14:1-9, 14:10, 14:11-13, 14:14-17, 14:18-20, 14:21-24
ఆదికాండము 14:1-9 షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీ యుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొఱ్ఱా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయీయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి. వీరందరు ఉప్పు సముద్రమైన సిద్దీములోయలో ఏకముగా కూడి పండ్రెండు సంవత్సరములు కదొర్లా యోమెరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగు బాటు చేసిరి. పదునాలుగవ సంవత్సరమున కదొర్లా యోమెరును అతనితో కూడనున్న రాజులును వచ్చి అష్తా రోత్ కర్నాయిములో రెఫాయీయులను హాములో జూజీయులను షావే కిర్యతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఏల్పారాను వరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేషను ఏన్మిష్పతుకువచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులనుకూడ కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును గొమొఱ్ఱా రాజును అద్మా రాజును సెబోయీము రాజును సోయరను బెల రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ యైదుగురు రాజులు యుద్ధము చేసిరి.
ఈ వచనాలలో కొందరు రాజుల మధ్య జరిగిన యుద్ధం గురించి రాయబడడం మనం చూస్తాం. అయితే సొదొమ, గొమొఱ్ఱాలు మరియు ఇక్కడ చెప్పబడుతున్న ఇతర మూడు పట్టణాలూ మృతసముద్రానికి తూర్పుదిక్కుగా ఉండేవి. వీటిపై యుద్దం చెయ్యడానికి ఎక్కడో బాబేలు/షీనారు (ఇరాక్) ప్రాంతంలో నివసిస్తున్న రాజులు ఎలా వచ్చారు? వారిలో కదొర్లాయెమెరు అనే రాజు 12 సంవత్సరాలు ఆ పట్టణాలను ఎలా లోపరచుకున్నాడనే ప్రశ్నలు ఇక్కడ వస్తుంటాయి. కానీ క్రీస్తు శకం 1920వ సంవత్సరంలో "Dr.Nelson Glueek" అనే పురాతత్వ శాస్త్రవేత్త పరిశీలన ప్రకారం; ఇరాక్ నుండి మృతసముద్రం తూర్పుదిక్కున సొదొమ, గొమొఱ్ఱా వైపు వేయబడిన ఒక పురాతన మార్గం బయటపడింది. ఆ మార్గం ద్వారానే ఆ రాజులు సొదొమ, గొమొఱ్ఱాలపై యుద్ధానికి వచ్చారని బైబిల్ పండితులు విశ్వసిస్తున్నారు.
ఈ రాజులలో మనం ప్రధానంగా గుర్తించవలసిన రాజు అమ్రాపేలు. షీనారు/బాబేలు (ఇరాక్) దేశం, ఆదికాండము 11వ అధ్యాయానికే నాగరికతపరంగా అభివృద్ధి చెందినట్టు మనకు కనిపిస్తుంది. ఆ ప్రాంతాన్ని అబ్రాహాము కాలంలో ఇతనే పరిపాలించాడు. హమ్మురాబి అనే ఇతనిపేరుతో 282 చట్టాలను కలిగియున్న, ఏడు అడుగుల రాతిపలకను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. పురాతన చట్టప్రతుల్లో అది ఒకటి. దీని గురించిన ఆధారాలు పరిశీలించండి.
https://www.newadvent.org/cathen/01441a.htm
https://booksnthoughts.com/one-of-the-oldest-law-code-in-the-world/
ఆదికాండము 14:10 ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొఱ్ఱాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి.
ఈ వచనంలో సొదొమ గొమొఱ్ఱా రాజులు పారిపోయి, సిద్దీములోయలోని మట్టికీలు గుంటల్లో పడడం మనం చూస్తాం. ఈ మట్టికీలు గుంటలు, భూమిలో ఉండే సహజ పెట్రోలియం నుండి ప్రకృతి సిద్ధమైన రసాయనక ప్రక్రియల ద్వారా ఏర్పడే "బిటుమెన్" అనే పధార్థమని బైబిల్ పండితులు భావిస్తున్నారు. మెసపటోమియా పాలస్తీనా ప్రాంతాల్లో శీతోష్ణస్థితి, నేలల భౌతికస్వరూపాల మూలంగా ఈ గుంటలు విరివిగా ఏర్పడేవట, వీటికి మండే గుణం ఉంటుంది.
ఆదికాండము 14:11-13 అప్పుడు వారు సొదొమ గొమొఱ్ఱాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నియు పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపుర ముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొనిపోగా తప్పించుకొనిన యొకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రా మునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసికొనినవారు.
ఈ వచనాలలో ఆ రాజులు సొదొమ గొమొఱ్ఱాలపై దాడి చేసి లోతునూ అతని కుటుంబాన్ని కూడా చెరపట్టుకుని పోయినట్టు, అక్కడినుండి తప్పించుకున్న ఒక వ్యక్తి వచ్చి అబ్రాహాముతో ఆ విషయం చెప్పడం మనం చూస్తాం. బహుశా ఆ వ్యక్తి లోతు పనివాడు అయ్యుంటాడు. ఇక్కడ బైబిల్ గ్రంథం మొదటిసారిగా అబ్రాహామును హెబ్రీయుడని సంబోధించింది. తర్వాత నుండి ఇతని సంతానమైన ఇశ్రాయేలీయులంతా హెబ్రీయులుగా పిలవబడ్డారు.
అదేవిధంగా లోతు కుటుంబం యొక్క ప్రస్తావనను కూడా ఇక్కడే మొదటిసారి చూస్తున్నాం. అతను ఊరు అనే పట్టణం నుండి అబ్రాహాముతో ప్రయాణమైనప్పుడు కానీ అబ్రాహాము నుండి ఈ పట్టణాల వైపు విడిపోయినప్పుడు కానీ ఆ కుటుంబం యొక్క ప్రస్తావన లేదు. దీనిప్రకారం; అతను సొదొమ గొమొఱ్ఱాలకు చెందిన స్త్రీనే వివాహం చేసుకుని ఉంటాడు. అందుకే ఆమె ప్రవర్తనా ఆమెకు పుట్టిన కుమార్తెల ప్రవర్తన కూడా ఆ పట్టణాలను పోలినట్టే కనిపిస్తుంది.
ఆదికాండము 14:14-17 అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన యింట పుట్టి అలవరచబడిన మూడువందల పదునెనమండుగురిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులును వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసికొని వచ్చెను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు, రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను.
ఈ వచనాలలో అబ్రాహాము కేవలం మూడువందల పద్దెనిమిది మందితో కలసి సొదొమ గొమొఱ్ఱాలను చెరపట్టిన ఐదుగురు రాజులతో యుద్ధం చేసివారిని ఓడించినట్టు మనం చూస్తాం. ఇది దేవుని శక్తినిబట్టే అబ్రాహాముకు సాధ్యమైంది. ఇలాంటి సంఘటనే మనం గిద్యోను విషయంలో కూడా చూస్తాం (న్యాయాధిపతులు 7: 7).
ఇక్కడ మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే; అబ్రాహాము దేవుని చేత పిలువబడి ఆయన విశ్వాసిగా జీవిస్తున్నాడు. అయినప్పటికీ తన సహోదరుని సంతానం చెరపట్టబడిందని వినగానే ఆ శత్రువులపై యుద్ధానికి సిద్ధపడి దేవుని సహాయంతో వారిని ఓడించాడు. ఈవిధంగా అతను యుద్ధానికి సిద్ధపడడాన్ని దేవుడు నేరంగా పరిగణించలేదు. పైగా అతనికి సహాయం చేసాడు. దీనినిబట్టి మన/మనవారి ఆత్మరక్షణకోసం శత్రువులపై ప్రతిదాడి చెయ్యడం దేవుని దృష్టిలో నేరం కాదని గుర్తించాలి. అలాంటి అపాయకర పరిస్థితి మనకు కానీ మనవారికి కానీ సంభవించి "ఇక తప్పించుకునే ఏ మార్గమూ అనగా పారిపోయే అవకాశం కూడా లేనప్పుడు" దేవునిపై ఆధారపడి శత్రువులపై ప్రతిదాడి చెయ్యాలి.
"కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచుకొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను" (లేవీకాండము 19:18), "కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును" (సామెతలు 20:22), "కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యు లందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి" (రోమా 12:17), "ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి" (1 పేతురు 3:9), "మీకు మీరే పగతీర్చుకొనవద్దు ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది" (రోమా 12:19) వంటి ఆజ్ఞలు ఎవరో మనకు గతంలో చేసిన కీడును బట్టి, వారిపై "పగతో" ప్రతీకారం (ప్రతికీడు) తీర్చుకోవద్దని, "వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెదనను కొనకుము" (సామెతలు 24:29), ఎందుకంటే; మనపక్షంగా పగ తీర్చుకునే దేవుడు ఉన్నాడని బోధిస్తున్నాయి తప్ప మనకు ఇతరుల నుండి కీడు (అపాయం) జరుగుతున్న సమయంలో కూడా మనల్ని మనం రక్షించుకునే ప్రయత్నాలు చెయ్యకూడదని వాటి భావం కాదు. ఆ ప్రయత్నంలో భాగంగా కొన్నిసార్లు శత్రువులపై ప్రతిదాడి చెయ్యవలసి వస్తుంది. అది పగతో/ప్రతీకారంతో చేసేది కాదు, మనల్ని మనం కాపాడుకోవడానికి చేసేది.
గమనించండి; అలాంటి ప్రతిదాడిలో శత్రువు మనకిక కీడు చెయ్యలేని విధంగా నేలకూలినప్పుడు కూడా కసితో మరలా దాడి చేస్తే అది మాత్రం పగతీర్చుకోవడమే ఔతుంది. అది పైన ప్రస్తావించిన దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమే. ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేసే విశ్వాసులు ఈ విషయం కూడా బాగా గుర్తుంచుకోవాలి.
అలానే "దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము" (మత్తయి 5:39) అనే యేసుక్రీస్తు మాటలు ఆత్మరక్షణ చేసుకోవద్దనే భావంలో చెప్పబడలేదు. ఆ మాటల భావం అదే ఐతే ఆయన చెంపమీద కొట్టడం వంటి చిన్నచిన్న దాడుల గురించి కాకుండా నిన్ను కత్తితో ఒకపక్క పొడిచేవాడికి మరో పక్క కూడా చూపించమని చెప్పేవాడేమో. యేసుక్రీస్తు ఆ మాటలు పలికిన సందర్భాన్ని మనం 38వ వచనం నుండి పరిశీలిస్తే మోషే ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పంటికి పన్ను అని దేవుడు చట్టపరంగా అమలు చెయ్యమన్న శిక్షలను ఇశ్రాయేలీయులు వ్యక్తిగత పగలు తీర్చుకోవడానికి అనగా గతంలో వారికి జరిగిన కీడును బట్టి పగతీర్చుకోవడానికి అడ్డు పెట్టుకునేవారు. అయితే అలా వ్యక్తిగతంగా పగతీర్చుకోవడం (గతంలో జరిగిన కీడును బట్టి) దేవునికి విరుద్ధమైన కార్యం కాబట్టి, దేవుని పిల్లలుగా వారు తమ శత్రువులను క్షమించగలగాలి (మత్తయి 5:44, 6:14,15) కాబట్టి, యేసుక్రీస్తు వారి ఆలోచనను సరిచేస్తూ నిన్ను కుడిచెంప మీద కొట్టేవాడికి ఎడమచెంప త్రిప్పుము అని చెబుతున్నాడు.
చెంపపై కొట్టడం ప్రాణ/మాన హానికి సంబంధించిన విషయం కాదు అది అవతలి వ్యక్తికి కలిగిన కోపాన్ని బట్టి చేసే చిన్నపాటి దాడి మాత్రమే. ఆ సమయంలో మనమూ ప్రతిదాడికి దిగితే అప్పుడే అది పెద్ద గొడవగా మారి ప్రాణహానుల వరకూ వెళ్తుంది. అంటే అక్కడ ఆయన చిన్న చిన్న గొడవలను కాస్తా పెద్దవిగా చేసుకోవద్దనే అర్థంలో మాట్లాడుతున్నాడు.
అక్కడ యేసుక్రీస్తు చెబుతున్న మాటలను మనం అక్షరార్థంగా తీసుకుంటే ఆయనను ప్రధానయాజకుడు విమర్శ చేసే సమయంలో సైనికుడొకడు ఆయనను కొట్టినప్పుడు మరో చెంపను కూడా చూపించకుండా వాడిని ఎందుకు ప్రశ్నించాడు? (యోహాను 18:22,23). కాబట్టి యేసుక్రీస్తు ఆ సందర్భంలో చెప్పిన మాటలను నేను చెప్పినవిధంగా అర్థం చేసుకోవాలి.
మన పాపాలను బట్టి ఆయన మరణించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన తప్పించుకునే ప్రయత్నం చెయ్యలేదు. శిష్యులలో కొందరికి కూడా వారి మరణ సమయం గురించి ముందే తెలుసు కాబట్టి వారు కూడా దానినుండి తప్పించుకోవాలని ప్రయత్నించలేదు. కానీ మన మరణదినం ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి, మన ప్రాణ మానాలకు అపాయం కలిగే పరిస్థితి వచ్చినప్పుడు పైన చెప్పినవిధంగా తప్పించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆ సమయంలో ఏ మార్గమూ లేనప్పుడు (పారిపోవడానికి కూడా) శత్రువుపై ప్రతిదాడి చెయ్యాలి. మళ్ళీ చెబుతున్నాను. ఆ క్రమంలో శత్రువు మనపై ఇక దాడి చెయ్యలేని విధంగా లొంగిపోయినప్పుడు మాత్రం పగతో ఆ వ్యక్తిని మరలా గాయపరచకూడదు, చంపకూడదు. షెకెము విషయంలో లేవీ షిమ్యోనులు ఈ నియమాన్ని పాటించనందుకే యాకోబు మరణ సమయంలో శపించబడ్డారు (ఆదికాండము 49:5-7).
అదేవిధంగా గత అధ్యాయంలో పశువుల కాపరుల మధ్య కలిగిన వివాదాన్ని బట్టి అబ్రాహాము లోతును విడిగా ఉండమన్నాడు. కానీ ఇప్పుడు ఆ లోతు సమస్యలో చిక్కుకోగానే తన ప్రాణాలకు తెగించి మరీ కాపాడుకునే ప్రయత్నం చేసాడు. కాబట్టి మనం కూడా కొన్ని సమస్యల వల్ల మన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నప్పటికీ/దూరం పెట్టినప్పటికీ వారికి సమస్య రాగానే తగిన సహాయాన్ని అందించాలి.
ఆదికాండము 14:18-20 మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పు డతడు అబ్రామును ఆశీర్వదించిఆకాశమునకు భూమి కిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవునివలన అబ్రాము ఆశీర్వ దింపబడునుగాక అనియు, నీ శత్రు వులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్ని టిలో ఇతనికి పదియవవంతు ఇచ్చెను.
ఈ వచనాలలో మెల్కీసెదెకు అనే యాజకుడు అబ్రాహామును కలుసుకుని అతనిని దీవించడం, అబ్రాహాము అతనికి దశమభాగం ఇవ్వడం మనం చూస్తాం. ఈ మెల్కీసెదకు గురించి కొందరు యూదులైతే నోవహు కుమారుడైన షేము అనీ కొందరు క్రైస్తవులైతే యేసుక్రీస్తు ప్రభువేయని విశ్వసిస్తుంటారు. కానీ ఆ రెండు అభిప్రాయాలూ సరికాదు. దీనిగురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
యేసుక్రీస్తే మెల్కీసెదకా?
ఆదికాండము 14:21-24 సొదొమ రాజుమనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసికొనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీవాటిలో ఏదైనను తీసికొన నని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతు డును దేవుడునైన యెహోవాయెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతోకూడ వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అను వారికి ఏయే భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసికొననిమ్మని సొదొమ రాజుతో చెప్పెను.
ఈ వచనాలలో సొదొమ రాజు మనుష్యులను మాత్రమే నాకు అప్పగించి సంపదను నువ్వే తీసుకో అన్నప్పుడు అబ్రాహాము దానిని తృణీకరించడం మనం చూస్తాం. అబ్రాహాము ఆ ఆస్తిలో ఏదీ తీసుకోనని ప్రమాణం చేసినట్టు కూడా మనకిక్కడ అర్థమౌతుంది. ఎందుకంటే సొదొమ మనుష్యులు దుర్మార్గులని అతనికి తెలుసు. ఒకవేళ అబ్రాహాము కనుక ఆ ఆస్తిని తీసుకుంటే తర్వాత ఆ సొదొమరాజు అబ్రాహాముకు కలిగిన సమృద్ధి తనవల్లే కలిగిందని అతిశయించే అవకాశం ఉంది. కానీ అబ్రాహాము దేవుని ఆశీర్వాదం వల్ల ముందే ధనవంతుడిగా ఉన్నాడు. అందుకే అబ్రాహాము దేవుని ఆశీర్వాదం వల్ల తనకు కలిగిన సమృద్ధి విషయంలో ఆ ఘనత సొదొమ రాజుకు దక్కకుండా జాగ్రతపడుతున్నాడు. మనం కూడా మన జీవితాలలో దేవుడు మనకు చేస్తున్న మేలులను బట్టి వేరేవారు ఘనతపొందే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. అలా ఇవ్వకుండా ఉండాలంటే దుష్టులు మనకేదో దానంగా చేస్తున్నట్టుగా భావించగలిగే సహాయాలకు దూరంగా ఉండాలి. ఈ విషయం మరచిపోవద్దు; అన్యుల నుండి సహాయం పొందుకోవడం వేరు దుష్టులనుండి సహాయం పొందుకోవడం వేరు. అబ్రాహాము కూడా అన్యులనుండి సహాయం పొందుకున్నాడు. కానీ దుష్టులనుండి కాదు.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 14
14:1-9, 14:10, 14:11-13, 14:14-17, 14:18-20, 14:21-24
ఆదికాండము 14:1-9 షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీ యుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొఱ్ఱా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయీయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి. వీరందరు ఉప్పు సముద్రమైన సిద్దీములోయలో ఏకముగా కూడి పండ్రెండు సంవత్సరములు కదొర్లా యోమెరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగు బాటు చేసిరి. పదునాలుగవ సంవత్సరమున కదొర్లా యోమెరును అతనితో కూడనున్న రాజులును వచ్చి అష్తా రోత్ కర్నాయిములో రెఫాయీయులను హాములో జూజీయులను షావే కిర్యతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఏల్పారాను వరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేషను ఏన్మిష్పతుకువచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులనుకూడ కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును గొమొఱ్ఱా రాజును అద్మా రాజును సెబోయీము రాజును సోయరను బెల రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ యైదుగురు రాజులు యుద్ధము చేసిరి.
ఈ వచనాలలో కొందరు రాజుల మధ్య జరిగిన యుద్ధం గురించి రాయబడడం మనం చూస్తాం. అయితే సొదొమ, గొమొఱ్ఱాలు మరియు ఇక్కడ చెప్పబడుతున్న ఇతర మూడు పట్టణాలూ మృతసముద్రానికి తూర్పుదిక్కుగా ఉండేవి. వీటిపై యుద్దం చెయ్యడానికి ఎక్కడో బాబేలు/షీనారు (ఇరాక్) ప్రాంతంలో నివసిస్తున్న రాజులు ఎలా వచ్చారు? వారిలో కదొర్లాయెమెరు అనే రాజు 12 సంవత్సరాలు ఆ పట్టణాలను ఎలా లోపరచుకున్నాడనే ప్రశ్నలు ఇక్కడ వస్తుంటాయి. కానీ క్రీస్తు శకం 1920వ సంవత్సరంలో "Dr.Nelson Glueek" అనే పురాతత్వ శాస్త్రవేత్త పరిశీలన ప్రకారం; ఇరాక్ నుండి మృతసముద్రం తూర్పుదిక్కున సొదొమ, గొమొఱ్ఱా వైపు వేయబడిన ఒక పురాతన మార్గం బయటపడింది. ఆ మార్గం ద్వారానే ఆ రాజులు సొదొమ, గొమొఱ్ఱాలపై యుద్ధానికి వచ్చారని బైబిల్ పండితులు విశ్వసిస్తున్నారు.
ఈ రాజులలో మనం ప్రధానంగా గుర్తించవలసిన రాజు అమ్రాపేలు. షీనారు/బాబేలు (ఇరాక్) దేశం, ఆదికాండము 11వ అధ్యాయానికే నాగరికతపరంగా అభివృద్ధి చెందినట్టు మనకు కనిపిస్తుంది. ఆ ప్రాంతాన్ని అబ్రాహాము కాలంలో ఇతనే పరిపాలించాడు. హమ్మురాబి అనే ఇతనిపేరుతో 282 చట్టాలను కలిగియున్న, ఏడు అడుగుల రాతిపలకను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. పురాతన చట్టప్రతుల్లో అది ఒకటి. దీని గురించిన ఆధారాలు పరిశీలించండి.
https://www.newadvent.org/cathen/01441a.htm
https://booksnthoughts.com/one-of-the-oldest-law-code-in-the-world/
ఆదికాండము 14:10 ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొఱ్ఱాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి.
ఈ వచనంలో సొదొమ గొమొఱ్ఱా రాజులు పారిపోయి, సిద్దీములోయలోని మట్టికీలు గుంటల్లో పడడం మనం చూస్తాం. ఈ మట్టికీలు గుంటలు, భూమిలో ఉండే సహజ పెట్రోలియం నుండి ప్రకృతి సిద్ధమైన రసాయనక ప్రక్రియల ద్వారా ఏర్పడే "బిటుమెన్" అనే పధార్థమని బైబిల్ పండితులు భావిస్తున్నారు. మెసపటోమియా పాలస్తీనా ప్రాంతాల్లో శీతోష్ణస్థితి, నేలల భౌతికస్వరూపాల మూలంగా ఈ గుంటలు విరివిగా ఏర్పడేవట, వీటికి మండే గుణం ఉంటుంది.
ఆదికాండము 14:11-13 అప్పుడు వారు సొదొమ గొమొఱ్ఱాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నియు పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపుర ముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొనిపోగా తప్పించుకొనిన యొకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రా మునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసికొనినవారు.
ఈ వచనాలలో ఆ రాజులు సొదొమ గొమొఱ్ఱాలపై దాడి చేసి లోతునూ అతని కుటుంబాన్ని కూడా చెరపట్టుకుని పోయినట్టు, అక్కడినుండి తప్పించుకున్న ఒక వ్యక్తి వచ్చి అబ్రాహాముతో ఆ విషయం చెప్పడం మనం చూస్తాం. బహుశా ఆ వ్యక్తి లోతు పనివాడు అయ్యుంటాడు. ఇక్కడ బైబిల్ గ్రంథం మొదటిసారిగా అబ్రాహామును హెబ్రీయుడని సంబోధించింది. తర్వాత నుండి ఇతని సంతానమైన ఇశ్రాయేలీయులంతా హెబ్రీయులుగా పిలవబడ్డారు.
అదేవిధంగా లోతు కుటుంబం యొక్క ప్రస్తావనను కూడా ఇక్కడే మొదటిసారి చూస్తున్నాం. అతను ఊరు అనే పట్టణం నుండి అబ్రాహాముతో ప్రయాణమైనప్పుడు కానీ అబ్రాహాము నుండి ఈ పట్టణాల వైపు విడిపోయినప్పుడు కానీ ఆ కుటుంబం యొక్క ప్రస్తావన లేదు. దీనిప్రకారం; అతను సొదొమ గొమొఱ్ఱాలకు చెందిన స్త్రీనే వివాహం చేసుకుని ఉంటాడు. అందుకే ఆమె ప్రవర్తనా ఆమెకు పుట్టిన కుమార్తెల ప్రవర్తన కూడా ఆ పట్టణాలను పోలినట్టే కనిపిస్తుంది.
ఆదికాండము 14:14-17 అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన యింట పుట్టి అలవరచబడిన మూడువందల పదునెనమండుగురిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులును వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసికొని వచ్చెను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు, రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను.
ఈ వచనాలలో అబ్రాహాము కేవలం మూడువందల పద్దెనిమిది మందితో కలసి సొదొమ గొమొఱ్ఱాలను చెరపట్టిన ఐదుగురు రాజులతో యుద్ధం చేసివారిని ఓడించినట్టు మనం చూస్తాం. ఇది దేవుని శక్తినిబట్టే అబ్రాహాముకు సాధ్యమైంది. ఇలాంటి సంఘటనే మనం గిద్యోను విషయంలో కూడా చూస్తాం (న్యాయాధిపతులు 7: 7).
ఇక్కడ మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే; అబ్రాహాము దేవుని చేత పిలువబడి ఆయన విశ్వాసిగా జీవిస్తున్నాడు. అయినప్పటికీ తన సహోదరుని సంతానం చెరపట్టబడిందని వినగానే ఆ శత్రువులపై యుద్ధానికి సిద్ధపడి దేవుని సహాయంతో వారిని ఓడించాడు. ఈవిధంగా అతను యుద్ధానికి సిద్ధపడడాన్ని దేవుడు నేరంగా పరిగణించలేదు. పైగా అతనికి సహాయం చేసాడు. దీనినిబట్టి మన/మనవారి ఆత్మరక్షణకోసం శత్రువులపై ప్రతిదాడి చెయ్యడం దేవుని దృష్టిలో నేరం కాదని గుర్తించాలి. అలాంటి అపాయకర పరిస్థితి మనకు కానీ మనవారికి కానీ సంభవించి "ఇక తప్పించుకునే ఏ మార్గమూ అనగా పారిపోయే అవకాశం కూడా లేనప్పుడు" దేవునిపై ఆధారపడి శత్రువులపై ప్రతిదాడి చెయ్యాలి.
"కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచుకొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను" (లేవీకాండము 19:18), "కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును" (సామెతలు 20:22), "కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యు లందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి" (రోమా 12:17), "ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి" (1 పేతురు 3:9), "మీకు మీరే పగతీర్చుకొనవద్దు ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది" (రోమా 12:19) వంటి ఆజ్ఞలు ఎవరో మనకు గతంలో చేసిన కీడును బట్టి, వారిపై "పగతో" ప్రతీకారం (ప్రతికీడు) తీర్చుకోవద్దని, "వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెదనను కొనకుము" (సామెతలు 24:29), ఎందుకంటే; మనపక్షంగా పగ తీర్చుకునే దేవుడు ఉన్నాడని బోధిస్తున్నాయి తప్ప మనకు ఇతరుల నుండి కీడు (అపాయం) జరుగుతున్న సమయంలో కూడా మనల్ని మనం రక్షించుకునే ప్రయత్నాలు చెయ్యకూడదని వాటి భావం కాదు. ఆ ప్రయత్నంలో భాగంగా కొన్నిసార్లు శత్రువులపై ప్రతిదాడి చెయ్యవలసి వస్తుంది. అది పగతో/ప్రతీకారంతో చేసేది కాదు, మనల్ని మనం కాపాడుకోవడానికి చేసేది.
గమనించండి; అలాంటి ప్రతిదాడిలో శత్రువు మనకిక కీడు చెయ్యలేని విధంగా నేలకూలినప్పుడు కూడా కసితో మరలా దాడి చేస్తే అది మాత్రం పగతీర్చుకోవడమే ఔతుంది. అది పైన ప్రస్తావించిన దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమే. ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేసే విశ్వాసులు ఈ విషయం కూడా బాగా గుర్తుంచుకోవాలి.
అలానే "దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము" (మత్తయి 5:39) అనే యేసుక్రీస్తు మాటలు ఆత్మరక్షణ చేసుకోవద్దనే భావంలో చెప్పబడలేదు. ఆ మాటల భావం అదే ఐతే ఆయన చెంపమీద కొట్టడం వంటి చిన్నచిన్న దాడుల గురించి కాకుండా నిన్ను కత్తితో ఒకపక్క పొడిచేవాడికి మరో పక్క కూడా చూపించమని చెప్పేవాడేమో. యేసుక్రీస్తు ఆ మాటలు పలికిన సందర్భాన్ని మనం 38వ వచనం నుండి పరిశీలిస్తే మోషే ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పంటికి పన్ను అని దేవుడు చట్టపరంగా అమలు చెయ్యమన్న శిక్షలను ఇశ్రాయేలీయులు వ్యక్తిగత పగలు తీర్చుకోవడానికి అనగా గతంలో వారికి జరిగిన కీడును బట్టి పగతీర్చుకోవడానికి అడ్డు పెట్టుకునేవారు. అయితే అలా వ్యక్తిగతంగా పగతీర్చుకోవడం (గతంలో జరిగిన కీడును బట్టి) దేవునికి విరుద్ధమైన కార్యం కాబట్టి, దేవుని పిల్లలుగా వారు తమ శత్రువులను క్షమించగలగాలి (మత్తయి 5:44, 6:14,15) కాబట్టి, యేసుక్రీస్తు వారి ఆలోచనను సరిచేస్తూ నిన్ను కుడిచెంప మీద కొట్టేవాడికి ఎడమచెంప త్రిప్పుము అని చెబుతున్నాడు.
చెంపపై కొట్టడం ప్రాణ/మాన హానికి సంబంధించిన విషయం కాదు అది అవతలి వ్యక్తికి కలిగిన కోపాన్ని బట్టి చేసే చిన్నపాటి దాడి మాత్రమే. ఆ సమయంలో మనమూ ప్రతిదాడికి దిగితే అప్పుడే అది పెద్ద గొడవగా మారి ప్రాణహానుల వరకూ వెళ్తుంది. అంటే అక్కడ ఆయన చిన్న చిన్న గొడవలను కాస్తా పెద్దవిగా చేసుకోవద్దనే అర్థంలో మాట్లాడుతున్నాడు.
అక్కడ యేసుక్రీస్తు చెబుతున్న మాటలను మనం అక్షరార్థంగా తీసుకుంటే ఆయనను ప్రధానయాజకుడు విమర్శ చేసే సమయంలో సైనికుడొకడు ఆయనను కొట్టినప్పుడు మరో చెంపను కూడా చూపించకుండా వాడిని ఎందుకు ప్రశ్నించాడు? (యోహాను 18:22,23). కాబట్టి యేసుక్రీస్తు ఆ సందర్భంలో చెప్పిన మాటలను నేను చెప్పినవిధంగా అర్థం చేసుకోవాలి.
మన పాపాలను బట్టి ఆయన మరణించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన తప్పించుకునే ప్రయత్నం చెయ్యలేదు. శిష్యులలో కొందరికి కూడా వారి మరణ సమయం గురించి ముందే తెలుసు కాబట్టి వారు కూడా దానినుండి తప్పించుకోవాలని ప్రయత్నించలేదు. కానీ మన మరణదినం ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి, మన ప్రాణ మానాలకు అపాయం కలిగే పరిస్థితి వచ్చినప్పుడు పైన చెప్పినవిధంగా తప్పించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆ సమయంలో ఏ మార్గమూ లేనప్పుడు (పారిపోవడానికి కూడా) శత్రువుపై ప్రతిదాడి చెయ్యాలి. మళ్ళీ చెబుతున్నాను. ఆ క్రమంలో శత్రువు మనపై ఇక దాడి చెయ్యలేని విధంగా లొంగిపోయినప్పుడు మాత్రం పగతో ఆ వ్యక్తిని మరలా గాయపరచకూడదు, చంపకూడదు. షెకెము విషయంలో లేవీ షిమ్యోనులు ఈ నియమాన్ని పాటించనందుకే యాకోబు మరణ సమయంలో శపించబడ్డారు (ఆదికాండము 49:5-7).
అదేవిధంగా గత అధ్యాయంలో పశువుల కాపరుల మధ్య కలిగిన వివాదాన్ని బట్టి అబ్రాహాము లోతును విడిగా ఉండమన్నాడు. కానీ ఇప్పుడు ఆ లోతు సమస్యలో చిక్కుకోగానే తన ప్రాణాలకు తెగించి మరీ కాపాడుకునే ప్రయత్నం చేసాడు. కాబట్టి మనం కూడా కొన్ని సమస్యల వల్ల మన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నప్పటికీ/దూరం పెట్టినప్పటికీ వారికి సమస్య రాగానే తగిన సహాయాన్ని అందించాలి.
ఆదికాండము 14:18-20 మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పు డతడు అబ్రామును ఆశీర్వదించిఆకాశమునకు భూమి కిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవునివలన అబ్రాము ఆశీర్వ దింపబడునుగాక అనియు, నీ శత్రు వులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్ని టిలో ఇతనికి పదియవవంతు ఇచ్చెను.
ఈ వచనాలలో మెల్కీసెదెకు అనే యాజకుడు అబ్రాహామును కలుసుకుని అతనిని దీవించడం, అబ్రాహాము అతనికి దశమభాగం ఇవ్వడం మనం చూస్తాం. ఈ మెల్కీసెదకు గురించి కొందరు యూదులైతే నోవహు కుమారుడైన షేము అనీ కొందరు క్రైస్తవులైతే యేసుక్రీస్తు ప్రభువేయని విశ్వసిస్తుంటారు. కానీ ఆ రెండు అభిప్రాయాలూ సరికాదు. దీనిగురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
యేసుక్రీస్తే మెల్కీసెదకా?
ఆదికాండము 14:21-24 సొదొమ రాజుమనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసికొనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీవాటిలో ఏదైనను తీసికొన నని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతు డును దేవుడునైన యెహోవాయెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతోకూడ వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అను వారికి ఏయే భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసికొననిమ్మని సొదొమ రాజుతో చెప్పెను.
ఈ వచనాలలో సొదొమ రాజు మనుష్యులను మాత్రమే నాకు అప్పగించి సంపదను నువ్వే తీసుకో అన్నప్పుడు అబ్రాహాము దానిని తృణీకరించడం మనం చూస్తాం. అబ్రాహాము ఆ ఆస్తిలో ఏదీ తీసుకోనని ప్రమాణం చేసినట్టు కూడా మనకిక్కడ అర్థమౌతుంది. ఎందుకంటే సొదొమ మనుష్యులు దుర్మార్గులని అతనికి తెలుసు. ఒకవేళ అబ్రాహాము కనుక ఆ ఆస్తిని తీసుకుంటే తర్వాత ఆ సొదొమరాజు అబ్రాహాముకు కలిగిన సమృద్ధి తనవల్లే కలిగిందని అతిశయించే అవకాశం ఉంది. కానీ అబ్రాహాము దేవుని ఆశీర్వాదం వల్ల ముందే ధనవంతుడిగా ఉన్నాడు. అందుకే అబ్రాహాము దేవుని ఆశీర్వాదం వల్ల తనకు కలిగిన సమృద్ధి విషయంలో ఆ ఘనత సొదొమ రాజుకు దక్కకుండా జాగ్రతపడుతున్నాడు. మనం కూడా మన జీవితాలలో దేవుడు మనకు చేస్తున్న మేలులను బట్టి వేరేవారు ఘనతపొందే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. అలా ఇవ్వకుండా ఉండాలంటే దుష్టులు మనకేదో దానంగా చేస్తున్నట్టుగా భావించగలిగే సహాయాలకు దూరంగా ఉండాలి. ఈ విషయం మరచిపోవద్దు; అన్యుల నుండి సహాయం పొందుకోవడం వేరు దుష్టులనుండి సహాయం పొందుకోవడం వేరు. అబ్రాహాము కూడా అన్యులనుండి సహాయం పొందుకున్నాడు. కానీ దుష్టులనుండి కాదు.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Add comment