15:1, 15:2,3, 15:4,5, 15:6, 15:7,8, 15:9, 15:10,11, 15:12, 15:13,14, 15:15,16, 15:17-21
ఆదికాండము 15:1 ఇవి జరిగినతరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము. నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.
ఈ వచనంలో "యెహోవా వాక్యము" అబ్రాహామును దర్శించి, అతనితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. "వాక్యము" అనగానే అది శబ్దం ఐతే అది వినిపించాలే తప్ప కనిపించకూడదు. కానీ ఈ సందర్భంలోనూ మరికొన్ని సందర్భాలలో కూడా ఆ యెహోవా వాక్యము భక్తులను దర్శించి మాట్లాడుతున్నట్టు గమనిస్తాం. ఉదాహరణకు; 1సమూయేలు 15:10, 2 సమూయేలు 7: 4, యెహేజ్కేలు 38:1, 1 రాజులు 6:11, యెషయా 38: 4.
దీనిని బట్టి యూదులు కూడా దేవునిలో బహుళత్వం ఉందనీ ఈ "యెహోవా వాక్యము" ఆ బహుళత్వంలోని వ్యక్తియని విశ్వసించేవారు. ఈవిధంగా "యెహోవా వాక్యము" పేరుతో పాతనిబంధనలో పరిచయం చెయ్యబడింది యేసుక్రీస్తు ప్రభువేయని నూతన నిబంధన చాలా స్పష్టంగా తెలియచేస్తుంది (యోహాను 1:1-3,14, ప్రకటన 19: 13).
అయితే కొందరు "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను" అని యోహాను "వాక్యము" గురించి రాస్తున్నటువంటి మాటలను అతను ప్లేటో లాంటి గ్రీకు తత్వజ్ఞానుల నుండి అరువు తెచ్చుకున్నట్టుగా ఆరోపిస్తుంటారు. ఎందుకంటే వ్యక్తియైన వాక్యము (లోగోస్) ప్రస్తావన మనకు గ్రీకు ఫిలాసఫీలో కూడా కనిపిస్తుంటుంది. కానీ యోహాను ఎక్కడినుండో అరువు తెచ్చుకుని వాక్యము గురించి రాయట్లేదు. యూదుడిగా తనకున్న అవగాహనను బట్టే యేసుక్రీస్తును అలా పరిచయం చేస్తున్నాడు. దానికి మంచి ఆధారమే "ఇవి జరిగినతరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి" వంటి మాటలు. మోషే ఈ సందర్భాన్ని రాసేటప్పటికి అసలు గ్రీకు ఫిలాసఫీనే ఉనికిలో లేదు. వాస్తవానికి యూదులనుండే గ్రీకులు ఇలాంటి అంశాలను దొంగిలించారని గ్రీకు తత్వజ్ఞానులే కొందరు ఒప్పుకున్నట్టుగా చరిత్ర చెబుతుంది. ఉదాహరణకు; ఫ్లేటోను తన స్వంత గ్రీకులే కొందరు ఇతను గ్రీకు బాషలో మాట్లాడే మోషే కదా అంటూ ఆక్షేపించేవారంట. అంటే అతను మోషే రచనలను ఆధారం చేసుకుని స్వంత ఫిలాసఫీని నిర్మించుకున్నాడు.
అదేవిధంగా ఆ సందర్భంలో దేవుడు అబ్రాహాముతో నేను నీకు కేడెమును, నీ బహుమానం అత్యధికమౌతుందని చెబుతున్నాడు. గడచిన అధ్యాయంలో అబ్రాహాము షీనారు దేశానికి చెందిన ఐదుగురు రాజులను ఓడించి లోతు కుటుంబాన్ని కాపాడినట్టుగా మనం చూసాం. దేవుడు అతనికి కేడెము (డాలు) గా ఉండబట్టే అది అతనికి సాధ్యమైంది. మనకు కూడా మన దేవుడు కేడెముగా ఉన్నప్పుడు మనశక్తికి అసాధ్యమైన కార్యాలను కూడా సులభంగా చెయ్యగలం. కానీ ఆయన మనకు కేడెముగా ఉండాలంటే మనం కూడా అబ్రాహాములా దేవుణ్ణి విశ్వసించగలగాలి.
దానియేలు 11: 32 అయితే తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు.
ఇంకా ఆయన అబ్రాహాముతో మాట్లాడుతూ నీ బహుమానము అత్యధికమౌతుందని సెలవిస్తున్నాడు. గత అధ్యాయంలో అబ్రాహాము సొదొమ రాజు ఇవ్వబోయిన ఆస్తిని, తన ఆశీర్వాదం విషయంలో దేవుడు మాత్రమే ఘనతపొందాలనే ఉద్దేశంతో తృణీకరించినట్టుగా మనం చూసాం. అందుకే ఇక్కడ అబ్రాహాము సొదొమ రాజు ఇవ్వబోయిన ఆస్తికంటే ఎంతో విలువైన సంతానాన్ని దేవుని బహుమానంగా పొందుకోబోతున్నాడు. కాబట్టి దేవుని చేత బహుమానాలు ఆశించే మనమంతా అబ్రాహాములా దేవునికి మాత్రమే చెందవలసిన ఘనతపై ప్రభావం చూపించే బహుమానాలను తృణీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకిచ్చే బహుమానం ముందు మనం కోల్పోయినవి ఏమాత్రమూ సరితూగవు.
ఆదికాండము 15:2,3 అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా మరియు అబ్రాముఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా-
ఈ వచనాలలో అబ్రాహాము దేవుడు తనతో నీ బహుమానం అత్యధికమౌతుందని చెప్పినమాటలకు స్పందిస్తూ తన సంతానం గురించి వాపోవడం మనం చూస్తాం. వాస్తవానికి దేవుడు అతనికి ఇస్తానన్న బహుమానం అతని సంతానమే. అయితే అబ్రాహాము దానిని సంపదగా అపార్థం చేసుకుని ఈవిధంగా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఆ కాలంలో ఎవరైనా ఒక యజమానుడు సంతానం లేక చనిపోయినప్పుడు తన పనివారిలో ముఖ్యుడు అతని ఆస్తికి వారసుడయ్యేవాడు. ఎలీయెజెరు అనేవ్యక్తి అబ్రాహాము పనివారిలో ముఖ్యుడు కాబట్టి అబ్రాహాము అతని పేరును ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.
ఆదికాండము 15:4,5 యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు. నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చినీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవునని చెప్పెను.
ఈ వచనాలలో దేవుడు, తాను ఇస్తానంటున్న బహుమానాన్ని అబ్రాహాము సంపదగా అపార్థం చేసుకున్న కారణం చేత ఆ బహుమానం అతని సంతానమే అని వివరంగా చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ అబ్రాహాము స్వయంగా దేవుని మాటలనే అపార్థం చేసుకున్నప్పుడు ఆయన ఎంతో ఓర్పుతో అతనికి విషయం అర్థమయ్యేలా బోధిస్తున్నాడు. దీనిని బట్టి మనం కూడా మన మాటలను ఎవరైనా అపార్థం చేసుకుంటున్నప్పుడు విసుగు చెందకుండా విషయం అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా దేవుడు ఇక్కడ అబ్రాహాము సంతానాన్ని ఆకాశనక్షత్రాలతో పోల్చడం మనం చూస్తాం, అది అబ్రాహాము సంతానం గొప్పగా విస్తరిస్తుందనే భావంతో కూడిన అలంకార బాష.
ఆదికాండము 15:6 అతడు యెహోవాను నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.
ఈ వచనంలో అబ్రాహాము దేవుణ్ణి నమ్మినట్టు అది అతనికి నీతిగా ఎంచబడినట్టు మనం చూస్తాం. విశ్వాసం ద్వారా నీతి కలుగుతుందనే సిద్ధాంతాన్ని బైబిల్ ప్రారంభం నుండీ బోధిస్తుంది, దానికి ఒక మంచి ఉదాహరణే ఈ సందర్భం (రోమా 4:3-25).
ఆదికాండము 15:7,8 మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించు కొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా-
ఈ వచనాలలో దేవుడు అబ్రాహాముకు తనగురించి మరలా జ్ఞాపకం చెయ్యడం దానికి అబ్రాహాము అతని సంతానం కనానును స్వాధీనం చేసుకుంటుంది అనడానికి ఒక సూచనను అడగడం మనం చూస్తాం. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే అబ్రాహాము దేవుడు చేసిన వాగ్దానంపై సందేహంతో సూచనను అడగడం లేదు, ఎందుకంటే పై వచనంలోనే అతను దేవుణ్ణి నమ్మినట్టుగా రాయబడింది. కాబట్టి అబ్రాహాము కేవలం తనలో ఉన్న తపనను బట్టే దేవుణ్ణి సూచన అడుగుతున్నాడు.
ఆదికాండము 15:9 ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.
ఈ వచనంలో దేవుడు అబ్రాహాము కోరిన కోరికకు సానుకూలంగా స్పందిస్తూ కొన్ని జంతువులనూ పక్షులనూ తన యొద్దకు తెమ్మన్నట్టుగా మనం చూస్తాం. ఆయన ఇవెందుకు తీసుకురమ్మన్నాడో క్రింది వచనాలలో వివరంగా చూద్దాం. అయితే ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే ఆయన అబ్రాహాము కోరికను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా అబ్రాహాములా దేవునిపట్ల విశ్వాసంతో ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ జీవిస్తున్నప్పుడు మన కోరికలన్నీ ఆయన "తగిన సమయంలో" తప్పకుండా నెరవేరుస్తాడు. మన కోరికలు అన్నప్పుడు ఆయన చిత్తానుసారమైన కోరికల గురించి మాట్లాడుతున్నాను (1 యోహాను 3: 21, 1 యోహాను 5: 13).
ఆదికాండము 15:10,11 అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను.
ఈ వచనాలలో అబ్రాహాము, దేవుడు చెప్పిన జీవులన్నిటికీ ఆయన యొద్దకు తీసుకువచ్చి, వాటిని రెండుగా ఖండించినట్టు మనం చూస్తాం. 8వ వచనంలో అబ్రాహాము దేవుణ్ణి తన సంతానం కనానును స్వాధీనం చేసుకుంటుంది అనడానికి సూచనను అడిగాడు. అప్పుడు దేవుడు అతనికి కొన్ని జీవులను తనయొద్దకు తీసుకురమ్మన్నాడు. అబ్రాహాము ఆవిధంగానే చేసాడు. ఇక్కడ దేవుణ్ణి సూచన కోరిన అబ్రాహాముకు ఆయన ఒక పని చెప్పాడు, సూచన కోరిన అబ్రాహాము ఆ పని చేసాడు. కాబట్టి మనం కూడా దేవుణ్ణి కోరికలు కోరేముందు దాని నెరవేర్పుకై ఆయన చెప్పిన పనులు చేస్తుండాలి.
ఉదాహరణకు, ఒక వ్యక్తి దేవుణ్ణి దీర్ఘాయుష్షు అడుగుతున్నాడు అనుకుందాం. దీర్ఘాయుష్షు కావలసిన వ్యక్తి తన తల్లితండ్రులను సన్మానించాలని దేవుని వాక్యం బోధిస్తుంది (నిర్గమకాండము 20:12) ఇప్పుడు ఆ వ్యక్తి దేవుని వాక్యం బోధిస్తున్న పనిచెయ్యకుండా ఆయనను దీర్ఘాయుష్షు అడుగుతుంటే దానివల్ల అతనికి ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి మనం దేవునినుండి ఏదైనా కోరుకునేటప్పుడు దానికోసం ఆయన బోధిస్తున్న పనేంటో అది చెయ్యగలగాలి. అలా చెయ్యాలంటే ఆయన ఏం బోధించాడో తెలుసుకోవడానికి వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించాలి. ఎందుకంటే ఆయన బోధ, ఆయన చిత్తం కేవలం లేఖనాలలో మాత్రమే మనకు వివరించబడింది.
ఆదికాండము15:12 ప్రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను. భయంకరమైన కటికచీకటి అతని కమ్మగా-
ఈ వచనంలో అబ్రాహాముకు గాఢనిద్రపట్టినట్టు కటికచీకటి అతడిని కమ్మినట్టు రాయబడడం మనం చూస్తాం. కొందరు ఈమాటలను అపార్థం చేసుకుని అబ్రాహాము దేవునితో మాట్లాడకుండా నిద్రపోయాడని, అందుకే ఆయన క్రింది వచనాలలో అతని సంతానం దాస్యానికి పోతుందని శపించాడని బోధిస్తుంటారు. కానీ ఆ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు అబ్రాహాము కావాలని నిద్రపోలేదు, అది నిద్రపోయే సమయం కూడా కాదు. అక్కడ అతని ప్రమేయం లేకుండానే అతనికి గాఢనిద్రపట్టింది, ఎందుకంటే దేవుడు ఆ క్రిందిమాటలన్నీ అతనికి స్వప్నంలో తెలియచేయబోతున్నాడు.
ఆదికాండము 15:13,14 ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.
ఈ వచనాలలో దేవుడు అబ్రాహాముతో అతని సంతానం నాలుగువందల సంవత్సరాలు వేరే దేశపువారికి దాసులుగా ఉంటారని, తర్వాత వారు ఆ దాస్యం నుండి విడిపించబడి కనానుకు తిరిగివస్తారని తెలియచెయ్యడం మనం చూస్తాం. ఈ నాలుగువందల సంవత్సరాలను మనం ఇస్సాకు తన ఐదవయేట పాలువిడిచిన సంవత్సరం నుండి, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయటకు వచ్చేంతవరకూ మధ్య ఉన్నకాలంగా పరిగణించాలి. కనాను దేశంలో అబ్రాహాము ఇస్సాకు యాకోబులు కూడా పరదేశులుగానే జీవించారు, ఆ కనాను దేశంలో ఇస్సాకు పాలువిడిచిన రోజు ఇష్మాయేలు వల్ల అతనికి మొదటి శ్రమసంభవించింది. అప్పటినుండి అతనూ అతని కుమారుడైన యాకోబు వారు పరదేశులుగా ఉన్న కనాను దేశంలో ఆ దేశప్రజల వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. తర్వాత యాకోబు కుటుంబం ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు ఆ దేశంలో 215 సంవత్సరాలు దాసులుగా జీవించారు, చివరికి మోషే కాలానికి దేవుడు అబ్రాహాముతో చెప్పిన 400 సంవత్సరాలు పూర్తికాగా వారు మోషే నాయకత్వంలో ఐగుప్తునుండి బయటకు వచ్చి కనానును స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశాన్ని మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎంతకాలం నివసించారు?
ఆదికాండము 15:15,16 నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.
ఈ వచనాలలో దేవుడు అబ్రాహాముకు అతని మరణం గురించీ అతని నాలుగవ తరం కనానుకు తిరిగిరావడం గురించి చెబుతున్నట్టుగా మనం చూస్తాం. దేవుడు ఇక్కడ చెబుతున్నట్టుగా అబ్రాహాము నాలుగవ తరం కనానును ఎలా స్వాధీనం చేసుకుందో కూడా నేను పైన ప్రస్తావించిన వ్యాసంలో వివరించాను. కొందరు అబ్రాహాము నాలుగవ తరం అనగానే యాకోబు కుమారుల వరకూ లెక్కించి వారు కనానును స్వాధీనపరచుకోలేదని ప్రశ్నిస్తుంటారు. కానీ ఇక్కడ దేవుడు అబ్రాహాముతో నీ నాలుగవ తరం అన్నప్పుడు అతని సంతానంలో నాలుగవ తరం గురించి చెబుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. దీనిని ఐగుప్తుకు వెళ్ళిన యాకోబు కుమారుల నుంచి మనం లెక్కిస్తే ఆయన చెప్పిన లెక్క సరిపోతుంది (పైన ప్రస్తావించిన వ్యాసం చదవండి).
అదేవిధంగా దేవుడు ఆ సందర్భంలో అమోరీయుల అక్రమం ఇంకా పరిపూర్ణం కాలేదు కాబట్టి నీ సంతానపు నాలుగవ తరం ఈదేశాన్ని స్వాధీనం చేసుకుంటుందని చెప్పడం మనం చూస్తాం. అమోరీయులు అంటే కనాను దేశంలో నివసిస్తున్న ఒకజాతి ప్రజలు. దేవుడు ఎవరి పాపమూ పరిపూర్ణం కాకుండా వారిని నాశనం చెయ్యడు కాబట్టి, అమోరీయుల అక్రమం పరిపూర్ణమయ్యేదాకా ఆయన అబ్రాహాము సంతానానికి కనాను దేశాన్ని స్వాధీనపరచలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే వారు అక్కడి స్థానిక ప్రజలను నాశనం చెయ్యాలి.
కాబట్టి వారి పాపం పరిపూర్ణమయ్యాకే ఆయన ఆ పనిని జరిగించాడు. కొందరు బైబిల్ విమర్శకులు ఇశ్రాయేలీయులు కనాను దేశప్రజలను నాశనం చేసినదానిని చూపిస్తూ దేవుడు ఇశ్రాయేలీయులకు కనానును స్వాధీనం చెయ్యడానికి వారిని అన్యాయంగా చంపివేసాడని ఆరోపిస్తుంటారు.
కానీ ఆ ప్రజలు ఎలాంటి హేయకార్యాలు చేసారో తమకు తామే నాశనానికి ఎలా పాత్రులయ్యారో లేవీకాండము, ద్వితీయోపదేశకాండాలను మనం చదివినప్పుడు బాగా అర్థమౌతుంది. వాటిగురించి అర్కిలాజికల్ ఆధారాలతో సహా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
ఇశ్రాయేలీయులు కనానీయులను సంహరించడం న్యాయమా? నేరమా?
ఆదికాండము 15:17-21 మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవాఐగుప్తు నది మొదలుకొని గొప్పనదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయీయులను అమోరీయులను కనా నీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.
ఈ వచనాలలో దేవుడు అబ్రాహాము ఖండించిన జీవులమధ్య నుండి నడచిపోవడం, అప్పటికి పదిజాతుల ప్రజలు నివసిస్తున్న కనాను దేశాన్ని అతని సంతానానికి ఇస్తానని నిబంధన చెయ్యడం మనం చూస్తాం. ప్రాచీనకాలంలో ఇద్దరు వ్యక్తులు ఏదైనా ఒప్పందం చేసుకునేటప్పుడు ఒక జంతువును రెండుగా ఖండించి, ఆ భాగాల మధ్యనుండి నడచివెళ్ళాలి. దీనికి ఒప్పందం మీరిన వ్యక్తిని మిగిలిన వ్యక్తి ఆ జంతువును చంపినట్టు చంపవచ్చని భావం (యిర్మీయా 34:18,19).
8వ వచనంలో అబ్రాహాము దేవుణ్ణి నా సంతానం ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటుందని నాకెలా తెలుస్తుందని అడిగినప్పుడు, ఆయన కొన్ని జీవులను తనయొద్దకు తెచ్చి వాటిని ఖండించమన్నాడు. ఇప్పుడు ఆ ఖండించిన జీవుల మధ్యనుండి ఆయన నడచివెళ్ళి తాను చెప్పినమాటను తప్పకుండా నెరవేరుస్తానని అబ్రాహాముతో నిబంధన చేస్తున్నాడు. తన సంతానం విషయంలో సూచన కోరిన అబ్రాహాముకు ఈ నిబంధనకు మించిన సూచన మరొకటి ఉండదు. ఎందుకంటే ఇక్కడ దేవుడే స్వయంగా అబ్రాహాముకు బాగా అర్థమయ్యేవిధంగా వారి పద్ధతిలో ప్రమాణం చేస్తున్నాడు.
ఇక్కడ మనం గుర్తించవలసిన మరోవిషయం ఏంటంటే ఈ ప్రమాణంలో దేవుడు అబ్రాహాముతో కలసి ఆ జంతుఖండాల మధ్యనుండి నడవలేదు, ఆయన మాత్రమే నడిచాడు. అంటే ఇది అబ్రాహాముతో నిమిత్తం లేని నిబంధన. దీనిప్రకారం ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నప్పటికీ ఆయన ఆ ప్రమాణాన్ని నెరవేర్చుకుంటాడు. అందుకే మార్గమధ్యంలో వారు ఎంత అవిధేయులుగా ఉన్నప్పటికీ వారిని పూర్తిగా నశింపచెయ్యకుండా కనానుకు చేర్చాడు.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 15
15:1, 15:2,3, 15:4,5, 15:6, 15:7,8, 15:9, 15:10,11, 15:12, 15:13,14, 15:15,16, 15:17-21
ఆదికాండము 15:1 ఇవి జరిగినతరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము. నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.
ఈ వచనంలో "యెహోవా వాక్యము" అబ్రాహామును దర్శించి, అతనితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. "వాక్యము" అనగానే అది శబ్దం ఐతే అది వినిపించాలే తప్ప కనిపించకూడదు. కానీ ఈ సందర్భంలోనూ మరికొన్ని సందర్భాలలో కూడా ఆ యెహోవా వాక్యము భక్తులను దర్శించి మాట్లాడుతున్నట్టు గమనిస్తాం. ఉదాహరణకు; 1సమూయేలు 15:10, 2 సమూయేలు 7: 4, యెహేజ్కేలు 38:1, 1 రాజులు 6:11, యెషయా 38: 4.
దీనిని బట్టి యూదులు కూడా దేవునిలో బహుళత్వం ఉందనీ ఈ "యెహోవా వాక్యము" ఆ బహుళత్వంలోని వ్యక్తియని విశ్వసించేవారు. ఈవిధంగా "యెహోవా వాక్యము" పేరుతో పాతనిబంధనలో పరిచయం చెయ్యబడింది యేసుక్రీస్తు ప్రభువేయని నూతన నిబంధన చాలా స్పష్టంగా తెలియచేస్తుంది (యోహాను 1:1-3,14, ప్రకటన 19: 13).
అయితే కొందరు "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను" అని యోహాను "వాక్యము" గురించి రాస్తున్నటువంటి మాటలను అతను ప్లేటో లాంటి గ్రీకు తత్వజ్ఞానుల నుండి అరువు తెచ్చుకున్నట్టుగా ఆరోపిస్తుంటారు. ఎందుకంటే వ్యక్తియైన వాక్యము (లోగోస్) ప్రస్తావన మనకు గ్రీకు ఫిలాసఫీలో కూడా కనిపిస్తుంటుంది. కానీ యోహాను ఎక్కడినుండో అరువు తెచ్చుకుని వాక్యము గురించి రాయట్లేదు. యూదుడిగా తనకున్న అవగాహనను బట్టే యేసుక్రీస్తును అలా పరిచయం చేస్తున్నాడు. దానికి మంచి ఆధారమే "ఇవి జరిగినతరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి" వంటి మాటలు. మోషే ఈ సందర్భాన్ని రాసేటప్పటికి అసలు గ్రీకు ఫిలాసఫీనే ఉనికిలో లేదు. వాస్తవానికి యూదులనుండే గ్రీకులు ఇలాంటి అంశాలను దొంగిలించారని గ్రీకు తత్వజ్ఞానులే కొందరు ఒప్పుకున్నట్టుగా చరిత్ర చెబుతుంది. ఉదాహరణకు; ఫ్లేటోను తన స్వంత గ్రీకులే కొందరు ఇతను గ్రీకు బాషలో మాట్లాడే మోషే కదా అంటూ ఆక్షేపించేవారంట. అంటే అతను మోషే రచనలను ఆధారం చేసుకుని స్వంత ఫిలాసఫీని నిర్మించుకున్నాడు.
అదేవిధంగా ఆ సందర్భంలో దేవుడు అబ్రాహాముతో నేను నీకు కేడెమును, నీ బహుమానం అత్యధికమౌతుందని చెబుతున్నాడు. గడచిన అధ్యాయంలో అబ్రాహాము షీనారు దేశానికి చెందిన ఐదుగురు రాజులను ఓడించి లోతు కుటుంబాన్ని కాపాడినట్టుగా మనం చూసాం. దేవుడు అతనికి కేడెము (డాలు) గా ఉండబట్టే అది అతనికి సాధ్యమైంది. మనకు కూడా మన దేవుడు కేడెముగా ఉన్నప్పుడు మనశక్తికి అసాధ్యమైన కార్యాలను కూడా సులభంగా చెయ్యగలం. కానీ ఆయన మనకు కేడెముగా ఉండాలంటే మనం కూడా అబ్రాహాములా దేవుణ్ణి విశ్వసించగలగాలి.
దానియేలు 11: 32 అయితే తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు.
ఇంకా ఆయన అబ్రాహాముతో మాట్లాడుతూ నీ బహుమానము అత్యధికమౌతుందని సెలవిస్తున్నాడు. గత అధ్యాయంలో అబ్రాహాము సొదొమ రాజు ఇవ్వబోయిన ఆస్తిని, తన ఆశీర్వాదం విషయంలో దేవుడు మాత్రమే ఘనతపొందాలనే ఉద్దేశంతో తృణీకరించినట్టుగా మనం చూసాం. అందుకే ఇక్కడ అబ్రాహాము సొదొమ రాజు ఇవ్వబోయిన ఆస్తికంటే ఎంతో విలువైన సంతానాన్ని దేవుని బహుమానంగా పొందుకోబోతున్నాడు. కాబట్టి దేవుని చేత బహుమానాలు ఆశించే మనమంతా అబ్రాహాములా దేవునికి మాత్రమే చెందవలసిన ఘనతపై ప్రభావం చూపించే బహుమానాలను తృణీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకిచ్చే బహుమానం ముందు మనం కోల్పోయినవి ఏమాత్రమూ సరితూగవు.
ఆదికాండము 15:2,3 అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా మరియు అబ్రాముఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా-
ఈ వచనాలలో అబ్రాహాము దేవుడు తనతో నీ బహుమానం అత్యధికమౌతుందని చెప్పినమాటలకు స్పందిస్తూ తన సంతానం గురించి వాపోవడం మనం చూస్తాం. వాస్తవానికి దేవుడు అతనికి ఇస్తానన్న బహుమానం అతని సంతానమే. అయితే అబ్రాహాము దానిని సంపదగా అపార్థం చేసుకుని ఈవిధంగా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఆ కాలంలో ఎవరైనా ఒక యజమానుడు సంతానం లేక చనిపోయినప్పుడు తన పనివారిలో ముఖ్యుడు అతని ఆస్తికి వారసుడయ్యేవాడు. ఎలీయెజెరు అనేవ్యక్తి అబ్రాహాము పనివారిలో ముఖ్యుడు కాబట్టి అబ్రాహాము అతని పేరును ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.
ఆదికాండము 15:4,5 యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు. నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చినీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవునని చెప్పెను.
ఈ వచనాలలో దేవుడు, తాను ఇస్తానంటున్న బహుమానాన్ని అబ్రాహాము సంపదగా అపార్థం చేసుకున్న కారణం చేత ఆ బహుమానం అతని సంతానమే అని వివరంగా చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ అబ్రాహాము స్వయంగా దేవుని మాటలనే అపార్థం చేసుకున్నప్పుడు ఆయన ఎంతో ఓర్పుతో అతనికి విషయం అర్థమయ్యేలా బోధిస్తున్నాడు. దీనిని బట్టి మనం కూడా మన మాటలను ఎవరైనా అపార్థం చేసుకుంటున్నప్పుడు విసుగు చెందకుండా విషయం అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా దేవుడు ఇక్కడ అబ్రాహాము సంతానాన్ని ఆకాశనక్షత్రాలతో పోల్చడం మనం చూస్తాం, అది అబ్రాహాము సంతానం గొప్పగా విస్తరిస్తుందనే భావంతో కూడిన అలంకార బాష.
ఆదికాండము 15:6 అతడు యెహోవాను నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.
ఈ వచనంలో అబ్రాహాము దేవుణ్ణి నమ్మినట్టు అది అతనికి నీతిగా ఎంచబడినట్టు మనం చూస్తాం. విశ్వాసం ద్వారా నీతి కలుగుతుందనే సిద్ధాంతాన్ని బైబిల్ ప్రారంభం నుండీ బోధిస్తుంది, దానికి ఒక మంచి ఉదాహరణే ఈ సందర్భం (రోమా 4:3-25).
ఆదికాండము 15:7,8 మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించు కొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా-
ఈ వచనాలలో దేవుడు అబ్రాహాముకు తనగురించి మరలా జ్ఞాపకం చెయ్యడం దానికి అబ్రాహాము అతని సంతానం కనానును స్వాధీనం చేసుకుంటుంది అనడానికి ఒక సూచనను అడగడం మనం చూస్తాం. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే అబ్రాహాము దేవుడు చేసిన వాగ్దానంపై సందేహంతో సూచనను అడగడం లేదు, ఎందుకంటే పై వచనంలోనే అతను దేవుణ్ణి నమ్మినట్టుగా రాయబడింది. కాబట్టి అబ్రాహాము కేవలం తనలో ఉన్న తపనను బట్టే దేవుణ్ణి సూచన అడుగుతున్నాడు.
ఆదికాండము 15:9 ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.
ఈ వచనంలో దేవుడు అబ్రాహాము కోరిన కోరికకు సానుకూలంగా స్పందిస్తూ కొన్ని జంతువులనూ పక్షులనూ తన యొద్దకు తెమ్మన్నట్టుగా మనం చూస్తాం. ఆయన ఇవెందుకు తీసుకురమ్మన్నాడో క్రింది వచనాలలో వివరంగా చూద్దాం. అయితే ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే ఆయన అబ్రాహాము కోరికను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా అబ్రాహాములా దేవునిపట్ల విశ్వాసంతో ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ జీవిస్తున్నప్పుడు మన కోరికలన్నీ ఆయన "తగిన సమయంలో" తప్పకుండా నెరవేరుస్తాడు. మన కోరికలు అన్నప్పుడు ఆయన చిత్తానుసారమైన కోరికల గురించి మాట్లాడుతున్నాను (1 యోహాను 3: 21, 1 యోహాను 5: 13).
ఆదికాండము 15:10,11 అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను.
ఈ వచనాలలో అబ్రాహాము, దేవుడు చెప్పిన జీవులన్నిటికీ ఆయన యొద్దకు తీసుకువచ్చి, వాటిని రెండుగా ఖండించినట్టు మనం చూస్తాం. 8వ వచనంలో అబ్రాహాము దేవుణ్ణి తన సంతానం కనానును స్వాధీనం చేసుకుంటుంది అనడానికి సూచనను అడిగాడు. అప్పుడు దేవుడు అతనికి కొన్ని జీవులను తనయొద్దకు తీసుకురమ్మన్నాడు. అబ్రాహాము ఆవిధంగానే చేసాడు. ఇక్కడ దేవుణ్ణి సూచన కోరిన అబ్రాహాముకు ఆయన ఒక పని చెప్పాడు, సూచన కోరిన అబ్రాహాము ఆ పని చేసాడు. కాబట్టి మనం కూడా దేవుణ్ణి కోరికలు కోరేముందు దాని నెరవేర్పుకై ఆయన చెప్పిన పనులు చేస్తుండాలి.
ఉదాహరణకు, ఒక వ్యక్తి దేవుణ్ణి దీర్ఘాయుష్షు అడుగుతున్నాడు అనుకుందాం. దీర్ఘాయుష్షు కావలసిన వ్యక్తి తన తల్లితండ్రులను సన్మానించాలని దేవుని వాక్యం బోధిస్తుంది (నిర్గమకాండము 20:12) ఇప్పుడు ఆ వ్యక్తి దేవుని వాక్యం బోధిస్తున్న పనిచెయ్యకుండా ఆయనను దీర్ఘాయుష్షు అడుగుతుంటే దానివల్ల అతనికి ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి మనం దేవునినుండి ఏదైనా కోరుకునేటప్పుడు దానికోసం ఆయన బోధిస్తున్న పనేంటో అది చెయ్యగలగాలి. అలా చెయ్యాలంటే ఆయన ఏం బోధించాడో తెలుసుకోవడానికి వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించాలి. ఎందుకంటే ఆయన బోధ, ఆయన చిత్తం కేవలం లేఖనాలలో మాత్రమే మనకు వివరించబడింది.
ఆదికాండము15:12 ప్రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను. భయంకరమైన కటికచీకటి అతని కమ్మగా-
ఈ వచనంలో అబ్రాహాముకు గాఢనిద్రపట్టినట్టు కటికచీకటి అతడిని కమ్మినట్టు రాయబడడం మనం చూస్తాం. కొందరు ఈమాటలను అపార్థం చేసుకుని అబ్రాహాము దేవునితో మాట్లాడకుండా నిద్రపోయాడని, అందుకే ఆయన క్రింది వచనాలలో అతని సంతానం దాస్యానికి పోతుందని శపించాడని బోధిస్తుంటారు. కానీ ఆ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు అబ్రాహాము కావాలని నిద్రపోలేదు, అది నిద్రపోయే సమయం కూడా కాదు. అక్కడ అతని ప్రమేయం లేకుండానే అతనికి గాఢనిద్రపట్టింది, ఎందుకంటే దేవుడు ఆ క్రిందిమాటలన్నీ అతనికి స్వప్నంలో తెలియచేయబోతున్నాడు.
ఆదికాండము 15:13,14 ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.
ఈ వచనాలలో దేవుడు అబ్రాహాముతో అతని సంతానం నాలుగువందల సంవత్సరాలు వేరే దేశపువారికి దాసులుగా ఉంటారని, తర్వాత వారు ఆ దాస్యం నుండి విడిపించబడి కనానుకు తిరిగివస్తారని తెలియచెయ్యడం మనం చూస్తాం. ఈ నాలుగువందల సంవత్సరాలను మనం ఇస్సాకు తన ఐదవయేట పాలువిడిచిన సంవత్సరం నుండి, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయటకు వచ్చేంతవరకూ మధ్య ఉన్నకాలంగా పరిగణించాలి. కనాను దేశంలో అబ్రాహాము ఇస్సాకు యాకోబులు కూడా పరదేశులుగానే జీవించారు, ఆ కనాను దేశంలో ఇస్సాకు పాలువిడిచిన రోజు ఇష్మాయేలు వల్ల అతనికి మొదటి శ్రమసంభవించింది. అప్పటినుండి అతనూ అతని కుమారుడైన యాకోబు వారు పరదేశులుగా ఉన్న కనాను దేశంలో ఆ దేశప్రజల వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. తర్వాత యాకోబు కుటుంబం ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు ఆ దేశంలో 215 సంవత్సరాలు దాసులుగా జీవించారు, చివరికి మోషే కాలానికి దేవుడు అబ్రాహాముతో చెప్పిన 400 సంవత్సరాలు పూర్తికాగా వారు మోషే నాయకత్వంలో ఐగుప్తునుండి బయటకు వచ్చి కనానును స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశాన్ని మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎంతకాలం నివసించారు?
ఆదికాండము 15:15,16 నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.
ఈ వచనాలలో దేవుడు అబ్రాహాముకు అతని మరణం గురించీ అతని నాలుగవ తరం కనానుకు తిరిగిరావడం గురించి చెబుతున్నట్టుగా మనం చూస్తాం. దేవుడు ఇక్కడ చెబుతున్నట్టుగా అబ్రాహాము నాలుగవ తరం కనానును ఎలా స్వాధీనం చేసుకుందో కూడా నేను పైన ప్రస్తావించిన వ్యాసంలో వివరించాను. కొందరు అబ్రాహాము నాలుగవ తరం అనగానే యాకోబు కుమారుల వరకూ లెక్కించి వారు కనానును స్వాధీనపరచుకోలేదని ప్రశ్నిస్తుంటారు. కానీ ఇక్కడ దేవుడు అబ్రాహాముతో నీ నాలుగవ తరం అన్నప్పుడు అతని సంతానంలో నాలుగవ తరం గురించి చెబుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. దీనిని ఐగుప్తుకు వెళ్ళిన యాకోబు కుమారుల నుంచి మనం లెక్కిస్తే ఆయన చెప్పిన లెక్క సరిపోతుంది (పైన ప్రస్తావించిన వ్యాసం చదవండి).
అదేవిధంగా దేవుడు ఆ సందర్భంలో అమోరీయుల అక్రమం ఇంకా పరిపూర్ణం కాలేదు కాబట్టి నీ సంతానపు నాలుగవ తరం ఈదేశాన్ని స్వాధీనం చేసుకుంటుందని చెప్పడం మనం చూస్తాం. అమోరీయులు అంటే కనాను దేశంలో నివసిస్తున్న ఒకజాతి ప్రజలు. దేవుడు ఎవరి పాపమూ పరిపూర్ణం కాకుండా వారిని నాశనం చెయ్యడు కాబట్టి, అమోరీయుల అక్రమం పరిపూర్ణమయ్యేదాకా ఆయన అబ్రాహాము సంతానానికి కనాను దేశాన్ని స్వాధీనపరచలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే వారు అక్కడి స్థానిక ప్రజలను నాశనం చెయ్యాలి.
కాబట్టి వారి పాపం పరిపూర్ణమయ్యాకే ఆయన ఆ పనిని జరిగించాడు. కొందరు బైబిల్ విమర్శకులు ఇశ్రాయేలీయులు కనాను దేశప్రజలను నాశనం చేసినదానిని చూపిస్తూ దేవుడు ఇశ్రాయేలీయులకు కనానును స్వాధీనం చెయ్యడానికి వారిని అన్యాయంగా చంపివేసాడని ఆరోపిస్తుంటారు.
కానీ ఆ ప్రజలు ఎలాంటి హేయకార్యాలు చేసారో తమకు తామే నాశనానికి ఎలా పాత్రులయ్యారో లేవీకాండము, ద్వితీయోపదేశకాండాలను మనం చదివినప్పుడు బాగా అర్థమౌతుంది. వాటిగురించి అర్కిలాజికల్ ఆధారాలతో సహా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
ఇశ్రాయేలీయులు కనానీయులను సంహరించడం న్యాయమా? నేరమా?
ఆదికాండము 15:17-21 మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవాఐగుప్తు నది మొదలుకొని గొప్పనదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయీయులను అమోరీయులను కనా నీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.
ఈ వచనాలలో దేవుడు అబ్రాహాము ఖండించిన జీవులమధ్య నుండి నడచిపోవడం, అప్పటికి పదిజాతుల ప్రజలు నివసిస్తున్న కనాను దేశాన్ని అతని సంతానానికి ఇస్తానని నిబంధన చెయ్యడం మనం చూస్తాం. ప్రాచీనకాలంలో ఇద్దరు వ్యక్తులు ఏదైనా ఒప్పందం చేసుకునేటప్పుడు ఒక జంతువును రెండుగా ఖండించి, ఆ భాగాల మధ్యనుండి నడచివెళ్ళాలి. దీనికి ఒప్పందం మీరిన వ్యక్తిని మిగిలిన వ్యక్తి ఆ జంతువును చంపినట్టు చంపవచ్చని భావం (యిర్మీయా 34:18,19).
8వ వచనంలో అబ్రాహాము దేవుణ్ణి నా సంతానం ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటుందని నాకెలా తెలుస్తుందని అడిగినప్పుడు, ఆయన కొన్ని జీవులను తనయొద్దకు తెచ్చి వాటిని ఖండించమన్నాడు. ఇప్పుడు ఆ ఖండించిన జీవుల మధ్యనుండి ఆయన నడచివెళ్ళి తాను చెప్పినమాటను తప్పకుండా నెరవేరుస్తానని అబ్రాహాముతో నిబంధన చేస్తున్నాడు. తన సంతానం విషయంలో సూచన కోరిన అబ్రాహాముకు ఈ నిబంధనకు మించిన సూచన మరొకటి ఉండదు. ఎందుకంటే ఇక్కడ దేవుడే స్వయంగా అబ్రాహాముకు బాగా అర్థమయ్యేవిధంగా వారి పద్ధతిలో ప్రమాణం చేస్తున్నాడు.
ఇక్కడ మనం గుర్తించవలసిన మరోవిషయం ఏంటంటే ఈ ప్రమాణంలో దేవుడు అబ్రాహాముతో కలసి ఆ జంతుఖండాల మధ్యనుండి నడవలేదు, ఆయన మాత్రమే నడిచాడు. అంటే ఇది అబ్రాహాముతో నిమిత్తం లేని నిబంధన. దీనిప్రకారం ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నప్పటికీ ఆయన ఆ ప్రమాణాన్ని నెరవేర్చుకుంటాడు. అందుకే మార్గమధ్యంలో వారు ఎంత అవిధేయులుగా ఉన్నప్పటికీ వారిని పూర్తిగా నశింపచెయ్యకుండా కనానుకు చేర్చాడు.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Add comment