ఈ రోజుల్లో చాలామంది బోధకులు తమంతట తాము అపొస్తలులమని ప్రకటించుకుంటున్నారు, అలాగే చలామణీ అవుతున్నారు. మరి కొన్ని క్రైస్తవశాఖలకు చెందినవారు ఇలా వాదిస్తుంటారు - 'ప్రతి క్రైస్తవుడూ ఒక అపొస్తలుడే. ప్రతి ఒక్కరూ అపొస్తలులు చేసినవన్నీ చెయ్యాలి. అపొస్తలులు కనపరిచిన ఆ మానవాతీత శక్తినీ, ప్రభావాన్నీ కనపరచాలి'. టీవీ ప్రసంగాల్లోనూ, సామాజిక మాధ్యమాల ద్వారానూ ఈ బోధ ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. ఈ తరంలోని అనేకులు ఈ విషయంలో 'ఏది సత్యం? ఏది అసత్యం?' అని నిర్ధారించుకోలేని గందరగోళ పరిస్థితులలో ఉంటున్నారు. లేఖనాల ఆధారంగా ఈ విషయంలో స్పష్టత తెచ్చుకోవడం కోసం ఈ వ్యాసాన్ని చదవండి.
కొన్నిరోజుల క్రితం మేము అద్దంకి రంజీత్ ఓఫీర్ గారు తాను చెప్పిన ప్రవచనం, బోధ ఆధారంగా లేఖనాల ప్రకారం అబద్ధప్రవక్త ఔతున్నాడని రుజువు చేస్తూ ఒక వీడియోను చేసాము.
ఓఫీర్ గారు మాట్లాడిన మరొక మాట కూడా ఆయనను ఎలా అబద్ధప్రవక్తగా దుర్భోధకుడిగా రుజువు చేస్తుందో వివరించడానికే ఈ వ్యాసాన్ని రాశాము. వాక్యం పట్ల ఆసక్తికలిగిన విశ్వాసులందరూ దీనిని పరిశీలించి ఓఫీర్ గారు ఎవరో మీరే నిర్ణయించుకోవాలి.
పెంతెకోస్తువారు, కరిస్మాటిక్ వారు, సాధారణంగా చెప్పుకొంటే (జీసస్ ఓన్లీ గుంపు మినహా) పరిశుద్ధాత్మ దేవత్వాన్ని, త్రిత్వాన్ని నమ్ముతారు. అయితే పెంతెకొస్తు ఉద్యమం తండ్రి కుమారులను త్రోసిపుచ్చి పరిశుద్ధాత్మను హెచ్చిస్తుంది. క్రొత్త నిబంధన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్న క్రమాన్ని మార్చి పరిశుద్ధాత్మ, కుమారుడు, తండ్రిగా తికమక చేసారు. అయితే పరిశుద్ధాత్మ తనను గూర్చి కాక క్రీస్తును గూర్చి మాట్లాడవలసి వుంది. తండ్రి కుమారులు ఆయన్ని ఈ లోకములోనికి పంపించారు. కుమారుణ్ణి లోకానికి వెల్లడిచేసి మహిమపరచే బాధ్యత ఆయనకు అప్పగింపబడ్డది (యోహాను 16:13-15).
హితబోధ నెట్వర్క్ వారి పరిచర్యలో భాగంగా బ్రదర్ బిబు ఈ మధ్యకాలంలో బైబిల్ మిషన్ దేవదాసు అయ్యగారి బోధలలోని వాక్యవిరుద్ధమైన సంగతులను తన పుస్తకం మరియు వీడియోల ద్వారా బహిర్గతం చేసినప్పుడు ఆ సంస్థకు చెందిన కొందరు అనుచరులు విషయమంతా వదిలేసి, దేవదాసు అయ్యగారు చెప్పినవి ఏవిధంగా వాక్యానుసారమో రుజువు చెయ్యకుండా, కనీసం వారు బహిరంగంగా నిరూపించుకోగలిగే సవాలును కూడా స్వీకరించకుండా కొన్ని అనవసరపు విమర్శలు చెయ్యడం ప్రారంభించారు.
బైబిలో దేవుడు ప్రత్యక్షపరచిన బోధకు భిన్నంగా ఎవరు బోధించినా అది దేవుని కార్యం కాదని, అది మానవ పొరపాటు లేదా సాతాను దుర్బోధ అయ్యుండాలని వేరే చెప్పాల్సిన పని లేదు. కాబట్టి, ప్రతి బోధకుని మాటలను మనం వాక్యపు వెలుగులో పరిశీలించాలి. అది బైబిలుకు భిన్న బోధ అని తేలితే దానిని తిరస్కరించి ఖండించాలి. ఇందుకు దేవదాసు అయ్యగారు కూడా మినహాయింపు కాదు. ప్రస్తుత పరిశీలనకు నన్ను ప్రేరేపించింది దేవుని వాక్యం పట్ల కనపరచాల్సిన విశ్వాస్యత మాత్రమే తప్ప, ఇందులో ఎలాంటి వ్యక్తిగత ద్వేషానికి, దూషణకు తావులేదని గమనించాలి.
Institute of Bible Technology వ్యవస్థాపకులైన డాక్టర్ బొంకూరి జాన్ గారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడే తప్ప దేవుడు కాడని, దేవునితో సమానుడు కాడని తీర్మానిస్తూ, తాను సొంతంగా పోగుచేసుకుని కల్పించుకున్న చౌకబారు వ్యాఖ్యానాలకు లేఖనాలను తగిలించుకుని, ఎంతో శ్రమించి పరిశోధించి రాసిన ‘యేసుక్రీస్తు ఎవరు’ అనే 8 పేజీలు కలిగిన కరపత్రాన్ని లేఖనాధారాలతో తూర్పారబడుతూ, సంస్కారవంతంగా ఖండిస్తూ ఈ వ్యాసాన్ని రాస్తున్నాము.
గమనిక: ఈ రచన బి.జాన్ గారి ప్రసంగం ఎంత వరకు సత్యము అని పరిశీలించడానికి మాత్రమే ఉద్దేశించినది. ఇది పరిశుద్ధాత్ముని గూర్చిన పూర్తి వివరణ ఇచ్చే రచన కాదు. కొందరు IBT సహోదరులు ఇలా జాన్ గారి దురోధలను బహిర్గతం చేయడం, వ్యక్తిగత విమర్శ అంటున్నారు. డా|| జాన్ గారి దగ్గరికి వచ్చే సహోదరులు జాన్ గారి బోధలను ఏమాత్రం పరిశీలించకుండానే అంగీకరించి వాటినే ఇతరులకు బోధిస్తున్నారు.
బైబిల్ ముందుగా హెచ్చరించినట్లుగానే ఈ అంత్యకాలంలో అనేకమంది అబద్ద ప్రవక్తలు వచ్చి కోట్లమంది క్రైస్తవుల్ని తప్పుమార్గంలోనికి నడిపిస్తున్నారు. ఇలా మోసగించిన అబద్ద ప్రవక్తల్లో 'విలియం మారియన్ బ్రెన్హాం' అతి ముఖ్యుడు. ఇతడు 1909 సం||లో కెంటక్కి (అమెరికా) అనే ప్రాంతంలో జన్మించాడు. 1943లో విలియం హీలింగ్ మినిస్ట్రీని ఇతడు ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే విస్తారమైన పేరుప్రఖ్యాతలు సంపాదించాడు. అనేక దేశాలు తిరిగాడు. ఒకప్రక్క క్రైస్తవ్యంలో ఉన్న తప్పుడుబోధల్ని ఖండిస్తూ మరోప్రక్క మరింత తప్పుడు బోధలు చేస్తూ పాపులర్ అయ్యాడు. ఆదిమ సంఘానికి పౌలు ఎలాగో ఈ చివరి సంఘానికి తాను అలాంటివాడు అనీ, తనని ప్రవక్తగా అంగీకరించకుంటే రక్షణ దొరకదు అనీ, బైబిల్ లో అతని గురించి ముందుగానే ప్రవచింపబడింది అని చెప్పుకోవడం మొదలుపెట్టాడు.
సాంప్రదాయక క్రైస్తవ్యం, యెహోవాసాక్షులు, మార్మోన్లు
అనేక సంఘాలలో డిసెంబర్ 31న లేదా జనవరి 1వ తారీఖున బైబిల్లో ఉన్న వాగ్దానాలను చిన్నచిన్న చీటీలలో రాసి పంచిపెట్టడం, ఎవరికి ఏ వాగ్దానం వస్తే అది ఆ సంవత్సరం కోసం ప్రభువు ఇచ్చిన వాగ్దానంగా పరిగణించటం ఒక అలవాటు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు కాబట్టి, నా పరిస్థితిని ఎరిగిన దేవుడు దానికి తగిన వాగ్దానాన్ని నాకు అనుగ్రహిస్తాడనే విశ్వాసం ఈ అలవాటుకు ఆయువుపట్టు. ఎంతో ఆదరణనిచ్చే ఈ పరిచర్యను కూడా విమర్శిస్తారా? అది తప్పు, ఇది తప్పు అనటంకంటే మీకింకో పనే లేదా అనే ఆక్షేపణలకు, తిరస్కారానికి సిద్ధపడి, వాక్య అధికారంతో ఈ వాగ్దానాల లాటరీ పద్ధతిని ఖండిస్తున్నాను. ఇది సంఘాన్ని మూఢభక్తి వైపుకు నడిపించటం మాత్రమే కాకుండా, దేవుని వాక్యం చదవాల్సిన విధానాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టే తప్పుడు అలవాటు. ఇందులో ఉన్న పొరపాటు ఏమిటో ఈ క్రింది విషయాలను నాతో కలసి విశ్లేషిస్తే మీకే అర్థమౌతుంది. ప్రార్థనాపూర్వకంగా పరిశీలించగలరని మనవి.
అబ్రహాము దేవుడు ఎవరు? యెహోవా లేక అల్లాహ్?
బైబిల్ లో ఉన్న యెహోవా, ఖురాన్ లో ఉన్న అల్లాహ్… ఇద్దరూ ఒక్కరేనా లేక వేరు వేరా? యెహోవా - అల్లాహ్, ఇద్దరూ ఒక్కరే అని ముస్లింలు చాలా బలంగా విశ్వసిస్తారు. ఎందుకంటే, బైబిల్ ప్రకారం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ల దేవుడి పేరు యెహోవా. అలాగే ఖురాన్ ప్రకారం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ల దేవుడి పేరు అల్లాహ్. అందువలన ముస్లింలకు వేరే మార్గం లేదు. అల్లాహ్, యెహోవా ఇద్దరూ ఒక్కరే అని వారు మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి మూడు భిన్న వాదనలను ఈ రోజు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా, ప్రముఖ ముస్లిం మత ప్రచారకుడు డాక్టర్ షబ్బీర్ అలీ గారి వాదన ఏమిటో చూద్దాం.
© 2021. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.