారు? ఒకవేళ పూడ్చిపెట్టారు అంటే ఆ మాత్రం దానికి హేబెలు గొర్రెల కాపరిగా ఉండవలసిన అవసరం లేదుకదా, తన తండ్రితోనూ సహోదరునితోనూ కలసి సేద్యం చేస్తే వారికి కాస్త శ్రమ తగ్గుతుంది, పంట ఇంకా ఎక్కువ పండుతుంది. బలులు అర్పించాలంటే చుట్టుప్రక్కల స్వేచ్చగా తిరిగే గొర్రెల్లో బలమైనవాటిని పట్టుకుంటే సరిపోతుంది.
అంతేకాదు "జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచునుండిరి" (మత్తయి 24:38) అని రాయబడింది. అంటే వారు ఏం తినుంటారు శాఖాహారమేనా? నిజానికి "ప్రాణముగల సమస్తచరములు మీకు ఆహారమగును. పచ్చని కూరమొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను" అని ఆయన నోవహుకు జ్ఞాపకం చెయ్యడానికి బహుశా నోవహు ఆ ప్రజలు అలా తినడం కూడా దేవునిదృష్టిలో పాపమైంది అని భావించియుంటాడు. అలాంటప్పుడు అతనికి ఇకపై మేము మాంసాహారం తినవచ్చా తినకూడదా అనే సందేహం కలుగుతుంది. అందుకే దేవుడు "ప్రాణముగల సమస్తచరములు మీకు ఆహారమగును. పచ్చని కూరమొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను" అని మాంసాహారం తినవచ్చు అని మాటలు చెబుతున్నాడని నేను భావిస్తున్నాను.
ఆదికాండము 9:4
అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము.
ఈ వచనంలో ఆయన నోవహు కుటుంబానికి రక్తాన్ని తినకూడదని, రక్తమే ఆ జీవియొక్క ప్రాణమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. బహుశా జలప్రళయానికి ముందటి ప్రజలు రక్తాన్ని కూడా తింటూ ఉండవచ్చు. ఎందుకంటే అది చాలా రుచికరంగా ఉంటుందని మాంసం కంటే శక్తివంతమైనదని కొందరు భావిస్తుంటారు. అందుకే ఆయన "మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము" అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ ఆజ్ఞ లేఖనాలలో మనకు పదేపదే కనిపిస్తుంది ఉదాహరణకు; (లేవీకాండము 7:26, ద్వితీయోపదేశకాండము 12:23, 15:22, అపో.కార్యములు 15:28). ఇక్కడ మనం రెండు విషయాలను గుర్తించాలి.
1. 1. రక్తమే ప్రాణము అంటే, రక్తంలో ప్రాణముంటుందని కాదు కానీ, ఆ రక్తం ప్రాణానికి అధారంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. రక్తం లేకుండా ఏ ప్రాణీ ప్రాణంతో జీవించలేదు. ఈ వాక్యభాగం చూడండి.
లేవీయకాండము 17:14 దానిరక్తము "దాని ప్రాణమునకాధారము". కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. "వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము"; దానిని తిను ప్రతివాడు మరణశిక్షనొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.
2. అదేవిధంగా దేవుడు ఆ సందర్భంలో, రక్తాన్ని తినకూడదని కూడా చెబుతున్నాడు. దీనికి రెండు కారణాలు ఉన్నట్టుగా మనం భావించవచ్చు. మొదటిది; మనిషి చేసిన పాపానికి ఈ రక్తం దేవుని ముందు ప్రాయుశ్చిత్తం చేసేదిగా నియమించబడింది (బలిద్వారా).
లేవీయకాండము 17: 11,12 రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.
ఈ కారణంచేత రక్తం తినకూడదు, దానిని నీళ్ళవలే బయటపారబొయ్యాలి (బలిలో మినహా).
ద్వితియోపదేశకాండము 12: 16 మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలె నేలమీద పారబోయవలెను.
ఐతే, యేసుక్రీస్తు బలికి ఛాయగా ఉన్నటువంటి జంతుబలులు, ఆయన సంపూర్ణ బలితో నిలచిపోయినప్పటికీ, నూతననిబంధన విశ్వాసులు కూడా రక్తం తినకూడదనే ఆజ్ఞాపించబడ్డారు.
అపొ.కార్యముకు 15:28 విగ్రహములకు అర్పించినవాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.
దీనికి కారణం ఏంటంటే, సాధారణంగా రక్తాన్ని "fluid of life" అంటారు. శాస్త్రీయంగా కోణంలో దీనిని పరిశీలించినప్పుడు, ఏదైన ఒక జీవికి రోగం సంక్రమించినప్పుడు ఆ ప్రభావం రక్తంలోనే ఎక్కువగా ఉంటుంది. (మనిషికి కూడా, అందుకే మొదట రక్తపరీక్ష చేస్తారు) ఈ కారణం చేత ఏదైనా రోగం బారిన పడిన జీవియొక్క రక్తాన్ని ఎవరైనా తింటే ఆ రోగం వారికి సంక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి మనిషి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా దేవుడు రక్తాన్ని తినకూడదని ఆజ్ఞాపించాడు. ఈవిధంగా దేవుని ఆజ్ఞలు ఒకవైపు అతని ఆధ్యాత్మిక జీవితానికే కాదు, శారీరానికి కూడా మేలు చేసేవిగా ఉంటాయి. ఉదాహరణకు ఆయన వ్యభిచరించకూడదు అని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే దేవుడు నియమించిన వివాహ వ్యవస్థకు విరుద్ధంగా వ్యభిచరించినప్పుడు ఆ మనిషికి ఆయన నియమాన్ని మీరిన పాపం అంటడమే కాదు, అతని కుటుంబం, శరీరం కూడా పాడు ఔతుంది. అందుకే "జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు" (1కోరింథీ 6:18) అని హెచ్చరించబడింది. సున్నతి కూడా ఇంతే; అది వారికి నిబంధన గుర్తుగా శరీరానికి కూడా మేలు చేసేదిగా నియమించబడింది (ఆదికాండము 17:10-12 వ్యాఖ్యానం చూడండి). క్రొవ్వును తినకూడదు అన్నప్పుడు కూడా ఇంతే (లేవీకాండము 3:16 వ్యాఖ్యానం చూడండి).
ఆదికాండము 9:5
మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.
ఈ వచనంలో దేవుడు నరుని రక్తం గురించి విచారణ చేస్తానని హెచ్చరించడం మనం చూస్తాం. దీనికి ఏవిధంగానైనా నరహత్య చెయ్యకూడదని (ప్రాణం తియ్యకూడదని) భావం. ఈ కారణం చేత, నరహంతకులకు ఆయన తప్పకుండా తీర్పుతీరుస్తాడు. అందుకే ఆయన హేబెలు ప్రాణం (రక్తం) విషయంలో ఆయన కయీనును విమర్శచేసి, కఠినంగా తీర్పుతీర్చాడు (ఆదికాండము 4:9-13). కాబట్టి నరహత్య చేసినవారు ఎవరూ కూడా దేవుని తీర్పు నుండి తప్పించుకోలేరు.
నహూము 3: 1 నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ.
ప్రకటన గ్రంథం 22: 15 కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును "నరహంతకులును" విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
అదేవిధంగా ఆ సందర్భంలో ఆయన, నరులను చంపిన జంతువులను కూడా విచారిస్తానని పలకడం మనం చూస్తాం. కాబట్టి మనిషి ప్రాణం జంతువు ద్వారా పోయినా కూడా దేవుడు దానిని విడిచిపెట్టడు. ఉదాహరణకు ఆయన ధర్మశాస్త్రంలో మనిషికి హాని కలిగించిన జంతువులకు కూడా శిక్షవిధించాలని ఆ జ్ఞాపించాడు (నిర్గమకాండము 21: 28).
ఆదికాండము 9:6
నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింప బడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.
దీనికి పై వచనంలో దేవుడు నరహత్య చెయ్యకూడదని చెబుతూ, ఈ వచనంలో నరహత్య ఎందుకు చెయ్యకూడదో ఆ కారణం కూడా వివరించడం మనం చూస్తాం. మనిషిని దేవుడు తనపోలిక తన స్వరూపంలో సృజించాడు (ఆదికాండము 1:26,27). మనిషి పాపం చేసాక తనలోని దేవుని గుణలక్షణాలకు (దేవుని స్వరూపానికి) వ్యతిరేకంగా ప్రవర్తింపచేసే పాప/పతన స్వభావాన్ని సంతరించుకున్నప్పటికీ, అనగా ఆత్మీయంగా చనిపోయినప్పటికీ, అతను ఇంకా దేవుని పోలిక దేవుని స్వరూపంలోనే ఉన్నాడు. అందుకే "దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే "దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను" శపింతుము" (యాకోబు 3:9) అన్యాయంగా మనిషిని శపించడం కూడా పాపమని రాయబడింది.
ఈ కారణం చేత, దేవునిపోలిక దేవుని స్వరూపంలో ఉన్న మనిషిని చంపడం దేవుణ్ణి అవమానించడమే ఔతుంది. ఇందుకు భిన్నంగా చాలా మతగ్రంథాల్లో శరీరానికి ఎటువంటి ప్రాముఖ్యతా లేదని, శరీరంలో ఉన్న ఆత్మకు మాత్రమే ప్రాముఖ్యత ఉంటుందని, ఈ కారణం చేత శరీరాన్ని ఎవరైనా చంపినప్పటికీ ఏమీకాదన్నట్టు రాయబడింది. ఉదాహరణకు హిందువులు ప్రామాణిక గ్రంథంగా నమ్మే "భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్య యాగంలో" ఇటువంటి మాటలే మనకు కనిపిస్తాయి.
అదేవిధంగా, ఆ మాటల్లో దేవుడు నరుని రక్తము చిందించువాడి రక్తము నరుడివలనే చిందించబడునని పలకడం కూడా మనం చూస్తున్నాం. ఇది నిష్కారణంగా దేవుని పోలిక దేవుని స్వరూపంలో ఉన్న మనిషిని హత్యచేసినందుకు దేవుడు విధిస్తున్న చట్టపరమైన శిక్షగా మనం భావించాలి. దీనిని బట్టి "ఒక నిర్దోషిని" హత్య చెయ్యడం దేవుణ్ణి అవమానించడం ఔతుంది తప్ప, ఆ హత్యకు ప్రతిహత్య జరగడం (చట్టపరంగా) ఆ విధంగా ఎంచబడదు. ఎందుకంటే అది దేవుడే స్వయంగా నియమిస్తున్నటువంటి న్యాయమైన శిక్ష. ధర్మశాస్త్రంలో దీనిగురించి చాలా స్పష్టంగా రాయబడింది.
నిర్గమకాండము 21:12,14 నరుని చావగొట్టినవానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే ఒకడు తన పొరుగువానిమీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినయెడల వాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవ లెను.
సంఖ్యాకాండము 35:16-18 ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధ ముతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. ఒకడు చచ్చు నట్లు మరియొకడు రాతితో వాని కొట్టగా దెబ్బతినిన వాడు చనిపోయినయెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మరియు ఒకడు చచ్చునట్లు మరియొకడు చేతికఱ్ఱతో కొట్టగా దెబ్బ తినినవాడు చనిపోయిన యెడల కొట్టిన వాడు నర హంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
సంఖ్యాకాండము 35:31,33 చావతగిన నరహంతకుని ప్రాణముకొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు.
ఆయన భూమిపైకి జలప్రళయాన్ని రప్పించిన కారణాలలో అప్పటి ప్రజలు చేస్తున్న బలత్కారం ప్రధానమైనది (ఆదికాండము 6:11). బలాత్కారం అన్నప్పుడు హత్యలు కూడా పరిగణలోకి వస్తాయి. అప్పటి ప్రజలు చేస్తున్న హత్యలను బట్టి ఆయన జలప్రళయాన్ని రప్పించి, వారికి తీర్పుతీరిస్తే, అటువంటి జలప్రళయం మరలా కలగదని చెబుతూనే (ఆదికాండము 9:15) ఆ బలత్కారాన్ని నియంత్రించడానికి ఆయన చట్టవ్యవస్థను ప్రవేశపెట్టాడు.
రోమీయులకు 13: 4 (చట్టం) వారు ఊరకయే "ఖడ్గము" ధరింపరు. "కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు".
రోమీయులకు 13:1,2 ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. కాబట్టి అధికారమును ఎది రించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.
అయితే, ప్రస్తుతకాలంలో నరుల పాపం ప్రభలమౌతున్నకొద్దీ కొన్ని చట్టవ్యవస్థలు కూడా దారితప్పి అనైతికతవైపుగా పయనిస్తున్నాయి. ఈ పరిణామం కూడా, త్వరలో క్రీస్తు ద్వారా లోకానికి రాబోతున్న న్యాయమైన తీర్పును సూచిస్తుంది. ఈ విషయంలో విశ్వాసులు అధైర్యపడకుండా, ఈ పరిస్థితులన్నీ క్రీస్తు రాకడకు గురుతులుగా భావించి దానికోసం ఆసక్తితో ఎదురుచూడాలి, సాధ్యమైనంతమట్టుకు దేవుని న్యాయాన్ని బట్టి నేరస్తులకు శిక్షలు పడేలా ప్రయాసపడాలి. ఈ నరహత్య గురించీ, ఆ విషయంలో దేవుని న్యాయం గురించీ మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం మరియు వ్యాఖ్యానం తప్పక చదవండి.
పది ఆజ్ఞల వివరణ
నిర్గమకాండము 21:23-25 వ్యాఖ్యానం చూడండి
ఆదికాండము 9:7
మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.
ఈ వచనంలో దేవుడు మరలా వారిపట్ల తన సంకల్పం గురించి నోవహు కుటుంబానికి జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. దేవుడు ఒకే విషయాన్ని మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నాడంటే, దానికి దేవుడు ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నాడో గ్రహించాలి (ఆదికాండము 41:32). కాబట్టి ఈ అధ్యాయ ప్రారంభంలో నేను తెలియచేసినట్టుగా, విశ్వాసులందరూ ఆ దేవుని సంకల్పాన్ని గుర్తించి మంచి వివాహ జీవితాన్ని ప్రారంభించి ఫలియించాలి. దేవుని ప్రత్యేక అనుగ్రహంతో మినహా (మత్తయి 19:11) ఇతర కారణాలతో వివాహ జీవితానికి దూరం కాకూడదు. ప్రస్తుతం సమాజంలో, స్త్రీ పురుషుల మధ్య వివక్షలు చోటు చేసుకోవడం వల్లకూడా ఎంతోమంది వివాహ జీవితానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. మరికొందరైతే ఇంకా దిగజారి, స్వలింగసంపర్కులుగా మారిపోతున్నారు. ఇవన్నీ దేవుని సంకల్పానికి వ్యతిరేకమైన పాపాలే.
ఆదికాండము 9:8-11
మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతాన ముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను.
ఈ వచనాలలో దేవుడు గతంలో చేసిన కృపగల నిబంధనను (ఆదికాండము 6:18) మరలా జ్ఞాపకం చేస్తూ, జలప్రళయం గురించి కూడా గతంలో పలికిన మాటలనే (ఆదికాండము 8:21) మరలా ప్రస్తావించడం మనం చూస్తాం. ఈ కృపగల నిబంధన ప్రకారం మనిషి తన దృష్టికి పాపిగా మారుతున్నప్పటికీ ఆయన మరలా జలప్రళయం ద్వారా భూమి అంతటినీ నాశనం చెయ్యడు. దీనివల్ల ఆ నిబంధనలో భాగమైన జీవరాశులు కూడా సమూలంగా నాశనమయ్యే పరిస్థితి ఉండదు.
ఆదికాండము 9:12
మరియు దేవుడు నాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే.
ఈ వచనంలో దేవుడు తాను నోవహుతోనూ, అతనితో ఉన్న జీవరాశులతోనూ చేసిన నిబంధనకు గురుతును తెలియచేస్తున్నట్టు మనం చూస్తాం. ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనకు కూడా సున్నతిని గురుతుగా నియమించాడు (ఆదికాండము 17:10,11, రోమా 4:11). దీనికి కారణం ఒకటే, ఆ గురుతును మనం వారు/మనం చూసినప్పుడల్లా దాని వెనుక ఉన్న దేవుని నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి.
ఆదికాండము 9:13-17
మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగానుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్తశరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములోనుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతిదానికిని మధ్యనున్న నిత్యనిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను. మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.
గత వచనాలలో దేవుడు తన నిబంధనకు గురుతుగా ప్రస్తావించింది మేఘంలోని రంగురంగుల ధనుస్సుగా ఈ వచనాలలో మనకు అర్థమౌతుంది. ఆయన అప్పుడు నోవహుతో చేసిన నిబంధనకు గురుతు ఐన ఆ ధనుస్సు ఇప్పటికీ వర్షం వచ్చేటప్పుడు మనకు కనిపిస్తూ, ఆ నిబంధనను మనకు గుర్తు చేస్తుంది. శాస్త్ర ప్రపంచం అది ఎందుకు ఏర్పడుతుందో చెప్పగలదు కానీ ఎప్పటినుంచి దేనికి గుర్తుగా ఏర్పడుతుందో బైబిల్ మాత్రమే చెబుతుంది.
ఆదికాండము 9:18,19
ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.
ఈ వచనాలలో నోవాహు కుమారుల సంతానం భూమియంతటా వ్యాపించినట్టు మనం చూస్తాం. ఆ వివరాలు అన్నీ పదవ అధ్యాయంలో రాయబడ్డాయి. ఐతే ఇక్కడ రచయిత (మోషే) ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారుల పేర్లను తెలియచేస్తూ, ఆ ముగ్గురు కుమారుల్లో ఒక కుమారుడైన హాముకు పుట్టిన కనాను అనేవాడి పేరును కూడా ప్రస్తావిస్తున్నాడు. ఎందుకిలా ప్రస్తావించాడో క్రింది వచనాలలో చూద్దాం.
ఆదికాండము 9:20,21
నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను.
ఈ వచనంలో నోవహు ద్రాక్షారసం త్రాగి వస్త్రహీనుడిగా మారినట్టు మనం చూస్తాం. అప్పటిప్రజల విందుల్లో ద్రాక్షారసం త్రాగడం ఒక భాగమైనప్పటికీ, అది మత్తు కలిగించేంత స్థాయిలో త్రాగడం తప్పకుండా విపరీత పరిణామాలకు దారితీస్తుంది, విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఇక్కడ నోవహు విషయంలో కూడా అదే జరిగింది. అందుకే బైబిల్ మత్తుకు దూరంగా ఉండమని మనల్ని హెచ్చరిస్తుంది.
యెషయా 5: 11 మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ.
సామెతలు 20: 1 ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.
ఎఫెసీయులకు 5: 18 మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మపూర్ణులైయుండుడి.
అదేవిధంగా నోవహు గురించి మనం అతను నీతిమంతుడని, నిందారహితుడని చదివాం (ఆదికాండము 6:9, 7:1). అదేవ్యక్తి ఈ సందర్భంలో మాత్రం మత్తుడిగా మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి నీతిమంతులూ, నిందారహితులు కూడా పడిపోయే అవకాశం ఉందని మనం గ్రహించి, మరింత జాగ్రతకలిగి నడుచుకోవాలి.
1 కొరింథీయులకు 10:11,12 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.
ఫిలిప్పీయులకు 2:12 కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి.
సామెతలు 28:14 నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును.
ఆదికాండము 9:22-23
అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడైయుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమయిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుటవలన తమ తండ్రి దిసమొలను చూడలేదు.
ఈ వచనాలలో హాము తన తండ్రియైన నోవహును వస్త్రహీనుడిగా చూసి, తన సహోదరులకు తెలియచెయ్యడం, వారు అతని దేహంపై బట్టను కప్పడం మనం చూస్తాం. ఇక్కడ నోవహు చిన్నకుమారుడైన హాము చేసింది మనం పరిశీలించగలిగితే, తన తండ్రిని పొరపాటున వస్త్రహీనుడిగా చూడడం అతని తప్పుకాదు కానీ, చూసిన తర్వాత వెంటనే అతని దేహాన్ని కప్పకుండా, తన సహోదరుల యొద్ద ఆ విషయాన్ని ప్రస్తావించడం తప్పకుండా పొరపాటే. ఎందుకంటే అతనిక్కడ తన తండ్రి విషయంలో చెయ్యదగింది కూడా చెయ్యకుండా, తన సహోదరులకు ఆ వార్తను ఎగతాళిగా ప్రకటించాడు. ఒకవిధంగా, తండ్రియొక్క గౌరవాన్ని భంగపరిచాడు.
సామెతలు 3:27 మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.
3యోహాను 1:11 ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.
కానీ అతని సోదరులైన షేము, యాపెతులు ఆ విషయంలో తమ తండ్రిని ఎగతాళి చెయ్యకుండా, ఆ అవమానకర పరిస్థితిని కప్పే ప్రయత్నం చేస్తూ, ఆ క్రమంలో తమ తండ్రిని వస్త్రహీనుడిగా చూడడానికి కూడా వారు ఇష్టపడలేదు, అందుకే వెనుకతట్టుగా వెళ్ళి అతనికి వస్త్రాన్ని కప్పారు. ఇది తమ తండ్రిపై వారికున్న గౌరవాన్ని సూచిస్తుంది.
ఆదికాండము 9:24,25
అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసినదానిని తెలిసికొని కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.
ఈ వచనాలలో నోవహు మత్తు నుండి మేలుకుని, తన చిన్నకుమారుడు చేసినదానిని బట్టి అతనిని శపించడం మనం చూస్తాం. అయితే ఈ క్రమంలో అతను హాము పేరును తీసుకోకుండా అతని కుమారుడైన కనానును ప్రస్తావిస్తున్నాడు, హాముకు కనాను కాకుండా ఇంకా ముగ్గురు కుమారులు ఉన్నప్పటికీ (అదికాండము 10:6) వారిని శపించలేదు. కొందరు దీనిని ఆధారంగా చేసుకుని, అక్కడ హాము నోవహును వస్త్రహీనుడిగా చూసాడనే మాటలు Euphemism (ఇబ్బందిగా అనిపించే పదాలను వేరేలా చెప్పడం) పద్ధతిలో రాయబడ్డాయని, వాస్తవానికి హాము నోవహు భార్యతో (తల్లితో) శయనించి కనానును కన్నాడని అందుకే నోవహు ఆ కనానును శపించాడని చెబుతుంటారు.
బైబిల్ లో కొన్నిచోట్ల Euphemism పద్ధతి ఉందనడంలో నాకు సందేహం లేదు. ఉదాహరణకు; అబ్రాహాము యాకోబులు తమ తొడక్రింద చెయ్యి పెట్టి చెయ్యమన్న ప్రమాణాలు (ఆదికాండము 24:2,9, 47:29) వాస్తవానికి మర్మాంగం క్రింద పెట్టి చేసేవే. అక్కడ Euphemism పద్ధతిలోనే తొడ అనే పదం వాడారు. కానీ మనం చూస్తున్న నోవహు హాముల సంఘటనలో పదాలు కాదు సందర్భమే వేరుగా కనిపిస్తుంది. ఒకవేళ నోవహు వస్త్రహీనుడైయుండగా, హాము అతని దిసమొలను చూసాడన్నప్పుడు, అది Euphemism పద్ధతిలో రాయబడిందని, వాస్తవానికి హాము నోవహు భార్యతో (తల్లితో) శయనించాడని భావిస్తే, హాము వచ్చి తన సహోదరులతో తమ తండ్రి వస్త్రహీనుడిగా పడియున్నాడని చెప్పడాన్ని, వారిద్దరూ నోవహు దిసమొలను చూడకుండా వస్త్రంతో కప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు నోవహు ద్రాక్షతోట నాటడాన్ని, ఆ రసం త్రాగి మత్తుడై పడుకోవడాన్ని ఇంకెలా అర్థం చేసుకోవాలి? కాబట్టి నోవహు కనానును మాత్రమే ఎందుకు శపించాడనే ప్రశ్నకు సమాధానంగా ఇలాంటి అసహ్యకరమైన, సందర్భరహితమైన వివరణలను ఎంచుకోకూడదు.
ఎందుకంటే, హాము అలా చెయ్యడంలో అతని కుమారుడైన కనాను పాత్ర ఏముందో మనకు తెలియదు. కానీ హేతువు లేని శాపం తగలదని వాక్యం చెబుతుంది కాబట్టి (సామెతలు 26:2) ఆ శాపం కనానుకు తగిలిందంటే అతని తండ్రి చేసినదానిలో అతని పాత్రకూడా తప్పకుండా ఉండేయుంటుంది. అందుకే నోవహు అతనిని మాత్రమే శపించి తన తండ్రికి పుట్టిన మిగిలిన కుమారులను మినహాయించాడు. కాబట్టి ఇది కనానుపై అన్యాయంగా మోపబడిన శాపం కాదు. ఇక హాము విషయానికి వస్తే, తన కుమారుడు శపించబడినప్పుడు ఆ వేదన హాముకు కూడా కలుగుతుంది. ఒక కుమారుడిగా తండ్రిపట్ల సరైనది చెయ్యనందుకు, తన కుమారుడి విషయంలో ఇది హాముకు కలిగిన పర్యవసానం.
అదేవిధంగా, నోవాహు కనానును శపించినప్పుడు, అది నెరవేరడానికి కొన్నివందల సవత్సరాల సమయం పట్టింది. ఆమధ్య కాలంలో వారు ఎంతో బలమైన జనంగా విస్తరించినట్టు ఇశ్రాయేలీయులకూ వారికి మధ్య జరిగిన యుద్ధాలను బట్టి మనకు అర్థమౌతుంది. దీనినిబట్టి మనం ఒక విషయాన్ని గుర్తించాలి, దేవుని ప్రజలకు విరోధులైన శాపగ్రస్తులు ఎంతగా ప్రబలినప్పటికీ, దేవుడు ఏర్పరచిన సమయంలో వారికి నాశనం తప్పదు.
విచారకరమైన విషయం ఏంటంటే నోవహు హాము సంతానమైన కనానును "కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును" అని శపించడాన్ని బట్టి ఐరోపాలో ఉన్న క్రైస్తవులు ఆఫ్రికాలో నివశిస్తున్న హాము సంతానాన్ని దాసులుగా చేసుకుని వారిచేత కఠినమైన సేవలు చేయించుకునేవారు. దానిని వారు హాము సంతానానికి దాసత్వం అనేది దేవుడే నిర్ణయించాడు కాబట్టి మేము చేస్తుంది తప్పుకాదని సమర్థించుకునేవారు. దీనివల్ల క్రైస్తవ్యం బానిసత్వాన్ని ప్రోత్సహిస్తుందనే నింద కూడా పడింది. కానీ గమనించండి.
1. నోవహు హాము సంతానం మొత్తాన్ని శపించలేదు అతని కుమారులలో ఒకడైన కనానును మాత్రమే శపించాడు. దానికి కారణం ఏమైయుండవచ్చో ఇప్పటికే మనం చూసాం. కాబట్టి ఆఫ్రికాలో ఉన్న మిగిలిన హాము సంతానానికి ఆ శాపం వర్తించదు. వాస్తవానికి కనాను సంతానమైన కనానీయులు ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్న కనాను ప్రాంతంలో స్థిరపడ్డారు.
2. చుట్టుప్రక్కల దేశాలనుండి దాసదాసీలను కొనుక్కునే ఆ కాలంలో కూడా ధర్మశాస్త్రం ప్రకారం ఎవరూ ఆ పరదేశులతో కఠినంగా వ్యవహరించకూడదు (నిర్గమకాండము 22:21, లేవీకాండము 19:33,34). ధర్మశాస్త్రం దృష్టిలో దాసుడూ యజమాని అంటే ఒక ఒప్పందం ప్రకారం పనిచేసేవారూ చేయించుకునేవారు అని అర్థం. కాబట్టి యజమానులు వారిని తమదగ్గర పనిచేసే ఉద్యోగుల మాదిరిగానే చూడాలి తప్ప బానిసలుగా కాదు. "నిన్ను వలె నీ పొరుగువానిని" ప్రేమించాలనే ఆజ్ఞ ఎలాంటి జాతీయ, ప్రాంతీయ బేధం లేకుండా మనుషులందరికీ వర్తిస్తుందని యేసుక్రీస్తు మంచి సమరయుని ఉపమానంలో మనం గమనిస్తాం (లూకా 10:27-36), ఎందుకంటే ధర్మశాస్త్రంలో అది అలానే అన్యులకు కూడా వర్తిందేదిగా నియమించబడింది (లేవీకాండము 19:33,34). కాబట్టి యజమానులు తమ దాసులను కూడా తమ వలే ప్రేమించాలి. అందుకే ఆ దాసుల విషయంలో చాలా కచ్చితమైన ఆజ్ఞలు రాయబడ్డాయి (నిర్గమకాండము 21:20,21, 26,27). ఆ మాటల భావాన్ని నేను స్పష్టంగా వివరించాను (నిర్గమకాండము 21 వ్యాఖ్యానం చూడండి).
3. నూతననిబంధనలో పౌలు "యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని యెరిగి, న్యాయమైనదియు ధర్మాను సారమైనదియు మీ దాసులయెడల చేయుడి" (కొలస్సీయులకు 4:1) అని అప్పటికే దాసులను కలిగియున్న యజమానులను హెచ్చరిస్తున్నాడు.
ఈవిధంగా బైబిల్ గ్రంథంలో కఠినదాస్యానికి ఎక్కడా అవకాశం లేదు. తమకున్న ఇబ్బందులను బట్టి స్వచ్చందంగా ఒకరికి దాసులుగా పని చెయ్యడానికి మాత్రమే అవకాశం కల్పించబడింది (ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగి తరహాలో). కాబట్టి ఐరోపాలో ఉన్న క్రైస్తవులు ఆఫ్రికాలోని హాము సంతానాన్ని బలవంతంగా దాసులుగా మార్చుకోవడం, వారిచేత కఠినదాసత్వం చేయించుకోవడం ఏవిధంగానూ వాక్య అనుకూలం కాదు. వాక్య విరుద్ధం. నోవహు శాపం కూడా వారికి వర్తించదు. అలాగైతే ఐగుప్తీయులు కూడా హాము సంతానమే (కీర్తనలు 78:51, 105:23,27, 106:21,22). అందుకే హాము కుమారుడైన మిస్రాయిము పేరుతో (ఆదికాండము 10:6, 1 దినవృత్తాంతములు 1:8) ఐగుప్తును సంబోధిస్తారు (ఆదికాండము 50:11). ఒకవేళ హాము సంతానమంతా శాపగ్రస్తులే ఐతే మిస్రాయిము నుండి విస్తరించిన ఈ ఐగుప్తు గురించి దేవుడు ఏమంటున్నాడో చూడండి.
యెషయా 19:19-25 ఆ దినమున ఐగుప్తుదేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక స్తంభమును ఉండును. అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహో వాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును. ఐగుప్తీయులు తెలిసికొనునట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసి కొందురు వారు బలి నైవేద్యముల నర్పించి ఆయనను సేవించెదరు యెహోవాకు మ్రొక్కుకొనెదరు తాము చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన నంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరున కును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవిం చెదరు. "ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగ నుండును". "సైన్యములకధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును".
ఈ వాక్యభాగం ప్రకారం హాము సంతానమైన ఐగుప్తీయులు కూడా క్రీస్తు నందు ఆశీర్వదించబడినవారే. అసలు ఐరోపాలో ఉన్న క్రైస్తవులు ఐగుప్తులో ఉన్న హాము సంతానాన్ని (మిస్రాయిమును) వదిలేసి ఆఫ్రికాలో ఉన్నటువంటి హాము సంతానాన్ని (కూషును) దాసులుగా మార్చుకుంటున్నప్పుడే వారి కుట్ర మనకు అర్థం అవ్వాలి. ఐగుప్తీయులు అన్నివిధాలుగా బలవంతులు కాబట్టి వీరు వారిని దాసులుగా మార్చుకోలేరు. కానీ ఆఫ్రికాలో ఉన్న వారు అన్నివిధాలుగా బలహీనులు కాబట్టి వారిపై వీరి పెత్తనం చెలాయించాలి అనుకున్నారు. అందుకు నోవహు శాపాన్ని వక్రీకరించి సాటి క్రైస్తవుల నుండి వస్తున్న విమర్శలను తప్పించుకునే ప్రయత్నం చేసారు. వీరు ఇతరులను బానిసలుగా మార్చుకోవాలనే దుర్మార్గతను నెరవేర్చుకోవడానికి, వాక్య నియమాలను మీరడమే కాదు, వారు చేస్తుంది దుర్మార్గం కాదని కప్పి పుచ్చుకోవడానికి "నోవహు శాపం" అంటూ వాక్యాన్ని వక్రీకరించారు కూడా. కాబట్టి వీరు అసలు క్రైస్తవులే కాదు. గమనించండి; బైబిల్ దేవుణ్ణి బైబిల్ పరిధిలో పరిశీలించాలి తప్ప, వాక్య విరుద్ధమైన లేక నామకార్థ క్రైస్తవుల ఆరాచకాలనూ సాంప్రదాయాలనూ బట్టి కాదు. బైబిల్ విమర్శకులకు ఇలాంటి నిజాయితీ ఉండదు కాబట్టే క్రైస్తవులుగా పిలవబడుతున్నవారి దుష్టక్రియలను చూపించి దానిని బైబిల్ కూ క్రైస్తవ్యం మొత్తానికీ ఆపాదిస్తుంటారు.
ఆదికాండము 9:26,27
మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.
ఈ వచనాలలో నోవహు తన కుమారులైన షేము, యాపెతులు చేసిన మంచిని బట్టి, దేవుణ్ణి స్తుతిస్తున్నట్టు మనం చూస్తాం. అతను ఆ విధంగా చెయ్యడంలో సమస్త మంచికీ, మంచి చెయ్యాలనే ప్రేరణకీ దేవుడు మాత్రమే మూలమనే సందేశం నిక్షిప్తమై ఉంది. ఈ రోజు విశ్వాసులు చేసే క్రియలను బట్టికూడా ప్రజలు దేవుణ్ణి స్తుతించగలగాలి.
మత్తయి సువార్త 5:16 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
అదేవిధంగా, తరువాత అధ్యాయాల ప్రకారం ఈ షేము సంతానం నుండే, విశ్వాసులకు తండ్రిగా పేరుపొందిన అబ్రాహాము జన్మించాడు. యాపెతు అతని గుడారంలో నివసిస్తాడు అన్నప్పుడు వారిద్దరి సంతానాలు ఒకదానితో ఒకటి మంచి సంబంధాన్ని కలిగియుంటాయనే అర్థం వస్తుంది.
ఆదికాండము 9:28,29
ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడువందల ఏబదియేండ్లు బ్రదికెను. నోవహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
ఈ వచనాలలో నోవహు మరణించినట్టుగా మనం చూస్తాం. బైబిల్ చరిత్రలో ఈ నోవహు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న వ్యక్తి. నూతననిబంధనలో కూడా ఇతని ప్రస్తావనలు మనం చూస్తుంటాం (మత్తయి 24:37, హెబ్రీ 11:7, 1 పేతురు 3:20). అదేవిధంగా జలప్రళయం తరువాత ఈభూమి పైన ఎక్కువకాలం బ్రతికిన వ్యక్తి కూడా ఇతనే.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 9
9:1, 9:2,3, 9:4, 9:5, 9:6, 9:7, 9:8-11, 9:12, 9:13-17, 9:18,19, 9:20,21, 9:22-23, 9:24,25, 9:26,27, 9:28,29
ఆదికాండము 9:1
మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
ఈ వచనంలో దేవుడు ఓడనుండి బయటకు వచ్చిన నోవహు కుటుంబానికి "మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి" అని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇవే మాటలను ఆయన తొలి మానవులైన ఆదాము హవ్వల విషయంలో ఉపయోగించారు (ఆదికాండము 1:27,28). ఎందుకంటే ఇప్పుడు నోవహు కుటుంబం కూడా ఆదాము హవ్వల వలే ఫలియించి అభివృద్ధి చెంది భూమిని నిండించాలి. ఈ మాటల ప్రకారం; ఫలియింపచేసేది దేవుడే అయినప్పటికీ, మనిషి ఆ దేవుని సంకల్పానికి లోబడుతూ మంచి వివాహ జీవితాన్ని కలిగియుండడం అతని బాధ్యత. కానీ విరోధియైన అపవాది దేవుని సంకల్పమైన ఈ వివాహ వ్యవస్థను నిర్వీర్యం చెయ్యాలనే ఉద్దేశంతో అనేకవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఒక్కటిగా కలిసియుండవలసిన స్త్రీ పురుషుల మధ్యలో ద్వేషం, వ్యభిచారం, స్వలింగసంపర్కం,...ఇలా వివాహ వ్యవస్థ నుండి మనిషిని దారితప్పిస్తున్నవన్నీ అందులో భాగమే. అందులో ఒకానొకటైన LGBTQ+ గురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
LGBTQ+ పై బైబిల్ దృక్పథం ఏంటి? బైబిల్ ప్రకారం మూడవ లింగం (Third Gender) ఉందా?
ఆదికాండము 9:2,3
మీ భయమును మీ బెదురును అడవి జంతువు లన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతికప్పగింపబడియున్నవి. ప్రాణముగల సమస్తచరములు మీకు ఆహారమగును. పచ్చని కూరమొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.
ఈ వచనాలలో దేవుడు నోవహు కుటుంబంతో మీ భయం మీ బెదురు జీవరాశులన్నిటికీ కలుగుతుందని తెలియచెయ్యడం మనం చూస్తాం. అందుకే క్రూరమృగాలు చాలామట్టుకు మనుషులకు దూరంగానే జీవిస్తున్నాయి. మిగిలిన చాలా జీవరాశులు మనిషికి భయపడుతూ లేక లోబడుతూ జీవిస్తున్నాయి. కొన్నిసార్లు వాటినుండి మానవుడికి ప్రమాదం సంభవించినప్పటికీ, అది మనిషి యొక్క పాపాన్ని బట్టి దేవుని అనుమతితోనే జరుగుతుంది.
యిర్మియా 5: 6 వారు తిరుగుబాటుచేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యమునుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణములయొద్ద పొంచి యుండును, వాటిలోనుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును.
అదేవిధంగా, ఇక్కడ దేవుడు "ప్రాణముగల సమస్తచరములు మీకు ఆహారమగును. పచ్చని కూరమొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను" అని పలికిన మాటలను కొందరు ఆధారం చేసుకుని జలప్రళయం తరువాతనే నరులు మాంసాహారం తినడం ప్రారంభించారని భావిస్తుంటారు. కానీ, మాంసాహారం తినడం అప్పుడే ప్రారంభించబడిందని మనం చెప్పలేము. ఎందుకంటే, ఈ అధ్యాయంలో దేవుడు మీరు ఫలియించి అభివృద్ధి చెందాలని (1వ) నరహత్య చెయ్యకూడదని (6వ) జలప్రళయానికి ముందున్న నియమాలనే మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఫలియించాలని దేవుడు ఆదాము హవ్వలతో చెప్పాడు (ఆదికాండము 1:27,28), నరహత్య చెయ్యడం నేరమని కయీనుకు శిక్షవిధించాడు (ఆదికాండము 4:8-14).
వాటినే దేవుడు మరలా నోవహుకూ అతని సంతానానికీ జ్ఞాపకం చెయ్యడాన్ని బట్టి, మాంసాహారం విషయంలో కూడా అదేవిధంగా జరిగిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఒకవిధంగా నూతనసృష్టి. నిజానికి ఆదాము హవ్వల పాపం తరువాత జంతువులను ఆయనకు బలిగా అర్పించడం ప్రారంభమైనప్పుడే అనగా జంతువులను చంపే అనుమతి వారికి లభించినప్పుడే మాంసాహారం తినడం కూడా ప్రారంభమైంది. గమనించండి. ఏదెనులో ఉన్నప్పుడు మనిషి జీవితం వేరు, ఏదెను నుండి గెంటివెయ్యబడ్డాక ఆ మనిషి జీవితం వేరు. ఏదెనులో పాపం లేని మనిషి ఏ జంతువునూ చంపవలసిన అవసరం లేదు. ఎందుకంటే అతనికి ఆహారానికి ఏ లోటూ లేదు. అలానే అతని పాపానికి బలి కూడా అవసరం లేదు. కానీ ఆ మనిషి ఏదెనునుండి గెంటివెయ్యబడ్డాక తన పాపప్రాయశ్చిత్తం కోసం జంతువులను చంపి దేవునికి బలులు అర్పించాలి. ఆ క్రమంలో అతని శారీరక శక్తికోసం వాటిని ఆహారంగా కూడా తినవచ్చు. ఎందుకంటే చంపే అనుమతి లభించినప్పుడే తినే అనుమతి కూడా లభించింది. దీనికి మరో కచ్చితమైన ఆధారం ఏంటంటే; హేబెలు గొర్రెల కాపరి (ఆదికాండము 4:2). వారు మాంసాహారం తినకుంటే గొర్రెలను ఎందుకు పెంచుతున్నట్టు? ఒకవేళ పాలు కోసం అంటారేమో, మరి దేవుడు ఎక్కడా పాలు త్రాగమని కూడా ఆజ్ఞాపించలేదుగా అవి మాత్రం ఎలా త్రాగుతున్నారు? కొందరు ఇంకాస్త తెలివిగా ఆలోచించి వారు గొర్రెలను పెంచుతుంది మాంసం కోసమూ కాదు, పాలకోసమూ కాదు కేవలం దేవునికి బలులను అర్పించడానికే అంటారేమో. అలాగైతే హేబెలు తన మందనుండి తొలిచూలు వాటిని అందులోనూ క్రొవ్వినవాటిని బలిగా తీసుకువచ్చాడు (ఆదికాండము 4:4) అంటే వారు దేవునికి మొదటపుట్టిన వాటినీ అందులోనూ శ్రేష్టమైనవాటినీ బలులుగా ఇచ్చేవారు. మరి తరువాత పుట్టినవాటినీ, బలంగా లేనటువంటి వాటినీ తినకుండా ఏం చేసేవారు? ఒకవేళ పూడ్చిపెట్టారు అంటే ఆ మాత్రం దానికి హేబెలు గొర్రెల కాపరిగా ఉండవలసిన అవసరం లేదుకదా, తన తండ్రితోనూ సహోదరునితోనూ కలసి సేద్యం చేస్తే వారికి కాస్త శ్రమ తగ్గుతుంది, పంట ఇంకా ఎక్కువ పండుతుంది. బలులు అర్పించాలంటే చుట్టుప్రక్కల స్వేచ్చగా తిరిగే గొర్రెల్లో బలమైనవాటిని పట్టుకుంటే సరిపోతుంది.
అంతేకాదు "జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచునుండిరి" (మత్తయి 24:38) అని రాయబడింది. అంటే వారు ఏం తినుంటారు శాఖాహారమేనా? నిజానికి "ప్రాణముగల సమస్తచరములు మీకు ఆహారమగును. పచ్చని కూరమొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను" అని ఆయన నోవహుకు జ్ఞాపకం చెయ్యడానికి బహుశా నోవహు ఆ ప్రజలు అలా తినడం కూడా దేవునిదృష్టిలో పాపమైంది అని భావించియుంటాడు. అలాంటప్పుడు అతనికి ఇకపై మేము మాంసాహారం తినవచ్చా తినకూడదా అనే సందేహం కలుగుతుంది. అందుకే దేవుడు "ప్రాణముగల సమస్తచరములు మీకు ఆహారమగును. పచ్చని కూరమొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను" అని మాంసాహారం తినవచ్చు అని మాటలు చెబుతున్నాడని నేను భావిస్తున్నాను.
ఆదికాండము 9:4
అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము.
ఈ వచనంలో ఆయన నోవహు కుటుంబానికి రక్తాన్ని తినకూడదని, రక్తమే ఆ జీవియొక్క ప్రాణమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. బహుశా జలప్రళయానికి ముందటి ప్రజలు రక్తాన్ని కూడా తింటూ ఉండవచ్చు. ఎందుకంటే అది చాలా రుచికరంగా ఉంటుందని మాంసం కంటే శక్తివంతమైనదని కొందరు భావిస్తుంటారు. అందుకే ఆయన "మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము" అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ ఆజ్ఞ లేఖనాలలో మనకు పదేపదే కనిపిస్తుంది ఉదాహరణకు; (లేవీకాండము 7:26, ద్వితీయోపదేశకాండము 12:23, 15:22, అపో.కార్యములు 15:28). ఇక్కడ మనం రెండు విషయాలను గుర్తించాలి.
1. 1. రక్తమే ప్రాణము అంటే, రక్తంలో ప్రాణముంటుందని కాదు కానీ, ఆ రక్తం ప్రాణానికి అధారంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. రక్తం లేకుండా ఏ ప్రాణీ ప్రాణంతో జీవించలేదు. ఈ వాక్యభాగం చూడండి.
లేవీయకాండము 17:14 దానిరక్తము "దాని ప్రాణమునకాధారము". కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. "వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము"; దానిని తిను ప్రతివాడు మరణశిక్షనొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.
2. అదేవిధంగా దేవుడు ఆ సందర్భంలో, రక్తాన్ని తినకూడదని కూడా చెబుతున్నాడు. దీనికి రెండు కారణాలు ఉన్నట్టుగా మనం భావించవచ్చు. మొదటిది; మనిషి చేసిన పాపానికి ఈ రక్తం దేవుని ముందు ప్రాయుశ్చిత్తం చేసేదిగా నియమించబడింది (బలిద్వారా).
లేవీయకాండము 17: 11,12 రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.
ఈ కారణంచేత రక్తం తినకూడదు, దానిని నీళ్ళవలే బయటపారబొయ్యాలి (బలిలో మినహా).
ద్వితియోపదేశకాండము 12: 16 మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలె నేలమీద పారబోయవలెను.
ఐతే, యేసుక్రీస్తు బలికి ఛాయగా ఉన్నటువంటి జంతుబలులు, ఆయన సంపూర్ణ బలితో నిలచిపోయినప్పటికీ, నూతననిబంధన విశ్వాసులు కూడా రక్తం తినకూడదనే ఆజ్ఞాపించబడ్డారు.
అపొ.కార్యముకు 15:28 విగ్రహములకు అర్పించినవాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.
దీనికి కారణం ఏంటంటే, సాధారణంగా రక్తాన్ని "fluid of life" అంటారు. శాస్త్రీయంగా కోణంలో దీనిని పరిశీలించినప్పుడు, ఏదైన ఒక జీవికి రోగం సంక్రమించినప్పుడు ఆ ప్రభావం రక్తంలోనే ఎక్కువగా ఉంటుంది. (మనిషికి కూడా, అందుకే మొదట రక్తపరీక్ష చేస్తారు) ఈ కారణం చేత ఏదైనా రోగం బారిన పడిన జీవియొక్క రక్తాన్ని ఎవరైనా తింటే ఆ రోగం వారికి సంక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి మనిషి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా దేవుడు రక్తాన్ని తినకూడదని ఆజ్ఞాపించాడు. ఈవిధంగా దేవుని ఆజ్ఞలు ఒకవైపు అతని ఆధ్యాత్మిక జీవితానికే కాదు, శారీరానికి కూడా మేలు చేసేవిగా ఉంటాయి. ఉదాహరణకు ఆయన వ్యభిచరించకూడదు అని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే దేవుడు నియమించిన వివాహ వ్యవస్థకు విరుద్ధంగా వ్యభిచరించినప్పుడు ఆ మనిషికి ఆయన నియమాన్ని మీరిన పాపం అంటడమే కాదు, అతని కుటుంబం, శరీరం కూడా పాడు ఔతుంది. అందుకే "జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు" (1కోరింథీ 6:18) అని హెచ్చరించబడింది. సున్నతి కూడా ఇంతే; అది వారికి నిబంధన గుర్తుగా శరీరానికి కూడా మేలు చేసేదిగా నియమించబడింది (ఆదికాండము 17:10-12 వ్యాఖ్యానం చూడండి). క్రొవ్వును తినకూడదు అన్నప్పుడు కూడా ఇంతే (లేవీకాండము 3:16 వ్యాఖ్యానం చూడండి).
ఆదికాండము 9:5
మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.
ఈ వచనంలో దేవుడు నరుని రక్తం గురించి విచారణ చేస్తానని హెచ్చరించడం మనం చూస్తాం. దీనికి ఏవిధంగానైనా నరహత్య చెయ్యకూడదని (ప్రాణం తియ్యకూడదని) భావం. ఈ కారణం చేత, నరహంతకులకు ఆయన తప్పకుండా తీర్పుతీరుస్తాడు. అందుకే ఆయన హేబెలు ప్రాణం (రక్తం) విషయంలో ఆయన కయీనును విమర్శచేసి, కఠినంగా తీర్పుతీర్చాడు (ఆదికాండము 4:9-13). కాబట్టి నరహత్య చేసినవారు ఎవరూ కూడా దేవుని తీర్పు నుండి తప్పించుకోలేరు.
నహూము 3: 1 నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ.
ప్రకటన గ్రంథం 22: 15 కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును "నరహంతకులును" విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
అదేవిధంగా ఆ సందర్భంలో ఆయన, నరులను చంపిన జంతువులను కూడా విచారిస్తానని పలకడం మనం చూస్తాం. కాబట్టి మనిషి ప్రాణం జంతువు ద్వారా పోయినా కూడా దేవుడు దానిని విడిచిపెట్టడు. ఉదాహరణకు ఆయన ధర్మశాస్త్రంలో మనిషికి హాని కలిగించిన జంతువులకు కూడా శిక్షవిధించాలని ఆ జ్ఞాపించాడు (నిర్గమకాండము 21: 28).
ఆదికాండము 9:6
నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింప బడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.
దీనికి పై వచనంలో దేవుడు నరహత్య చెయ్యకూడదని చెబుతూ, ఈ వచనంలో నరహత్య ఎందుకు చెయ్యకూడదో ఆ కారణం కూడా వివరించడం మనం చూస్తాం. మనిషిని దేవుడు తనపోలిక తన స్వరూపంలో సృజించాడు (ఆదికాండము 1:26,27). మనిషి పాపం చేసాక తనలోని దేవుని గుణలక్షణాలకు (దేవుని స్వరూపానికి) వ్యతిరేకంగా ప్రవర్తింపచేసే పాప/పతన స్వభావాన్ని సంతరించుకున్నప్పటికీ, అనగా ఆత్మీయంగా చనిపోయినప్పటికీ, అతను ఇంకా దేవుని పోలిక దేవుని స్వరూపంలోనే ఉన్నాడు. అందుకే "దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే "దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను" శపింతుము" (యాకోబు 3:9) అన్యాయంగా మనిషిని శపించడం కూడా పాపమని రాయబడింది.
ఈ కారణం చేత, దేవునిపోలిక దేవుని స్వరూపంలో ఉన్న మనిషిని చంపడం దేవుణ్ణి అవమానించడమే ఔతుంది. ఇందుకు భిన్నంగా చాలా మతగ్రంథాల్లో శరీరానికి ఎటువంటి ప్రాముఖ్యతా లేదని, శరీరంలో ఉన్న ఆత్మకు మాత్రమే ప్రాముఖ్యత ఉంటుందని, ఈ కారణం చేత శరీరాన్ని ఎవరైనా చంపినప్పటికీ ఏమీకాదన్నట్టు రాయబడింది. ఉదాహరణకు హిందువులు ప్రామాణిక గ్రంథంగా నమ్మే "భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్య యాగంలో" ఇటువంటి మాటలే మనకు కనిపిస్తాయి.
అదేవిధంగా, ఆ మాటల్లో దేవుడు నరుని రక్తము చిందించువాడి రక్తము నరుడివలనే చిందించబడునని పలకడం కూడా మనం చూస్తున్నాం. ఇది నిష్కారణంగా దేవుని పోలిక దేవుని స్వరూపంలో ఉన్న మనిషిని హత్యచేసినందుకు దేవుడు విధిస్తున్న చట్టపరమైన శిక్షగా మనం భావించాలి. దీనిని బట్టి "ఒక నిర్దోషిని" హత్య చెయ్యడం దేవుణ్ణి అవమానించడం ఔతుంది తప్ప, ఆ హత్యకు ప్రతిహత్య జరగడం (చట్టపరంగా) ఆ విధంగా ఎంచబడదు. ఎందుకంటే అది దేవుడే స్వయంగా నియమిస్తున్నటువంటి న్యాయమైన శిక్ష. ధర్మశాస్త్రంలో దీనిగురించి చాలా స్పష్టంగా రాయబడింది.
నిర్గమకాండము 21:12,14 నరుని చావగొట్టినవానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే ఒకడు తన పొరుగువానిమీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినయెడల వాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవ లెను.
సంఖ్యాకాండము 35:16-18 ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధ ముతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. ఒకడు చచ్చు నట్లు మరియొకడు రాతితో వాని కొట్టగా దెబ్బతినిన వాడు చనిపోయినయెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మరియు ఒకడు చచ్చునట్లు మరియొకడు చేతికఱ్ఱతో కొట్టగా దెబ్బ తినినవాడు చనిపోయిన యెడల కొట్టిన వాడు నర హంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
సంఖ్యాకాండము 35:31,33 చావతగిన నరహంతకుని ప్రాణముకొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు.
ఆయన భూమిపైకి జలప్రళయాన్ని రప్పించిన కారణాలలో అప్పటి ప్రజలు చేస్తున్న బలత్కారం ప్రధానమైనది (ఆదికాండము 6:11). బలాత్కారం అన్నప్పుడు హత్యలు కూడా పరిగణలోకి వస్తాయి. అప్పటి ప్రజలు చేస్తున్న హత్యలను బట్టి ఆయన జలప్రళయాన్ని రప్పించి, వారికి తీర్పుతీరిస్తే, అటువంటి జలప్రళయం మరలా కలగదని చెబుతూనే (ఆదికాండము 9:15) ఆ బలత్కారాన్ని నియంత్రించడానికి ఆయన చట్టవ్యవస్థను ప్రవేశపెట్టాడు.
రోమీయులకు 13: 4 (చట్టం) వారు ఊరకయే "ఖడ్గము" ధరింపరు. "కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు".
రోమీయులకు 13:1,2 ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. కాబట్టి అధికారమును ఎది రించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.
అయితే, ప్రస్తుతకాలంలో నరుల పాపం ప్రభలమౌతున్నకొద్దీ కొన్ని చట్టవ్యవస్థలు కూడా దారితప్పి అనైతికతవైపుగా పయనిస్తున్నాయి. ఈ పరిణామం కూడా, త్వరలో క్రీస్తు ద్వారా లోకానికి రాబోతున్న న్యాయమైన తీర్పును సూచిస్తుంది. ఈ విషయంలో విశ్వాసులు అధైర్యపడకుండా, ఈ పరిస్థితులన్నీ క్రీస్తు రాకడకు గురుతులుగా భావించి దానికోసం ఆసక్తితో ఎదురుచూడాలి, సాధ్యమైనంతమట్టుకు దేవుని న్యాయాన్ని బట్టి నేరస్తులకు శిక్షలు పడేలా ప్రయాసపడాలి. ఈ నరహత్య గురించీ, ఆ విషయంలో దేవుని న్యాయం గురించీ మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం మరియు వ్యాఖ్యానం తప్పక చదవండి.
పది ఆజ్ఞల వివరణ
నిర్గమకాండము 21:23-25 వ్యాఖ్యానం చూడండి
ఆదికాండము 9:7
మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.
ఈ వచనంలో దేవుడు మరలా వారిపట్ల తన సంకల్పం గురించి నోవహు కుటుంబానికి జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. దేవుడు ఒకే విషయాన్ని మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నాడంటే, దానికి దేవుడు ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నాడో గ్రహించాలి (ఆదికాండము 41:32). కాబట్టి ఈ అధ్యాయ ప్రారంభంలో నేను తెలియచేసినట్టుగా, విశ్వాసులందరూ ఆ దేవుని సంకల్పాన్ని గుర్తించి మంచి వివాహ జీవితాన్ని ప్రారంభించి ఫలియించాలి. దేవుని ప్రత్యేక అనుగ్రహంతో మినహా (మత్తయి 19:11) ఇతర కారణాలతో వివాహ జీవితానికి దూరం కాకూడదు. ప్రస్తుతం సమాజంలో, స్త్రీ పురుషుల మధ్య వివక్షలు చోటు చేసుకోవడం వల్లకూడా ఎంతోమంది వివాహ జీవితానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. మరికొందరైతే ఇంకా దిగజారి, స్వలింగసంపర్కులుగా మారిపోతున్నారు. ఇవన్నీ దేవుని సంకల్పానికి వ్యతిరేకమైన పాపాలే.
ఆదికాండము 9:8-11
మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతాన ముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను.
ఈ వచనాలలో దేవుడు గతంలో చేసిన కృపగల నిబంధనను (ఆదికాండము 6:18) మరలా జ్ఞాపకం చేస్తూ, జలప్రళయం గురించి కూడా గతంలో పలికిన మాటలనే (ఆదికాండము 8:21) మరలా ప్రస్తావించడం మనం చూస్తాం. ఈ కృపగల నిబంధన ప్రకారం మనిషి తన దృష్టికి పాపిగా మారుతున్నప్పటికీ ఆయన మరలా జలప్రళయం ద్వారా భూమి అంతటినీ నాశనం చెయ్యడు. దీనివల్ల ఆ నిబంధనలో భాగమైన జీవరాశులు కూడా సమూలంగా నాశనమయ్యే పరిస్థితి ఉండదు.
ఆదికాండము 9:12
మరియు దేవుడు నాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే.
ఈ వచనంలో దేవుడు తాను నోవహుతోనూ, అతనితో ఉన్న జీవరాశులతోనూ చేసిన నిబంధనకు గురుతును తెలియచేస్తున్నట్టు మనం చూస్తాం. ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనకు కూడా సున్నతిని గురుతుగా నియమించాడు (ఆదికాండము 17:10,11, రోమా 4:11). దీనికి కారణం ఒకటే, ఆ గురుతును మనం వారు/మనం చూసినప్పుడల్లా దాని వెనుక ఉన్న దేవుని నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి.
ఆదికాండము 9:13-17
మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగానుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్తశరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములోనుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతిదానికిని మధ్యనున్న నిత్యనిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను. మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.
గత వచనాలలో దేవుడు తన నిబంధనకు గురుతుగా ప్రస్తావించింది మేఘంలోని రంగురంగుల ధనుస్సుగా ఈ వచనాలలో మనకు అర్థమౌతుంది. ఆయన అప్పుడు నోవహుతో చేసిన నిబంధనకు గురుతు ఐన ఆ ధనుస్సు ఇప్పటికీ వర్షం వచ్చేటప్పుడు మనకు కనిపిస్తూ, ఆ నిబంధనను మనకు గుర్తు చేస్తుంది. శాస్త్ర ప్రపంచం అది ఎందుకు ఏర్పడుతుందో చెప్పగలదు కానీ ఎప్పటినుంచి దేనికి గుర్తుగా ఏర్పడుతుందో బైబిల్ మాత్రమే చెబుతుంది.
ఆదికాండము 9:18,19
ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.
ఈ వచనాలలో నోవాహు కుమారుల సంతానం భూమియంతటా వ్యాపించినట్టు మనం చూస్తాం. ఆ వివరాలు అన్నీ పదవ అధ్యాయంలో రాయబడ్డాయి. ఐతే ఇక్కడ రచయిత (మోషే) ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారుల పేర్లను తెలియచేస్తూ, ఆ ముగ్గురు కుమారుల్లో ఒక కుమారుడైన హాముకు పుట్టిన కనాను అనేవాడి పేరును కూడా ప్రస్తావిస్తున్నాడు. ఎందుకిలా ప్రస్తావించాడో క్రింది వచనాలలో చూద్దాం.
ఆదికాండము 9:20,21
నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను.
ఈ వచనంలో నోవహు ద్రాక్షారసం త్రాగి వస్త్రహీనుడిగా మారినట్టు మనం చూస్తాం. అప్పటిప్రజల విందుల్లో ద్రాక్షారసం త్రాగడం ఒక భాగమైనప్పటికీ, అది మత్తు కలిగించేంత స్థాయిలో త్రాగడం తప్పకుండా విపరీత పరిణామాలకు దారితీస్తుంది, విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఇక్కడ నోవహు విషయంలో కూడా అదే జరిగింది. అందుకే బైబిల్ మత్తుకు దూరంగా ఉండమని మనల్ని హెచ్చరిస్తుంది.
యెషయా 5: 11 మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ.
సామెతలు 20: 1 ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.
ఎఫెసీయులకు 5: 18 మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మపూర్ణులైయుండుడి.
అదేవిధంగా నోవహు గురించి మనం అతను నీతిమంతుడని, నిందారహితుడని చదివాం (ఆదికాండము 6:9, 7:1). అదేవ్యక్తి ఈ సందర్భంలో మాత్రం మత్తుడిగా మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి నీతిమంతులూ, నిందారహితులు కూడా పడిపోయే అవకాశం ఉందని మనం గ్రహించి, మరింత జాగ్రతకలిగి నడుచుకోవాలి.
1 కొరింథీయులకు 10:11,12 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.
ఫిలిప్పీయులకు 2:12 కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి.
సామెతలు 28:14 నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును.
ఆదికాండము 9:22-23
అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడైయుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమయిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుటవలన తమ తండ్రి దిసమొలను చూడలేదు.
ఈ వచనాలలో హాము తన తండ్రియైన నోవహును వస్త్రహీనుడిగా చూసి, తన సహోదరులకు తెలియచెయ్యడం, వారు అతని దేహంపై బట్టను కప్పడం మనం చూస్తాం. ఇక్కడ నోవహు చిన్నకుమారుడైన హాము చేసింది మనం పరిశీలించగలిగితే, తన తండ్రిని పొరపాటున వస్త్రహీనుడిగా చూడడం అతని తప్పుకాదు కానీ, చూసిన తర్వాత వెంటనే అతని దేహాన్ని కప్పకుండా, తన సహోదరుల యొద్ద ఆ విషయాన్ని ప్రస్తావించడం తప్పకుండా పొరపాటే. ఎందుకంటే అతనిక్కడ తన తండ్రి విషయంలో చెయ్యదగింది కూడా చెయ్యకుండా, తన సహోదరులకు ఆ వార్తను ఎగతాళిగా ప్రకటించాడు. ఒకవిధంగా, తండ్రియొక్క గౌరవాన్ని భంగపరిచాడు.
సామెతలు 3:27 మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.
3యోహాను 1:11 ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.
కానీ అతని సోదరులైన షేము, యాపెతులు ఆ విషయంలో తమ తండ్రిని ఎగతాళి చెయ్యకుండా, ఆ అవమానకర పరిస్థితిని కప్పే ప్రయత్నం చేస్తూ, ఆ క్రమంలో తమ తండ్రిని వస్త్రహీనుడిగా చూడడానికి కూడా వారు ఇష్టపడలేదు, అందుకే వెనుకతట్టుగా వెళ్ళి అతనికి వస్త్రాన్ని కప్పారు. ఇది తమ తండ్రిపై వారికున్న గౌరవాన్ని సూచిస్తుంది.
ఆదికాండము 9:24,25
అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసినదానిని తెలిసికొని కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.
ఈ వచనాలలో నోవహు మత్తు నుండి మేలుకుని, తన చిన్నకుమారుడు చేసినదానిని బట్టి అతనిని శపించడం మనం చూస్తాం. అయితే ఈ క్రమంలో అతను హాము పేరును తీసుకోకుండా అతని కుమారుడైన కనానును ప్రస్తావిస్తున్నాడు, హాముకు కనాను కాకుండా ఇంకా ముగ్గురు కుమారులు ఉన్నప్పటికీ (అదికాండము 10:6) వారిని శపించలేదు. కొందరు దీనిని ఆధారంగా చేసుకుని, అక్కడ హాము నోవహును వస్త్రహీనుడిగా చూసాడనే మాటలు Euphemism (ఇబ్బందిగా అనిపించే పదాలను వేరేలా చెప్పడం) పద్ధతిలో రాయబడ్డాయని, వాస్తవానికి హాము నోవహు భార్యతో (తల్లితో) శయనించి కనానును కన్నాడని అందుకే నోవహు ఆ కనానును శపించాడని చెబుతుంటారు.
బైబిల్ లో కొన్నిచోట్ల Euphemism పద్ధతి ఉందనడంలో నాకు సందేహం లేదు. ఉదాహరణకు; అబ్రాహాము యాకోబులు తమ తొడక్రింద చెయ్యి పెట్టి చెయ్యమన్న ప్రమాణాలు (ఆదికాండము 24:2,9, 47:29) వాస్తవానికి మర్మాంగం క్రింద పెట్టి చేసేవే. అక్కడ Euphemism పద్ధతిలోనే తొడ అనే పదం వాడారు. కానీ మనం చూస్తున్న నోవహు హాముల సంఘటనలో పదాలు కాదు సందర్భమే వేరుగా కనిపిస్తుంది. ఒకవేళ నోవహు వస్త్రహీనుడైయుండగా, హాము అతని దిసమొలను చూసాడన్నప్పుడు, అది Euphemism పద్ధతిలో రాయబడిందని, వాస్తవానికి హాము నోవహు భార్యతో (తల్లితో) శయనించాడని భావిస్తే, హాము వచ్చి తన సహోదరులతో తమ తండ్రి వస్త్రహీనుడిగా పడియున్నాడని చెప్పడాన్ని, వారిద్దరూ నోవహు దిసమొలను చూడకుండా వస్త్రంతో కప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు నోవహు ద్రాక్షతోట నాటడాన్ని, ఆ రసం త్రాగి మత్తుడై పడుకోవడాన్ని ఇంకెలా అర్థం చేసుకోవాలి? కాబట్టి నోవహు కనానును మాత్రమే ఎందుకు శపించాడనే ప్రశ్నకు సమాధానంగా ఇలాంటి అసహ్యకరమైన, సందర్భరహితమైన వివరణలను ఎంచుకోకూడదు.
ఎందుకంటే, హాము అలా చెయ్యడంలో అతని కుమారుడైన కనాను పాత్ర ఏముందో మనకు తెలియదు. కానీ హేతువు లేని శాపం తగలదని వాక్యం చెబుతుంది కాబట్టి (సామెతలు 26:2) ఆ శాపం కనానుకు తగిలిందంటే అతని తండ్రి చేసినదానిలో అతని పాత్రకూడా తప్పకుండా ఉండేయుంటుంది. అందుకే నోవహు అతనిని మాత్రమే శపించి తన తండ్రికి పుట్టిన మిగిలిన కుమారులను మినహాయించాడు. కాబట్టి ఇది కనానుపై అన్యాయంగా మోపబడిన శాపం కాదు. ఇక హాము విషయానికి వస్తే, తన కుమారుడు శపించబడినప్పుడు ఆ వేదన హాముకు కూడా కలుగుతుంది. ఒక కుమారుడిగా తండ్రిపట్ల సరైనది చెయ్యనందుకు, తన కుమారుడి విషయంలో ఇది హాముకు కలిగిన పర్యవసానం.
అదేవిధంగా, నోవాహు కనానును శపించినప్పుడు, అది నెరవేరడానికి కొన్నివందల సవత్సరాల సమయం పట్టింది. ఆమధ్య కాలంలో వారు ఎంతో బలమైన జనంగా విస్తరించినట్టు ఇశ్రాయేలీయులకూ వారికి మధ్య జరిగిన యుద్ధాలను బట్టి మనకు అర్థమౌతుంది. దీనినిబట్టి మనం ఒక విషయాన్ని గుర్తించాలి, దేవుని ప్రజలకు విరోధులైన శాపగ్రస్తులు ఎంతగా ప్రబలినప్పటికీ, దేవుడు ఏర్పరచిన సమయంలో వారికి నాశనం తప్పదు.
విచారకరమైన విషయం ఏంటంటే నోవహు హాము సంతానమైన కనానును "కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును" అని శపించడాన్ని బట్టి ఐరోపాలో ఉన్న క్రైస్తవులు ఆఫ్రికాలో నివశిస్తున్న హాము సంతానాన్ని దాసులుగా చేసుకుని వారిచేత కఠినమైన సేవలు చేయించుకునేవారు. దానిని వారు హాము సంతానానికి దాసత్వం అనేది దేవుడే నిర్ణయించాడు కాబట్టి మేము చేస్తుంది తప్పుకాదని సమర్థించుకునేవారు. దీనివల్ల క్రైస్తవ్యం బానిసత్వాన్ని ప్రోత్సహిస్తుందనే నింద కూడా పడింది. కానీ గమనించండి.
1. నోవహు హాము సంతానం మొత్తాన్ని శపించలేదు అతని కుమారులలో ఒకడైన కనానును మాత్రమే శపించాడు. దానికి కారణం ఏమైయుండవచ్చో ఇప్పటికే మనం చూసాం. కాబట్టి ఆఫ్రికాలో ఉన్న మిగిలిన హాము సంతానానికి ఆ శాపం వర్తించదు. వాస్తవానికి కనాను సంతానమైన కనానీయులు ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్న కనాను ప్రాంతంలో స్థిరపడ్డారు.
2. చుట్టుప్రక్కల దేశాలనుండి దాసదాసీలను కొనుక్కునే ఆ కాలంలో కూడా ధర్మశాస్త్రం ప్రకారం ఎవరూ ఆ పరదేశులతో కఠినంగా వ్యవహరించకూడదు (నిర్గమకాండము 22:21, లేవీకాండము 19:33,34). ధర్మశాస్త్రం దృష్టిలో దాసుడూ యజమాని అంటే ఒక ఒప్పందం ప్రకారం పనిచేసేవారూ చేయించుకునేవారు అని అర్థం. కాబట్టి యజమానులు వారిని తమదగ్గర పనిచేసే ఉద్యోగుల మాదిరిగానే చూడాలి తప్ప బానిసలుగా కాదు. "నిన్ను వలె నీ పొరుగువానిని" ప్రేమించాలనే ఆజ్ఞ ఎలాంటి జాతీయ, ప్రాంతీయ బేధం లేకుండా మనుషులందరికీ వర్తిస్తుందని యేసుక్రీస్తు మంచి సమరయుని ఉపమానంలో మనం గమనిస్తాం (లూకా 10:27-36), ఎందుకంటే ధర్మశాస్త్రంలో అది అలానే అన్యులకు కూడా వర్తిందేదిగా నియమించబడింది (లేవీకాండము 19:33,34). కాబట్టి యజమానులు తమ దాసులను కూడా తమ వలే ప్రేమించాలి. అందుకే ఆ దాసుల విషయంలో చాలా కచ్చితమైన ఆజ్ఞలు రాయబడ్డాయి (నిర్గమకాండము 21:20,21, 26,27). ఆ మాటల భావాన్ని నేను స్పష్టంగా వివరించాను (నిర్గమకాండము 21 వ్యాఖ్యానం చూడండి).
3. నూతననిబంధనలో పౌలు "యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని యెరిగి, న్యాయమైనదియు ధర్మాను సారమైనదియు మీ దాసులయెడల చేయుడి" (కొలస్సీయులకు 4:1) అని అప్పటికే దాసులను కలిగియున్న యజమానులను హెచ్చరిస్తున్నాడు.
ఈవిధంగా బైబిల్ గ్రంథంలో కఠినదాస్యానికి ఎక్కడా అవకాశం లేదు. తమకున్న ఇబ్బందులను బట్టి స్వచ్చందంగా ఒకరికి దాసులుగా పని చెయ్యడానికి మాత్రమే అవకాశం కల్పించబడింది (ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగి తరహాలో). కాబట్టి ఐరోపాలో ఉన్న క్రైస్తవులు ఆఫ్రికాలోని హాము సంతానాన్ని బలవంతంగా దాసులుగా మార్చుకోవడం, వారిచేత కఠినదాసత్వం చేయించుకోవడం ఏవిధంగానూ వాక్య అనుకూలం కాదు. వాక్య విరుద్ధం. నోవహు శాపం కూడా వారికి వర్తించదు. అలాగైతే ఐగుప్తీయులు కూడా హాము సంతానమే (కీర్తనలు 78:51, 105:23,27, 106:21,22). అందుకే హాము కుమారుడైన మిస్రాయిము పేరుతో (ఆదికాండము 10:6, 1 దినవృత్తాంతములు 1:8) ఐగుప్తును సంబోధిస్తారు (ఆదికాండము 50:11). ఒకవేళ హాము సంతానమంతా శాపగ్రస్తులే ఐతే మిస్రాయిము నుండి విస్తరించిన ఈ ఐగుప్తు గురించి దేవుడు ఏమంటున్నాడో చూడండి.
యెషయా 19:19-25 ఆ దినమున ఐగుప్తుదేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక స్తంభమును ఉండును. అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహో వాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును. ఐగుప్తీయులు తెలిసికొనునట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసి కొందురు వారు బలి నైవేద్యముల నర్పించి ఆయనను సేవించెదరు యెహోవాకు మ్రొక్కుకొనెదరు తాము చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన నంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరున కును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవిం చెదరు. "ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగ నుండును". "సైన్యములకధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును".
ఈ వాక్యభాగం ప్రకారం హాము సంతానమైన ఐగుప్తీయులు కూడా క్రీస్తు నందు ఆశీర్వదించబడినవారే. అసలు ఐరోపాలో ఉన్న క్రైస్తవులు ఐగుప్తులో ఉన్న హాము సంతానాన్ని (మిస్రాయిమును) వదిలేసి ఆఫ్రికాలో ఉన్నటువంటి హాము సంతానాన్ని (కూషును) దాసులుగా మార్చుకుంటున్నప్పుడే వారి కుట్ర మనకు అర్థం అవ్వాలి. ఐగుప్తీయులు అన్నివిధాలుగా బలవంతులు కాబట్టి వీరు వారిని దాసులుగా మార్చుకోలేరు. కానీ ఆఫ్రికాలో ఉన్న వారు అన్నివిధాలుగా బలహీనులు కాబట్టి వారిపై వీరి పెత్తనం చెలాయించాలి అనుకున్నారు. అందుకు నోవహు శాపాన్ని వక్రీకరించి సాటి క్రైస్తవుల నుండి వస్తున్న విమర్శలను తప్పించుకునే ప్రయత్నం చేసారు. వీరు ఇతరులను బానిసలుగా మార్చుకోవాలనే దుర్మార్గతను నెరవేర్చుకోవడానికి, వాక్య నియమాలను మీరడమే కాదు, వారు చేస్తుంది దుర్మార్గం కాదని కప్పి పుచ్చుకోవడానికి "నోవహు శాపం" అంటూ వాక్యాన్ని వక్రీకరించారు కూడా. కాబట్టి వీరు అసలు క్రైస్తవులే కాదు. గమనించండి; బైబిల్ దేవుణ్ణి బైబిల్ పరిధిలో పరిశీలించాలి తప్ప, వాక్య విరుద్ధమైన లేక నామకార్థ క్రైస్తవుల ఆరాచకాలనూ సాంప్రదాయాలనూ బట్టి కాదు. బైబిల్ విమర్శకులకు ఇలాంటి నిజాయితీ ఉండదు కాబట్టే క్రైస్తవులుగా పిలవబడుతున్నవారి దుష్టక్రియలను చూపించి దానిని బైబిల్ కూ క్రైస్తవ్యం మొత్తానికీ ఆపాదిస్తుంటారు.
ఆదికాండము 9:26,27
మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.
ఈ వచనాలలో నోవహు తన కుమారులైన షేము, యాపెతులు చేసిన మంచిని బట్టి, దేవుణ్ణి స్తుతిస్తున్నట్టు మనం చూస్తాం. అతను ఆ విధంగా చెయ్యడంలో సమస్త మంచికీ, మంచి చెయ్యాలనే ప్రేరణకీ దేవుడు మాత్రమే మూలమనే సందేశం నిక్షిప్తమై ఉంది. ఈ రోజు విశ్వాసులు చేసే క్రియలను బట్టికూడా ప్రజలు దేవుణ్ణి స్తుతించగలగాలి.
మత్తయి సువార్త 5:16 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
అదేవిధంగా, తరువాత అధ్యాయాల ప్రకారం ఈ షేము సంతానం నుండే, విశ్వాసులకు తండ్రిగా పేరుపొందిన అబ్రాహాము జన్మించాడు. యాపెతు అతని గుడారంలో నివసిస్తాడు అన్నప్పుడు వారిద్దరి సంతానాలు ఒకదానితో ఒకటి మంచి సంబంధాన్ని కలిగియుంటాయనే అర్థం వస్తుంది.
ఆదికాండము 9:28,29
ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడువందల ఏబదియేండ్లు బ్రదికెను. నోవహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
ఈ వచనాలలో నోవహు మరణించినట్టుగా మనం చూస్తాం. బైబిల్ చరిత్రలో ఈ నోవహు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న వ్యక్తి. నూతననిబంధనలో కూడా ఇతని ప్రస్తావనలు మనం చూస్తుంటాం (మత్తయి 24:37, హెబ్రీ 11:7, 1 పేతురు 3:20). అదేవిధంగా జలప్రళయం తరువాత ఈభూమి పైన ఎక్కువకాలం బ్రతికిన వ్యక్తి కూడా ఇతనే.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Add comment