31:1, 31:2, 31:3, 31:4-13, 31:14-16, 31:17,18, 31:19, 31:20,21, 31:22,23, 31:24, 31:25-28, 31:29, 31:30, 31:31,32, 31:33-35, 31:36,37, 31:38-42, 31:43,44, 31:45,46, 31:47, 31:48, 31:49,50, 31:51,52, 31:53, 31:54,55
ఆదికాండము 31:1 లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసికొని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను.
ఈ వచనంలో లాబాను కుమారులు అన్యాయంగా పలుకుతున్న మాటలను యాకోబు వినడం మనం చూస్తాం. ఇక్క డవారు యాకోబు వశమైన మందలు అతని కష్టానికి ప్రతిఫలమని, తన తండ్రి ఒప్పందం ప్రకారమే అవి అతని వశమయ్యాయని, ఆ మాటకొస్తే యాకోబును బట్టే తమ తండ్రి మందలు దీవించబడ్డాయని వారు గుర్తించలేకపోతున్నారు. ఈ అసూయ మానవుల పతన స్వభావాన్ని తెలియచేస్తుంది. ఇలాంటి అనుభవమే మనలో చాలామందికి పనిచేసే చోట్లలోనూ వ్యాపారం విషయంలోనూ చదువుల పోటీలోనూ చివరికి పరిచర్యలో సైతం ఎదురౌతుంటుంది.
ఈ అసూయతో కూడిన వైఖరి విశ్వాసుల్లో లేకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే ఆ లక్షణం ఆత్మసంబంధులకు కాదు శరీరసంబంధులకు చెందిందిగా చెప్పబడింది (1 కొరింథీ 3:3). కాబట్టి విశ్వాసులు తమ కళ్ళముందు ఎవరైనా అభివృద్ధి చెందుతున్నప్పుడు వారిని అభినందించేవారిగా ఉండాలి తప్ప అసూయపడేవారిగా ఉండకూడదు. ఈ అసూయ మెళ్ళిమెళ్ళిగా హత్యలకు కూడా ప్రేరేపిస్తుందని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. బైబిల్ లో జరిగిన మొట్టమొదటి హత్యకు (కయీను&హెబేలు) ఈ అసూయనేగా కారణం. అన్నలు యోసేపును చంపాలని ప్రయత్నించడానికి కూడా ఈ అసూయనే కారణం. ఇలాంటి సంఘటనలెన్నో ఈరోజుకూ మనం చూస్తున్నాం. అందుకే పౌలు ఈ అసూయను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని పాపాల జాబితాలో హత్యలతో సమానంగా చేర్చాడు (గలతీ 5:20,21).
ఆదికాండము 31:2 మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనియెడల ఉండలేదు.
ఈ వచనంలో యాకోబు లాబాను ప్రవర్తనలో కూడా మార్పు గమనించడం మనం చూస్తాం. మన మనసులోని భావనలు మన ముఖాల్లో కూడా బయటపడుతుంటాయి. అందుకే తోటివారి పట్ల, కుటుంబీకుల పట్ల మన మనసును నిర్మలంగా ఉంచుకోవాలి.
ఆదికాండము 31:3 అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము. నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా-
ఈ వచనంలో దేవుడు నీ తండ్రి ఇంటికి తిరిగివెళ్ళమని యాకోబుకు మరలా ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈ మాటలు యాకోబుపై ఉన్న ఆయన కాపుదలను సూచిస్తున్నాయి.
ఆదికాండము 31:4-13 యాకోబు పొలములో తన మందయొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో యిట్లనెను. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడైయున్నాడు. మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసేయున్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చేయనియ్యలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లలనీనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవైయుండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయననీ కన్నులెత్తి చూడుము. గొఱ్ఱెలను దాటుచున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని నీ వెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.
ఈ వచనాలలో యాకోబు అక్కడినుండి తన భార్యలను ఊరికే తీసుకుపోకుండా ఇంతకాలం ఏం జరిగిందో ఇప్పుడు తన తండ్రి ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడో వివరించడం మనం చూస్తాం. అతను అలా చెయ్యకుండా కనానుకు తీసుకువెళ్ళుంటే వారు యాకోబును అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి భార్యభర్తలు తాము చెయ్యబోయే ప్రతీదానినీ ఒకరికి ఒకరు సానుకూలంగా వివరించుకుంటూ వారిమధ్య ఎలాంటి అపార్థాలూ తలెత్తకుండా జాగ్రతపడాలి. కొన్నిసార్లు ఒక చిన్న అపార్థం కూడా వారి సంబంధాన్ని దెబ్బతీస్తుంది.
అదేవిధంగా అతను లాబాను తన విషయంలో ఎన్నిసార్లు మాటలు మార్చినా నేను మాత్రం నిజాయితీగా కొలువు చేసానని చెబుతున్నాడు. యాకోబు లాబాను చేస్తున్న మోసాన్ని బట్టి అతను కూడా అవినీతికి పాల్పడడం, తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించకపోవడం వంటివి చేసుంటే ఇక్కడ కానీ తర్వాత సందర్భంలో లాబాను దగ్గరకానీ ఇంత ధైర్యంగా మాట్లాడగలిగేవాడు కాదు (ఆదికాండము 31:38-41). కాబట్టి మనం చేసేపనిలో అన్యాయానికి గురౌతున్నప్పటికీ దేవునిపై ఆధారపడి మనవైపునుండి ఎలాంటి లోపమూ లేకుండా చూసుకోవాలి. చివరకు మనం ఎవరిపై ఆధారపడి నిజాయితీగా నడుచుకుంటున్నామో ఆ న్యాయవంతుడైన దేవుడే యాకోబు విషయంలో చేసినట్టు మనకూ న్యాయం చేస్తాడు. అందుకే ఉద్యోగస్తులకు "మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి" (ఎఫెసీ 6:7) అని ఆజ్ఞాపించబడింది.
ఇక యాకోబు "దేవుని దూత" అతనికి ప్రత్యక్షమై తన తండ్రి ఇంటికి తిరిగివెళ్ళమన్నట్టు కూడా చెబుతున్నాడు. అయితే ఆ దూత "నీ వెక్కడ స్తంభము మీద నూనె పోసితివో యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే" అని అంటున్నాడు. దీనిప్రకారం; బేతేలులో ఏ దేవుడైతే అతనికి ప్రత్యక్షమయ్యాడో (ఆదికాండము 28:11-22). ఆ దేవుడే ఇక్కడ దేవుని దూతగా మాట్లాడుతున్నాడు. ఆ దూతనే యెహోవా దూత. ఈ దూత గురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
యెహోవా దూత, యేసుక్రీస్తు
ఆదికాండము 31:14-16 అందుకు రాహేలును లేయాయు యింక మా తండ్రి యింట మాకు పాలుపంపులెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మును అమ్మివేసి, మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్దనుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునైయున్నది గదా? కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్ల చేయుమని అతనికుత్తరమియ్యగా-
ఈ వచనాలలో లేయా రాహేలులు యాకోబు మాటలకు తమ అనుభవాలను కూడా జతచేస్తూ తమ తండ్రి ఇంటినుండి కనానుకు వెళ్ళడానికి సిద్ధపడడం మనం చూస్తాం. ఇక్కడ వారు తమ తండ్రి దగ్గరే ఉండాలని వాదనకు దిగలేదు, అనగా తమ సంబంధాన్ని బట్టి తండ్రిని సమర్ధించుకోట్లేదు. ఎందుకంటే యాకోబు మాటల్లో న్యాయం ఉంది. కాబట్టి దాంపత్య జీవితంలో భాగస్వామి చెప్పినమాటలను/భావనలను న్యాయబద్ధంగా ఆలోచిస్తూ సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుతం చాలా కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. భాగస్వామి మాటలు/బాధ అర్థం చేసుకోకుండా తల్లితండ్రులను గ్రుడ్డిగా సమర్ధించుకోవడమే ఎక్కువగా చూస్తున్నాం. విశ్వాసులు అలా ఉండకూడదు. న్యాయం ఎటువైపు ఉంటే మన సానుకూలత కూడా అటువైపే ఉండాలి. ఎందుకంటే మన దేవుడైన "యెహోవా న్యాయమును ప్రేమించువాడు" (కీర్తనలు 37:28).
"దేవుడు మా తండ్రి యొద్దనుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునైయున్నది గదా?"
దేవుని కృపను బట్టే యాకోబు ఇంతగా ఆశీర్వదించబడ్డాడని లేయా రాహేలులకు కూడా అర్థమైనట్టు ఈ మాటలను బట్టి గ్రహిస్తున్నాం. దీనంతటికీ అతను చక్కగా వివరించడమే కారణం. కాబట్టి మన ఆశీర్వాదానికి కారణమైన దేవుని కృపను కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు వివరిస్తుండాలి. ముఖ్యంగా పిల్లలకు.
ఆదికాండము 31:17,18 యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలమీద నెక్కించి కనానుదేశమునకు తన తండ్రియైన ఇస్సాకు నొద్దకు వెళ్లుటకు తన పశువులన్నిటిని, తాను సంపాదించిన సంపద యావత్తును, పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొనిపోయెను.
ఈ వచనాలలో యాకోబు తనకున్న సమస్తాన్నీ వెంటబెట్టుకుని కనాను దేశానికి పయనమవ్వడం మనం చూస్తాం. కారణమేంటో ఇప్పటికే మనం వివరించుకున్నాం.
ఆదికాండము 31:19 లాబాను తన గొఱ్ఱెలబొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహదేవతలను దొంగిలెను.
ఈ వచనంలో రాహేలు తన తండ్రి గృహదేవతలను దొంగిలించడం మనం చూస్తాం. మన తెలుగు బైబిల్ లో వాటిని గృహదేవతలు అని తర్జుమా చేసారు కానీ ఆ ప్రాంతపు పూర్వ సంస్కృతులపైన పరిశీలన చేసిన కొందరు బైబిల్ పండితుల వివరణ ప్రకారం; అవి వారు పూజించే దేవతలు కాదు. హీబ్రూ బాషలో వాటిని "הַתְּרָפִ֖ים" (Teraphim) అన్నారు. ఆ ప్రజలు వాటిని తమ గృహానికి రక్షణగా (దేవదూతలులా) ఉంటాయని భావించేవారట వాటిదగ్గర శకునాలు కూడా చూసేవారట. అందుకే వీటి గురించి "గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి" (జెకర్యా 10:2) అని రాయబడింది. దీనిప్రకారం; గతంలో లాబాను యాకోబును బట్టే దేవుడు తనను దీవించాడని వీటిదగ్గరే శకునం చూసి తెలుసుకునుంటాడు. ఇవి కుటుంబంలోని జ్యేష్ఠకుమారుడికి హక్కుగా ప్రాప్తించేవట. సౌలు రాజు ఇంట్లో కూడా ఇలాంటిది ఉన్నట్టు మనం గమనిస్తాం (1 సమూయేలు 19:13).
ఇంతకూ రాహేలు ఈ గృహదేవతలను ఎందుకు దొంగిలించినట్టు? దీనిపై కొందరు, రాహేలు కూడా అలాంటి విశ్వాసంతోనే అనగా అవి తమ కుటుంబానికి రక్షణగా ఉంటాయనీ వాటిదగ్గర శకునాలు చూడవచ్చనే ఉద్దేశంతోనే దొంగిలించిందని అభిప్రాయపడ్డారు. అయితే నేను ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నాను. ఎందుకంటే; రాహేలు యాకోబుతో దేవుడు పలికిన మాటలు విశ్వసించి కనానుకు పయనమయ్యింది. కాబట్టి మార్గంలో శకునం చూడవలసిన అవసరం వస్తుందని కానీ దేవుని రక్షణకు మించి మరో రక్షణ వారికి అవసరమని కానీ ఆమె ఆలోచించి ఉండకపోవచ్చు. గత చరిత్రలో అవిశ్వాసపు ఛాయలు ఆమెలో కనిపిస్తున్నప్పటికీ తర్వాత కాలంలో ఆమె యెహోవాను మాత్రమే దేవునిగా నమ్ముతుందని తన పిల్లలకు పెట్టిన పేర్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ దేవతలలో ఏదో శక్తి ఉందనే ఉద్దేశంలో వాటిని దొంగిలించిందని మనం భావించలేము. మరి ముఖ్యంగా ఆ దేవతలలో ఏదో శక్తి ఉందని నమ్మే ప్రజలు వాటిపట్ల ఎంతో గౌరవంతో ఉంటారు అలాంటి గౌరవమే రాహేలుకు వాటిపై ఉండుంటే వాటిపై కూర్చునే సాహసం చేసేదికాదు (ఆదికాండము 31:34).
ఆదికాండము 31:20,21 యాకోబు తాను పారిపోవుచున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవుటవలన అతని మోసపుచ్చినవాడాయెను. అతడు తనకు కలిగినదంతయు తీసికొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్లెను.
ఈ వచనాలలో యాకోబు లాబానుకు చెప్పకుండా పారిపోవడం వల్ల తన మామను మోసగించినవాడిగా రాయబడడం మనం చూస్తాం. వాస్తవానికి అతను లాబానుది ఏదీ దొంగిలించలేదు ఒప్పందం ప్రకారం తనకు స్వంతమైన ఆస్తినీ మరియు తన భార్యపిల్లల్నే తీసుకుని వెళ్తున్నాడు. కానీ లాబానుకు చెప్పకుండా వెళ్తున్నాడు కాబట్టి అలా రాయబడింది. అయితే అతను ఈవిధంగా చెయ్యడానికి లాబాను ప్రవర్తనే కారణం. అనగా ఎక్కడ వీటన్నిటినీ లాక్కుంటాడో అనే భయం అతనిలో ఉంది (ఆదికాండము 31:31) అయినప్పటికీ అతను దేవుని కాపుదలపై ఆధారపడి తన మామకు విషయం చెప్పవలసింది. కాబట్టి విశ్వాసులు తమకున్న భయాలను బట్టి లేక కారణాలను తమ బాధ్యతలను విస్మరించకూడదు. అవసరమైతే తగు జాగ్రత్తలు తీసుకునైనా చెయ్యాల్సింది చెయ్యాలి.
ఆదికాండము 31:22,23 యాకోబు పారిపోయెనని మూడవ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొనిపోయి, గిలాదుకొండ మీద అతని కలిసికొనెను.
ఈ వచనాలలో లాబాను యాకోబు పారిపోయాడని తెలుసుకుని అతడిని తరమడం మనం చూస్తాం. 19వ వచనం ప్రకారం; రాహేలు తన తండ్రి గృహదేవతలను దొంగిలించేసరికి (యాకోబు పారిపోయే సమయానికి) లాబాను తన గొఱ్ఱెల బొచ్చును కత్తిరించడానికి వెళ్ళాడు. ఆ కాలంలో వారు తమ మందలు నిలిపేచోటికీ వారి నివాసానికీ మధ్య చాలా దూరం ఉంటుంది. ఉదాహరణకు 30:36వ వచనం ప్రకారం; లాబాను యాకోబు మందలు మేపే చోటికీ తన కుమారులు మేపే చోటికీ మధ్యలో మూడు రోజుల ప్రయాణమంత దూరం ఉండేలా చేసాడు. ఈవిధంగా ఆలోచించినప్పుడు లాబాను తన మందల బొచ్చును కత్తిరించడానికి తన ఇంటినుండి చాలా దూరమే వెళ్ళుంటాడు. కాబట్టి అతనికి యాకోబు పారిపోయాడనే సమాచారం మూడవరోజున తెలిసింది. ఆ సమాచారం తెలుసుకున్న లాబాను తన బంధువులందరినీ పోగుచేసుకుని ఏడు రోజుల ప్రయాణమంత దూరంలో అతడిని కలుసుకున్నాడు.
ఆదికాండము 31:24 ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబానునొద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను.
ఈ వచనంలో యాకోబుపై కోపంతో తరుముతున్న లాబానుకు స్వప్నంలో దేవుడు ప్రత్యక్షమై యాకోబు విషయమై హెచ్చరించడం మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఆయన ప్రవక్తలతోనే కాకుండా వారితో సంబంధం ఉన్నవారితో కూడా మాట్లాడడం మనం చూస్తాం. కారణం: వారి క్షేమం. ఉదాహరణకు ఆయన అబ్రాహాము నిమిత్తం అబీమెలెకు రాజుతో మాట్లాడాడు (ఆదికాండము 20:3). ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే దేవుడు ఒకవ్యక్తితో మాట్లాడినంత మాత్రాన ఆ వ్యక్తి మార్పు చెందేసి ఆయనకు దాసుడు అవ్వలేడు. ఆయన సార్వభౌమ నిర్ణయంలో ఉన్నవారు మాత్రమే ఆయనకు సదా దాసులుగా మారుమనస్సు పొందుతారు. అలా ఈ సందర్భంలో ఆయన లాబానుతో మాట్లాడినప్పటికీ ఆ మాటలు అతడిని యాకోబుకు హానీ చెయ్యకుండా నియంత్రించాయే తప్ప అతని జీవితాన్ని మార్చలేదు. మార్చే ఉంటే తర్వాత సందర్భంలో యాకోబు దగ్గర తన మోసాలను కప్పిపుచ్చుకుంటూ వాదించేవాడు కాదు. ఈవిధంగా ఆయన ఈరోజుకూ ఎంతోమంది దుష్టులతో వారి మనస్సాక్షి ద్వారా మాట్లాడుతూ నీతిమంతులకు హాని చెయ్యకుండా నియంత్రిస్తున్నాడు, లేకపోతే చంపాలకున్న ప్రతీవారూ చంపుకునిపోదురు.
అదేవిధంగా ఆయన "యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ" అని పలకడం చూస్తున్నాం. దానర్థం అసలేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండమని కాదు. అదే అయ్యింటే నువ్వు యాకోబును కలుసుకోకుండా వెనక్కు వెళ్ళిపోమని చెప్పేవాడు. జరిగిన చరిత్రనంతా పరిశీలించినప్పుడు, ఇక్కడ లాబాను యాకోబు దగ్గరకు వెళ్ళడంలో అతను రెండు ఉద్దేశాలు కలిగియున్నట్టు అర్థమౌతుంది. మొదటిగా అతను యాకోబు చేసినదాని విషయంలో కోపంతో ఉండి అతనికి ఏదైనా హాని చెయ్యడానికి వెళ్తున్నాడు. రెండవదిగా యాకోబు తనను విడిచిపెట్టిపోవడం లాబానుకు మొదటి నుండీ ఇష్టం లేదు, యాకోబు నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను అన్నప్పుడు అతను తప్పక అంగీకరించాడే తప్ప ఇష్టంతో కాదు. ఎందుకంటే యాకోబును బట్టే దేవుడు తనను ఆశీర్వదిస్తున్నాడని అతను నమ్మాడు (ఆదికాండము 30:27). దీనిప్రకారం అతను యాకోబును ఏదోలా వెనక్కు తీసుకుని వెళ్ళే ఉద్దేశంతో కూడా ఉండి ఉండవచ్చు. అందుకే దేవుడు అతనితో నీవు అతనితో కీడుకానీ (హానిచేసేలా కానీ) మేలుగా కానీ (తిరిగి నీదగ్గరకు తీసుకుని వెళ్ళేలా కానీ) ఏమీ మాట్లాడవద్దని హెచ్చరిస్తున్నాడు.
ఆదికాండము 31:25-28 లాబాను యాకోబును కలిసికొనెను. యాకోబు తన గుడారము ఆ కొండమీద వేసికొనియుండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండమీద గుడారము వేసికొనెను. అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేల? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దుపెట్టుకొననియ్యక పిచ్చిపట్టి యిట్లు చేసితివి.
ఈ వచనాలలో లాబాను నిందనంతా యాకోబుపైనే వేస్తున్నట్టు మనం చూస్తాం. ఒక తండ్రిగా అతని కోపంలో కొంత న్యాయం ఉన్నప్పటికీ జరిగినదానిలో నిందనంతా యాకోబుపై మాత్రమే వేసే హక్కు మాత్రం అతనికి లేదు. ఎందుకంటే అసలు యాకోబు అలా చెయ్యడానికి కారణమే ఇతని ప్రవర్తన కదా!. 20 సంవత్సరాలుగా లాబాను మోసపూరిత స్వభావాన్ని గమనిస్తూ యాకోబు ఎంతో అన్యాయానికి గురయ్యాడు. మరలా ఆవిధంగానే అన్యాయానికి గురౌతాననే భయంతోనే యాకోబు లాబానుకు చెప్పకుండా పారిపోతున్నాడు. కాబట్టి యాకోబు చేసింది పొరపాటే ఐతే ఆ పొరపాటును అతను చెయ్యడానికి కారణం లాబాను ప్రవర్తనే. కొంచెం జీతంలోనే నమ్మకంగా ఉండకుండా 10 సార్లు తన జీతాన్ని మార్చిన లాబాను ఇంతమంద, తన కుమార్తెల విషయంలో నమ్మకంగా ఉండి తనతో పంపిస్తాడని మాత్రం యాకోబు ఎలా నమ్మగలడు? కాబట్టి యాకోబు తనకు చెప్పకుండా పారిపోయే పరిస్థితిని కల్పించింది లాబానే అని మనం కచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఇక్కడ లాబాను వాదనలో మనకు మానవ పతనస్వభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఏమాత్రమూ యాకోబు విషయంలో తాను చేస్తూ వచ్చిన పొరపాటును గుర్తించకుండా నిందనంతా యాకోబుపైనే నెట్టివేస్తున్నాడు. ఇలాంటి స్వభావం ఉన్న మనుషులు మనకు చాలామంది సమాజంలో తారసపడుతూ ఉంటారు. అందుకే "తన పొరపాటులు కనుగొనగలవాడెవడు?" (కీర్తనలు 19:12) అని రాయబడింది.
కాబట్టి విశ్వాసులంగా ఒకరు మనపట్ల ఏదైన పొరపాటుగా ప్రవర్తించినప్పుడు దానివిషయమై వారిపై నిందవేసే ముందు, వారలా ప్రవర్తించడానికి మనలో కూడా ఏదైనా లోపం ఉందా, వారు అలాంటి పొరపాటు చేసే పరిస్థితిని మనమే కల్పించామా అని ఆలోచించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇది నైతికత ఉన్న వ్యక్తులు మాత్రమే అనుసరించగలరు.
ఆదికాండము 31:29 మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రియొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని నాతో చెప్పెను.
ఈ వచనంలో లాబాను యాకోబుతో తన స్వప్నం గురించి తెలియచేస్తూనే మరలా నేను తలచుకుంటే నీకు హాని చెయ్యగలననే గర్వాన్ని ప్రదర్శించడం మనం చూస్తాం. తనతో ఉన్న బంధుబలం అతనితో అలా మాట్లాడిస్తుంది. పతనమైన మానవుడు ఇలానే తన వెనుకున్న మంది, ఆస్తులను బట్టి తాను ఏదైనా చెయ్యగలననే గర్వంతో ప్రవర్తిస్తుంటాడు. కానీ తగిన కాలంలో దేవుడు ఆ గర్వమంతా అణిచివేస్తాడు.
ఆదికాండము 31:30 నీ తండ్రి యింటి మీద బహు వాంఛగలవాడవై వెళ్లగోరినయెడల వెళ్లుము, నా దేవతల నేల దొంగిలితివనగా-
ఈ వచనంలో లాబాను దొంగిలించబడిన తన గృహదేవతల నిమిత్తం కూడా యాకోబును నిందించడం మనం చూస్తాం. కానీ యాకోబు వాటిని దొంగిలించలేదు, పైగా ఆ పని అతనే చేసాడనడానికి లాబాను దగ్గర ఎలాంటి సాక్ష్యమూ లేదు. అయినప్పటికీ అతను యాకోబు చెప్పకుండా పారిపోయాడు కాబట్టి ఆ గృహదేవతలను కూడా అతనే దొంగిలించాడనే అనుమానంతో ఇలాంటి నిరాధారమైన ఆరోపణ చేస్తున్నాడు. మన సమాజంలో కూడా ఎలాంటి ఆధారాలు లేకున్నా ఇతరులపై కేవలం అనుమానంతోనో ద్వేషంతోనో మోపబడే ఆరోపణలు మనం చాలా చూస్తుంటాం. కొన్నిసార్లు ఆ ఆరోపణల వల్ల ఏ తప్పిదం చెయ్యని అమాయకులు కూడా అన్యాయంగా శిక్షకూ అవమానానికీ లోనౌతారు. ఒక వ్యక్తిపై మనకు ఏదైనా అనుమానం ఉన్నప్పుడు అతడిని ప్రశ్నించడం తప్పుకాదు కానీ కచ్చితంగా ఆ పని అతనే చేసాడని ధృవీకరించడం మాత్రం నేరమే. కాబట్టి ఒక విశ్వాసిగా నైతికత ఉన్న మనిషిగా ఇతరులపై మనం ఆరోపణకు సిద్ధపడేముందు దానికి తగిన ఆధారం ఉండాలి. వారు ఇతర విషయాల్లో దోషులైనంత మాత్రాన ఇది కూడా వారే చేసారని ఖచ్చితంగా ధృవీకరించకూడదు దానిని తెలుసుకోవడానికి తగిన రీతిలో విచారణ జరిపించాలి.
ఇక్కడ మనం గుర్తించవలసిన మరో విషయం ఏంటంటే ఇక్కడ లాబాను మనసులో యాకోబు తీసుకుపోతున్న సంపదను బట్టి కలిగే బాధకంటే తన దేవతలను దొంగిలించుకుపోతున్నాడనే కోపమే ఎక్కువ కనిపిస్తుంది. ఇలాంటి సందర్భమే మనకు న్యాయాధిపతుల గ్రంథంలో కూడా కనిపిస్తుంది (న్యాయాధిపతులు 18:24). అక్కడ మీకా అనేవాడు తాను చేయించుకున్న దేవతలను దానీయులు పట్టుకుపోయేసరికి, మీరు వీటిని పట్టుకుపోతున్నారు ఇక నాకేముందని వేదనతో ప్రశ్నిస్తాడు. అంటే తన దేవతలను పట్టుకుపోయేసరికి తనకిక ఏమీలేదు అనే స్థితిలోకి కూరుకుపోయాడు. దీనిని బట్టి జీవముగల దేవునిపిల్లలుగా భావించేమనం బుద్ధి తెచ్చుకోవాలి. విగ్రహారాధికులైన వారు తమ దేవతలను కోల్పోవడమంటే ఇక సమస్తాన్నీ కోల్పోవడమే అన్నట్టు భావిస్తుంటే మనం మాత్రం పాపపు క్రియల వల్ల సులభంగా దేవుణ్ణి విడిచిపెడుతుంటాం.
ఆదికాండము 31:31,32 యాకోబు నీవు బలవంతముగా నా యొద్దనుండి నీ కుమార్తెలను తీసికొందువేమో అనుకొని భయపడితిని . ఎవరియొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రదుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల యెదుట వెదకి నీ దానిని తీసికొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు.
ఈ వచనాలలో యాకోబు నిందకు స్పందిస్తూ నేనలా పారిపోడానికి నీపట్ల ఏర్పడిన భయమే కారణమని చెప్పడం మనం చూస్తాం. అలానే గృహదేవతల విషయంలో తన కుటుంబ సభ్యులు ఎవరూ అలాంటి పనిచెయ్యరనే నమ్మకంతో ఉండి, ఎంతో ధైర్యంగా అవి ఎవరిదగ్గర దొరుకుతాయో వారు చస్తారని తీర్పుతీరుస్తున్నాడు. యాకోబు తన కుటుంబం విషయంలో అలాంటి నమ్మకం కలిగియుండడం తప్పుకాదు కానీ తన కుటుంబ సభ్యుల ప్రవర్తనను పరీక్షించకుండా ఆ నమ్మకాన్ని కనుపరచడం మాత్రం తప్పే ఔతుంది. అతనికి గతంలో లేయా రాహేలులు ఎలాంటి లోపయుక్తమైన ప్రవర్తనను కనుపరిచారో బాగా తెలుసు. అదంతా తెలిసిన యాకోబు వారిలో ఎవరైనా అలాంటి తప్పిదం చేసారా అని ఆలోచించకుండా వారిపట్ల కనపరచిన నమ్మకం ఒక మూఢనమ్మకంతో సమానం. దానివల్ల ఆ గృహదేవతలు కనుక రాహేలు దగ్గర దొరికుంటే తాను పలికినమాట ప్రకారం తానే ఆమెను చంపవలసి వచ్చియుండేది. కాబట్టి మనం మన కుటుంబసభ్యుల పట్ల కానీ స్నేహితుల పట్ల కానీ నమ్మకంతో మాట్లాడేముందు వారి ప్రవర్తనను పరిశీలించడం చాలా ముఖ్యం. అందుకే కుటుంబం పట్ల ఇలాంటి పరిశీలణ గుణవతియైన భార్యకు చెందినలక్షణంగా చెప్పబడింది (సామెతలు 31:27).
ఆదికాండము 31:33-35 లాబాను యాకోబు గుడారములోనికి లేయా గుడారము లోనికి ఇద్దరి దాసీల గుడారములలోనికి వెళ్లెను గాని అతనికేమియు దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్లెను. రాహేలు ఆ విగ్రహములను తీసికొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచినప్పటికిని అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో తమయెదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు. నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెదకినను ఆ విగ్రహములు దొరకలేదు.
ఈ వచనాలలో లాబాను యాకోబు కుటుంబం విశ్రాంతి తీసుకోవడానికి వేసుకున్న గుడారాలలోకి వెళ్ళి తన గృహ దేవతల కోసం వెదకడం మనం చూస్తాం. రాహేలు తనకున్న తెలివితేటలతో వాటిపై కూర్చుని తాను రుతుస్రావంతో ఉన్నందువల్ల అక్కడి నుండి లేవలేనని చెప్పి తాను చేసిన దొంగతనం తెలియకుండా తప్పించుకుంది.
ఆదికాండము 31:36,37 యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమనేల? నేను చేసిన ద్రోహమేమి? పాపమేమి? నీవు నా సమస్త సామగ్రి తడివి చూచిన తరువాత నీ యింటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి యెదుటను నీ వారియెదుటను అది యిట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు.
ఈ వచనాలలో యాకోబు లాబాను కావాలనే తనపై దొంగతన ఆరోపణను మోపుతున్నాడని భావించి అతనితో వాదించడం మనం చూస్తాం. ఎందుకంటే రాహేలే ఆ దొంగతనం చేసిందని తెలియదు. ఒకవేళ తెలిసి అలా వాదించియుంటే కనుక తనకూ అవిశ్వాసికీ తేడా ఉండకపోను.
ఆదికాండము 31:38-42 ఈ యిరువది యేండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొఱ్ఱెలైనను మేకలైనను ఈచుకొనిపోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగములచేత చీల్చబడినదానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడినదాని నేమి రాత్రియందు దొంగిలింపబడినదాని నేమి నాయొద్ద పుచ్చుకొంటివి. నేను ఈలాగుంటిని. పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలుగేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసియుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.
ఈ వచనాలలో యాకోబు లాబాను తనకు చేసిన మోసమంతటినీ తాను పడిన కష్టమంతటినీ చివరికి దేవుడు తనకు చేసిన మేలును కూడా లాబాను తీసుకువచ్చిన బంధువుల ముందు వివరించడం మనం చూస్తాం. దీనిద్వారా లాబాను ఏ బంధువులనైతే యాకోబుకు విరుద్ధంగా పోగుచేసుకు వచ్చాడో వారిముందే ఒక మోసగాడిగా అవమానించబడ్డాడు. కాబట్టి మన నిజాయితీ మన విరోధుల ముందు ధైర్యంగా మాట్లాడే శక్తిని ఇస్తుంది. అందుకే దానిని ఎప్పటికీ కోల్పోకూడదు.
ఆదికాండము 31:43,44 అందుకు లాబాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది, ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసికొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా-
ఈ వచనాలలో లాబాను యాకోబుతో ఉన్నదంతా తనదని చెబుతూ అతనితో నిబంధన చేసుకోవడానికి సిద్ధపడడం మనం చూస్తాం. ఇక్కడ లాబాను యాకోబుపై వేసిన నిందకు, అతను తిరిగి నింద వేసేసరికి ఇక సమాధానం ఇవ్వలేక దాటవేస్తూ మాట్లాడుతున్నాడు. వాస్తవానికి అతను ఎలాంటి విధ్వంసమూ సృష్టించకుండా ఉన్నది వారిపై ఉన్న ప్రేమను బట్టి కాదు దేవుడు చేసిన హెచ్చరికను బట్టే. దేవుడు అతడిని హెచ్చరించకుండా ఉంటే ఆవేశంలో తప్పకుండా యాకోబుకు ఏదోవిధంగా హాని తలపెట్టేవాడేమో? ఆ సమయంలో ప్రతిఘటించే తన కుమార్తెలకు పిల్లలకూ కూడా హాని సంభవించేదేమో? ఎందుకంటే; ఆవేశంలో ఉన్న మనిషి తన విచక్షణను కోల్పోయి ప్రవర్తిస్తాడు. కొందరు తర్వాత పశ్చాత్తాపపడి వేదన అనుభవిస్తారు. దీనిని బట్టి లాబాను ఆ ఆవేశంలో యాకోబు కుటుంబానికి హాని తలపెట్టి తర్వాత తప్పకుండా బాధపడేవాడు. కానీ దేవుడు ముందే అతన్ని హెచ్చరించడం వల్ల యాకోబుకే కాదు, ఇతనికి కూడా మేలు చేసాడు.
ఆదికాండము 31:45,46 యాకోబు ఒక రాయి తీసికొని దానిని స్తంభముగా నిలువబెట్టెను. మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్పవేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి.
ఈ వచనాలలో యాకోబు లాబానులు నిబంధన చేసుకునేందుకు రాళ్ళను నిలువబెట్టి అక్కడ భోజనం చెయ్యడం మనం చూస్తాం. ఆ కాలంలో ఇద్దరు వ్యక్తులు ఏదైనా ఒక నిబంధన చేసుకునేటప్పుడు దానికి సాక్ష్యంగా ఏదోఒక గుర్తు పెట్టుకోవడం ఆచారంగా కొనసాగేది. ఎందుకంటే ఆ కాలంలో పత్రాలు సాధారణ ప్రజలకు అంతగా వాడుకలో లేవు. అదేవిధంగా లాబాను యాకోబును ఎన్నోసార్లు మోసగించాడు, ఇక్కడిదాకా తరుముకుంటూ వచ్చి తనపై పారిపోతున్న నిందను మాత్రమే కాకుండా దొంగతనాన్ని కూడా అంటగట్టి అతని గుడారాలన్నీ గాలించి అవమానించాడు. కానీ అతను నిబంధన చేసుకుందామని పిలిచేసరికి యాకోబు అదంతా మర్చిపోయి సమాధానపడడానికి సిద్ధపడ్డాడు, అతడిని క్షమించాడు. గతంలో అబ్రాహాము, ఇస్సాకులు కూడా తమను ఇబ్బంది పెట్టిన అబీమెలెకుల (పిలిష్తీయుల రాజులు) విషయంలో ఇలానే స్పందించారు (ఆదికాండము 21:22-24 , 26:26-31). కాబట్టి విశ్వాసులందరూ ఇలాంటి క్షమించేమనస్సును కలిగియుండాలి, మనపట్ల పొరపాటు చేసినవారు మనతో సమాధానపడడానికి ప్రయత్నించినప్పుడు వారు తమ పొరపాటును గుర్తించారని ఎరిగి వారితో సమాధానపడాలి.
ఆదికాండము 31:47 లాబాను దానికి యగర్ శాహదూతా అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను.
ఈ వచనంలో యాకోబు లాబానులు తాము స్థంబంగా నిలిపిన రాళ్ళకుప్పకు పేర్లు పెట్టడం మనం చూస్తాం. ఆ రెండు పేర్లకూ "సాక్ష్యపుకుప్ప" అనే అర్థమే వస్తుంది. లాబాను దానికి అరామిక్ భాషలో పేరుపెడితే యాకోబు హెబ్రీబాషలో పెట్టాడు.
ఆదికాండము 31:48 లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరుపెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగానుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను.
ఈ వచనంలో లాబాను ఆ రాళ్ళకుప్పకు గలేదు మిస్పా అనే పేర్లు కూడా పెట్టడం మనం చూస్తాం. దానికి "కావలి గోపురం" అని అర్థం.
ఆదికాండము 31:49,50 అంతట లాబాను నీవు నా కుమార్తెలను బాధపెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను, చూడుము, మనయొద్ద ఎవరును లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను.
ఈ వచనాలలో లాబాను తన కుమార్తెల క్షేమం నిమిత్తం దేవుణ్ణి సాక్ష్యంగా పెట్టి మాట్లాడడం మనం చూస్తాం. ఒక తండ్రికి తన పిల్లలపై సహజంగా ఉండే ప్రేమను ఇది తెలియచేస్తుంది. కానీ ఇదే లాబానుపై తన కుమార్తెలు మమ్మల్ని అన్యులుగా చూస్తున్నాడని ఆరోపించడం ఇదే అధ్యాయం ప్రారంభంలో మనం చూసాం. అక్కడ ఆ కుమార్తెలు చేసిన ఆరోపణను కూడా మనం సత్యంగానే భావించాలి, ఎందుకంటే లాబాను ప్రవర్తన అలానే ఉంది. వాస్తవానికి లాబాను మనసులో తన కుమార్తెల పట్ల ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమను తనకున్న మోసపూరితమైన దురాశలు బయటపడకుండా చేసి స్వంతకుమార్తెల చేతనే నింద అనుభవించేలా చేసాయి. మనకున్న స్వార్థపు, మోసపూరితమైన ఆలోచనలు మన సంబంధాలను దెబ్బతీస్తాయనడానికి ఇది మంచి ఉదాహరణ.
ఆదికాండము 31:51,52 మరియు లాబాను నాకును నీకును మధ్య నేను నిలిపిన యీ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము. హాని చేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి యీ స్తంభమును సాక్షి.
ఈ వచనాలలో కూడా లాబాను మాటలనే మనం చూస్తాం. అతను భవిష్యత్తులో యాకోబు మరింతగా అభివృద్ధి చెందాక తాను చేసిన కీడు నిమిత్తం ప్రతికీడు చేసే అవకాశం అనగా అతనిపై దండెత్తే పరిస్థితి ఉందని ఆలోచించాడు. అందుకే ఇలాంటి నిబంధన అతనితో చేస్తున్నాడు.
ఆదికాండము 31:53 అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవునితోడని ప్రమాణము చేసెను.
ఈ వచనంలో లాబాను యెహోవా దేవుని పేరిట ప్రమాణం చేస్తూ ఆయన అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడని ప్రస్తావించడం మనం చూస్తాం. గతంలో కూడా అతను రిబ్కా వివాహం విషయంలో అది "యెహోవా వలన కలిగిన కార్యమని" ఒప్పుకున్నాడు (ఆదికాండము 24:50). అంటే లాబానుకు యెహోవాయే దేవుడని తెలుసు. ఈ సత్యం తెలిసిన లాబానుకు ఇంకా గృహదేవతలతో పనేంటి? కాబట్టి కొందరికి సత్యమేంటో తెలిసినప్పటికీ దానిని పూర్తిగా అనుసరించలేరని ఈ లాబానును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. హేరోదు లేఖనాలను బట్టి యేసుక్రీస్తు ప్రభువు యూదులరాజుగా పుట్టాడని గ్రహించి కూడా ఆయనను చంపడానికి ప్రయత్నించాడే తప్ప ఆయనను రాజుగా అంగీకరించి పూజించలేకపోయాడు కదా! (మత్తయి 2:3-5). ఎందుకంటే; ఒక వ్యక్తి ప్రభువును అంగీకరించాలంటే పరిశుద్ధాత్ముడు చేసే కార్యం వల్ల మాత్రమే సాధ్యమౌతుంది. అందుకే "పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను" (1 కోరింథీ 12:3) అని రాయబడింది.
ఆదికాండము 31:54,55 యాకోబు ఆ కొండమీద బలియర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనముచేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దుపెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్లిపోయెను.
ఈ వచనాలలో లాబాను యాకోబులు ఇద్దరూ యెహోవా దేవుని పేరిట నిబంధన చేసుకుని, ఆయనకు బలి అర్పించి భోజనం చేసి ఎవరి మార్గాన వారు సమాధానంగా వెళ్ళిపోవడం మనం చూస్తాం. ఈవిధంగా దేవుడు యాకోబుపై కోపంతో వచ్చిన లాబానును మార్గమధ్యంలోనే హెచ్చరించి సమాధానంతో తిరిగివెళ్ళేలా చేసాడు. ఆయన సమాధానానికి కర్త, ఆయన తలచుకుంటే ఎలాంటి బద్ధశత్రువుల మధ్యనైనా సమాధానం కలిగించగలడు.
సామెతలు 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 31
31:1, 31:2, 31:3, 31:4-13, 31:14-16, 31:17,18, 31:19, 31:20,21, 31:22,23, 31:24, 31:25-28, 31:29, 31:30, 31:31,32, 31:33-35, 31:36,37, 31:38-42, 31:43,44, 31:45,46, 31:47, 31:48, 31:49,50, 31:51,52, 31:53, 31:54,55
ఆదికాండము 31:1 లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసికొని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను.
ఈ వచనంలో లాబాను కుమారులు అన్యాయంగా పలుకుతున్న మాటలను యాకోబు వినడం మనం చూస్తాం. ఇక్క డవారు యాకోబు వశమైన మందలు అతని కష్టానికి ప్రతిఫలమని, తన తండ్రి ఒప్పందం ప్రకారమే అవి అతని వశమయ్యాయని, ఆ మాటకొస్తే యాకోబును బట్టే తమ తండ్రి మందలు దీవించబడ్డాయని వారు గుర్తించలేకపోతున్నారు. ఈ అసూయ మానవుల పతన స్వభావాన్ని తెలియచేస్తుంది. ఇలాంటి అనుభవమే మనలో చాలామందికి పనిచేసే చోట్లలోనూ వ్యాపారం విషయంలోనూ చదువుల పోటీలోనూ చివరికి పరిచర్యలో సైతం ఎదురౌతుంటుంది.
ఈ అసూయతో కూడిన వైఖరి విశ్వాసుల్లో లేకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే ఆ లక్షణం ఆత్మసంబంధులకు కాదు శరీరసంబంధులకు చెందిందిగా చెప్పబడింది (1 కొరింథీ 3:3). కాబట్టి విశ్వాసులు తమ కళ్ళముందు ఎవరైనా అభివృద్ధి చెందుతున్నప్పుడు వారిని అభినందించేవారిగా ఉండాలి తప్ప అసూయపడేవారిగా ఉండకూడదు. ఈ అసూయ మెళ్ళిమెళ్ళిగా హత్యలకు కూడా ప్రేరేపిస్తుందని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. బైబిల్ లో జరిగిన మొట్టమొదటి హత్యకు (కయీను&హెబేలు) ఈ అసూయనేగా కారణం. అన్నలు యోసేపును చంపాలని ప్రయత్నించడానికి కూడా ఈ అసూయనే కారణం. ఇలాంటి సంఘటనలెన్నో ఈరోజుకూ మనం చూస్తున్నాం. అందుకే పౌలు ఈ అసూయను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని పాపాల జాబితాలో హత్యలతో సమానంగా చేర్చాడు (గలతీ 5:20,21).
ఆదికాండము 31:2 మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనియెడల ఉండలేదు.
ఈ వచనంలో యాకోబు లాబాను ప్రవర్తనలో కూడా మార్పు గమనించడం మనం చూస్తాం. మన మనసులోని భావనలు మన ముఖాల్లో కూడా బయటపడుతుంటాయి. అందుకే తోటివారి పట్ల, కుటుంబీకుల పట్ల మన మనసును నిర్మలంగా ఉంచుకోవాలి.
ఆదికాండము 31:3 అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము. నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా-
ఈ వచనంలో దేవుడు నీ తండ్రి ఇంటికి తిరిగివెళ్ళమని యాకోబుకు మరలా ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈ మాటలు యాకోబుపై ఉన్న ఆయన కాపుదలను సూచిస్తున్నాయి.
ఆదికాండము 31:4-13 యాకోబు పొలములో తన మందయొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో యిట్లనెను. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడైయున్నాడు. మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసేయున్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చేయనియ్యలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లలనీనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవైయుండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయననీ కన్నులెత్తి చూడుము. గొఱ్ఱెలను దాటుచున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని నీ వెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.
ఈ వచనాలలో యాకోబు అక్కడినుండి తన భార్యలను ఊరికే తీసుకుపోకుండా ఇంతకాలం ఏం జరిగిందో ఇప్పుడు తన తండ్రి ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడో వివరించడం మనం చూస్తాం. అతను అలా చెయ్యకుండా కనానుకు తీసుకువెళ్ళుంటే వారు యాకోబును అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి భార్యభర్తలు తాము చెయ్యబోయే ప్రతీదానినీ ఒకరికి ఒకరు సానుకూలంగా వివరించుకుంటూ వారిమధ్య ఎలాంటి అపార్థాలూ తలెత్తకుండా జాగ్రతపడాలి. కొన్నిసార్లు ఒక చిన్న అపార్థం కూడా వారి సంబంధాన్ని దెబ్బతీస్తుంది.
అదేవిధంగా అతను లాబాను తన విషయంలో ఎన్నిసార్లు మాటలు మార్చినా నేను మాత్రం నిజాయితీగా కొలువు చేసానని చెబుతున్నాడు. యాకోబు లాబాను చేస్తున్న మోసాన్ని బట్టి అతను కూడా అవినీతికి పాల్పడడం, తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించకపోవడం వంటివి చేసుంటే ఇక్కడ కానీ తర్వాత సందర్భంలో లాబాను దగ్గరకానీ ఇంత ధైర్యంగా మాట్లాడగలిగేవాడు కాదు (ఆదికాండము 31:38-41). కాబట్టి మనం చేసేపనిలో అన్యాయానికి గురౌతున్నప్పటికీ దేవునిపై ఆధారపడి మనవైపునుండి ఎలాంటి లోపమూ లేకుండా చూసుకోవాలి. చివరకు మనం ఎవరిపై ఆధారపడి నిజాయితీగా నడుచుకుంటున్నామో ఆ న్యాయవంతుడైన దేవుడే యాకోబు విషయంలో చేసినట్టు మనకూ న్యాయం చేస్తాడు. అందుకే ఉద్యోగస్తులకు "మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి" (ఎఫెసీ 6:7) అని ఆజ్ఞాపించబడింది.
ఇక యాకోబు "దేవుని దూత" అతనికి ప్రత్యక్షమై తన తండ్రి ఇంటికి తిరిగివెళ్ళమన్నట్టు కూడా చెబుతున్నాడు. అయితే ఆ దూత "నీ వెక్కడ స్తంభము మీద నూనె పోసితివో యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే" అని అంటున్నాడు. దీనిప్రకారం; బేతేలులో ఏ దేవుడైతే అతనికి ప్రత్యక్షమయ్యాడో (ఆదికాండము 28:11-22). ఆ దేవుడే ఇక్కడ దేవుని దూతగా మాట్లాడుతున్నాడు. ఆ దూతనే యెహోవా దూత. ఈ దూత గురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
యెహోవా దూత, యేసుక్రీస్తు
ఆదికాండము 31:14-16 అందుకు రాహేలును లేయాయు యింక మా తండ్రి యింట మాకు పాలుపంపులెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మును అమ్మివేసి, మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్దనుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునైయున్నది గదా? కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్ల చేయుమని అతనికుత్తరమియ్యగా-
ఈ వచనాలలో లేయా రాహేలులు యాకోబు మాటలకు తమ అనుభవాలను కూడా జతచేస్తూ తమ తండ్రి ఇంటినుండి కనానుకు వెళ్ళడానికి సిద్ధపడడం మనం చూస్తాం. ఇక్కడ వారు తమ తండ్రి దగ్గరే ఉండాలని వాదనకు దిగలేదు, అనగా తమ సంబంధాన్ని బట్టి తండ్రిని సమర్ధించుకోట్లేదు. ఎందుకంటే యాకోబు మాటల్లో న్యాయం ఉంది. కాబట్టి దాంపత్య జీవితంలో భాగస్వామి చెప్పినమాటలను/భావనలను న్యాయబద్ధంగా ఆలోచిస్తూ సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుతం చాలా కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. భాగస్వామి మాటలు/బాధ అర్థం చేసుకోకుండా తల్లితండ్రులను గ్రుడ్డిగా సమర్ధించుకోవడమే ఎక్కువగా చూస్తున్నాం. విశ్వాసులు అలా ఉండకూడదు. న్యాయం ఎటువైపు ఉంటే మన సానుకూలత కూడా అటువైపే ఉండాలి. ఎందుకంటే మన దేవుడైన "యెహోవా న్యాయమును ప్రేమించువాడు" (కీర్తనలు 37:28).
"దేవుడు మా తండ్రి యొద్దనుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునైయున్నది గదా?"
దేవుని కృపను బట్టే యాకోబు ఇంతగా ఆశీర్వదించబడ్డాడని లేయా రాహేలులకు కూడా అర్థమైనట్టు ఈ మాటలను బట్టి గ్రహిస్తున్నాం. దీనంతటికీ అతను చక్కగా వివరించడమే కారణం. కాబట్టి మన ఆశీర్వాదానికి కారణమైన దేవుని కృపను కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు వివరిస్తుండాలి. ముఖ్యంగా పిల్లలకు.
ఆదికాండము 31:17,18 యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలమీద నెక్కించి కనానుదేశమునకు తన తండ్రియైన ఇస్సాకు నొద్దకు వెళ్లుటకు తన పశువులన్నిటిని, తాను సంపాదించిన సంపద యావత్తును, పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొనిపోయెను.
ఈ వచనాలలో యాకోబు తనకున్న సమస్తాన్నీ వెంటబెట్టుకుని కనాను దేశానికి పయనమవ్వడం మనం చూస్తాం. కారణమేంటో ఇప్పటికే మనం వివరించుకున్నాం.
ఆదికాండము 31:19 లాబాను తన గొఱ్ఱెలబొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహదేవతలను దొంగిలెను.
ఈ వచనంలో రాహేలు తన తండ్రి గృహదేవతలను దొంగిలించడం మనం చూస్తాం. మన తెలుగు బైబిల్ లో వాటిని గృహదేవతలు అని తర్జుమా చేసారు కానీ ఆ ప్రాంతపు పూర్వ సంస్కృతులపైన పరిశీలన చేసిన కొందరు బైబిల్ పండితుల వివరణ ప్రకారం; అవి వారు పూజించే దేవతలు కాదు. హీబ్రూ బాషలో వాటిని "הַתְּרָפִ֖ים" (Teraphim) అన్నారు. ఆ ప్రజలు వాటిని తమ గృహానికి రక్షణగా (దేవదూతలులా) ఉంటాయని భావించేవారట వాటిదగ్గర శకునాలు కూడా చూసేవారట. అందుకే వీటి గురించి "గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి" (జెకర్యా 10:2) అని రాయబడింది. దీనిప్రకారం; గతంలో లాబాను యాకోబును బట్టే దేవుడు తనను దీవించాడని వీటిదగ్గరే శకునం చూసి తెలుసుకునుంటాడు. ఇవి కుటుంబంలోని జ్యేష్ఠకుమారుడికి హక్కుగా ప్రాప్తించేవట. సౌలు రాజు ఇంట్లో కూడా ఇలాంటిది ఉన్నట్టు మనం గమనిస్తాం (1 సమూయేలు 19:13).
ఇంతకూ రాహేలు ఈ గృహదేవతలను ఎందుకు దొంగిలించినట్టు? దీనిపై కొందరు, రాహేలు కూడా అలాంటి విశ్వాసంతోనే అనగా అవి తమ కుటుంబానికి రక్షణగా ఉంటాయనీ వాటిదగ్గర శకునాలు చూడవచ్చనే ఉద్దేశంతోనే దొంగిలించిందని అభిప్రాయపడ్డారు. అయితే నేను ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నాను. ఎందుకంటే; రాహేలు యాకోబుతో దేవుడు పలికిన మాటలు విశ్వసించి కనానుకు పయనమయ్యింది. కాబట్టి మార్గంలో శకునం చూడవలసిన అవసరం వస్తుందని కానీ దేవుని రక్షణకు మించి మరో రక్షణ వారికి అవసరమని కానీ ఆమె ఆలోచించి ఉండకపోవచ్చు. గత చరిత్రలో అవిశ్వాసపు ఛాయలు ఆమెలో కనిపిస్తున్నప్పటికీ తర్వాత కాలంలో ఆమె యెహోవాను మాత్రమే దేవునిగా నమ్ముతుందని తన పిల్లలకు పెట్టిన పేర్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ దేవతలలో ఏదో శక్తి ఉందనే ఉద్దేశంలో వాటిని దొంగిలించిందని మనం భావించలేము. మరి ముఖ్యంగా ఆ దేవతలలో ఏదో శక్తి ఉందని నమ్మే ప్రజలు వాటిపట్ల ఎంతో గౌరవంతో ఉంటారు అలాంటి గౌరవమే రాహేలుకు వాటిపై ఉండుంటే వాటిపై కూర్చునే సాహసం చేసేదికాదు (ఆదికాండము 31:34).
ఆదికాండము 31:20,21 యాకోబు తాను పారిపోవుచున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవుటవలన అతని మోసపుచ్చినవాడాయెను. అతడు తనకు కలిగినదంతయు తీసికొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్లెను.
ఈ వచనాలలో యాకోబు లాబానుకు చెప్పకుండా పారిపోవడం వల్ల తన మామను మోసగించినవాడిగా రాయబడడం మనం చూస్తాం. వాస్తవానికి అతను లాబానుది ఏదీ దొంగిలించలేదు ఒప్పందం ప్రకారం తనకు స్వంతమైన ఆస్తినీ మరియు తన భార్యపిల్లల్నే తీసుకుని వెళ్తున్నాడు. కానీ లాబానుకు చెప్పకుండా వెళ్తున్నాడు కాబట్టి అలా రాయబడింది. అయితే అతను ఈవిధంగా చెయ్యడానికి లాబాను ప్రవర్తనే కారణం. అనగా ఎక్కడ వీటన్నిటినీ లాక్కుంటాడో అనే భయం అతనిలో ఉంది (ఆదికాండము 31:31) అయినప్పటికీ అతను దేవుని కాపుదలపై ఆధారపడి తన మామకు విషయం చెప్పవలసింది. కాబట్టి విశ్వాసులు తమకున్న భయాలను బట్టి లేక కారణాలను తమ బాధ్యతలను విస్మరించకూడదు. అవసరమైతే తగు జాగ్రత్తలు తీసుకునైనా చెయ్యాల్సింది చెయ్యాలి.
ఆదికాండము 31:22,23 యాకోబు పారిపోయెనని మూడవ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొనిపోయి, గిలాదుకొండ మీద అతని కలిసికొనెను.
ఈ వచనాలలో లాబాను యాకోబు పారిపోయాడని తెలుసుకుని అతడిని తరమడం మనం చూస్తాం. 19వ వచనం ప్రకారం; రాహేలు తన తండ్రి గృహదేవతలను దొంగిలించేసరికి (యాకోబు పారిపోయే సమయానికి) లాబాను తన గొఱ్ఱెల బొచ్చును కత్తిరించడానికి వెళ్ళాడు. ఆ కాలంలో వారు తమ మందలు నిలిపేచోటికీ వారి నివాసానికీ మధ్య చాలా దూరం ఉంటుంది. ఉదాహరణకు 30:36వ వచనం ప్రకారం; లాబాను యాకోబు మందలు మేపే చోటికీ తన కుమారులు మేపే చోటికీ మధ్యలో మూడు రోజుల ప్రయాణమంత దూరం ఉండేలా చేసాడు. ఈవిధంగా ఆలోచించినప్పుడు లాబాను తన మందల బొచ్చును కత్తిరించడానికి తన ఇంటినుండి చాలా దూరమే వెళ్ళుంటాడు. కాబట్టి అతనికి యాకోబు పారిపోయాడనే సమాచారం మూడవరోజున తెలిసింది. ఆ సమాచారం తెలుసుకున్న లాబాను తన బంధువులందరినీ పోగుచేసుకుని ఏడు రోజుల ప్రయాణమంత దూరంలో అతడిని కలుసుకున్నాడు.
ఆదికాండము 31:24 ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబానునొద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను.
ఈ వచనంలో యాకోబుపై కోపంతో తరుముతున్న లాబానుకు స్వప్నంలో దేవుడు ప్రత్యక్షమై యాకోబు విషయమై హెచ్చరించడం మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఆయన ప్రవక్తలతోనే కాకుండా వారితో సంబంధం ఉన్నవారితో కూడా మాట్లాడడం మనం చూస్తాం. కారణం: వారి క్షేమం. ఉదాహరణకు ఆయన అబ్రాహాము నిమిత్తం అబీమెలెకు రాజుతో మాట్లాడాడు (ఆదికాండము 20:3). ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే దేవుడు ఒకవ్యక్తితో మాట్లాడినంత మాత్రాన ఆ వ్యక్తి మార్పు చెందేసి ఆయనకు దాసుడు అవ్వలేడు. ఆయన సార్వభౌమ నిర్ణయంలో ఉన్నవారు మాత్రమే ఆయనకు సదా దాసులుగా మారుమనస్సు పొందుతారు. అలా ఈ సందర్భంలో ఆయన లాబానుతో మాట్లాడినప్పటికీ ఆ మాటలు అతడిని యాకోబుకు హానీ చెయ్యకుండా నియంత్రించాయే తప్ప అతని జీవితాన్ని మార్చలేదు. మార్చే ఉంటే తర్వాత సందర్భంలో యాకోబు దగ్గర తన మోసాలను కప్పిపుచ్చుకుంటూ వాదించేవాడు కాదు. ఈవిధంగా ఆయన ఈరోజుకూ ఎంతోమంది దుష్టులతో వారి మనస్సాక్షి ద్వారా మాట్లాడుతూ నీతిమంతులకు హాని చెయ్యకుండా నియంత్రిస్తున్నాడు, లేకపోతే చంపాలకున్న ప్రతీవారూ చంపుకునిపోదురు.
అదేవిధంగా ఆయన "యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ" అని పలకడం చూస్తున్నాం. దానర్థం అసలేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండమని కాదు. అదే అయ్యింటే నువ్వు యాకోబును కలుసుకోకుండా వెనక్కు వెళ్ళిపోమని చెప్పేవాడు. జరిగిన చరిత్రనంతా పరిశీలించినప్పుడు, ఇక్కడ లాబాను యాకోబు దగ్గరకు వెళ్ళడంలో అతను రెండు ఉద్దేశాలు కలిగియున్నట్టు అర్థమౌతుంది. మొదటిగా అతను యాకోబు చేసినదాని విషయంలో కోపంతో ఉండి అతనికి ఏదైనా హాని చెయ్యడానికి వెళ్తున్నాడు. రెండవదిగా యాకోబు తనను విడిచిపెట్టిపోవడం లాబానుకు మొదటి నుండీ ఇష్టం లేదు, యాకోబు నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను అన్నప్పుడు అతను తప్పక అంగీకరించాడే తప్ప ఇష్టంతో కాదు. ఎందుకంటే యాకోబును బట్టే దేవుడు తనను ఆశీర్వదిస్తున్నాడని అతను నమ్మాడు (ఆదికాండము 30:27). దీనిప్రకారం అతను యాకోబును ఏదోలా వెనక్కు తీసుకుని వెళ్ళే ఉద్దేశంతో కూడా ఉండి ఉండవచ్చు. అందుకే దేవుడు అతనితో నీవు అతనితో కీడుకానీ (హానిచేసేలా కానీ) మేలుగా కానీ (తిరిగి నీదగ్గరకు తీసుకుని వెళ్ళేలా కానీ) ఏమీ మాట్లాడవద్దని హెచ్చరిస్తున్నాడు.
ఆదికాండము 31:25-28 లాబాను యాకోబును కలిసికొనెను. యాకోబు తన గుడారము ఆ కొండమీద వేసికొనియుండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండమీద గుడారము వేసికొనెను. అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేల? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దుపెట్టుకొననియ్యక పిచ్చిపట్టి యిట్లు చేసితివి.
ఈ వచనాలలో లాబాను నిందనంతా యాకోబుపైనే వేస్తున్నట్టు మనం చూస్తాం. ఒక తండ్రిగా అతని కోపంలో కొంత న్యాయం ఉన్నప్పటికీ జరిగినదానిలో నిందనంతా యాకోబుపై మాత్రమే వేసే హక్కు మాత్రం అతనికి లేదు. ఎందుకంటే అసలు యాకోబు అలా చెయ్యడానికి కారణమే ఇతని ప్రవర్తన కదా!. 20 సంవత్సరాలుగా లాబాను మోసపూరిత స్వభావాన్ని గమనిస్తూ యాకోబు ఎంతో అన్యాయానికి గురయ్యాడు. మరలా ఆవిధంగానే అన్యాయానికి గురౌతాననే భయంతోనే యాకోబు లాబానుకు చెప్పకుండా పారిపోతున్నాడు. కాబట్టి యాకోబు చేసింది పొరపాటే ఐతే ఆ పొరపాటును అతను చెయ్యడానికి కారణం లాబాను ప్రవర్తనే. కొంచెం జీతంలోనే నమ్మకంగా ఉండకుండా 10 సార్లు తన జీతాన్ని మార్చిన లాబాను ఇంతమంద, తన కుమార్తెల విషయంలో నమ్మకంగా ఉండి తనతో పంపిస్తాడని మాత్రం యాకోబు ఎలా నమ్మగలడు? కాబట్టి యాకోబు తనకు చెప్పకుండా పారిపోయే పరిస్థితిని కల్పించింది లాబానే అని మనం కచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఇక్కడ లాబాను వాదనలో మనకు మానవ పతనస్వభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఏమాత్రమూ యాకోబు విషయంలో తాను చేస్తూ వచ్చిన పొరపాటును గుర్తించకుండా నిందనంతా యాకోబుపైనే నెట్టివేస్తున్నాడు. ఇలాంటి స్వభావం ఉన్న మనుషులు మనకు చాలామంది సమాజంలో తారసపడుతూ ఉంటారు. అందుకే "తన పొరపాటులు కనుగొనగలవాడెవడు?" (కీర్తనలు 19:12) అని రాయబడింది.
కాబట్టి విశ్వాసులంగా ఒకరు మనపట్ల ఏదైన పొరపాటుగా ప్రవర్తించినప్పుడు దానివిషయమై వారిపై నిందవేసే ముందు, వారలా ప్రవర్తించడానికి మనలో కూడా ఏదైనా లోపం ఉందా, వారు అలాంటి పొరపాటు చేసే పరిస్థితిని మనమే కల్పించామా అని ఆలోచించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇది నైతికత ఉన్న వ్యక్తులు మాత్రమే అనుసరించగలరు.
ఆదికాండము 31:29 మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రియొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని నాతో చెప్పెను.
ఈ వచనంలో లాబాను యాకోబుతో తన స్వప్నం గురించి తెలియచేస్తూనే మరలా నేను తలచుకుంటే నీకు హాని చెయ్యగలననే గర్వాన్ని ప్రదర్శించడం మనం చూస్తాం. తనతో ఉన్న బంధుబలం అతనితో అలా మాట్లాడిస్తుంది. పతనమైన మానవుడు ఇలానే తన వెనుకున్న మంది, ఆస్తులను బట్టి తాను ఏదైనా చెయ్యగలననే గర్వంతో ప్రవర్తిస్తుంటాడు. కానీ తగిన కాలంలో దేవుడు ఆ గర్వమంతా అణిచివేస్తాడు.
ఆదికాండము 31:30 నీ తండ్రి యింటి మీద బహు వాంఛగలవాడవై వెళ్లగోరినయెడల వెళ్లుము, నా దేవతల నేల దొంగిలితివనగా-
ఈ వచనంలో లాబాను దొంగిలించబడిన తన గృహదేవతల నిమిత్తం కూడా యాకోబును నిందించడం మనం చూస్తాం. కానీ యాకోబు వాటిని దొంగిలించలేదు, పైగా ఆ పని అతనే చేసాడనడానికి లాబాను దగ్గర ఎలాంటి సాక్ష్యమూ లేదు. అయినప్పటికీ అతను యాకోబు చెప్పకుండా పారిపోయాడు కాబట్టి ఆ గృహదేవతలను కూడా అతనే దొంగిలించాడనే అనుమానంతో ఇలాంటి నిరాధారమైన ఆరోపణ చేస్తున్నాడు. మన సమాజంలో కూడా ఎలాంటి ఆధారాలు లేకున్నా ఇతరులపై కేవలం అనుమానంతోనో ద్వేషంతోనో మోపబడే ఆరోపణలు మనం చాలా చూస్తుంటాం. కొన్నిసార్లు ఆ ఆరోపణల వల్ల ఏ తప్పిదం చెయ్యని అమాయకులు కూడా అన్యాయంగా శిక్షకూ అవమానానికీ లోనౌతారు. ఒక వ్యక్తిపై మనకు ఏదైనా అనుమానం ఉన్నప్పుడు అతడిని ప్రశ్నించడం తప్పుకాదు కానీ కచ్చితంగా ఆ పని అతనే చేసాడని ధృవీకరించడం మాత్రం నేరమే. కాబట్టి ఒక విశ్వాసిగా నైతికత ఉన్న మనిషిగా ఇతరులపై మనం ఆరోపణకు సిద్ధపడేముందు దానికి తగిన ఆధారం ఉండాలి. వారు ఇతర విషయాల్లో దోషులైనంత మాత్రాన ఇది కూడా వారే చేసారని ఖచ్చితంగా ధృవీకరించకూడదు దానిని తెలుసుకోవడానికి తగిన రీతిలో విచారణ జరిపించాలి.
ఇక్కడ మనం గుర్తించవలసిన మరో విషయం ఏంటంటే ఇక్కడ లాబాను మనసులో యాకోబు తీసుకుపోతున్న సంపదను బట్టి కలిగే బాధకంటే తన దేవతలను దొంగిలించుకుపోతున్నాడనే కోపమే ఎక్కువ కనిపిస్తుంది. ఇలాంటి సందర్భమే మనకు న్యాయాధిపతుల గ్రంథంలో కూడా కనిపిస్తుంది (న్యాయాధిపతులు 18:24). అక్కడ మీకా అనేవాడు తాను చేయించుకున్న దేవతలను దానీయులు పట్టుకుపోయేసరికి, మీరు వీటిని పట్టుకుపోతున్నారు ఇక నాకేముందని వేదనతో ప్రశ్నిస్తాడు. అంటే తన దేవతలను పట్టుకుపోయేసరికి తనకిక ఏమీలేదు అనే స్థితిలోకి కూరుకుపోయాడు. దీనిని బట్టి జీవముగల దేవునిపిల్లలుగా భావించేమనం బుద్ధి తెచ్చుకోవాలి. విగ్రహారాధికులైన వారు తమ దేవతలను కోల్పోవడమంటే ఇక సమస్తాన్నీ కోల్పోవడమే అన్నట్టు భావిస్తుంటే మనం మాత్రం పాపపు క్రియల వల్ల సులభంగా దేవుణ్ణి విడిచిపెడుతుంటాం.
ఆదికాండము 31:31,32 యాకోబు నీవు బలవంతముగా నా యొద్దనుండి నీ కుమార్తెలను తీసికొందువేమో అనుకొని భయపడితిని . ఎవరియొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రదుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల యెదుట వెదకి నీ దానిని తీసికొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు.
ఈ వచనాలలో యాకోబు నిందకు స్పందిస్తూ నేనలా పారిపోడానికి నీపట్ల ఏర్పడిన భయమే కారణమని చెప్పడం మనం చూస్తాం. అలానే గృహదేవతల విషయంలో తన కుటుంబ సభ్యులు ఎవరూ అలాంటి పనిచెయ్యరనే నమ్మకంతో ఉండి, ఎంతో ధైర్యంగా అవి ఎవరిదగ్గర దొరుకుతాయో వారు చస్తారని తీర్పుతీరుస్తున్నాడు. యాకోబు తన కుటుంబం విషయంలో అలాంటి నమ్మకం కలిగియుండడం తప్పుకాదు కానీ తన కుటుంబ సభ్యుల ప్రవర్తనను పరీక్షించకుండా ఆ నమ్మకాన్ని కనుపరచడం మాత్రం తప్పే ఔతుంది. అతనికి గతంలో లేయా రాహేలులు ఎలాంటి లోపయుక్తమైన ప్రవర్తనను కనుపరిచారో బాగా తెలుసు. అదంతా తెలిసిన యాకోబు వారిలో ఎవరైనా అలాంటి తప్పిదం చేసారా అని ఆలోచించకుండా వారిపట్ల కనపరచిన నమ్మకం ఒక మూఢనమ్మకంతో సమానం. దానివల్ల ఆ గృహదేవతలు కనుక రాహేలు దగ్గర దొరికుంటే తాను పలికినమాట ప్రకారం తానే ఆమెను చంపవలసి వచ్చియుండేది. కాబట్టి మనం మన కుటుంబసభ్యుల పట్ల కానీ స్నేహితుల పట్ల కానీ నమ్మకంతో మాట్లాడేముందు వారి ప్రవర్తనను పరిశీలించడం చాలా ముఖ్యం. అందుకే కుటుంబం పట్ల ఇలాంటి పరిశీలణ గుణవతియైన భార్యకు చెందినలక్షణంగా చెప్పబడింది (సామెతలు 31:27).
ఆదికాండము 31:33-35 లాబాను యాకోబు గుడారములోనికి లేయా గుడారము లోనికి ఇద్దరి దాసీల గుడారములలోనికి వెళ్లెను గాని అతనికేమియు దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్లెను. రాహేలు ఆ విగ్రహములను తీసికొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచినప్పటికిని అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో తమయెదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు. నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెదకినను ఆ విగ్రహములు దొరకలేదు.
ఈ వచనాలలో లాబాను యాకోబు కుటుంబం విశ్రాంతి తీసుకోవడానికి వేసుకున్న గుడారాలలోకి వెళ్ళి తన గృహ దేవతల కోసం వెదకడం మనం చూస్తాం. రాహేలు తనకున్న తెలివితేటలతో వాటిపై కూర్చుని తాను రుతుస్రావంతో ఉన్నందువల్ల అక్కడి నుండి లేవలేనని చెప్పి తాను చేసిన దొంగతనం తెలియకుండా తప్పించుకుంది.
ఆదికాండము 31:36,37 యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమనేల? నేను చేసిన ద్రోహమేమి? పాపమేమి? నీవు నా సమస్త సామగ్రి తడివి చూచిన తరువాత నీ యింటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి యెదుటను నీ వారియెదుటను అది యిట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు.
ఈ వచనాలలో యాకోబు లాబాను కావాలనే తనపై దొంగతన ఆరోపణను మోపుతున్నాడని భావించి అతనితో వాదించడం మనం చూస్తాం. ఎందుకంటే రాహేలే ఆ దొంగతనం చేసిందని తెలియదు. ఒకవేళ తెలిసి అలా వాదించియుంటే కనుక తనకూ అవిశ్వాసికీ తేడా ఉండకపోను.
ఆదికాండము 31:38-42 ఈ యిరువది యేండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొఱ్ఱెలైనను మేకలైనను ఈచుకొనిపోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగములచేత చీల్చబడినదానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడినదాని నేమి రాత్రియందు దొంగిలింపబడినదాని నేమి నాయొద్ద పుచ్చుకొంటివి. నేను ఈలాగుంటిని. పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలుగేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసియుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.
ఈ వచనాలలో యాకోబు లాబాను తనకు చేసిన మోసమంతటినీ తాను పడిన కష్టమంతటినీ చివరికి దేవుడు తనకు చేసిన మేలును కూడా లాబాను తీసుకువచ్చిన బంధువుల ముందు వివరించడం మనం చూస్తాం. దీనిద్వారా లాబాను ఏ బంధువులనైతే యాకోబుకు విరుద్ధంగా పోగుచేసుకు వచ్చాడో వారిముందే ఒక మోసగాడిగా అవమానించబడ్డాడు. కాబట్టి మన నిజాయితీ మన విరోధుల ముందు ధైర్యంగా మాట్లాడే శక్తిని ఇస్తుంది. అందుకే దానిని ఎప్పటికీ కోల్పోకూడదు.
ఆదికాండము 31:43,44 అందుకు లాబాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది, ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసికొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా-
ఈ వచనాలలో లాబాను యాకోబుతో ఉన్నదంతా తనదని చెబుతూ అతనితో నిబంధన చేసుకోవడానికి సిద్ధపడడం మనం చూస్తాం. ఇక్కడ లాబాను యాకోబుపై వేసిన నిందకు, అతను తిరిగి నింద వేసేసరికి ఇక సమాధానం ఇవ్వలేక దాటవేస్తూ మాట్లాడుతున్నాడు. వాస్తవానికి అతను ఎలాంటి విధ్వంసమూ సృష్టించకుండా ఉన్నది వారిపై ఉన్న ప్రేమను బట్టి కాదు దేవుడు చేసిన హెచ్చరికను బట్టే. దేవుడు అతడిని హెచ్చరించకుండా ఉంటే ఆవేశంలో తప్పకుండా యాకోబుకు ఏదోవిధంగా హాని తలపెట్టేవాడేమో? ఆ సమయంలో ప్రతిఘటించే తన కుమార్తెలకు పిల్లలకూ కూడా హాని సంభవించేదేమో? ఎందుకంటే; ఆవేశంలో ఉన్న మనిషి తన విచక్షణను కోల్పోయి ప్రవర్తిస్తాడు. కొందరు తర్వాత పశ్చాత్తాపపడి వేదన అనుభవిస్తారు. దీనిని బట్టి లాబాను ఆ ఆవేశంలో యాకోబు కుటుంబానికి హాని తలపెట్టి తర్వాత తప్పకుండా బాధపడేవాడు. కానీ దేవుడు ముందే అతన్ని హెచ్చరించడం వల్ల యాకోబుకే కాదు, ఇతనికి కూడా మేలు చేసాడు.
ఆదికాండము 31:45,46 యాకోబు ఒక రాయి తీసికొని దానిని స్తంభముగా నిలువబెట్టెను. మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్పవేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి.
ఈ వచనాలలో యాకోబు లాబానులు నిబంధన చేసుకునేందుకు రాళ్ళను నిలువబెట్టి అక్కడ భోజనం చెయ్యడం మనం చూస్తాం. ఆ కాలంలో ఇద్దరు వ్యక్తులు ఏదైనా ఒక నిబంధన చేసుకునేటప్పుడు దానికి సాక్ష్యంగా ఏదోఒక గుర్తు పెట్టుకోవడం ఆచారంగా కొనసాగేది. ఎందుకంటే ఆ కాలంలో పత్రాలు సాధారణ ప్రజలకు అంతగా వాడుకలో లేవు. అదేవిధంగా లాబాను యాకోబును ఎన్నోసార్లు మోసగించాడు, ఇక్కడిదాకా తరుముకుంటూ వచ్చి తనపై పారిపోతున్న నిందను మాత్రమే కాకుండా దొంగతనాన్ని కూడా అంటగట్టి అతని గుడారాలన్నీ గాలించి అవమానించాడు. కానీ అతను నిబంధన చేసుకుందామని పిలిచేసరికి యాకోబు అదంతా మర్చిపోయి సమాధానపడడానికి సిద్ధపడ్డాడు, అతడిని క్షమించాడు. గతంలో అబ్రాహాము, ఇస్సాకులు కూడా తమను ఇబ్బంది పెట్టిన అబీమెలెకుల (పిలిష్తీయుల రాజులు) విషయంలో ఇలానే స్పందించారు (ఆదికాండము 21:22-24 , 26:26-31). కాబట్టి విశ్వాసులందరూ ఇలాంటి క్షమించేమనస్సును కలిగియుండాలి, మనపట్ల పొరపాటు చేసినవారు మనతో సమాధానపడడానికి ప్రయత్నించినప్పుడు వారు తమ పొరపాటును గుర్తించారని ఎరిగి వారితో సమాధానపడాలి.
ఆదికాండము 31:47 లాబాను దానికి యగర్ శాహదూతా అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను.
ఈ వచనంలో యాకోబు లాబానులు తాము స్థంబంగా నిలిపిన రాళ్ళకుప్పకు పేర్లు పెట్టడం మనం చూస్తాం. ఆ రెండు పేర్లకూ "సాక్ష్యపుకుప్ప" అనే అర్థమే వస్తుంది. లాబాను దానికి అరామిక్ భాషలో పేరుపెడితే యాకోబు హెబ్రీబాషలో పెట్టాడు.
ఆదికాండము 31:48 లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరుపెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగానుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను.
ఈ వచనంలో లాబాను ఆ రాళ్ళకుప్పకు గలేదు మిస్పా అనే పేర్లు కూడా పెట్టడం మనం చూస్తాం. దానికి "కావలి గోపురం" అని అర్థం.
ఆదికాండము 31:49,50 అంతట లాబాను నీవు నా కుమార్తెలను బాధపెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను, చూడుము, మనయొద్ద ఎవరును లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను.
ఈ వచనాలలో లాబాను తన కుమార్తెల క్షేమం నిమిత్తం దేవుణ్ణి సాక్ష్యంగా పెట్టి మాట్లాడడం మనం చూస్తాం. ఒక తండ్రికి తన పిల్లలపై సహజంగా ఉండే ప్రేమను ఇది తెలియచేస్తుంది. కానీ ఇదే లాబానుపై తన కుమార్తెలు మమ్మల్ని అన్యులుగా చూస్తున్నాడని ఆరోపించడం ఇదే అధ్యాయం ప్రారంభంలో మనం చూసాం. అక్కడ ఆ కుమార్తెలు చేసిన ఆరోపణను కూడా మనం సత్యంగానే భావించాలి, ఎందుకంటే లాబాను ప్రవర్తన అలానే ఉంది. వాస్తవానికి లాబాను మనసులో తన కుమార్తెల పట్ల ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమను తనకున్న మోసపూరితమైన దురాశలు బయటపడకుండా చేసి స్వంతకుమార్తెల చేతనే నింద అనుభవించేలా చేసాయి. మనకున్న స్వార్థపు, మోసపూరితమైన ఆలోచనలు మన సంబంధాలను దెబ్బతీస్తాయనడానికి ఇది మంచి ఉదాహరణ.
ఆదికాండము 31:51,52 మరియు లాబాను నాకును నీకును మధ్య నేను నిలిపిన యీ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము. హాని చేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి యీ స్తంభమును సాక్షి.
ఈ వచనాలలో కూడా లాబాను మాటలనే మనం చూస్తాం. అతను భవిష్యత్తులో యాకోబు మరింతగా అభివృద్ధి చెందాక తాను చేసిన కీడు నిమిత్తం ప్రతికీడు చేసే అవకాశం అనగా అతనిపై దండెత్తే పరిస్థితి ఉందని ఆలోచించాడు. అందుకే ఇలాంటి నిబంధన అతనితో చేస్తున్నాడు.
ఆదికాండము 31:53 అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవునితోడని ప్రమాణము చేసెను.
ఈ వచనంలో లాబాను యెహోవా దేవుని పేరిట ప్రమాణం చేస్తూ ఆయన అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడని ప్రస్తావించడం మనం చూస్తాం. గతంలో కూడా అతను రిబ్కా వివాహం విషయంలో అది "యెహోవా వలన కలిగిన కార్యమని" ఒప్పుకున్నాడు (ఆదికాండము 24:50). అంటే లాబానుకు యెహోవాయే దేవుడని తెలుసు. ఈ సత్యం తెలిసిన లాబానుకు ఇంకా గృహదేవతలతో పనేంటి? కాబట్టి కొందరికి సత్యమేంటో తెలిసినప్పటికీ దానిని పూర్తిగా అనుసరించలేరని ఈ లాబానును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. హేరోదు లేఖనాలను బట్టి యేసుక్రీస్తు ప్రభువు యూదులరాజుగా పుట్టాడని గ్రహించి కూడా ఆయనను చంపడానికి ప్రయత్నించాడే తప్ప ఆయనను రాజుగా అంగీకరించి పూజించలేకపోయాడు కదా! (మత్తయి 2:3-5). ఎందుకంటే; ఒక వ్యక్తి ప్రభువును అంగీకరించాలంటే పరిశుద్ధాత్ముడు చేసే కార్యం వల్ల మాత్రమే సాధ్యమౌతుంది. అందుకే "పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను" (1 కోరింథీ 12:3) అని రాయబడింది.
ఆదికాండము 31:54,55 యాకోబు ఆ కొండమీద బలియర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనముచేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దుపెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్లిపోయెను.
ఈ వచనాలలో లాబాను యాకోబులు ఇద్దరూ యెహోవా దేవుని పేరిట నిబంధన చేసుకుని, ఆయనకు బలి అర్పించి భోజనం చేసి ఎవరి మార్గాన వారు సమాధానంగా వెళ్ళిపోవడం మనం చూస్తాం. ఈవిధంగా దేవుడు యాకోబుపై కోపంతో వచ్చిన లాబానును మార్గమధ్యంలోనే హెచ్చరించి సమాధానంతో తిరిగివెళ్ళేలా చేసాడు. ఆయన సమాధానానికి కర్త, ఆయన తలచుకుంటే ఎలాంటి బద్ధశత్రువుల మధ్యనైనా సమాధానం కలిగించగలడు.
సామెతలు 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Add comment