8:1, 8:2, 8:3, 8:4, 8:5, 8:6,7, 8:8-11, 8:12-16, 8:17, 8:18-20, 8:21, 8:22
ఆదికాండము 8:1 దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.
ఈ వచనంలో దేవుడు నోవహునూ ఓడలో ఉన్న సమస్తాన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. వాస్తవానికి దేవునికి మనలా ఏదో జ్ఞాపకం చేసుకునే అవసరం ఉండదు. మరి ఈమాటలకు అర్థం ఏంటంటే; ఆయన కాపుదలనూ సహాయాన్నీ శ్రమలనుండి విడుదలనూ సూచిస్తూ ఇలాంటి పదప్రయోగం చెయ్యబడింది. ఉదాహరణకు; (ఆదికాండము 30:22, నిర్గమకాండము 2:23-25) దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 2:23-25 వ్యాఖ్యానం చూడండి).
కాబట్టి ఈ సందర్భంలో దేవుడు నోవహునూ అతనితో ఉన్న సమస్తాన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు అనంటే ఇప్పుడు వారు ఓడనుండి బయటకువచ్చే మార్గం సిద్ధపరుస్తున్నాడని అర్థం. అందుకే తర్వాత మాటల్లో "దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను" అని రాయబడింది.
అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్న సమస్తమూ ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంది. అందులో గాలి ఒకటి (కీర్తనలు 135:7, నిర్గమకాండము 14:21,22, 10:13).
ఆదికాండము 8:2 అగాధజలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను; ఆకాశమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను.
ఈ వచనంలో అగాధజలాల ఊటలూ ఆకాశపు తూములూ మూయబడినట్టు ఆకాశమునుండి కురుస్తున్న ప్రచండ వర్షం నిలిచిపోయినట్టు మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పటికే దేవుడు నిర్ణయించిన 40 పగళ్ళు, 40 రాత్రులూ గడచిపోయి ఓడలో ఉన్న నోవహు కుటుంబం జీవరాశులూ తప్ప ఊపిరి తీసుకునే జీవులన్నీ చనిపోయాయి. అప్పటినుంచే ఆయన వాయువును విసిరింపచేసి నీటిని తగ్గించే కార్యాన్ని ప్రారంభిస్తున్నాడు
ఆదికాండము 8:3 అప్పుడు నీళ్లు భూమిమీదనుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను; నూట ఏబది దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా-
ఈ వచనంలో జలప్రళయం ప్రారంభమైన రోజునుండి 150 రోజుల తర్వాత ఈ భూమిపై నుండి నీరు క్రమక్రమంగా తగ్గిపోయినట్టు మనం చూస్తాం. ఇక్కడ దేవుని సార్వభౌమ నిర్ణయాన్ని మనం స్పష్టంగా గమనిస్తున్నాం. ఎలాగంటే ఆదికాండము 1:6 ప్రకారం; ఈ సృష్టి అంతా నీటితో నింపబడియున్నప్పుడు ఆయన కొంతసేపటికే ఆ నీరు అంతటినీ వేరుచేసి, విశాలాన్ని (ఆకాశాన్ని) చేసాడు. 9వ వచనం ప్రకారం; ఈ భూమిపై ఉన్న నీరు అంతటినీ సముద్రాలుగా ప్రత్యేకించి మిగిలిన భూమిని ఆరిననేలగా చేసాడు. అయితే ఈ జలప్రళయ సంఘటనలో మాత్రం, ఆయన వెంటనే నీటిని తొలగించకుండా గాలిద్వారా దానిని మెళ్ళిమెళ్ళిగా తగ్గిస్తున్నాడు. ఆవిధంగా ఈ నీరు మొత్తం తొలగిపోయి, నోవహు కుటుంబం ఓడ నుండి బయటకు రావడానికి ఒక సంవత్సరం పదిరోజుల సమయం పట్టింది (ఆ వివరాలు ముందు చూద్దాం).
కాబట్టి దేవుడు ఏపనినైనా తన సార్వభౌమ నిర్ణయం చొప్పున ఎంత సమయంలో చెయ్యాలి అనుకుంటాడో అంత సమయంలోనే దానిని చేస్తాడు. మన ప్రార్థనల విషయంలో కూడా ఆయన ఇలానే తన సార్వభౌమచిత్త ప్రకారమే స్పందిస్తాడని మనం గుర్తుంచుకోవాలి. మనం తొందరపడుతున్నామని తొందరపడవలసిన అవసరం ఆయనకు ఉండదు. నోవహుకు కూడా ఆ ఓడ నుండి ఎప్పుడు బయటకు వద్దామా అని లేకుంటుందా? ఆ విషయంలో అతను ప్రార్థించకుండా ఉండుంటాడా?
అలానే దేవుడు ఏ కార్యాన్నైనా అద్భుతకరంగా (Super Natural) చెయ్యగలడు. సహజత్వంగా కూడా చెయ్యగలడు. సృష్టి ప్రారంభంలో ఆయన ఈ భూమిపై ఉన్న నీటిని అద్భుతకరంగా వేరు చేసాడు. ఈ జలప్రళయ సంఘటనలో మాత్రం సహజత్వంగా (గాలి ద్వారా) నీటిని ఆరిపోచేస్తున్నాడు. కాబట్టి తన పిల్లలకు ఏవిధమైన కార్యం చెయ్యాలని ఆయన నిర్ణయిస్తాడో దాని ప్రకారమే జరిగిస్తాడు. ఈమాటలు ఎందుకు చెబుతున్నానంటే మన జీవితంలో అద్భుతకరంగా జరిగితే మాత్రమే అది దేవుని సహాయం కాదు. మనకు సహాయం ఏ రూపంలో అందినా అది దేవుని నుండే.
అదేవిధంగా జలప్రళయం సంభవించిన 40 రోజులు గడచిన వెంటనే ఆయన ఈ భూమిని ఆరిపోయేలా చేస్తే నోవహు కుటుంబం కూడా ఓడనుండి బయటకు వచ్చి ఓడలో వారు చెయ్యవలసిన పనినుండి విశ్రాంతి పొందేవారు. కానీ దేవుడు అలా చెయ్యలేదు, వారు ఆ పని చాలా నెలలు చేస్తూనే ఉండేలా వారిని అందులోనే ఉంచి వేసాడు. దీనినిబట్టి, దేవుడు మనపై ఎక్కువ సమయం పని మోపుతున్నప్పుడు దానిని మనం భారంగా భావించకూడదు కానీ అది మన బాధ్యతగా మనకు మరి ఎక్కువ ప్రతిఫలాన్ని ఇచ్చేదిగానే గుర్తించాలి. నోవహు ఆ విధంగా గుర్తించే ఓడలో పనిచేసాడు. ఒకవేళ నోవహు కుటుంబం 40 రోజులకే ఓడ నుండి బయటపడితే వారు మిగిలిన 110 రోజుల ఓడ అనుభవం అనగా అద్భుతమైన రీతిలో వారిపై నిలిచిన దేవుని కాపుదలను అనుభవించియుండేవారు కాదు. అయితే ఒకటిమాత్రం మనం ఎప్పుడూ మరచిపోకూడదు, దేవుడు మనకు అసాధ్యమైన పని మనపై ఎప్పుడూ మోపడు. అందుకే కదా ఆయన నోవహు తీసుకురాలేని జీవులన్నీ వాటంతట అవే ఓడలోకి వచ్చేలా అద్భుతాన్ని చేసాడు.
ఆదికాండము 8:4 ఏడవ నెల పదియేడవ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను.
ఈ వచనంలో నోవహు ఓడ ఆరారాతు కొండలమీద నిలచినట్టు మనం చూస్తాం. టర్కీ దేశంలోని ఈ పర్వతాలలో కొందరు నోవహు ఓడను గుర్తించి ఆ ప్రాంతంలో "Noah Ark" అనే పార్కును కూడా నిర్మించినట్టు బైబిల్ పండితులు తెలియచేస్తున్నారు. ఇది బైబిల్ లోని నోవహు, జలప్రళయాల చరిత్ర వాస్తవమనేందుకు కచ్చితమైన ఆధారం. ఎందుకంటే ఆ పర్వతంపై ఉండే అగ్ని పర్వతాలు ప్రేలడం వల్ల ఆ లావాకు క్రిందకు కొట్టుకు వచ్చి భూమిలో కూరుకుపోయిన ఆ ఓడ యొక్క శిథిలాలను పరిశీలించినవారు, 6వ అధ్యాయంలో రాయబడిన ఓడ కొలతలతో దానిని పోల్చి అది నోవహు ఓడయే అని కచ్చితంగా చెబుతున్నారు. అధునిక పరీక్షలను నిర్వహించి మరీ ఆ విషయం నిర్ధారిస్తున్నారు. అయితే ఈ విషయంలో మరికొందరు 99.9% వరకే ఆ అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు (ఈ వివరాలను మీరు Google చెయ్యవచ్చు).
అయితే మొదటి శతాబ్దపు చరిత్రకారులకు మాత్రం ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే యూదా చరిత్రకారుడైన "ఫ్లేవియస్ జోసెఫెస్" తాను రాసిన "The Antiquities of The Jews" అనే పుస్తకం మొదటిభాగం, మూడవ అధ్యాయం ఐదు, ఆరు వచనాలలో నోవహు ఓడ నిలిచిన పర్వతం, అర్మేనియా దేశంలో ఉందని, ఆ దేశంలోని ప్రజలందరూ ఆ పర్వతాన్ని Apobarērion అని పిలిచేవారని తెలియచేసాడు. ఈ పేరుకు క్రిందకు దిగిరావడం అని అర్థం. నోవహు కుటుంబం ఆ పర్వతం పై నిలచిన ఓడనుండి క్రిందకు దిగివచ్చారు కాబట్టి, ఆ దేశపు ప్రజలు ఆ పర్వతాన్ని ఆ పేరుతో పిలిచేవారంట. దీనినిబట్టి జోసెఫెస్ జీవించిన కాలానికి (మొదటిశతాబ్దం), ఆ ఓడ శిథిలాలు ఎక్కడ ఉన్నాయో ఆయనకు కచ్చితంగా తెలుసని మనకు అర్థమౌతుంది. ఈ అర్మేనియా దేశమే ప్రస్తుతం టర్కీ దేశంగా పిలవబడుతుంది. దీనిప్రకారం ప్రస్తుతం టర్కీదేశంలోని పర్వతంపైన లభించిన ఓడ శిథిలాలు నోవహు ఓడవే అనడంలో మనకూ సందేహం లేదు.
జోసెఫెస్ కూడా కేవలం తన పరిశీలన ఆధారంగా మాత్రమే ఈ మాటలు రాయలేదు. బబులోను చరిత్రకారుడైన Berosus, ఈజిప్టు చరిత్రకారుడైన Hieronymus, ధమస్కు చరిత్రకారుడైన Nicolas చెప్పినవాటి వివరాలను కూడా అతను ప్రస్తావించాడు. ఆ ముగ్గురు కూడా నోవహు ఓడ అదే ప్రాంతంలో ఉందని, అక్కడి ప్రజలు కొందరు ఆ ఓడ శిథిలాలు కొన్నిటిని చిన్న ముక్కలుగా చేసి రక్షరేకులుగా మెడలో వేసుకునేవారని తమ పుస్తకాల్లో రాసారట.
ఆదికాండము 8:5 నీళ్లు పదియవ నెలవరకు క్రమముగా తగ్గుచువచ్చెను. పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను.
4వ వచనంలో నోవహు ఓడ ఆరారాతు పర్వతం పైన నిలిచినట్టుగా మనం చూసాం. అప్పటికి ఆ పర్వతం కూడా నీటిలోనే మునిగి ఉంది. ఎందుకంటే ఓడ అమరం నీటిలోనే ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో ఆ అమరానికి ఏదైనా మెరక తగిలినప్పుడు అది ఎటూ కదలకుండా నిలచిపోతుంది. అందుకే నోవహు ఓడ ఆరారాతు పర్వతంపై అలా నిలచిపోయింది. అది ఏడవ నెల పదిహేడవ రోజున జరిగితే పదవనెల మొదటిరోజుకు ఆ కొండల శిఖరాలు కనపడ్డాయి. అప్పటివరకూ (74 రోజులు) నోవహు ఆరారాతు పర్వతంపై నిలచిపోయిన ఓడలోనే ఎదురుచూస్తున్నాడు.
ఆదికాండము 8:6,7 నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడకిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవువరకు ఇటు అటు తిరుగుచుండెను.
ఈ వచనాలలో నోవహు భూమిపై నీరు ఇంకిపోయాయో లేదో తెలుసుకోవడానికి ఒక కాకిని పంపినట్టు మనం చూస్తాం. కానీ అది నోవహుకు ఎలాంటి సమాచారం తీసుకురాకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంది. సాధారణంగా కాకులు చనిపోయిన కళేబరాలను ఇష్టంగా తింటూ ఉంటాయి, ఈ కాకి కూడా జలప్రళయంలో చనిపోయిన వారి/వాటి కళేబరాలు నీటిలో తేలుతూ ఉండడం చూసి వాటిని తినే ఆసక్తితో నోవహు యొద్దకు రాకుండిందేమో.
ఆదికాండము 8:8-11 మరియు నీళ్లు నేల మీదనుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తనయొద్ద నుండి నల్లపావురమొకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీదనున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతనియొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాని పట్టుకొని ఓడలోనికి తీసికొనెను. అతడు మరి యేడు దినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను.
ఈ వచనాలలో నోవహు ఒక పావురాన్ని రెండుసార్లు బయటకు పంపినప్పుడు, రెండవసారి అది అతనిదగ్గరకు నీరు తగ్గిపోయిందనే సమాచారం తీసుకువచ్చినట్టు మనం చూస్తాం. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. దేవుడు నోవహుతో జలప్రళయం ఎన్ని రోజుల్లో వస్తుందో ఎంతకాలం వర్షం కురుస్తుందో తెలియచేసాడు కానీ ఆ నీరు ఎంతకాలానికి తగ్గుతుందో మాత్రం తెలియచెయ్యలేదు. అందుకే నోవహు అది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మొదట కాకినీ తర్వాత రెండుసార్లు పావురాన్నీ బయటకు పంపించాడు.
ఈ మాదిరిని బట్టి మనకున్న జ్ఞానంతో సాధనాలతో మనం తెలుసుకోగలిగే (చెయ్యగలిగే) వాటిని మనమే తెలుసుకునే (చేసే) ప్రయత్నం చెయ్యాలి. వాటిని కూడా దేవుడే ప్రత్యేకంగా తెలియచేస్తాడని (చేయిస్తాడని) భావించకూడదు అది సోమరితనం ఔతుంది. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే నేటికాలంలో చాలామంది విశ్వాసులూ బోధకులూ మనం చేసేది వాక్యానుసారమా కాదా అనేది పరీక్షించుకుని, తమకున్న జ్ఞానం, వనరులతో ప్రార్థనా పూర్వకంగా కార్యాలను తలపెట్టకుండా వాటి విషయంలో కూడా దేవుడు ప్రత్యేకంగా బోధిస్తాడంటూ (దర్శనాలు ఇస్తాడంటూ) ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా వివాహం, చదువు వంటి విషయాలలో.
ప్రత్యక్షతలు ఉన్నకాలంలోనే నోవహు తాను స్వతహాగా తెలుసుకోగలిగిన విషయానికై, ప్రత్యక్షత కోసం ఎదురుచూడకుండా కార్యాన్ని తలపెట్టినప్పుడు, వాక్య ప్రత్యక్షత సంపూర్ణం చెయ్యబడిన తర్వాత కూడా దేవుడు కలలోకి వచ్చో సూచనలు చూపించో తెలియచేస్తాడని భావించడం మూఢత్వం ఔతుంది. కాబట్టి మనం వాక్యమనే కొలమానంతో అన్నిటినీ పరీక్షించుకుంటూ మనకున్న జ్ఞానంతో వనరులతో ప్రార్థనాపూర్వకంగా చెయ్యాలనుకున్న కార్యాలను ప్రారంభించాలి. ఒకవేళ అడ్డగించాలి అనుకుంటే దేవుడే అడ్డగిస్తాడు. ఉదాహరణకు; దావీదు దేవునిపట్ల ఆసక్తితో మందిరం కట్టాలి అనుకున్నాడు. కానీ దేవుడు ఆ పనిని అతని కుమారుడైన సొలొమోనుకు నిర్ణయించి దావీదును అడ్డుకున్నాడు (2 సమూయేలు 7:1-13). కాబట్టి మనం వాక్యానుసారంగానే కార్యాన్ని తలపెట్టినా ఆ కార్యం దేవుడు నిర్ణయించింది కాకుంటే ఆయనే అడ్డుకుంటాడు.
ఆదికాండము 8:12-16 అతడింక మరి యేడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము మొదటినెల తొలిదినమున నీళ్లు భూమి మీదనుండి యింకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. రెండవ నెల యిరువది యేడవ దినమున భూమియెండి యుండెను. అప్పుడు దేవుడు నీవును నీతోకూడ నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలోనుండి బయటికి రండి.
ఈ వచనాల్లో నోవహు మరలా పావురాన్ని విడిచిపెట్టడం అది ఇంక అతనియొద్దకు తిరిగిరాకపోవడం, అతను చూసినప్పుడు నేల అంతా ఆరియుండడం, చివరికి దేవుడు అతని కుటుంబాన్నీ ఓడలో ఉన్న సమస్తాన్నీ బయటకు రమ్మని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. గమనించండి. నేల అంతా ఆరిపోయిందనే విషయం నోవహు తనకు ఉన్న జ్ఞానం, సాధనంతో గ్రహించాడు. అయినప్పటికీ అతను కానీ అతని కుటుంబం కానీ ఓడనుండి బయటకు రాలేదు. ఎందుకంటే వారు ఓడలోకి దేవుని మాటచొప్పున వెళ్ళారు కాబట్టి, మరలా దేవుని మాటచొప్పునే బయటకు రావాలి. ఈవిధంగా మనం కూడా దేవుని మాటయైన వాక్యప్రకారమే నడుచుకోవాలి. అందుకే "ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి" (యెషయా 8:20) అని రాయబడింది.
నోవహూ అతని కుటుంబం ఓడలో నివసించిన కాలం ఒక సంవత్సరం పదిరోజులు. ఆదికాండము 7:11 ప్రకారం; నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరం, రెండవ నెల పదిహేడవ రోజున వారు ఓడలో ప్రవేశించారు. పై వచనాల ప్రకారం అనగా "ఆరువందల ఒకటవ సంవత్సరము రెండవ నెల యిరువది యేడవ దినమున" వారు ఓడ నుండి బయటకు వచ్చారు - ఈమొత్తం సమయం ఒక సంవత్సరం పదిరోజులు.
ఆదికాండము 8:17 పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్తశరీరులలో నీతో కూడనున్న ప్రతిజంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను.
ఈ వచనాలలో దేవుడు ప్రారంభసృష్టిని ఉద్దేశించి పలికినట్టే (ఆదికాండము 1:21,22, ఆదికాండము 1: 27,28) ఇప్పుడు కూడా "మీరు ఫలించి అభివృద్ధి పొందవలెనని" నోవహు కుటుంబంతోనూ ఓడలోని జీవుల విషయంలోనూ పలకడం మనం చూస్తాం. ఒకవిధంగా ఇది నూతన సృష్టి. అందుకే ఆయన అలా పలుకుతున్నాడు.
ఆదికాండము 8:18-20 కాబట్టి నోవహును అతనితో కూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమిమీద సంచరించునవన్నియు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠము మీద దహనబలి అర్పించెను.
ఈ వచనాలలో ఓడలో ప్రవేశించిన జీవులతో సహా నోవహూ అతని కుటుంబం బయటకు రావడం, అప్పుడు నోవహు జలప్రళయం నుండి తమను కాపాడిన దేవునికి కృతజ్ఞతగా బలిని అర్పించడం మనం చూస్తాం. ఇక్కడ నోవహు ఓడనుండి బయటకు రాగానే తనకోసం ఇళ్ళు కట్టుకోవాలని చూడలేదు కానీ మొదటిగా దేవునికి బలిపీఠం కట్టి బలులు అర్పిస్తున్నాడు. దీనిని బట్టి ఒక నిజమైన విశ్వాసి దేవునికే మొదటి ప్రాధాన్యతను ఇస్తాడని మనం గుర్తించాలి. ఈ విషయంలో మనల్ని మనం సరిచేసుకోవాలి.
అదేవిధంగా ఆదికాండము 7:2,3 ప్రకారం; పవిత్ర జంతువులూ పక్షులూ ఏడేసి జతలుచొప్పున ఓడలోకి వెళ్ళాయి. అవి ఓడలో ఉన్న సంవత్సరకాలంలో కొంతమట్టుకు విస్తరించినప్పటికీ వాటి సంఖ్య గతంతో పోలిస్తే అప్పటికి తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ నోవహు అవి విస్తరించాక బలి ఇద్దామని ఆలోచించలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నవన్నీ అతనివే. అయినప్పటికీ తనకు ఉన్న కొంచెంలోనే దేవునికి సమర్పించాడు. ఇది మన సమర్పణా జీవితానికి మంచిమాదిరిగా ఉంది. పైగా అతను ఆ బలిలో పవిత్రజంతువులను మాత్రమే ఉపయోగించడం ద్వారా దేవుడు పెట్టిన క్రమంలోనే ఆయనను ఆరాధిస్తున్నాడు. ఇలాంటి ఆరాధనను మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అందుకే, క్రింది వచనంలో ఆయన నోవహు బలిని అంగీకరించినట్టుగా రాయబడింది.
అలానే లేవీకాండము 1వ అధ్యాయం ప్రకారం; దేవునికి బలిగా అర్పించవలసిన పవిత్రజంతువులు గోవులూ మేకలూ గొర్రెలూ. పక్షుల్లోనైతే పావురాలూ తెల్లగువ్వలూ. నోవహు వాటినే ఇక్కడ అర్పించాడు.
లేఖనాలలో దేవునికి బలి అర్పించబడిన ఏ సందర్భం మనకు కనిపించినా అక్కడ బలిగా అర్పించబడుతుంది ఈ జాబితాకు చెందినవే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ జాబితా తెలియచేసిన వాక్యభాగాలు ధర్మశాస్త్రానికి సంబంధించినవి కదా అంతకు ముందు కూడా అవే అర్పించబడ్డాయని ఎలా చెప్పగలము అనే సందేహానికి ఇక్కడ తావులేదు. ఎందుకంటే బలుల ద్వారా అర్పణల ద్వారా దేవుణ్ణి సేవించడం ప్రారంభమైనప్పుడే ఆయనకు వేటిని అర్పించాలో ఎలా అర్పించాలో కూడా బోధించబడింది. అందుకే హేబెలు తన గొఱ్ఱెల మందనుండి తొలిచూలు పుట్టిన శ్రేష్టమైనవాటిని ఆయనకు దహనబలిగా అర్పిస్తాడు (ఆదికాండము 4:4).
ఆదికాండము 8:21 అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను.
ఈ వచనాలలో దేవుడు నోవహు అర్పించిన బలిలో సువాసన ఆఘ్రాణించినట్లుగా మనం చూస్తాం. ఈ అలంకారం ఆయన అంగీకారాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఆత్మయైన దేవునికి ఊపిరి తీసుకునే ముక్కు ఉండదు. కాబట్టి దేవుడు సువాసనను నాఘ్రాణించాడు అనంటే ఆ బలిని ఆయన అంగీకరించాడని అర్థం. ఇలాంటి అలంకార పదప్రయోగం లేవీకాండములోని బలుల క్రమంలో పదేపదే ఉపయోగించబడుతుంది. ఆ సందర్భాలను మనం పరిశీలించినప్పుడు దేవుడు ఆ బలిని అంగీకరించాడు లేక అంగీకరించేలా అనే భావమే వస్తుంది. అందుకే ఇశ్రాయేలీయులు ఒకవైపు ఆయన దృష్టికి పాపంచేస్తూ మరోవైపు వారు అర్పిస్తున్న బలులను బట్టి ఆయన అసహ్యపడినట్టుగా (చెడ్డవాసనగా భావించినట్టుగా) కూడా రాయబడింది (యెషయా 1: 13).
ఎందుకంటే దేవుడు వాటిని తిరస్కరించాడు. ఆ భావంలోనే ఆయన అక్కడ "అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము" అని పలుకుతున్నాడు. కాబట్టి, దేవుడు సువాసనను నాఘ్రాణించాడు అన్నప్పుడు (లేవీకాండము 2:12, 4:31, 6:21, సంఖ్యాకాండము 15:24) అది జంతువులను కాల్చిప్పుడు వచ్చే వాసన గురించి కాదని, దేవుడు ఆ బలిని అంగీకరించాడు అనేభావంలో అలంకారంగా ఆ పదప్రయోగం చెయ్యబడిందని తెలియచేస్తున్నాను.
"ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను"
కొందరు దేవుడు పలికిన ఈమాటలను అప్పటినుండి ఆయన నరుల పాపంతో రాజీపడిపోయాడని భావిస్తుంటారు. కానీ ఆ మాటలు ఆయన దీర్ఘశాంతాన్ని సూచిస్తూ వాడబడ్డాయి. ఎందుకంటే ఆయన నోవహుతో చేసిన కృపగల నిబంధన ప్రకారం (ఆదికాండము 6:18, 9:11) ఆయన మరలా జలప్రళయంతో అందరినీ నాశనం చెయ్యడు. అంతేతప్ప ఆయన పాపంతో రాజీపడలేదు. ఆయన అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ పాపాన్ని సహించలేని పరిశుద్ధుడు. అందుకే "నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా" (హబక్కూకు 1:13) అని రాయబడింది. కాబట్టి ఆమాటలు ఆయన దీర్ఘశాంతాన్ని సూచిస్తున్నాయి.
ఆదికాండము 8:22 భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీతకాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.
ఈ వచనాలలో దేవుడు తాను భూమిపై నియమించిన కాలాలలో కానీ రాత్రింపగళ్ళలో కానీ ఎలాంటి మార్పూ లేకుండా భూమి ఉన్నంతకాలం కొనసాగుతాయని అనుకోవడం మనం చూస్తాం. "అనుకోవడం" అంటే ఆయనేదో కొత్తగా అనుకుంటున్నాడని కాదు కానీ ఈ మాట ఆయన నిర్ణయాన్ని సూచిస్తుంది. అంటే మనిషి పాపాన్ని బట్టి ఆయన వాటిని మార్చడు అని అర్థం. అందుకే "యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగిన యెడల" (యిర్మియా 33:20) అని రాయబడింది.
అలానే ఆయన ఈ భూమి నిలిచియున్నంతకాలమని ప్రస్తావించడం వల్ల, ఈ భూమి శాశ్వతంగా నిలిచియుండదని స్పష్టంగా అర్థమౌతుంది. క్రీస్తు రాకతో దీని అంతం ముడిపడియుంది (2 పేతురు 3:10).
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 8
8:1, 8:2, 8:3, 8:4, 8:5, 8:6,7, 8:8-11, 8:12-16, 8:17, 8:18-20, 8:21, 8:22
ఆదికాండము 8:1 దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.
ఈ వచనంలో దేవుడు నోవహునూ ఓడలో ఉన్న సమస్తాన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. వాస్తవానికి దేవునికి మనలా ఏదో జ్ఞాపకం చేసుకునే అవసరం ఉండదు. మరి ఈమాటలకు అర్థం ఏంటంటే; ఆయన కాపుదలనూ సహాయాన్నీ శ్రమలనుండి విడుదలనూ సూచిస్తూ ఇలాంటి పదప్రయోగం చెయ్యబడింది. ఉదాహరణకు; (ఆదికాండము 30:22, నిర్గమకాండము 2:23-25) దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 2:23-25 వ్యాఖ్యానం చూడండి).
కాబట్టి ఈ సందర్భంలో దేవుడు నోవహునూ అతనితో ఉన్న సమస్తాన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు అనంటే ఇప్పుడు వారు ఓడనుండి బయటకువచ్చే మార్గం సిద్ధపరుస్తున్నాడని అర్థం. అందుకే తర్వాత మాటల్లో "దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను" అని రాయబడింది.
అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్న సమస్తమూ ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంది. అందులో గాలి ఒకటి (కీర్తనలు 135:7, నిర్గమకాండము 14:21,22, 10:13).
ఆదికాండము 8:2 అగాధజలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను; ఆకాశమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను.
ఈ వచనంలో అగాధజలాల ఊటలూ ఆకాశపు తూములూ మూయబడినట్టు ఆకాశమునుండి కురుస్తున్న ప్రచండ వర్షం నిలిచిపోయినట్టు మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పటికే దేవుడు నిర్ణయించిన 40 పగళ్ళు, 40 రాత్రులూ గడచిపోయి ఓడలో ఉన్న నోవహు కుటుంబం జీవరాశులూ తప్ప ఊపిరి తీసుకునే జీవులన్నీ చనిపోయాయి. అప్పటినుంచే ఆయన వాయువును విసిరింపచేసి నీటిని తగ్గించే కార్యాన్ని ప్రారంభిస్తున్నాడు
ఆదికాండము 8:3 అప్పుడు నీళ్లు భూమిమీదనుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను; నూట ఏబది దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా-
ఈ వచనంలో జలప్రళయం ప్రారంభమైన రోజునుండి 150 రోజుల తర్వాత ఈ భూమిపై నుండి నీరు క్రమక్రమంగా తగ్గిపోయినట్టు మనం చూస్తాం. ఇక్కడ దేవుని సార్వభౌమ నిర్ణయాన్ని మనం స్పష్టంగా గమనిస్తున్నాం. ఎలాగంటే ఆదికాండము 1:6 ప్రకారం; ఈ సృష్టి అంతా నీటితో నింపబడియున్నప్పుడు ఆయన కొంతసేపటికే ఆ నీరు అంతటినీ వేరుచేసి, విశాలాన్ని (ఆకాశాన్ని) చేసాడు. 9వ వచనం ప్రకారం; ఈ భూమిపై ఉన్న నీరు అంతటినీ సముద్రాలుగా ప్రత్యేకించి మిగిలిన భూమిని ఆరిననేలగా చేసాడు. అయితే ఈ జలప్రళయ సంఘటనలో మాత్రం, ఆయన వెంటనే నీటిని తొలగించకుండా గాలిద్వారా దానిని మెళ్ళిమెళ్ళిగా తగ్గిస్తున్నాడు. ఆవిధంగా ఈ నీరు మొత్తం తొలగిపోయి, నోవహు కుటుంబం ఓడ నుండి బయటకు రావడానికి ఒక సంవత్సరం పదిరోజుల సమయం పట్టింది (ఆ వివరాలు ముందు చూద్దాం).
కాబట్టి దేవుడు ఏపనినైనా తన సార్వభౌమ నిర్ణయం చొప్పున ఎంత సమయంలో చెయ్యాలి అనుకుంటాడో అంత సమయంలోనే దానిని చేస్తాడు. మన ప్రార్థనల విషయంలో కూడా ఆయన ఇలానే తన సార్వభౌమచిత్త ప్రకారమే స్పందిస్తాడని మనం గుర్తుంచుకోవాలి. మనం తొందరపడుతున్నామని తొందరపడవలసిన అవసరం ఆయనకు ఉండదు. నోవహుకు కూడా ఆ ఓడ నుండి ఎప్పుడు బయటకు వద్దామా అని లేకుంటుందా? ఆ విషయంలో అతను ప్రార్థించకుండా ఉండుంటాడా?
అలానే దేవుడు ఏ కార్యాన్నైనా అద్భుతకరంగా (Super Natural) చెయ్యగలడు. సహజత్వంగా కూడా చెయ్యగలడు. సృష్టి ప్రారంభంలో ఆయన ఈ భూమిపై ఉన్న నీటిని అద్భుతకరంగా వేరు చేసాడు. ఈ జలప్రళయ సంఘటనలో మాత్రం సహజత్వంగా (గాలి ద్వారా) నీటిని ఆరిపోచేస్తున్నాడు. కాబట్టి తన పిల్లలకు ఏవిధమైన కార్యం చెయ్యాలని ఆయన నిర్ణయిస్తాడో దాని ప్రకారమే జరిగిస్తాడు. ఈమాటలు ఎందుకు చెబుతున్నానంటే మన జీవితంలో అద్భుతకరంగా జరిగితే మాత్రమే అది దేవుని సహాయం కాదు. మనకు సహాయం ఏ రూపంలో అందినా అది దేవుని నుండే.
అదేవిధంగా జలప్రళయం సంభవించిన 40 రోజులు గడచిన వెంటనే ఆయన ఈ భూమిని ఆరిపోయేలా చేస్తే నోవహు కుటుంబం కూడా ఓడనుండి బయటకు వచ్చి ఓడలో వారు చెయ్యవలసిన పనినుండి విశ్రాంతి పొందేవారు. కానీ దేవుడు అలా చెయ్యలేదు, వారు ఆ పని చాలా నెలలు చేస్తూనే ఉండేలా వారిని అందులోనే ఉంచి వేసాడు. దీనినిబట్టి, దేవుడు మనపై ఎక్కువ సమయం పని మోపుతున్నప్పుడు దానిని మనం భారంగా భావించకూడదు కానీ అది మన బాధ్యతగా మనకు మరి ఎక్కువ ప్రతిఫలాన్ని ఇచ్చేదిగానే గుర్తించాలి. నోవహు ఆ విధంగా గుర్తించే ఓడలో పనిచేసాడు. ఒకవేళ నోవహు కుటుంబం 40 రోజులకే ఓడ నుండి బయటపడితే వారు మిగిలిన 110 రోజుల ఓడ అనుభవం అనగా అద్భుతమైన రీతిలో వారిపై నిలిచిన దేవుని కాపుదలను అనుభవించియుండేవారు కాదు. అయితే ఒకటిమాత్రం మనం ఎప్పుడూ మరచిపోకూడదు, దేవుడు మనకు అసాధ్యమైన పని మనపై ఎప్పుడూ మోపడు. అందుకే కదా ఆయన నోవహు తీసుకురాలేని జీవులన్నీ వాటంతట అవే ఓడలోకి వచ్చేలా అద్భుతాన్ని చేసాడు.
ఆదికాండము 8:4 ఏడవ నెల పదియేడవ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను.
ఈ వచనంలో నోవహు ఓడ ఆరారాతు కొండలమీద నిలచినట్టు మనం చూస్తాం. టర్కీ దేశంలోని ఈ పర్వతాలలో కొందరు నోవహు ఓడను గుర్తించి ఆ ప్రాంతంలో "Noah Ark" అనే పార్కును కూడా నిర్మించినట్టు బైబిల్ పండితులు తెలియచేస్తున్నారు. ఇది బైబిల్ లోని నోవహు, జలప్రళయాల చరిత్ర వాస్తవమనేందుకు కచ్చితమైన ఆధారం. ఎందుకంటే ఆ పర్వతంపై ఉండే అగ్ని పర్వతాలు ప్రేలడం వల్ల ఆ లావాకు క్రిందకు కొట్టుకు వచ్చి భూమిలో కూరుకుపోయిన ఆ ఓడ యొక్క శిథిలాలను పరిశీలించినవారు, 6వ అధ్యాయంలో రాయబడిన ఓడ కొలతలతో దానిని పోల్చి అది నోవహు ఓడయే అని కచ్చితంగా చెబుతున్నారు. అధునిక పరీక్షలను నిర్వహించి మరీ ఆ విషయం నిర్ధారిస్తున్నారు. అయితే ఈ విషయంలో మరికొందరు 99.9% వరకే ఆ అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు (ఈ వివరాలను మీరు Google చెయ్యవచ్చు).
అయితే మొదటి శతాబ్దపు చరిత్రకారులకు మాత్రం ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే యూదా చరిత్రకారుడైన "ఫ్లేవియస్ జోసెఫెస్" తాను రాసిన "The Antiquities of The Jews" అనే పుస్తకం మొదటిభాగం, మూడవ అధ్యాయం ఐదు, ఆరు వచనాలలో నోవహు ఓడ నిలిచిన పర్వతం, అర్మేనియా దేశంలో ఉందని, ఆ దేశంలోని ప్రజలందరూ ఆ పర్వతాన్ని Apobarērion అని పిలిచేవారని తెలియచేసాడు. ఈ పేరుకు క్రిందకు దిగిరావడం అని అర్థం. నోవహు కుటుంబం ఆ పర్వతం పై నిలచిన ఓడనుండి క్రిందకు దిగివచ్చారు కాబట్టి, ఆ దేశపు ప్రజలు ఆ పర్వతాన్ని ఆ పేరుతో పిలిచేవారంట. దీనినిబట్టి జోసెఫెస్ జీవించిన కాలానికి (మొదటిశతాబ్దం), ఆ ఓడ శిథిలాలు ఎక్కడ ఉన్నాయో ఆయనకు కచ్చితంగా తెలుసని మనకు అర్థమౌతుంది. ఈ అర్మేనియా దేశమే ప్రస్తుతం టర్కీ దేశంగా పిలవబడుతుంది. దీనిప్రకారం ప్రస్తుతం టర్కీదేశంలోని పర్వతంపైన లభించిన ఓడ శిథిలాలు నోవహు ఓడవే అనడంలో మనకూ సందేహం లేదు.
జోసెఫెస్ కూడా కేవలం తన పరిశీలన ఆధారంగా మాత్రమే ఈ మాటలు రాయలేదు. బబులోను చరిత్రకారుడైన Berosus, ఈజిప్టు చరిత్రకారుడైన Hieronymus, ధమస్కు చరిత్రకారుడైన Nicolas చెప్పినవాటి వివరాలను కూడా అతను ప్రస్తావించాడు. ఆ ముగ్గురు కూడా నోవహు ఓడ అదే ప్రాంతంలో ఉందని, అక్కడి ప్రజలు కొందరు ఆ ఓడ శిథిలాలు కొన్నిటిని చిన్న ముక్కలుగా చేసి రక్షరేకులుగా మెడలో వేసుకునేవారని తమ పుస్తకాల్లో రాసారట.
ఆదికాండము 8:5 నీళ్లు పదియవ నెలవరకు క్రమముగా తగ్గుచువచ్చెను. పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను.
4వ వచనంలో నోవహు ఓడ ఆరారాతు పర్వతం పైన నిలిచినట్టుగా మనం చూసాం. అప్పటికి ఆ పర్వతం కూడా నీటిలోనే మునిగి ఉంది. ఎందుకంటే ఓడ అమరం నీటిలోనే ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో ఆ అమరానికి ఏదైనా మెరక తగిలినప్పుడు అది ఎటూ కదలకుండా నిలచిపోతుంది. అందుకే నోవహు ఓడ ఆరారాతు పర్వతంపై అలా నిలచిపోయింది. అది ఏడవ నెల పదిహేడవ రోజున జరిగితే పదవనెల మొదటిరోజుకు ఆ కొండల శిఖరాలు కనపడ్డాయి. అప్పటివరకూ (74 రోజులు) నోవహు ఆరారాతు పర్వతంపై నిలచిపోయిన ఓడలోనే ఎదురుచూస్తున్నాడు.
ఆదికాండము 8:6,7 నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడకిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవువరకు ఇటు అటు తిరుగుచుండెను.
ఈ వచనాలలో నోవహు భూమిపై నీరు ఇంకిపోయాయో లేదో తెలుసుకోవడానికి ఒక కాకిని పంపినట్టు మనం చూస్తాం. కానీ అది నోవహుకు ఎలాంటి సమాచారం తీసుకురాకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంది. సాధారణంగా కాకులు చనిపోయిన కళేబరాలను ఇష్టంగా తింటూ ఉంటాయి, ఈ కాకి కూడా జలప్రళయంలో చనిపోయిన వారి/వాటి కళేబరాలు నీటిలో తేలుతూ ఉండడం చూసి వాటిని తినే ఆసక్తితో నోవహు యొద్దకు రాకుండిందేమో.
ఆదికాండము 8:8-11 మరియు నీళ్లు నేల మీదనుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తనయొద్ద నుండి నల్లపావురమొకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీదనున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతనియొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాని పట్టుకొని ఓడలోనికి తీసికొనెను. అతడు మరి యేడు దినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను.
ఈ వచనాలలో నోవహు ఒక పావురాన్ని రెండుసార్లు బయటకు పంపినప్పుడు, రెండవసారి అది అతనిదగ్గరకు నీరు తగ్గిపోయిందనే సమాచారం తీసుకువచ్చినట్టు మనం చూస్తాం. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. దేవుడు నోవహుతో జలప్రళయం ఎన్ని రోజుల్లో వస్తుందో ఎంతకాలం వర్షం కురుస్తుందో తెలియచేసాడు కానీ ఆ నీరు ఎంతకాలానికి తగ్గుతుందో మాత్రం తెలియచెయ్యలేదు. అందుకే నోవహు అది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మొదట కాకినీ తర్వాత రెండుసార్లు పావురాన్నీ బయటకు పంపించాడు.
ఈ మాదిరిని బట్టి మనకున్న జ్ఞానంతో సాధనాలతో మనం తెలుసుకోగలిగే (చెయ్యగలిగే) వాటిని మనమే తెలుసుకునే (చేసే) ప్రయత్నం చెయ్యాలి. వాటిని కూడా దేవుడే ప్రత్యేకంగా తెలియచేస్తాడని (చేయిస్తాడని) భావించకూడదు అది సోమరితనం ఔతుంది. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే నేటికాలంలో చాలామంది విశ్వాసులూ బోధకులూ మనం చేసేది వాక్యానుసారమా కాదా అనేది పరీక్షించుకుని, తమకున్న జ్ఞానం, వనరులతో ప్రార్థనా పూర్వకంగా కార్యాలను తలపెట్టకుండా వాటి విషయంలో కూడా దేవుడు ప్రత్యేకంగా బోధిస్తాడంటూ (దర్శనాలు ఇస్తాడంటూ) ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా వివాహం, చదువు వంటి విషయాలలో.
ప్రత్యక్షతలు ఉన్నకాలంలోనే నోవహు తాను స్వతహాగా తెలుసుకోగలిగిన విషయానికై, ప్రత్యక్షత కోసం ఎదురుచూడకుండా కార్యాన్ని తలపెట్టినప్పుడు, వాక్య ప్రత్యక్షత సంపూర్ణం చెయ్యబడిన తర్వాత కూడా దేవుడు కలలోకి వచ్చో సూచనలు చూపించో తెలియచేస్తాడని భావించడం మూఢత్వం ఔతుంది. కాబట్టి మనం వాక్యమనే కొలమానంతో అన్నిటినీ పరీక్షించుకుంటూ మనకున్న జ్ఞానంతో వనరులతో ప్రార్థనాపూర్వకంగా చెయ్యాలనుకున్న కార్యాలను ప్రారంభించాలి. ఒకవేళ అడ్డగించాలి అనుకుంటే దేవుడే అడ్డగిస్తాడు. ఉదాహరణకు; దావీదు దేవునిపట్ల ఆసక్తితో మందిరం కట్టాలి అనుకున్నాడు. కానీ దేవుడు ఆ పనిని అతని కుమారుడైన సొలొమోనుకు నిర్ణయించి దావీదును అడ్డుకున్నాడు (2 సమూయేలు 7:1-13). కాబట్టి మనం వాక్యానుసారంగానే కార్యాన్ని తలపెట్టినా ఆ కార్యం దేవుడు నిర్ణయించింది కాకుంటే ఆయనే అడ్డుకుంటాడు.
ఆదికాండము 8:12-16 అతడింక మరి యేడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము మొదటినెల తొలిదినమున నీళ్లు భూమి మీదనుండి యింకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. రెండవ నెల యిరువది యేడవ దినమున భూమియెండి యుండెను. అప్పుడు దేవుడు నీవును నీతోకూడ నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలోనుండి బయటికి రండి.
ఈ వచనాల్లో నోవహు మరలా పావురాన్ని విడిచిపెట్టడం అది ఇంక అతనియొద్దకు తిరిగిరాకపోవడం, అతను చూసినప్పుడు నేల అంతా ఆరియుండడం, చివరికి దేవుడు అతని కుటుంబాన్నీ ఓడలో ఉన్న సమస్తాన్నీ బయటకు రమ్మని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. గమనించండి. నేల అంతా ఆరిపోయిందనే విషయం నోవహు తనకు ఉన్న జ్ఞానం, సాధనంతో గ్రహించాడు. అయినప్పటికీ అతను కానీ అతని కుటుంబం కానీ ఓడనుండి బయటకు రాలేదు. ఎందుకంటే వారు ఓడలోకి దేవుని మాటచొప్పున వెళ్ళారు కాబట్టి, మరలా దేవుని మాటచొప్పునే బయటకు రావాలి. ఈవిధంగా మనం కూడా దేవుని మాటయైన వాక్యప్రకారమే నడుచుకోవాలి. అందుకే "ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి" (యెషయా 8:20) అని రాయబడింది.
నోవహూ అతని కుటుంబం ఓడలో నివసించిన కాలం ఒక సంవత్సరం పదిరోజులు. ఆదికాండము 7:11 ప్రకారం; నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరం, రెండవ నెల పదిహేడవ రోజున వారు ఓడలో ప్రవేశించారు. పై వచనాల ప్రకారం అనగా "ఆరువందల ఒకటవ సంవత్సరము రెండవ నెల యిరువది యేడవ దినమున" వారు ఓడ నుండి బయటకు వచ్చారు - ఈమొత్తం సమయం ఒక సంవత్సరం పదిరోజులు.
ఆదికాండము 8:17 పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్తశరీరులలో నీతో కూడనున్న ప్రతిజంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను.
ఈ వచనాలలో దేవుడు ప్రారంభసృష్టిని ఉద్దేశించి పలికినట్టే (ఆదికాండము 1:21,22, ఆదికాండము 1: 27,28) ఇప్పుడు కూడా "మీరు ఫలించి అభివృద్ధి పొందవలెనని" నోవహు కుటుంబంతోనూ ఓడలోని జీవుల విషయంలోనూ పలకడం మనం చూస్తాం. ఒకవిధంగా ఇది నూతన సృష్టి. అందుకే ఆయన అలా పలుకుతున్నాడు.
ఆదికాండము 8:18-20 కాబట్టి నోవహును అతనితో కూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమిమీద సంచరించునవన్నియు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠము మీద దహనబలి అర్పించెను.
ఈ వచనాలలో ఓడలో ప్రవేశించిన జీవులతో సహా నోవహూ అతని కుటుంబం బయటకు రావడం, అప్పుడు నోవహు జలప్రళయం నుండి తమను కాపాడిన దేవునికి కృతజ్ఞతగా బలిని అర్పించడం మనం చూస్తాం. ఇక్కడ నోవహు ఓడనుండి బయటకు రాగానే తనకోసం ఇళ్ళు కట్టుకోవాలని చూడలేదు కానీ మొదటిగా దేవునికి బలిపీఠం కట్టి బలులు అర్పిస్తున్నాడు. దీనిని బట్టి ఒక నిజమైన విశ్వాసి దేవునికే మొదటి ప్రాధాన్యతను ఇస్తాడని మనం గుర్తించాలి. ఈ విషయంలో మనల్ని మనం సరిచేసుకోవాలి.
అదేవిధంగా ఆదికాండము 7:2,3 ప్రకారం; పవిత్ర జంతువులూ పక్షులూ ఏడేసి జతలుచొప్పున ఓడలోకి వెళ్ళాయి. అవి ఓడలో ఉన్న సంవత్సరకాలంలో కొంతమట్టుకు విస్తరించినప్పటికీ వాటి సంఖ్య గతంతో పోలిస్తే అప్పటికి తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ నోవహు అవి విస్తరించాక బలి ఇద్దామని ఆలోచించలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నవన్నీ అతనివే. అయినప్పటికీ తనకు ఉన్న కొంచెంలోనే దేవునికి సమర్పించాడు. ఇది మన సమర్పణా జీవితానికి మంచిమాదిరిగా ఉంది. పైగా అతను ఆ బలిలో పవిత్రజంతువులను మాత్రమే ఉపయోగించడం ద్వారా దేవుడు పెట్టిన క్రమంలోనే ఆయనను ఆరాధిస్తున్నాడు. ఇలాంటి ఆరాధనను మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అందుకే, క్రింది వచనంలో ఆయన నోవహు బలిని అంగీకరించినట్టుగా రాయబడింది.
అలానే లేవీకాండము 1వ అధ్యాయం ప్రకారం; దేవునికి బలిగా అర్పించవలసిన పవిత్రజంతువులు గోవులూ మేకలూ గొర్రెలూ. పక్షుల్లోనైతే పావురాలూ తెల్లగువ్వలూ. నోవహు వాటినే ఇక్కడ అర్పించాడు.
లేఖనాలలో దేవునికి బలి అర్పించబడిన ఏ సందర్భం మనకు కనిపించినా అక్కడ బలిగా అర్పించబడుతుంది ఈ జాబితాకు చెందినవే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ జాబితా తెలియచేసిన వాక్యభాగాలు ధర్మశాస్త్రానికి సంబంధించినవి కదా అంతకు ముందు కూడా అవే అర్పించబడ్డాయని ఎలా చెప్పగలము అనే సందేహానికి ఇక్కడ తావులేదు. ఎందుకంటే బలుల ద్వారా అర్పణల ద్వారా దేవుణ్ణి సేవించడం ప్రారంభమైనప్పుడే ఆయనకు వేటిని అర్పించాలో ఎలా అర్పించాలో కూడా బోధించబడింది. అందుకే హేబెలు తన గొఱ్ఱెల మందనుండి తొలిచూలు పుట్టిన శ్రేష్టమైనవాటిని ఆయనకు దహనబలిగా అర్పిస్తాడు (ఆదికాండము 4:4).
ఆదికాండము 8:21 అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను.
ఈ వచనాలలో దేవుడు నోవహు అర్పించిన బలిలో సువాసన ఆఘ్రాణించినట్లుగా మనం చూస్తాం. ఈ అలంకారం ఆయన అంగీకారాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఆత్మయైన దేవునికి ఊపిరి తీసుకునే ముక్కు ఉండదు. కాబట్టి దేవుడు సువాసనను నాఘ్రాణించాడు అనంటే ఆ బలిని ఆయన అంగీకరించాడని అర్థం. ఇలాంటి అలంకార పదప్రయోగం లేవీకాండములోని బలుల క్రమంలో పదేపదే ఉపయోగించబడుతుంది. ఆ సందర్భాలను మనం పరిశీలించినప్పుడు దేవుడు ఆ బలిని అంగీకరించాడు లేక అంగీకరించేలా అనే భావమే వస్తుంది. అందుకే ఇశ్రాయేలీయులు ఒకవైపు ఆయన దృష్టికి పాపంచేస్తూ మరోవైపు వారు అర్పిస్తున్న బలులను బట్టి ఆయన అసహ్యపడినట్టుగా (చెడ్డవాసనగా భావించినట్టుగా) కూడా రాయబడింది (యెషయా 1: 13).
ఎందుకంటే దేవుడు వాటిని తిరస్కరించాడు. ఆ భావంలోనే ఆయన అక్కడ "అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము" అని పలుకుతున్నాడు. కాబట్టి, దేవుడు సువాసనను నాఘ్రాణించాడు అన్నప్పుడు (లేవీకాండము 2:12, 4:31, 6:21, సంఖ్యాకాండము 15:24) అది జంతువులను కాల్చిప్పుడు వచ్చే వాసన గురించి కాదని, దేవుడు ఆ బలిని అంగీకరించాడు అనేభావంలో అలంకారంగా ఆ పదప్రయోగం చెయ్యబడిందని తెలియచేస్తున్నాను.
"ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను"
కొందరు దేవుడు పలికిన ఈమాటలను అప్పటినుండి ఆయన నరుల పాపంతో రాజీపడిపోయాడని భావిస్తుంటారు. కానీ ఆ మాటలు ఆయన దీర్ఘశాంతాన్ని సూచిస్తూ వాడబడ్డాయి. ఎందుకంటే ఆయన నోవహుతో చేసిన కృపగల నిబంధన ప్రకారం (ఆదికాండము 6:18, 9:11) ఆయన మరలా జలప్రళయంతో అందరినీ నాశనం చెయ్యడు. అంతేతప్ప ఆయన పాపంతో రాజీపడలేదు. ఆయన అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ పాపాన్ని సహించలేని పరిశుద్ధుడు. అందుకే "నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా" (హబక్కూకు 1:13) అని రాయబడింది. కాబట్టి ఆమాటలు ఆయన దీర్ఘశాంతాన్ని సూచిస్తున్నాయి.
ఆదికాండము 8:22 భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీతకాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.
ఈ వచనాలలో దేవుడు తాను భూమిపై నియమించిన కాలాలలో కానీ రాత్రింపగళ్ళలో కానీ ఎలాంటి మార్పూ లేకుండా భూమి ఉన్నంతకాలం కొనసాగుతాయని అనుకోవడం మనం చూస్తాం. "అనుకోవడం" అంటే ఆయనేదో కొత్తగా అనుకుంటున్నాడని కాదు కానీ ఈ మాట ఆయన నిర్ణయాన్ని సూచిస్తుంది. అంటే మనిషి పాపాన్ని బట్టి ఆయన వాటిని మార్చడు అని అర్థం. అందుకే "యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగిన యెడల" (యిర్మియా 33:20) అని రాయబడింది.
అలానే ఆయన ఈ భూమి నిలిచియున్నంతకాలమని ప్రస్తావించడం వల్ల, ఈ భూమి శాశ్వతంగా నిలిచియుండదని స్పష్టంగా అర్థమౌతుంది. క్రీస్తు రాకతో దీని అంతం ముడిపడియుంది (2 పేతురు 3:10).
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Add comment