30:1, 30:2, 30:3, 4, 30:5-8, 30:9-13, 30:14, 30:15,16, 30:17, 30:18, 30:19-21, 30:22, 30:23,24, 30:25,26, 30:27, 28, 30:29,30, 30:31-34, 30:35,36, 30:37-42, 30:43
ఆదికాండము 30:1 రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము. లేనియెడల నేను చచ్చెదననెను.
ఈ వచనంలో రాహేలు తన అక్కపై అసూయతో యాకోబును విసిగిస్తూ మాట్లాడడం మనం చూస్తాం. యాకోబు మొదటినుండీ తన అక్కకంటే ఈమెనే ఎక్కువగా ప్రేమించాడు. ఆ ప్రేమలో లేయాకు దక్కని ప్రయోజనాలెన్నో ఈమె పొందుంటుంది. కానీ లేయాకు కలిగిన సంతానం మాత్రం ఈమెకు కలగలేదు. ఎందుకంటే అది యాకోబు చేతుల్లో కాదు దేవునిచేతిలో ఉంటుంది. అయితే ఆ విషయంలో ఈమె దేవునిపై ఆధారపడకుండా చస్తానంటూ భర్తను విసిగిస్తుంది. ఇక్కడ రాహేలు యొక్క ప్రవర్తన దేవుణ్ణి ఎరిగిన విశ్వాసురాలిగా కనిపించట్లేదు. ఒక విశ్వాసురాలు అసూయపడదు, చస్తానంటూ బెదరింపులకు పాల్పడదు. గర్భఫలం నిమిత్తం తన భర్తను విసిగించకుండా సమూయేలు తల్లియైన హన్నావలే దేవునిపై ఆధారపడుతుంది.
ఆదికాండము 30:2 యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అనెను.
ఈ వచనంలో రాహేలు విసిగింపుకు యాకోబు ప్రతిస్పందన మనం చూస్తాం. అందులో దేవునిపై అతనికున్న ఉన్న విశ్వాసం బయలుపడుతుంది. ఎందుకంటే; సాధారణంగా మన జీవితాలలో మంచి జరిగితే దేవుడు చేసాడని, మంచి జరగకపోతే సాతాను అడ్డగిస్తున్నాడని భావిస్తుంటాము, అది వాస్తవం కాదు. విశ్వాసి జీవితంలో జరిగే ప్రతిదీ దేవుని చిత్తప్రకారంగానే జరుగుతుంది. అంటే మనకు ఇచ్చేదీ దేవుడే ఇవ్వకుండా ఉండేది కూడా దేవుడే. అందుకే "మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును బయలు వెళ్లునుగదా?" (విలాపవాక్యములు 3:38) అని రాయబడింది. యాకోబు దీనినే అర్థం చేసుకుని "నీకు గర్భఫలం ఇవ్వకుండా ఉన్న దేవుని స్థానంలో నేనున్నానా" అంటూ అది తన పరిధిలో లేని విషయమని రాహేలుకు బుద్ధి చెబుతున్నాడు. మరోవిధంగా దేవునిపై ఆధారపడమని బోధిస్తున్నాడు.
అలానే మన సమాజంలో తల్లిదండ్రులను దైవాలుగా భావించే మూఢనమ్మకం చోటుచేసుకుంది. ప్రధానంగా తల్లిని మించిన దైవం లేదనే రాతలూ మాటలూ ప్రతీచోటా దర్శనమిస్తుంటాయి (చదువుకునే పాఠశాలల్లో సహా). కానీ పిల్లల్ని కనడంలో తల్లిదండ్రులు దేవుని సాధనాలే తప్ప దైవాలు కాదు, ఎవరైనా అలా అతిశయిస్తుంటే వారు దేవుని మహిమను దొంగిలించే దుర్మార్గులు ఔతారు, ఇది సాతాను పుట్టించిన భావజాలం. ఎందుకంటే దేవునితో సమానంగా ఉండాలనే దుర్బుద్ధితో పరలోకం నుండి పడడ్రోయబడింది వాడే (యెషయా 14:12-15).
పిల్లలను కనడం తల్లితండ్రుల పరిధిలోని విషయమే ఐతే ఎంతోమంది పిల్లలు లేకుండానే ఎందుకు ఉండిపోతున్నారు? వారు దైవాలే ఐతే అంగవైకల్యం కలిగిన పిల్లలకు ఎలా జన్మనిస్తున్నారు? ఈ అవగాహన విశ్వాసికి ఉండి, దేవుని మహిమను దొంగిలించే పనిని అతను ఎప్పుడూ చెయ్యలేడు. అందుకే యాకోబు "నేను దేవునికి ప్రతిగా ఉన్నానా" అంటూ ప్రత్యుత్తరమిస్తున్నాడు. ఇదే లక్షణం తన కుమారుడైన యోసేపులో కూడా మనకు కనిపిస్తుంది (ఆదికాండము 50:19).
అదేవిధంగా యాకోబుకు రాహేలుపై కోపం రగులుకున్నట్టు మనం చూస్తాం. అతను ఆమెను ఎంతో గాఢంగా ప్రేమించి దాస్యత్వం చెయ్యడానికి కూడా సిద్ధపడ్డాడు. అంతగా ప్రేమించిన అతనికి ఆ భార్య ఒక అవిశ్వాసురాలిలా మాట్లాడేసరికి కోపం రగులుకుంది. కాబట్టి నిజమైన ప్రేమలో తప్పు చేసిన వ్యక్తిని కోపంతో సరిచేసే నైతికబాధ్యత ఉంటుందని గుర్తుంచుకోవాలి, ఆ లక్షణం లేకపోతే అది ప్రేమేకాదు. ఎందుకంటే ప్రేమ అవతలివారి క్షేమం కోరుకుంటుంది కాబట్టి, వారు తప్పు చేస్తున్నప్పుడు దానివల్ల ఏదైనా ప్రమాదం తెచ్చుకుంటారనే ఆందోళనతో కోపం కూడా కలుగుతుంది. కానీ చాలామంది తాము ప్రేమించేవారు ఏదైనా తప్పు చేసేసరికి ఏదో తెలియక చేసారులే ఆవేశంలో చేసారులే అంటూ సమర్థించుకుంటారు. అలా చెయ్యడం వారి జీవితానికే పెనుప్రమాదం తెచ్చిపెడుతుంది. అందుకే యోబు కూడా తన భార్య అన్నీ నష్టపోయిన ఆవేదనలో మాట్లాడినప్పటికీ ఆమెకు బుద్ధి చెప్పాడు (యోబు 2:9,10) కాబట్టి తప్పు చేస్తున్నవారిని (తీవ్రతను బట్టి) కఠినంగానే గద్దించాలి.
ఆదికాండము 30:3,4 అందుకామె నా దాసియైన బిల్హా ఉన్నది గదా. ఆమెతో పొమ్ము. ఆమె నా కొరకు పిల్లలను కనును. ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా-
ఈ వచనంలో రాహేలు తన దాసిద్వారా పిల్లలను కనాలనే ఉద్దేశంతో యాకోబుకు ఆమెను భార్యగా ఇవ్వడం మనం చూస్తాం. దాసి పిల్లలను తన పిల్లలుగా భావించడానికి సిద్ధపడిన రాహేలు స్వంత అక్క కన్నటువంటి పిల్లలను మాత్రం తన పిల్లలుగా భావించలేకపోయింది. అదేవిధంగా ఆకాలంలో పిల్లలు పుట్టనప్పుడు తమ దాసిల ద్వారా పిల్లలను కనే సాంప్రదాయం ఉండేది, అబ్రాహాము విషయంలో కూడా మనం దీనిని చూసాం. ఇక్కడ యాకోబు కూడా ఆ పద్ధతిని దృష్టిలో పెట్టుకుని తన భార్య మాటకు సమ్మతించాడు. అయితే బాగా గుర్తుంచుకోండి; ఇదంతా అతను దేవునిమాట ప్రకారంగా చెయ్యట్లేదు సుమా!. పితరుల జీవితంలో మనం చాలా లోపాలు గమనిస్తాం, అందులో ఇది కూడా ఒకటి. అలాంటివారిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు, చివరికి వారిని ఆయనకు తగినట్టుగా మార్చుకున్నాడు.
ఆదికాండము 30:5-8 బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను. ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను. రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.
ఈ వచనాలలో రాహేలు తన దాసి ద్వారా పిల్లలను కనడం మనం చూస్తాం. ఆమె వారికి పెట్టిన పేర్లు కూడా తన అక్కతో ఉన్నటువంటి పోటీని తెలియచేస్తున్నాయి.
ఆదికాండము 30:9-13 లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను. లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.
ఈ వచనాలలో లేయా అప్పటికే కుమారులను కన్నప్పటికీ తన చెల్లెలిపై అసూయతో ఆమె కూడా అదే పని చెయ్యడం మనం చూస్తాం. పైగా ఆమె అలా చేసి ఆషేరు పుట్టినప్పుడు స్త్రీలు నన్ను భాగ్యవంతురాలు అనుకుంటారని ఆశించింది. లోకం మనల్ని గొప్పగా అనుకోవాలనే ఉద్దేశంతో ఏవేవో చెయ్యడం విశ్వాసికి చెందిన లక్షణం కాదు. యేసుక్రీస్తు తల్లియైన మరియ ఆ ఉద్దేశంతో ఏమీ చెయ్యనప్పటికీ దేవుడు ఆమెను స్త్రీలలో ధన్యురాలిగా చేసాడు.
ఆదికాండము 30:14 గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్ర దాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా-
ఈ వచనంలో రూబేను పుత్రదాత వృక్షఫలాలను తీసుకొచ్చి తన తల్లికి ఇవ్వడం, రాహేలు వాటిని ఆశించడం మనం చూస్తాం. మన తెలుగు బైబిల్ లో ఈ పండ్లను పుత్రదాత వృక్షఫలాలని తప్పుగా అనువదించారు కానీ ఇంగ్లీష్ బైబిల్ లో వీటిని "Mandrakes" అని తర్జుమా చేసారు, హీబ్రూలో ఐతే ఇక్కడ 'דּוּדי'(dûday) అనేపదం ఉపయోగించబడింది. ఈ పండ్లు పెద్ద రేగుపండ్లలా (Green apples) లా కనిపించి, చాలా రుచికరంగా తీపి వాసనతో ఉంటాయి. అప్పటి ప్రజలు వీటిని కామవాంఛను పెంచుకునేందుకు (సంతాన సాఫల్యానికి) తినేవారు. అందుకే హీబ్రూలో వీటిని (dûday) అని పిలిచారు, దీనికి కామసంబంధమైన ప్రేమ అని అర్థం. ఈ పండ్లు గురించి పరమగీతాల్లో కూడా రాయబడింది (పరమగీతము 7:13).
ఇవి సహజసిద్ధంగా కామవాంఛను పెంచే సామర్థ్యం గలవైనప్పటికీ కొందరు ప్రజలు వీటిని తింటే పిల్లలు పుడతారనే మూఢనమ్మకంతో కూడా తింటుండేవారు. అవి స్త్రీ పురుషుల్లో కామవాంఛను పెంచి, భార్యాభర్తలు ఎక్కువగా కలిసేలా చేస్తాయి కాబట్టి వాటివల్ల గర్భవతులు అవ్వడం సాధారణంగానే జరుగుతుంది. దానిని బట్టే చాలామంది వాటిని తింటే పిల్లలు పుడతారనే మూఢనమ్మకాన్ని వ్యాప్తిచేసారు. కానీ ఇతర లోపాలు కలిగున్న జంటలు ఆ పండ్లు తిన్నప్పటికీ ఏ ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఆ పండ్లు కామవాంఛను పెంచుతాయే తప్ప పిల్లలను కనేలా చెయ్యలేవు. రాహేలు అప్పటికి ఇంకా పిల్లలను కనలేదు కాబట్టి, బహుశా ఆమె కూడా ఆ మూఢనమ్మకాన్ని నమ్ముతూ ఆ పండ్లను ఆశించియుండవచ్చు.
ఆదికాండము 30:15,16 ఆమె నా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నాయొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను.
ఈ వచనాలలో రాహేలు ఆ పండ్లు నిమిత్తం యాకోబు తనతో కలిసుండే రాత్రుల్లో ఒక రాత్రిని లేయాకు అమ్మి వెయ్యడం మనం చూస్తాం. యాకోబు లేయా రాహేలులతో వంతుల చొప్పున కాపురం చేసేవాడు. అలా అతను రాహేలుతో కలిసుండే ఒక రాత్రినే ఆమె లేయాకు అమ్మివేసింది.
ఆదికాండము 30:17 దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.
ఈ వచనంలో దేవుడు లేయా ప్రార్థనను ఆలకించి, కానుపు ఉడిగిపోయినా కూడా ఆమెకు గర్భఫలం ఇవ్వడం మనం చూస్తాం. ఈమె ఒకవైపు దేవునిపై ఆధారపడుతూనే అనగా ప్రార్థిస్తూనే చెల్లెలిపట్ల సరికాని పద్ధతిలో ప్రవర్తిస్తుంది. అయినప్పటికీ యాకోబు సంతానాన్ని విస్తరింపచేస్తానని వాగ్దానం చేసిన దేవుడు అ వాగ్దానం నిమిత్తమే వారికి సంతానం ఇస్తున్నాడు.
ఆదికాండము 30:18 లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.
ఈ వచనంలో లేయా చాలా పొరపాటు ఆలోచన కలిగియున్నట్టు మనం చూస్తాం. పతనమైన మానవజాతిలో ఇలాంటి పొరపాట్లతో నిండిన ఆలోచనలు బయటపడుతూనే ఉంటాయి. అందుకే దేవుని వాక్యమనే కొలమానంతో మన ప్రవర్తననూ ఆలోచనలనూ సరి చూసుకోవాలి. ఎందుకంటే; దేవుడు లేయాపై కనికరపడి అప్పటికే ఆమెకు గర్భఫలం ఇచ్చినప్పటికీ కేవలం ఆమె తన చెల్లెలితో పోటిపడి తన దాసిని యాకోబు వశం చేసింది, అలా చెయ్యమని దేవుడు ఆమెకు ఆజ్ఞాపించలేదు. దేవుడు ఆజ్ఞాపించని పనిని జరిగించి, అందుకై ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాడని భావించడం, మనం చేసే పొరపాట్లకు కూడా దేవుడు బహుమతులిస్తాడని ప్రకటించడమే ఔతుంది.
ఆదికాండము 30:19-21 లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను. అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను. నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను. ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.
ఈ వచనాలలో లేయా ఆరుగురు కుమారులనూ ఒక కుమార్తెనూ కన్నట్టుగా మనం చూస్తాం. చివరి కుమారుడిని కన్న సమయంలో కూడా ఆమె తన భర్త తనతో కాపురం చేస్తాడనే అనుకుంటుంది. కానీ ఆ భర్త కాపురం చెయ్యబట్టే ఆమె పిల్లలను కనగలుగుతుంది. బహుశా ఆమె యాకోబు తనతో మాత్రమే కాపురం చెయ్యాలని ఆశించి ఉండవచ్చు అదే నిజమైతే ఆ కోరిక న్యాయం కాదు.
ఆదికాండము 30:22 దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.
ఈ వచనంలో దేవుడు రాహేలును కూడా జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని తెరవడం మనం చూస్తాం. గమనించండి; ఆమె మూఢనమ్మకంతో ఆ పండ్లను తినబట్టి కాదు దేవునికి చేసిన ప్రార్థనను బట్టే గర్భవతి అయ్యింది. కాబట్టి మనుషులకు ఏ మంచి అయినా దేవుని మూలంగానే జరుగుతుంది తప్ప, వారు ఆచరించే నమ్మకాలను బట్టి కాదు.
ఆదికాండము 30:23,24 అప్పుడామె గర్భవతియై కుమారుని కని దేవుడు నా నింద తొలగించెననుకొనెను. మరియు ఆమె యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.
ఈ వచనంలో రాహేలు ఒక కుమారుడిని కని అతనికి యోసేపు అని పేరు పెట్టడం మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో క్రియలమూలమైన పాపాన్ని తనకు అంటనీయకుండా దేవునికి లోబడి జీవించిన భక్తుల్లో ఈ యోసేపు ఒకరు, దేవుడు ఇతని మూలంగానే యాకోబు కుటుంబాన్ని ఐగుప్తుకు తీసుకెళ్ళి కరువు సమయంలో వారిని సంరక్షించాడు. ఈ యోసేపు చరిత్ర గురించి ముందటి అధ్యాయాలలో మనం వివరంగా చూద్దాం.
ఆదికాండము 30:25,26 రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయుము నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను. నా భార్యలను నా పిల్లలను నా కప్పగించుము అప్పుడు నేను వెళ్లెదను. వారి కోసము నీకు కొలువు చేసితిని నేను నీకు కొలువు చేసిన విధమును నీవెరుగుదువు గదా అని చెప్పెను.
ఈ వచనాలలో యాకోబు తన తండ్రి ఇంటికి వెళ్ళేందుకు లాబానుతో చర్చిస్తూ తనకు రావలసిన జీతం గురించి మాట్లాడడం మనం చూస్తాం. ఎందుకంటే అతను తన కుమార్తెల నిమిత్తం 14 సంవత్సరాలే కాకుండా మందలో భాగం కోసం మరో ఆరు సంవత్సరాలు అతనికి కొలువు చేసాడు (ఆదికాండము 31:41). ఇక్కడ యాకోబు దేవుడు తనకు వాగ్దానం చేసిన కనానుకు తిరిగివెళ్ళడానికి సిద్ధమౌతూ 20 సంవత్సరాలుగా అతను అలవాటు పడిన ప్రదేశాన్ని విడిచివెళ్ళడానికి అభ్యంతరపడట్లేదు. ఎందుకంటే ఆ ప్రదేశం అతనికి స్థిరమైన నివాసం కాదని, దేవుడు వాగ్దానం చేసిన కనానే అతని స్థిరమైన స్వాస్థ్యమని అతను గ్రహించాడు.
విశ్వాసులమైన మనకు ఈ భూమి స్థిరమైన నివాసం కాదని లేఖనం చెబుతుంది (1దినవృత్తాంతములు 29:15, కీర్తనలు 119:19, హెబ్రీ 13:14, ఫిలిప్పీ 3:20). యాకోబు ఎలాగైతే లాబానుతో చేసుకున్న ఒప్పందం నెరవేర్చాక వాగ్దాన దేశానికి ప్రయాణమయ్యాడో ఒకరోజున ఈ భూమిపై దేవుడు మనకిచ్చిన పని పూర్తి చేసి ఆయన దగ్గరకు తిరిగివెళ్తాం. కాబట్టి మనం ఎల్లప్పుడూ దానికి సిద్ధంగా ఉండాలి. అనగా యేసుక్రీస్తులా ఈ భూమిపై దేవుడు మనకిచ్చిన పని పూర్తి చేసి ఆయనను మహిమపరచాలి, సదా ఆయన ఆజ్ఞలకు విధేయులుగా జీవించాలి.
ఆదికాండము 30:27,28 అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను. మరియు అతడు నీ జీతమింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను.
ఈ వచనాలలో యాకోబు మాటలను లాబాను కూడా సానుకూలంగా స్పందించడం మనం చూస్తాం. ఈ క్రమంలో అతను "నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటిని" అంటున్నాడు. యాకోబును బట్టే దేవుడు అతడిని ఆశీర్వదించాడనేది వాస్తవం. ఈ విషయం యాకోబు మాటల్లో కూడా స్పష్టమౌతుంది. కానీ ఈ శకునాలు, మంత్రప్రయోగాలు అనేవి అపవాది శక్తితో జరిగే కార్యాలు. వాటిద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చనేది వాస్తవమే అయినా అపవాది (దుష్ట) శక్తులను ఆశ్రయించడమనేది దేవునికి విరుద్ధమైన కార్యం కాబట్టి విశ్వాసులు అలా చెయ్యకూడదు. అందుకే ధర్మశాస్త్రంలో ఆయన వాటిని నిషేధించాడు (నిర్గమకాండము 22:18). లాబానుకు యెహోవా దేవుని గురించి తెలిసినా అంత భక్తుడేమీ కాదు కాబట్టి ఆ కార్యానికి పాల్పడ్డాడు.
ఆదికాండము 30:29,30 అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నాయొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. అయితే అది బహుగా అభివృద్ధి పొందెను.నేను పాదము పెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా యింటివారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందుననెను.
ఈ వచనాలలో నీకేం జీతం కావాలో అడగమన్న లాబాను మాటలకు యాకోబు ప్రతిస్పందన మనం చూస్తాం. ఇక్కడ యాకోబు ఎలాంటి దురాశకూ పోకుండా కేవలం తన కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రమే కోరుకుంటున్నాడు. పైగా ఆస్తిలో తన భార్యలకు రావలసిన భాగం గురించి కూడా అడగట్లేదు. కాబట్టి విశ్వాసులమైన మనం మన కష్టానికి తగిన ఫలాన్నే తప్ప మరేమీ ఆశించకూడదు. "నీ పొరుగువానిది ఏదీ ఆశింపకూడదు" అంటే ఇది కూడా.
ఆదికాండము 30:31-34 అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలెనని యడిగినందుకు యాకోబు నీవు నాకేమియు ఇయ్యవద్దు. నీవు నా కొరకు ఈ విధముగా చేసినయెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైననుగల ప్రతి గొఱ్ఱెను, గొఱ్ఱెపిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను. అట్టివి నాకు జీతమగును. ఇకమీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయప్రవర్తనయే నాకు సాక్ష్యమగును.మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియు, గొఱ్ఱెపిల్లలలో నలుపు లేనివన్నియు నా యొద్దనున్నయెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను. అందుకు లాబాను మంచిది, నీ మాటచొప్పుననే కానిమ్మనెను.
ఈ వచనాలలో యాకోబు తనకేం జీతం కావాలో లాబానుకు తెలియచెయ్యడం మనం చూస్తాం. దేవుడు ఆజ్ఞాపించబట్టే అతను వాటిని కోరుకున్నాడు (ఆదికాండము 31:10-13).
ఆదికాండము 30:35,36 ఆ దినమున లాబాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైననుగల పెంటిమేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొఱ్ఱెపిల్లలలో నల్లవాటినన్నిటిని వేరు చేసి తన కుమారుల చేతికప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను.లాబానుయొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను.
ఈ వచనాలలో లాబాను యాకోబును మరలా మోసం చెయ్యడం మనం చూస్తాం. ఇది ఒకసారి జరిగిన మోసం కాదు, పదిసార్లు వరకూ ఇదేవిధంగా మోసం చేస్తూ వచ్చాడు (ఆదికాండము 31:7). ఇక్కడ యాకోబును క్రమశిక్షణ చేస్తున్న దేవుని సార్వభౌమత్వాన్ని కూడా మనం గమనిస్తాం. అతను తన అన్ననూ తండ్రినీ ఒకటి రెండుసార్లే మోసం చేస్తే అతను లేయా విషయంలోనే కాకుండా మరోపదిసార్లు మోసపోయాడు. అయితే దీని తర్వాత ఊహించని మేలును కూడా అతని జీవితం చూస్తున్నాం. ఎందుకంటే మన దేవుడు పాపాల విషయంలో క్రమశిక్షణ చేసే దేవుడే కాదు దానిని న్యాయమని ఎంచి సహనంతో భరించినప్పుడు అధికంగా దీవించే దేవుడు కూడా.
ఆదికాండము 30:37-42 యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాళ్లలోను వాటియెదుట పెట్టగా మందలు ఆ చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. యాకోబు ఆ గొఱ్ఱెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటి తట్టును లాబాను మందలలో నల్లనివాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతోనుంచక వాటిని వేరుగా ఉంచెను. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల యెదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల యెదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను.
ఈ వచనాలలో యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వల తోళ్ళు ఒలిచి వాటిని మందల ముందు పెట్టడం, మందలన్నీ మచ్చలు గల పిల్లల్ని ఈనడం మనం చూస్తాం. ఆ చెట్లను ఇంగ్లీష్ లో Green poplar, Hazel, Chestnut అని పిలుస్తారు. అయితే గమనించండి; అతను మందల ముందు ఆ చువ్వల తొక్కలు ఒలిచి పెట్టడం వల్ల మచ్చలుగల పిల్లల్ని ఈనలేదు. అదంతా దేవుడు చేసిన అద్భుతం కారణంగానే జరిగింది. బహూశా మందలు మచ్చలు గల పిల్లల్ని ఈనాలనే తన కోరికకు జ్ఞాపకంగా అతనలా చేసుంటాడు. గర్భవతులు ఏ పోలికలున్నవారిని చూస్తే ఆ పోలికలతోనే పిల్లలు జన్మిస్తారనేది కొంత వాస్తవం అన్నట్టు కొందరు అభిప్రాయపడుతున్నప్పటికీ అది పూర్తి వాస్తవం కాదు. ముఖ్యంగా యాకోబు చేసినదానికీ దానికీ సంబంధం లేదు. ఎందుకంటే ఒక గర్భవతి కుక్కపిల్లను చూస్తూ ఉన్నంతమాత్రాన ఆ పోలికలో బిడ్డ పుట్టదు. అలానే మచ్చలున్న చువ్వలను చూస్తున్నంత మాత్రాన మందలు మచ్చలుగల పిల్లల్ని ఈనలేవు.
ఆదికాండము 30:43 ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను.
ఈ వచనంలో యాకోబు విస్తారంగా ఆశీర్వదించబడడం మనం చూస్తాం. కారణం ఇప్పటికే మనం చూసాం. అంటే అతను తన అన్నదగ్గర నుండి పారిపోతున్నప్పుడు వాగ్దానం చేసినట్టే దేవుడు అతన్ని విస్తారంగా దీవించాడు (ఆదికాండము 28:15).
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 30
30:1, 30:2, 30:3, 4, 30:5-8, 30:9-13, 30:14, 30:15,16, 30:17, 30:18, 30:19-21, 30:22, 30:23,24, 30:25,26, 30:27, 28, 30:29,30, 30:31-34, 30:35,36, 30:37-42, 30:43
ఆదికాండము 30:1 రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము. లేనియెడల నేను చచ్చెదననెను.
ఈ వచనంలో రాహేలు తన అక్కపై అసూయతో యాకోబును విసిగిస్తూ మాట్లాడడం మనం చూస్తాం. యాకోబు మొదటినుండీ తన అక్కకంటే ఈమెనే ఎక్కువగా ప్రేమించాడు. ఆ ప్రేమలో లేయాకు దక్కని ప్రయోజనాలెన్నో ఈమె పొందుంటుంది. కానీ లేయాకు కలిగిన సంతానం మాత్రం ఈమెకు కలగలేదు. ఎందుకంటే అది యాకోబు చేతుల్లో కాదు దేవునిచేతిలో ఉంటుంది. అయితే ఆ విషయంలో ఈమె దేవునిపై ఆధారపడకుండా చస్తానంటూ భర్తను విసిగిస్తుంది. ఇక్కడ రాహేలు యొక్క ప్రవర్తన దేవుణ్ణి ఎరిగిన విశ్వాసురాలిగా కనిపించట్లేదు. ఒక విశ్వాసురాలు అసూయపడదు, చస్తానంటూ బెదరింపులకు పాల్పడదు. గర్భఫలం నిమిత్తం తన భర్తను విసిగించకుండా సమూయేలు తల్లియైన హన్నావలే దేవునిపై ఆధారపడుతుంది.
ఆదికాండము 30:2 యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అనెను.
ఈ వచనంలో రాహేలు విసిగింపుకు యాకోబు ప్రతిస్పందన మనం చూస్తాం. అందులో దేవునిపై అతనికున్న ఉన్న విశ్వాసం బయలుపడుతుంది. ఎందుకంటే; సాధారణంగా మన జీవితాలలో మంచి జరిగితే దేవుడు చేసాడని, మంచి జరగకపోతే సాతాను అడ్డగిస్తున్నాడని భావిస్తుంటాము, అది వాస్తవం కాదు. విశ్వాసి జీవితంలో జరిగే ప్రతిదీ దేవుని చిత్తప్రకారంగానే జరుగుతుంది. అంటే మనకు ఇచ్చేదీ దేవుడే ఇవ్వకుండా ఉండేది కూడా దేవుడే. అందుకే "మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును బయలు వెళ్లునుగదా?" (విలాపవాక్యములు 3:38) అని రాయబడింది. యాకోబు దీనినే అర్థం చేసుకుని "నీకు గర్భఫలం ఇవ్వకుండా ఉన్న దేవుని స్థానంలో నేనున్నానా" అంటూ అది తన పరిధిలో లేని విషయమని రాహేలుకు బుద్ధి చెబుతున్నాడు. మరోవిధంగా దేవునిపై ఆధారపడమని బోధిస్తున్నాడు.
అలానే మన సమాజంలో తల్లిదండ్రులను దైవాలుగా భావించే మూఢనమ్మకం చోటుచేసుకుంది. ప్రధానంగా తల్లిని మించిన దైవం లేదనే రాతలూ మాటలూ ప్రతీచోటా దర్శనమిస్తుంటాయి (చదువుకునే పాఠశాలల్లో సహా). కానీ పిల్లల్ని కనడంలో తల్లిదండ్రులు దేవుని సాధనాలే తప్ప దైవాలు కాదు, ఎవరైనా అలా అతిశయిస్తుంటే వారు దేవుని మహిమను దొంగిలించే దుర్మార్గులు ఔతారు, ఇది సాతాను పుట్టించిన భావజాలం. ఎందుకంటే దేవునితో సమానంగా ఉండాలనే దుర్బుద్ధితో పరలోకం నుండి పడడ్రోయబడింది వాడే (యెషయా 14:12-15).
పిల్లలను కనడం తల్లితండ్రుల పరిధిలోని విషయమే ఐతే ఎంతోమంది పిల్లలు లేకుండానే ఎందుకు ఉండిపోతున్నారు? వారు దైవాలే ఐతే అంగవైకల్యం కలిగిన పిల్లలకు ఎలా జన్మనిస్తున్నారు? ఈ అవగాహన విశ్వాసికి ఉండి, దేవుని మహిమను దొంగిలించే పనిని అతను ఎప్పుడూ చెయ్యలేడు. అందుకే యాకోబు "నేను దేవునికి ప్రతిగా ఉన్నానా" అంటూ ప్రత్యుత్తరమిస్తున్నాడు. ఇదే లక్షణం తన కుమారుడైన యోసేపులో కూడా మనకు కనిపిస్తుంది (ఆదికాండము 50:19).
అదేవిధంగా యాకోబుకు రాహేలుపై కోపం రగులుకున్నట్టు మనం చూస్తాం. అతను ఆమెను ఎంతో గాఢంగా ప్రేమించి దాస్యత్వం చెయ్యడానికి కూడా సిద్ధపడ్డాడు. అంతగా ప్రేమించిన అతనికి ఆ భార్య ఒక అవిశ్వాసురాలిలా మాట్లాడేసరికి కోపం రగులుకుంది. కాబట్టి నిజమైన ప్రేమలో తప్పు చేసిన వ్యక్తిని కోపంతో సరిచేసే నైతికబాధ్యత ఉంటుందని గుర్తుంచుకోవాలి, ఆ లక్షణం లేకపోతే అది ప్రేమేకాదు. ఎందుకంటే ప్రేమ అవతలివారి క్షేమం కోరుకుంటుంది కాబట్టి, వారు తప్పు చేస్తున్నప్పుడు దానివల్ల ఏదైనా ప్రమాదం తెచ్చుకుంటారనే ఆందోళనతో కోపం కూడా కలుగుతుంది. కానీ చాలామంది తాము ప్రేమించేవారు ఏదైనా తప్పు చేసేసరికి ఏదో తెలియక చేసారులే ఆవేశంలో చేసారులే అంటూ సమర్థించుకుంటారు. అలా చెయ్యడం వారి జీవితానికే పెనుప్రమాదం తెచ్చిపెడుతుంది. అందుకే యోబు కూడా తన భార్య అన్నీ నష్టపోయిన ఆవేదనలో మాట్లాడినప్పటికీ ఆమెకు బుద్ధి చెప్పాడు (యోబు 2:9,10) కాబట్టి తప్పు చేస్తున్నవారిని (తీవ్రతను బట్టి) కఠినంగానే గద్దించాలి.
ఆదికాండము 30:3,4 అందుకామె నా దాసియైన బిల్హా ఉన్నది గదా. ఆమెతో పొమ్ము. ఆమె నా కొరకు పిల్లలను కనును. ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా-
ఈ వచనంలో రాహేలు తన దాసిద్వారా పిల్లలను కనాలనే ఉద్దేశంతో యాకోబుకు ఆమెను భార్యగా ఇవ్వడం మనం చూస్తాం. దాసి పిల్లలను తన పిల్లలుగా భావించడానికి సిద్ధపడిన రాహేలు స్వంత అక్క కన్నటువంటి పిల్లలను మాత్రం తన పిల్లలుగా భావించలేకపోయింది. అదేవిధంగా ఆకాలంలో పిల్లలు పుట్టనప్పుడు తమ దాసిల ద్వారా పిల్లలను కనే సాంప్రదాయం ఉండేది, అబ్రాహాము విషయంలో కూడా మనం దీనిని చూసాం. ఇక్కడ యాకోబు కూడా ఆ పద్ధతిని దృష్టిలో పెట్టుకుని తన భార్య మాటకు సమ్మతించాడు. అయితే బాగా గుర్తుంచుకోండి; ఇదంతా అతను దేవునిమాట ప్రకారంగా చెయ్యట్లేదు సుమా!. పితరుల జీవితంలో మనం చాలా లోపాలు గమనిస్తాం, అందులో ఇది కూడా ఒకటి. అలాంటివారిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు, చివరికి వారిని ఆయనకు తగినట్టుగా మార్చుకున్నాడు.
ఆదికాండము 30:5-8 బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను. ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను. రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.
ఈ వచనాలలో రాహేలు తన దాసి ద్వారా పిల్లలను కనడం మనం చూస్తాం. ఆమె వారికి పెట్టిన పేర్లు కూడా తన అక్కతో ఉన్నటువంటి పోటీని తెలియచేస్తున్నాయి.
ఆదికాండము 30:9-13 లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను. లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.
ఈ వచనాలలో లేయా అప్పటికే కుమారులను కన్నప్పటికీ తన చెల్లెలిపై అసూయతో ఆమె కూడా అదే పని చెయ్యడం మనం చూస్తాం. పైగా ఆమె అలా చేసి ఆషేరు పుట్టినప్పుడు స్త్రీలు నన్ను భాగ్యవంతురాలు అనుకుంటారని ఆశించింది. లోకం మనల్ని గొప్పగా అనుకోవాలనే ఉద్దేశంతో ఏవేవో చెయ్యడం విశ్వాసికి చెందిన లక్షణం కాదు. యేసుక్రీస్తు తల్లియైన మరియ ఆ ఉద్దేశంతో ఏమీ చెయ్యనప్పటికీ దేవుడు ఆమెను స్త్రీలలో ధన్యురాలిగా చేసాడు.
ఆదికాండము 30:14 గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్ర దాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా-
ఈ వచనంలో రూబేను పుత్రదాత వృక్షఫలాలను తీసుకొచ్చి తన తల్లికి ఇవ్వడం, రాహేలు వాటిని ఆశించడం మనం చూస్తాం. మన తెలుగు బైబిల్ లో ఈ పండ్లను పుత్రదాత వృక్షఫలాలని తప్పుగా అనువదించారు కానీ ఇంగ్లీష్ బైబిల్ లో వీటిని "Mandrakes" అని తర్జుమా చేసారు, హీబ్రూలో ఐతే ఇక్కడ 'דּוּדי'(dûday) అనేపదం ఉపయోగించబడింది. ఈ పండ్లు పెద్ద రేగుపండ్లలా (Green apples) లా కనిపించి, చాలా రుచికరంగా తీపి వాసనతో ఉంటాయి. అప్పటి ప్రజలు వీటిని కామవాంఛను పెంచుకునేందుకు (సంతాన సాఫల్యానికి) తినేవారు. అందుకే హీబ్రూలో వీటిని (dûday) అని పిలిచారు, దీనికి కామసంబంధమైన ప్రేమ అని అర్థం. ఈ పండ్లు గురించి పరమగీతాల్లో కూడా రాయబడింది (పరమగీతము 7:13).
ఇవి సహజసిద్ధంగా కామవాంఛను పెంచే సామర్థ్యం గలవైనప్పటికీ కొందరు ప్రజలు వీటిని తింటే పిల్లలు పుడతారనే మూఢనమ్మకంతో కూడా తింటుండేవారు. అవి స్త్రీ పురుషుల్లో కామవాంఛను పెంచి, భార్యాభర్తలు ఎక్కువగా కలిసేలా చేస్తాయి కాబట్టి వాటివల్ల గర్భవతులు అవ్వడం సాధారణంగానే జరుగుతుంది. దానిని బట్టే చాలామంది వాటిని తింటే పిల్లలు పుడతారనే మూఢనమ్మకాన్ని వ్యాప్తిచేసారు. కానీ ఇతర లోపాలు కలిగున్న జంటలు ఆ పండ్లు తిన్నప్పటికీ ఏ ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఆ పండ్లు కామవాంఛను పెంచుతాయే తప్ప పిల్లలను కనేలా చెయ్యలేవు. రాహేలు అప్పటికి ఇంకా పిల్లలను కనలేదు కాబట్టి, బహుశా ఆమె కూడా ఆ మూఢనమ్మకాన్ని నమ్ముతూ ఆ పండ్లను ఆశించియుండవచ్చు.
ఆదికాండము 30:15,16 ఆమె నా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నాయొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను.
ఈ వచనాలలో రాహేలు ఆ పండ్లు నిమిత్తం యాకోబు తనతో కలిసుండే రాత్రుల్లో ఒక రాత్రిని లేయాకు అమ్మి వెయ్యడం మనం చూస్తాం. యాకోబు లేయా రాహేలులతో వంతుల చొప్పున కాపురం చేసేవాడు. అలా అతను రాహేలుతో కలిసుండే ఒక రాత్రినే ఆమె లేయాకు అమ్మివేసింది.
ఆదికాండము 30:17 దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.
ఈ వచనంలో దేవుడు లేయా ప్రార్థనను ఆలకించి, కానుపు ఉడిగిపోయినా కూడా ఆమెకు గర్భఫలం ఇవ్వడం మనం చూస్తాం. ఈమె ఒకవైపు దేవునిపై ఆధారపడుతూనే అనగా ప్రార్థిస్తూనే చెల్లెలిపట్ల సరికాని పద్ధతిలో ప్రవర్తిస్తుంది. అయినప్పటికీ యాకోబు సంతానాన్ని విస్తరింపచేస్తానని వాగ్దానం చేసిన దేవుడు అ వాగ్దానం నిమిత్తమే వారికి సంతానం ఇస్తున్నాడు.
ఆదికాండము 30:18 లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.
ఈ వచనంలో లేయా చాలా పొరపాటు ఆలోచన కలిగియున్నట్టు మనం చూస్తాం. పతనమైన మానవజాతిలో ఇలాంటి పొరపాట్లతో నిండిన ఆలోచనలు బయటపడుతూనే ఉంటాయి. అందుకే దేవుని వాక్యమనే కొలమానంతో మన ప్రవర్తననూ ఆలోచనలనూ సరి చూసుకోవాలి. ఎందుకంటే; దేవుడు లేయాపై కనికరపడి అప్పటికే ఆమెకు గర్భఫలం ఇచ్చినప్పటికీ కేవలం ఆమె తన చెల్లెలితో పోటిపడి తన దాసిని యాకోబు వశం చేసింది, అలా చెయ్యమని దేవుడు ఆమెకు ఆజ్ఞాపించలేదు. దేవుడు ఆజ్ఞాపించని పనిని జరిగించి, అందుకై ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాడని భావించడం, మనం చేసే పొరపాట్లకు కూడా దేవుడు బహుమతులిస్తాడని ప్రకటించడమే ఔతుంది.
ఆదికాండము 30:19-21 లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను. అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను. నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను. ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.
ఈ వచనాలలో లేయా ఆరుగురు కుమారులనూ ఒక కుమార్తెనూ కన్నట్టుగా మనం చూస్తాం. చివరి కుమారుడిని కన్న సమయంలో కూడా ఆమె తన భర్త తనతో కాపురం చేస్తాడనే అనుకుంటుంది. కానీ ఆ భర్త కాపురం చెయ్యబట్టే ఆమె పిల్లలను కనగలుగుతుంది. బహుశా ఆమె యాకోబు తనతో మాత్రమే కాపురం చెయ్యాలని ఆశించి ఉండవచ్చు అదే నిజమైతే ఆ కోరిక న్యాయం కాదు.
ఆదికాండము 30:22 దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.
ఈ వచనంలో దేవుడు రాహేలును కూడా జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని తెరవడం మనం చూస్తాం. గమనించండి; ఆమె మూఢనమ్మకంతో ఆ పండ్లను తినబట్టి కాదు దేవునికి చేసిన ప్రార్థనను బట్టే గర్భవతి అయ్యింది. కాబట్టి మనుషులకు ఏ మంచి అయినా దేవుని మూలంగానే జరుగుతుంది తప్ప, వారు ఆచరించే నమ్మకాలను బట్టి కాదు.
ఆదికాండము 30:23,24 అప్పుడామె గర్భవతియై కుమారుని కని దేవుడు నా నింద తొలగించెననుకొనెను. మరియు ఆమె యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.
ఈ వచనంలో రాహేలు ఒక కుమారుడిని కని అతనికి యోసేపు అని పేరు పెట్టడం మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో క్రియలమూలమైన పాపాన్ని తనకు అంటనీయకుండా దేవునికి లోబడి జీవించిన భక్తుల్లో ఈ యోసేపు ఒకరు, దేవుడు ఇతని మూలంగానే యాకోబు కుటుంబాన్ని ఐగుప్తుకు తీసుకెళ్ళి కరువు సమయంలో వారిని సంరక్షించాడు. ఈ యోసేపు చరిత్ర గురించి ముందటి అధ్యాయాలలో మనం వివరంగా చూద్దాం.
ఆదికాండము 30:25,26 రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయుము నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను. నా భార్యలను నా పిల్లలను నా కప్పగించుము అప్పుడు నేను వెళ్లెదను. వారి కోసము నీకు కొలువు చేసితిని నేను నీకు కొలువు చేసిన విధమును నీవెరుగుదువు గదా అని చెప్పెను.
ఈ వచనాలలో యాకోబు తన తండ్రి ఇంటికి వెళ్ళేందుకు లాబానుతో చర్చిస్తూ తనకు రావలసిన జీతం గురించి మాట్లాడడం మనం చూస్తాం. ఎందుకంటే అతను తన కుమార్తెల నిమిత్తం 14 సంవత్సరాలే కాకుండా మందలో భాగం కోసం మరో ఆరు సంవత్సరాలు అతనికి కొలువు చేసాడు (ఆదికాండము 31:41). ఇక్కడ యాకోబు దేవుడు తనకు వాగ్దానం చేసిన కనానుకు తిరిగివెళ్ళడానికి సిద్ధమౌతూ 20 సంవత్సరాలుగా అతను అలవాటు పడిన ప్రదేశాన్ని విడిచివెళ్ళడానికి అభ్యంతరపడట్లేదు. ఎందుకంటే ఆ ప్రదేశం అతనికి స్థిరమైన నివాసం కాదని, దేవుడు వాగ్దానం చేసిన కనానే అతని స్థిరమైన స్వాస్థ్యమని అతను గ్రహించాడు.
విశ్వాసులమైన మనకు ఈ భూమి స్థిరమైన నివాసం కాదని లేఖనం చెబుతుంది (1దినవృత్తాంతములు 29:15, కీర్తనలు 119:19, హెబ్రీ 13:14, ఫిలిప్పీ 3:20). యాకోబు ఎలాగైతే లాబానుతో చేసుకున్న ఒప్పందం నెరవేర్చాక వాగ్దాన దేశానికి ప్రయాణమయ్యాడో ఒకరోజున ఈ భూమిపై దేవుడు మనకిచ్చిన పని పూర్తి చేసి ఆయన దగ్గరకు తిరిగివెళ్తాం. కాబట్టి మనం ఎల్లప్పుడూ దానికి సిద్ధంగా ఉండాలి. అనగా యేసుక్రీస్తులా ఈ భూమిపై దేవుడు మనకిచ్చిన పని పూర్తి చేసి ఆయనను మహిమపరచాలి, సదా ఆయన ఆజ్ఞలకు విధేయులుగా జీవించాలి.
ఆదికాండము 30:27,28 అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను. మరియు అతడు నీ జీతమింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను.
ఈ వచనాలలో యాకోబు మాటలను లాబాను కూడా సానుకూలంగా స్పందించడం మనం చూస్తాం. ఈ క్రమంలో అతను "నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటిని" అంటున్నాడు. యాకోబును బట్టే దేవుడు అతడిని ఆశీర్వదించాడనేది వాస్తవం. ఈ విషయం యాకోబు మాటల్లో కూడా స్పష్టమౌతుంది. కానీ ఈ శకునాలు, మంత్రప్రయోగాలు అనేవి అపవాది శక్తితో జరిగే కార్యాలు. వాటిద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చనేది వాస్తవమే అయినా అపవాది (దుష్ట) శక్తులను ఆశ్రయించడమనేది దేవునికి విరుద్ధమైన కార్యం కాబట్టి విశ్వాసులు అలా చెయ్యకూడదు. అందుకే ధర్మశాస్త్రంలో ఆయన వాటిని నిషేధించాడు (నిర్గమకాండము 22:18). లాబానుకు యెహోవా దేవుని గురించి తెలిసినా అంత భక్తుడేమీ కాదు కాబట్టి ఆ కార్యానికి పాల్పడ్డాడు.
ఆదికాండము 30:29,30 అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నాయొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. అయితే అది బహుగా అభివృద్ధి పొందెను.నేను పాదము పెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా యింటివారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందుననెను.
ఈ వచనాలలో నీకేం జీతం కావాలో అడగమన్న లాబాను మాటలకు యాకోబు ప్రతిస్పందన మనం చూస్తాం. ఇక్కడ యాకోబు ఎలాంటి దురాశకూ పోకుండా కేవలం తన కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రమే కోరుకుంటున్నాడు. పైగా ఆస్తిలో తన భార్యలకు రావలసిన భాగం గురించి కూడా అడగట్లేదు. కాబట్టి విశ్వాసులమైన మనం మన కష్టానికి తగిన ఫలాన్నే తప్ప మరేమీ ఆశించకూడదు. "నీ పొరుగువానిది ఏదీ ఆశింపకూడదు" అంటే ఇది కూడా.
ఆదికాండము 30:31-34 అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలెనని యడిగినందుకు యాకోబు నీవు నాకేమియు ఇయ్యవద్దు. నీవు నా కొరకు ఈ విధముగా చేసినయెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైననుగల ప్రతి గొఱ్ఱెను, గొఱ్ఱెపిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను. అట్టివి నాకు జీతమగును. ఇకమీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయప్రవర్తనయే నాకు సాక్ష్యమగును.మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియు, గొఱ్ఱెపిల్లలలో నలుపు లేనివన్నియు నా యొద్దనున్నయెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను. అందుకు లాబాను మంచిది, నీ మాటచొప్పుననే కానిమ్మనెను.
ఈ వచనాలలో యాకోబు తనకేం జీతం కావాలో లాబానుకు తెలియచెయ్యడం మనం చూస్తాం. దేవుడు ఆజ్ఞాపించబట్టే అతను వాటిని కోరుకున్నాడు (ఆదికాండము 31:10-13).
ఆదికాండము 30:35,36 ఆ దినమున లాబాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైననుగల పెంటిమేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొఱ్ఱెపిల్లలలో నల్లవాటినన్నిటిని వేరు చేసి తన కుమారుల చేతికప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను.లాబానుయొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను.
ఈ వచనాలలో లాబాను యాకోబును మరలా మోసం చెయ్యడం మనం చూస్తాం. ఇది ఒకసారి జరిగిన మోసం కాదు, పదిసార్లు వరకూ ఇదేవిధంగా మోసం చేస్తూ వచ్చాడు (ఆదికాండము 31:7). ఇక్కడ యాకోబును క్రమశిక్షణ చేస్తున్న దేవుని సార్వభౌమత్వాన్ని కూడా మనం గమనిస్తాం. అతను తన అన్ననూ తండ్రినీ ఒకటి రెండుసార్లే మోసం చేస్తే అతను లేయా విషయంలోనే కాకుండా మరోపదిసార్లు మోసపోయాడు. అయితే దీని తర్వాత ఊహించని మేలును కూడా అతని జీవితం చూస్తున్నాం. ఎందుకంటే మన దేవుడు పాపాల విషయంలో క్రమశిక్షణ చేసే దేవుడే కాదు దానిని న్యాయమని ఎంచి సహనంతో భరించినప్పుడు అధికంగా దీవించే దేవుడు కూడా.
ఆదికాండము 30:37-42 యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాళ్లలోను వాటియెదుట పెట్టగా మందలు ఆ చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. యాకోబు ఆ గొఱ్ఱెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటి తట్టును లాబాను మందలలో నల్లనివాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతోనుంచక వాటిని వేరుగా ఉంచెను. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల యెదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల యెదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను.
ఈ వచనాలలో యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వల తోళ్ళు ఒలిచి వాటిని మందల ముందు పెట్టడం, మందలన్నీ మచ్చలు గల పిల్లల్ని ఈనడం మనం చూస్తాం. ఆ చెట్లను ఇంగ్లీష్ లో Green poplar, Hazel, Chestnut అని పిలుస్తారు. అయితే గమనించండి; అతను మందల ముందు ఆ చువ్వల తొక్కలు ఒలిచి పెట్టడం వల్ల మచ్చలుగల పిల్లల్ని ఈనలేదు. అదంతా దేవుడు చేసిన అద్భుతం కారణంగానే జరిగింది. బహూశా మందలు మచ్చలు గల పిల్లల్ని ఈనాలనే తన కోరికకు జ్ఞాపకంగా అతనలా చేసుంటాడు. గర్భవతులు ఏ పోలికలున్నవారిని చూస్తే ఆ పోలికలతోనే పిల్లలు జన్మిస్తారనేది కొంత వాస్తవం అన్నట్టు కొందరు అభిప్రాయపడుతున్నప్పటికీ అది పూర్తి వాస్తవం కాదు. ముఖ్యంగా యాకోబు చేసినదానికీ దానికీ సంబంధం లేదు. ఎందుకంటే ఒక గర్భవతి కుక్కపిల్లను చూస్తూ ఉన్నంతమాత్రాన ఆ పోలికలో బిడ్డ పుట్టదు. అలానే మచ్చలున్న చువ్వలను చూస్తున్నంత మాత్రాన మందలు మచ్చలుగల పిల్లల్ని ఈనలేవు.
ఆదికాండము 30:43 ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను.
ఈ వచనంలో యాకోబు విస్తారంగా ఆశీర్వదించబడడం మనం చూస్తాం. కారణం ఇప్పటికే మనం చూసాం. అంటే అతను తన అన్నదగ్గర నుండి పారిపోతున్నప్పుడు వాగ్దానం చేసినట్టే దేవుడు అతన్ని విస్తారంగా దీవించాడు (ఆదికాండము 28:15).
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Add comment