6:1,2, 6:3, 6:4, 6:5, 6:6, 6:7, 6:8, 6:9, 6:10, 6:11, 6:12, 6:13, 6:14-16, 6:17, 6:18, 6:19,20, 6:21, 6:22
ఆదికాండము 6:1,2 నరులు భూమిమీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.
ఈ వచనంలో దేవుని కుమారులు నరుల కుమార్తెల అందాన్ని చూసి తమ మనసుకు నచ్చినవారిని వివాహాలు చేసుకున్నట్టు మనం చూస్తాం. ఈ "దేవుని కుమారులు - నరుల కుమార్తెలపై" క్రైస్తవసమాజంలో ప్రాముఖ్యంగా రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. యూదులకు కూడా ఇది ఒక వివాదాస్పదపు అంశమే. ఇది మన రక్షణకు కానీ విశ్వాసానికి కానీ దేవుని గుణలక్షణాలకు కానీ లేఖనాల ప్రామాణికతకు కానీ సంబంధించిన అంశం కానప్పటికీ లేఖనంలో రాయబడినవాటిని క్షుణ్ణంగా పరిశీలించి (సాధ్యమైనంతమట్టుకు) సరైనదానిని విశ్వసించడం మన బాధ్యత కాబట్టి కొంచెం విస్తారంగానే దీనిపై చర్చించదలిచాను. అందుకే ఈ అంశంపై ఉన్న ఆ రెండు అభిప్రాయాలనూ వాటిలో నేను గమనించిన లోపాలనూ మీతో పంచుకుని చివరిగా నేనేం విశ్వసిస్తున్నానో కూడా తెలియచేస్తాను. నిజానికి నేను మూడవ అభిప్రాయం విశ్వసిస్తాను.
ఈ దేవునికుమారుల విషయమై మొదటి అభిప్రాయం ప్రకారం; హీబ్రూబాషలో అక్కడ בני האלהים (Benay ha Elohim) అనేపదం వాడారు. పాతనిబంధనలో ఈ పదం కేవలం దేవదూతలను ఉద్దేశించి మాత్రమే వాడబడింది. ఉదాహరణకు; యోబు 1:6, 2:1, 38:7. ఈ కారణం చేత, అక్కడ మనకు కనిపించే దేవుని కుమారులు దేవదూతలేయని వీరు విశ్వసిస్తారు. అయితే ఈ వాదనపై చాలా ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ప్రాముఖ్యంగా పరలోకంలో దేవదూతలు పెండ్లికియ్యబడరు అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు (మార్కు12:25).
అయితే ఆ ప్రశ్నకు వీరు ఆదికాండము 18వ అధ్యాయంలో యెహోవా ఇద్దరు దేవదూతలతో అబ్రాహామును దర్శించి అతని ఇంట భోజనం చేసిన సందర్భాన్ని చూపించి సులభంగానే సమాధానం చెబుతుంటారు. అక్కడ దేవదూతలు మానవదేహాన్ని ధరించుకున్నారు, ఆహారం కూడా తిన్నారు. అదేవిధంగా వారు మానవ దేహాలను ధరించుకుని మానవ స్త్రీలను వివాహం చేసుకున్నారు అన్నదే ఆ సమాధానం.
నాకు ఈ సమాధానంలో సమస్యగా అనిపించిన విషయం ఏంటంటే అబ్రాహాము ఇంటికి వచ్చిన దూతలు దేవునితో కలసి వచ్చారు. కాబట్టి వారు మానవరూపాన్ని కలిగియుండడం, ఆయనతో కలసి భోజనం చెయ్యడంలో విచిత్రమేమీ లేదు. కానీ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే దూతలు కూడా తమకు ఇష్టమైనప్పుడు మానవదేహాలను ధరించుకునే సామర్థ్యం కలిగియుంటారు అనడానికి లేఖనాలలో ఒక్క ఆధారం కూడా లేదు. పైగా ఆ దూతలు మానవ స్త్రీల అందాన్ని చూసి దానిని అనుభవించడానికి మానవ దేహాలను ధరించుకోవలసిన అవసరం ఏముంటుంది?. యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాటల ప్రకారం వారు పెండ్లికియ్యబడరు అంటే మనకు ఉన్నట్టుగా వారికి లైంగిక కోరికలు ఉండవని అర్థం. ఆ కోరికలు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించాలనే దేవుని సంకల్పాన్ని బట్టి మనకూ (మనుషులకు) జంతువులకూ మాత్రమే అనుగ్రహించబడ్డాయి (ఆదికాండము 1:21,22, 1:27,28).
మరి లైంగిక కోరికలే లేని దేవదూతలు మానవ స్త్రీల అందానికి ఎలా ఆకర్షితులయ్యారు?. ఉదాహరణకు, నాకు ఆకలివేస్తుంది కాబట్టి అన్నం తింటాను, అది నా స్వభావం. ఒకవేళ నా స్వభావంలో ఆకలే లేకపోతే దానిని పుట్టించుకుని తినవలసిన అవసరం నాకు ఉండదు కదా!. ఎందుకంటే దానికోసం మళ్ళీ శ్రమపడాలి. పైగా మానవ స్త్రీలను వివాహం చేసుకున్న ఆ దేవుని కుమారులు పిల్లలను కూడా కన్నట్టుగా చదువుతున్నాం (ఆదికాండము 6:4). దేవుడు స్త్రీ పురుషుల కలయిక ద్వారా పిల్లలు జన్మించేలా నియమించాడు. ఆ ప్రక్రియ దేవదూతలు కూడా మానవ దేహాన్ని ధరించుకుంటే కొనసాగుతుందా?. నేనైతే దీనికి అంగీకరించను. దేవుడు మాత్రమే సృష్టికర్త అయినప్పుడు దేవదూతలు తమంతట తాముగా మానవదేహాలను అది కూడా ప్రత్యుత్పత్తి చేసే సామర్థ్యంతో ఎలా సృష్టించుకోగలిగారు? దేవదూతలు కూడా సృష్టికర్తలేనా? కాదు.
అయితే దేవదూతలు ఎందుకలా చేసారు? వారికి ఆ అవసరం ఏముంది? అని పైన నేను ప్రస్తావించిన ప్రశ్నకు కొందరు వారు దేవుడు చేసిన నరులను (సృష్టిని) పాడుచెయ్యాలనే ఉద్దేశంతో అలా చేసారని చెబుతుంటారు. కానీ వాక్యభాగాన్ని పరిశీలించినప్పుడు, వారు నరుల కుమార్తెలను వివాహం చేసుకోవడానికి వారి అందమే (చక్కనివారని చూసి) కారణమని స్పష్టంగా రాయబడింది. వారు అలా చెయ్యడానికి కారణమేంటో లేఖనం అంత స్పష్టంగా చెబుతున్నప్పుడు అది పక్కనపెట్టేసి ఇంకేదో కారణం చెప్పడం సమంజసం కాదు.
మరికొందరు ఇక్కడ చెప్పబడుతున్న దేవదూతలు అప్పటికే పతనమైన దేవదూతలని వారు దేవునిపై కోపంతోనే అలా చేసారని కూడా చెబుతుంటారు. యూదా చరిత్రకారుడైన ప్లేవియస్ జోసెఫస్ రచనల్లోనూ (The antiquities of the Jew), book of Enoch లోనూ మిగిలిన కొన్ని యూదా రచనల్లో కూడా ఈ దేవుని కుమారులు దేవదూతలే అని, నెఫీలీయులు వారి సంతానమే అని రాయబడింది. అదే నిజమైతే పతనమైన దేవదూతలు కూడా దేవుని కుమారులుగానే పిలవబడతారా? పతనమైన ఆ దూతలు అబ్రాహాము, లోతు దగ్గరకు వెళ్ళినప్పటివలే మానవదేహాన్ని ధరించుకోలరా? పైన తెలియచేసినట్టుగా లేఖనంలో దీనికి ఒక్క ఆధారం కూడా లేదు. మళ్ళీ చెబుతున్నాను. వాక్యంలో రాయబడినదాని ప్రకారం; దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకోవడానికి వారి అందమే కారణం తప్ప, దేవునిపై కోపం కూడా కారణం కాదు.
అయితే ఈ దేవుని కుమారులు దేవదూతలే అని వాదించేవారు దానికి ప్రధానమైన ఆధారంగా యూదాపత్రిక నుండి "మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను" (యూదా 1:6,7) అనే వాక్యభాగాన్ని చూపిస్తుంటారు.
అక్కడ యూదా దేవదూతలు చేసిన పాపం గురించి ప్రస్తావిస్తూ "ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు" అంటున్నాడు. అంటే ఈమాటల్లో దేవదూతలు చేసిన పాపం సొదొమ గొమొఱ్ఱాలు చేసిన పాపం ఒక్కటే (వ్యభిచారం) అని అర్థం వస్తుంది. దేవుని కుమారులు (దేవదూతలు) చేసినదానినే యూదా తన పత్రికలో ప్రస్తావిస్తున్నాడని వీరు చెబుతుంటారు. అయితే మనం మాట్లాడుకుంటున్న దేవునికుమారులు వ్యభిచారం చేసారా? లేక వివాహం చేసుకున్నారా?. వివాహమే కదా!.
"దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి"
కాబట్టి యూదా మాటలకు వీరు చెబుతున్న వ్యాఖ్యానం ప్రకారం దేవదూతలు వ్యభిచారం చేసారు అనుకున్నప్పటికీ ఈ దేవుని కుమారులు యూదా చెబుతున్న దేవదూతలే అని రుజువు చెయ్యలేరు. ఎందుకంటే వారు వివాహం చేసుకున్నారు. వ్యభిచారం చెయ్యలేదు. లేఖనంలో ఎక్కడా కూడా వివాహం వ్యభిచారంతో పోల్చబడలేదు. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధమైన కలయిక, వ్యభిచారం అనేది పతనస్వభావం నుండి పుట్టుకొచ్చిన పాపపు కోరిక (హెబ్రీ 13:4).
ఇకపోతే యూదా తన పత్రికలో "వీరివలెనే" అని సొదొమ గొమొఱ్ఱా పట్టణస్థు గురించి మాట్లాడుతున్నప్పుడు అతను దేవదూతలను ఉద్దేశించి కాదు కానీ అతను మొదటివచనం నుండీ ఎవరి గురించైతే మాట్లాడుతున్నాడో వారిని ఉద్దేశించే ఆ పదప్రయోగం చేసాడు.
యూదా 1:4-8 ఏలయనగా "కొందరు" రహస్యముగా జొరబడియున్నారు. "వారు" భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు "వారు" పూర్వమందే సూచింపబడిన వారు. ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్న దేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును "వీరివలెనే" వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలెనే "వీరును" కలలు కనుచు, శరీరమును అపవిత్ర పరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు.
ఈ సందర్భం అంతటినీ మనం పరిశీలించినప్పుడు యూదా అప్పటి సంఘంలో కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తున్న (వ్యభిచారం చేస్తున్న) వారిని ఉద్దేశించి మాట్లాడుతూ దేవుని తీర్పు గురించి హెచ్చరిస్తున్నాడు. ఆయన దృష్టికి పాపం చేసిన ఇశ్రాయేలీయులను ఆయన విడిచిపెట్టలేదు, తమ ప్రధానత్వాన్ని విడిచిపెట్టిన దూతలను ఆయన విడిచిపెట్టలేదు. అదేవిధంగా "వీరివలెనే" (కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తున్న వీరివలెనే) వ్యభిచారం చేసిన సొదొమ గొమొఱ్ఱా పట్టణస్థులను కూడా ఆయన విడిచిపెట్టలేదు. అలా ఆయన వీరిని కూడా విడిచిపెట్టడు అనేదే అతని మాటల సారాంశం. అంతేతప్ప అతను దేవదూతలు వ్యభిచారం చేసారని చెప్పట్లేదు.
ఇక ఈ దేవుని కుమారులు దేవదూతలే అనేవారు వారికీ మానవ స్త్రీలకూ పుట్టినపిల్లలను కూడా మరో ప్రాముఖ్యమైన ఆధారంగా తీసుకుంటారు. ఎందుకంటే వారి గురించి "ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే" (ఆదికాండము 6:4) అని రాయబడింది.
దేవుని కుమారులకూ మానవస్త్రీలకూ జన్మించిన ఆ నెఫీలులను ఇంగ్లీష్ బైబిల్ లో Giants అని తర్జుమా చెయ్యడం జరిగింది. హీబ్రూలో ఈ נפלים (Nephilim) అనేదానికి Fall (పతనం) అనే అర్థం వస్తుంది. వీరు సాధారణ మనుషులకంటే ఉన్నత దేహులు. ఆవిధంగా దేవుని కుమారులు దేవదూతలు కాబట్టే వారి సంతానమైన వీరు ఉన్నతదేహులుగా జన్మించారనేది వారి వాదన. ఈ నెఫీలీయులు ఉన్నతదేహులు అనడంలో మనకు ఏ సందేహమూ లేదు కానీ దేవుని కుమారులకూ నరుల కుమార్తెలకూ పుట్టిన అందరూ ఉన్నత దేహులేనా (నెఫీలీయులు) లేక కొందరే అలా ఉన్నారా అనేది నా ప్రశ్న. పైగా ఈ నెఫీలీయులు "తర్వాత కూడా" (జలప్రళయం తర్వాత కూడా) ఈ భూమిపై ఉన్నారని రాయబడింది (ఆదికాండము 6:4). ఆ సందర్భాలన్నీ సంఖ్యాకాండము 13:32,33, ద్వితీయోపదేశకాండము 2:10, 9:2 లలో మనకు కనిపిస్తాయి. దావీదు కాలంలో కూడా గొల్యాతు, రెఫామీయుల సంతతివారు ఉన్నత దేహులుగానే పేర్కోబడ్డారు (2 సమూయేలు 21:20). ఒకవేళ ఈ నెఫీలీయులు దేవదూతలకూ మానవస్త్రీలకూ పుట్టిన పిల్లలే ఐతే జలప్రళయంలో వారంతా నాశనమయ్యాక కూడా తర్వాత మళ్ళీ ఎలా ఉన్నారు?. కొందరు దీనికి నోవహు కుమారుడైన హాము భార్య ద్వారా ఆ జన్యువుల సంక్రమించాయని చెబుతుంటారు. కానీ ఇది నమ్మశక్యం కానటువంటి సమాధానం.
ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలపై ఉన్న రెండవ అభిప్రాయం ప్రకారం; ఆదికాండము నాలుగవ అధ్యాయంలో దుష్టుడైన కయీను సంతానం ఎలా విస్తరించిందో రాయబడింది, ఆ సంతానంలో హత్యలు చేసేవారూ బహు భార్యాత్వం కలిగినవారు (లెమెకు) మనకు కనిపిస్తారు. ఐదవ అధ్యాయంలో విశ్వాసియైన షేతు సంతానం గురించి రాయబడింది, ఆ సంతానంలో మనకు దేవునితో నడచినవారు (హనోకు, నోవహు) యెహోవా నామమున ప్రార్థన చేసినవారు (ఎనోషను) దర్శనమిస్తారు. ఈ రెండు వంశావళులూ రాయబడిన తర్వాతి అధ్యాయంలో (6వ) ఈ సంఘటన జరగడం వల్ల, అక్కడ దేవుని కుమారులంటే షేతు సంతానమని, నరుల కుమార్తెలంటే కయీను సంతానమని వీరు భావిస్తారు. లేఖనాలలో విశ్వాసులను దేవుని కుమారులుగా సంబోధించబడడం మనకు సాధారణంగానే కనిపిస్తుంటుంది (రోమీయులకు 8:14).
కానీ ఆ దేవుని కుమారులు ఆత్మీయతకు కాకుండా అందానికే ప్రాముఖ్యతను ఇస్తూ కయీను సంతానపు వారిని వివాహం చేసుకోవడం వారికి పాపమైంది అంట. అలా వారు చెడిపోవడమే కాకుండా వారికి పుట్టిన పిల్లలు కూడా బలాత్కారులుగా (నెఫీలీయులకు తెలుగు బైబిల్ లో పుట్ నోట్) తయారయ్యారనేది వీరి వాదన. ఎందుకంటే ఇలాంటి మిశ్రిత వివాహాల వల్ల వారి కుటుంబవ్యవస్థ తప్పకుండా దెబ్బతింటుంది.
మరి వారికి పుట్టిన పిల్లలు ఉన్నతదేహులుగా ఎలా ఉన్నారనే ప్రశ్నకు కూడా వీరు, అప్పటిప్రజల ఆయుష్షును ఉదాహరణగా తీసుకుంటూ అలానే వారిలో కొందరి దేహాలు కూడా పెద్దవిగా ఉన్నాయని (జన్యుపరమైన మార్పులు) సమాధానం ఇస్తుంటారు. అందుకే జలప్రళయం తర్వాత కాలంలో కూడా వారి ఉనికి ఉందట (సంఖ్యాకాండము 13:32,33, ద్వితీయోపదేశకాండము 2:10, 9:2). అయితే షేతు సంతానం కూడా నరులే అయినప్పుడు, మానవులకు నరులని దేవుడే పేరుపెట్టినప్పుడు, మోషే ఈ 6వ అధ్యాయంలో మాత్రం కయీను సంతానాన్ని నరుల కుమార్తెలని, షేతు సంతానాన్ని దేవుని కుమారులని వేరువేరుగా ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం ఔతుంది. కానీ ఈ ప్రశ్న ఈ వాదనను కాదనేంత బలీయమైనది కాదు. ఎందుకంటే నరులు అనేది అందరినీ ఉద్దేశించి సాధారణంగా వాడే పదమే అయినప్పటికీ (నరులు భూమిమీద విస్తరించనారంభించినప్పుడు) వారినుండి విశ్వాసులను ప్రత్యేకించి చూపించడానికి మోషే వారిని దేవుని కుమారులని ప్రస్తావించియుండవచ్చు కదా!. కానీ నాకు ఈ వాదనలో కలిగిన అసలైన అభ్యంతరాలు ఏంటంటే నెఫీలీయులు ఉన్నతదేహులుగా ఎందుకున్నారు అనే ప్రశ్నకు అప్పటి ప్రజల ఆయుష్షును బట్టి చెప్పే సమాధానం సరైందైతే ఆ సంఘటన జరగడానికి ముందు అలాంటివారు ఎందుకు పుట్టలేదు? అలానే విశ్వాసులైన వీరు షేతు సంతానంలో అందగత్తెలు లేరనే కయీను సంతానపు స్త్రీలను వివాహం చేసుకున్నారా?
అందుకే నేను ఈ రెండు అభిప్రాయాలకంటే మూడవ అభిప్రాయాన్నే ఎక్కువగా విశ్వసిస్తున్నాను. అదేంటంటే; DR. John Gill గారు తన ఆదికాండము 6 వ్యాఖ్యానంలో యూదులకు చెందిన Targums of Onkelos and Jonathan, Jarchi and Aben Ezraలలో అక్కడ ఈ "దేవునికుమారులను" గొప్పవ్యక్తులు, న్యాయాధిపతులు, బలవంతులు పాలకులుగా వివరించారని తెలియచేసాడు. కాబట్టి పురాతన యూదులు "Benay ha Elohim" అన్నప్పుడు ఇలాంటివారిని కూడా పరిగణలోకి తీసుకునేవారని మనకు అర్థమౌతుంది. ఆవిధంగా "Benay ha Elohim" (దేవుని కుమారులు) అనేది అప్పుడు కొందరు కలిగియున్న బిరుదు (Title). కాబట్టి నాకు దేవునికుమారులు అనగానే లేఖనాల ప్రకారం విశ్వాసులు అని భావించడం కంటే చరిత్రను బట్టి కొందరు కలిగియున్న బిరుదుగా (Title) గా భావించడమే సరి అనిపించింది. ఉదాహరణకు; నిమ్రోదుకు "అతడు యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తికలదు" (ఆదికాండము 10:9) అని బిరుదు ఉంది. నిజానికి యూదా చరిత్ర ప్రకారం అతను మంచివాడు కాదు. కాబట్టి ఈ దేవుని కుమారులను విశ్వాసులుగా భావించనక్కర్లేదు. వీరు ఆ ప్రజల్లో గొప్పవారు బలవంతులు కాబట్టి "Benay ha Elohim" అని పిలవబడ్డారు. అలానే తమకున్న బలాన్నీ అధికారాన్నీ ప్రదర్శించి ఇష్టానుసారంగా వివాహాలు చేసుకున్నారు. అలాంటి వివాహాలు దేవుని చిత్తం కాదు అందుకే ఆయన వాటిని నేరంగా చూసాడు. బహుశా ఆయన శాపం కారణంగానే వారి పిల్లలు ఇతరులకంటే భిన్నంగానూ మరింత నాశనం కలిగించేవారిగానూ పుట్టియుండవచ్చు. తర్వాత కాలంలో కూడా శపించబడిన జాతుల్లోనే అలాంటి ఉన్నతదేహులను మనం చూస్తున్నాము (ఆ వాక్యభాగాలు ఇప్పటికే ప్రస్తావించాను).
ఏది ఏమైనప్పటికీ ఈ దేవునికుమారులు మనుషులే అనేది మాత్రం సత్యం. దీనికి 3వ వచనంలోని "అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించడు" అనే మాటలు కూడా మంచి ఆధారంగా ఉన్నాయి.
ఆదికాండము 6:3 అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు (మూలభాషను బట్టి ఇక్కడ 'వాదించడు' అనేది సరైన అనువాదం; 'వాదించదు' అని తెలుగు బైబిల్లో ఉన్న స్త్రీలింగ/తటస్థ లింగ పదప్రయోగం అనువాదలోపం అని గమనించాలి). వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.
ఈ వచనంలో దేవుడు నరుల అక్రమం గురించి మాట్లాడడం మనం చూస్తాం. దీనిప్రకారం పై వచనాలలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఇద్దరూ కూడా నరులేయనే వాదన మరింతగా బలపడుతుంది. ఎందుకంటే అక్కడ పాపం చేసిన ఇద్దరూ నరులు కాబట్టే దేవుడు నరుల గురించి మాట్లాడుతున్నాడు. అయితే దేవుని కుమారులు దేవదూతలని నమ్మేవారు, ఈ వచనానికీ పై రెండు వచనాలకూ మధ్యలో చాలా సమయం గడచిందని, దేవుని కుమారులు (దేవదూతలు) మానవ స్త్రీలను వివాహం చేసుకోగా జన్మించిన నెఫీలీయుల కారణంగా అప్పుడున్న మనుషులంతా చెడిపోయారని, వారు మనుషులకు దైవవిరుద్ధమైన చాలా కార్యాలను నేర్పించారని Book of Enochలో రాయబడిన కొన్నిమాటల ఆధారంగా చెబుతుంటారు. ఆ నెఫీలీయుల వల్ల చెడిపోయిన నరుల గురించే దేవుడు ఈ సందర్భంలో ఇలా మాట్లాడుతున్నాడు అంట.
కానీ 4వ వచనంలోని "ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే" అనే మాటల ప్రకారం; దేవుడు ఈమాటలు పలికేసరికి నెఫీలీయులు కూడా ఈ భూమిపైనే ఉన్నారు. దేవుడు వారిని కూడా నరులనే సంబోధిస్తున్నాడు. ఎందుకంటే 5వ వచనం ప్రకారం ఆయన "నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డది" అని నరుల చెడుతనాన్ని ప్రస్తావించి, 7వ వచనంలో ఆ నరులను నాశనం చేస్తాను అంటున్నాడు.
"అప్పుడు యెహోవా నేను సృజించిన నరులును నరులతో కూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాననెను"
ఒకవేళ నెఫీలీయులు దేవదూతలకూ మనుషులకూ పుట్టినవారే ఐతే వారు పూర్తిగా నరులు ఎలా ఔతారు? దేవునికుమారులు దేవదూతలే అని అంటున్నవారి వాదనప్రకారం వారు ఒక విధంగా రాక్షసజాతి కదా!.
అదేవిధంగా, ఆ సందర్భంలో దేవుడు నా ఆత్మనరులతో ఎల్లప్పుడూ వాదించడని పలకడం మనం చూస్తాం. దీనికి ఆయన ఆత్మ (పరిశుద్ధాత్మ) నరులు చేస్తున్న పాపాన్ని చూస్తూ వారిని శిక్షవిధించకుండా వాదిస్తూనే (భరిస్తూనే) ఉండడని అర్థం. అందుకే వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులు (శరీరస్వభావం గలవారు/దైవవిరుద్ధంగా శరీరేచ్చలు నెరవేర్చుకునేవారు) అయినప్పుడు దేవుడు వారిని నాశనం చేసే ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. అలాంటి శరీరస్వభావం గలవారి గురించి ఏమని రాయబడిందో చూడండి.
రోమీయులకు 8:7-10,12,13 ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము. "మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు" గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.
"అయిననూ వారి దినములు 120 యేండ్లగుననెను"
దేవుడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించడని (శిక్షవిధించకుండా భరించడని) చెబుతున్న క్రమంలోనే ఈమాటలు కూడా పలకడం మనం గమనిస్తాం. దీనిని కొందరు అప్పటినుండి మానవుల ఆయిష్షును ఆయన 120 యేళ్ళకు కుదించివేసాడని అపార్థం చేసుకుంటుంటారు. కానీ, ఇది మానవుల ఆయుష్షుకోసం చెప్పబడినమాట కాదు. ఎందుకంటే 11వ అధ్యాయం ప్రకారం; నోవహు కుమారుల సంతానం వందల సంవత్సరాలు బ్రతికినట్టు మనం చూస్తాం. అదేవిధంగా అబ్రాహాము 175 సంవత్సరాలు బ్రతికాడు (ఆదికాండము 25:7), ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు (ఆదికాండము 35:28), యాకోబు కూడా 147 సంవత్సరాలు బ్రతికాడు (ఆదికాండము 47:28).
కాబట్టి ఆ సందర్భంలో దేవుడు వారి దినములు 120 యేండ్లగును అనంటే అది మానవుల ఆయుష్షుకోసం కాదు కానీ అప్పుడున్న మనుషుల అంతం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ మాటలు పలికినప్పటినుండి జలప్రళయం వచ్చి వారిని నాశనం చేసేవరకూ మధ్య ఉన్న సమయమే ఆ 120 సంవత్సరాలు. దేవుడు ఈ మాటలు పలికే సమయానికి నోవహుకు ఇంకా కుమారులు జన్మించలేదు. ఎందుకంటే ఆదికాండము 5:32 ప్రకారం; నోవహు 500 యేండ్లకు కుమారులను కన్నాడు. ఆదికాండము 7:6 ప్రకారం; నోవహుకు 600 యేండ్లు వచ్చినప్పుడు రెండవనెలలో జలప్రళయం వచ్చింది. దీనిప్రకారం, దేవుడు ఈ మాటలు పలికేసరికి నోవాహు వయస్సు 480 సంవత్సరాలు.
గమనించండి. దీర్ఘశాంతుడైన దేవుడు అప్పటి నరులు పాపం చెయ్యగానే వారిని అంతం చెయ్యకుండా వారికి 120 సంవత్సరాలు గడువు ఇచ్చాడు. అప్పటికి కూడా వారిలో ఎవరూ మార్పుచెందనప్పుడు ఆయన తన ఉగ్రతను వారిపై కురిపించి నాశనం చేసాడు. దీనిని బట్టి, దేవుడు దీర్ఘశాంతుడు అనగానే ఎల్లప్పుడూ మన పాపాలను భరించేవాడిగా మనం భావించకూడదు. మారుమనస్సు పొందడానికి ఆయన ఈరోజు ఇచ్చిన అవకాశం రేపు ఇవ్వకపోవచ్చు, కాబట్టి సమయం ఉండగానే మన తప్పులు సరిచేసుకోవాలి. ఈ వాక్యభాగాలు పరిశీలించండి.
కీర్తనలు 50: 21 ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను.
యిర్మియా 13:16 ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకము నుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవు డైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి.
ప్రకటన 2:21,22 మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడ వ్యభిచరించు వారు దాని క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును.
ఆదికాండము 6:4 ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే.
ఈ నెఫీలుల గురించి ఇప్పటికే పైన మనం విస్తృతంగా చర్చించుకున్నాము. వీరిని మన తెలుగు బైబిల్ పుట్ నోట్ లో బలత్కారులు అని పేర్కోవడం జరిగింది. ఎందుకంటే వీరు అప్పటి సమాజంలో తమకంటే బలహీనులపై దౌర్జన్యం జరిగిస్తూ హింసకు మరోపేరుగా నిలిచారని కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం. వీరు శూరులు అన్నప్పుడు అది వీరి బలాన్ని సూచిస్తుంది.
ఆదికాండము 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి-
ఈ వచనం మానవుడు చేసే క్రియలను బట్టే కాదు అతని ఊహను బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడని తెలియచేస్తుంది, ఎన్నో లేఖనాలు దీనికి సాక్ష్యంగా ఉన్నాయి (యిర్మియా 17:9,10, 1 కోరింథీ 4:5).
దేవుడు మనిషిని తనకు అనుకూలమైన ఆలోచనలు, ఊహలు కలిగియుండాలనే ఉద్దేశంతోనే ఆలోచించే ఊహించే వ్యక్తిగా తయారుచేశాడు (మనసాక్షి కలిగినవాడిగా). కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి దైవ విరుద్ధమైన ఆలోచనలతో ఊహలతో జీవిస్తాడో అప్పుడే ఆయన యెదుట పాపిగా తీర్పు పొందుకుంటాడు. ఎందుకంటే ప్రతీ పాపమూ క్రియారూపం దాల్చడానికంటే ముందుగా మానవుని ఆలోచనలోనే రూపుదిద్దుకుంటుంది. అలానే ప్రతీపాపమూ ఆయన పరిశుద్ధస్వభావానికి వ్యతిరేకంగానే చెయ్యబడుతుంది. కాబట్టి దేవునిపిల్లలు, దైవవిరుద్ధమైన ఆలోచనలకూ ఊహలకూ మనసులో తావివ్వకుండా జాగ్రతపడాలి, ఆ విధంగా ప్రేరేపించేవాటికి దూరంగా ఉండాలి. ప్రస్తుత సినిమాలు, ఇతర చిత్రీకరణలు, నవలలు చాలామట్టుకు మనిషిని ఈవిధంగానే ప్రేరేపిస్తున్నాయి.
సామెతలు 4: 23 నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.
ఫిలిప్పీయులకు 4:8 మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి.
ఈ వ్యాసం చదవండి.
సినిమాలు-క్రైస్తవులు
ఆదికాండము 6:6 తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకొనెను.
ఈ వచనంలో దేవుడు నరుల పాపాన్ని బట్టి వారిని చేసినందుకు సంతాపపడి, హృదయంలో నొచ్చుకున్నట్టు మనం చూస్తాం. అయితే సార్వభౌముడైన దేవునికి ఈ సృష్టిని చెయ్యకముందే అలా జరుగుతుందని తెలుసు, తెలిసే ఆయన ఈ సృష్టిని చేసాడు. అయినప్పటికీ ఆయనకు విరుద్ధమైన కార్యం సృష్టిలో జరుగుతున్న సమయంలో ఆ పాపం పట్ల తన వ్యతిరేఖ భావాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటాడు, దానిద్వారానే లోకానికి తీర్పుతీరుస్తాడు. ఈ సందర్భంలో అదే జరుగుతుంది.
కీర్తనలు 5:4 నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు.
హబక్కూకు 1:13 నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా.
అదేవిధంగా మొదటి అధ్యాయపు వ్యాఖ్యానంలో దేవునికి మనవలే శరీరం ఉన్నట్టుగా వర్ణించబడిన పద్ధతిని Anthropomorphism (మానవునికి అర్థమయ్యేలా కనిపించడం) అంటారని వివరించాను (ఆదికాండము 1:26 వ్యాఖ్యానం చూడండి). ఈ వచనంలో ఐతే మానవునికి ఏ విధంగా భావనలు పుడుతాయో అలాంటి భావనలే దేవునికి కూడా పుడుతున్నట్టుగా వర్ణించడం జరిగింది (సంతాపపడడం, నొచ్చుకోవడం). కానీ దేవునికి హృదయంలో ఆలోచనలు, బాధలు (సంతాపం) సందర్భాన్ని బట్టి మనకు పుట్టినట్టుగా పుట్టవు. ఎందుకంటే ఆయన నిత్యుడు (యెషయా 40:28), ఆయన మార్పులేనివాడు (మలాకీ 3:6). తన చిత్తం విషయంలో విఫలం కానివాడు (దానియేలు 4:35, యెషయా 46:10, యోబు 42:2). కాబట్టి దేవునికి పాపం పట్ల ఉండే వ్యతిరేక వైఖరి మనకు అర్థమయ్యేలా తెలియచెయ్యడానికే ఆయనకు కూడా సమయాన్ని బట్టి భావనలు పుడుతున్నట్టుగా (సంతాపం, నొచ్చుకోవడం) ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మానవుని భావనలను దేవునికి ఆపాదించి మాట్లాడడాన్ని Anthropopathism అంటారు.
ఆదికాండము 6:7 అప్పుడు యెహోవా నేను సృజించిన నరులును నరులతో కూడ జంతువులును పురుగులును ఆకాశపక్ష్యాదులును భూమి మీదనుండకుండ తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునొంది యున్నాననెను.
ఈ వచనంలో దేవుడు నరులతో సహా జీవరాశులను కూడా నాశనం చెయ్యబోతున్నట్టు ప్రకటించడం మనం చూస్తాం. మానవుడు చేసే పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత కొన్నిసార్లు సమస్త జీవరాశుల మీదకు కూడా వస్తుంటుంది. ఎందుకంటే ఆయన ఈ సృష్టిలో సమస్తం మానవుని కోసమే సృష్టించాడు, మానవుడిని వాటన్నిటిపై ఏలికగా నియమించాడు.
ఆదికాండము 6:8 అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.
ఈ వచనంలో దేవుడు రప్పించబోతున్న జలప్రళయంలో నశించిపోకుండా నోవహు ఆయన కృపను పొందుకోవడం మనం చూస్తాం. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. పై వచనాలలో దేవుడు నరులందరినీ నాశనం చేస్తానని పలికినట్టు రాయబడింది. దానర్థం, నరులను చెయ్యడంలో ఆయనకున్న ఉద్దేశం విఫలమైనట్టు కాదు. ఒకవేళ అదే నిజమైతే ఆయన నోవహును కూడా కాపాడకుండా నశింపచేసి ఉండేవాడు. కానీ దుష్టుడైన కయీను సంతానాన్ని సమూలంగా నాశనం చేసి, షేతు సంతానమైన నోవహు మూలంగా ఈ భూమిని నిండించాలన్నదే దేవుని చిత్తం కాబట్టి ఆయన నోవహునూ అతని కుటుంబాన్నీ కాపాడుతున్నాడు.
యెషయా 46: 10 "నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు", చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.
యోబు 42:2 నీవు సమస్త క్రియలను చేయగలవనియు "నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు" నేనిప్పుడు తెలిసికొంటిని.
అదేవిధంగా నోవహు యెహోవా దృష్టియందు కృపపొందినవాడు అంటే అది అతని గొప్పతనమో అతను చేసిన మంచిపనుల గొప్పతనమో కాదు. కృప అంటే అది పొందుకోవడానికి మనం యోగ్యులం కానప్పటికీ ఆ అర్హత మనకు లేనప్పటికీ ఆయన మనపై దృష్టి నిలపడం, కరుణించడం (దానం). ఈరోజు మనం కూడా నోవహు వలే దేవుని దృష్టియందు కృపపొందబట్టే రక్షించబడ్డాం, విశ్వసించాం. అది మన గొప్పతనం వల్ల కానీ మనం చేసిన మంచిక్రియల వల్ల కానీ కాదు. అందుకే పౌలు "మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే" (ఎఫెసీ 2:8) అని రాస్తున్నాడు.
ఆదికాండము 6:9 నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.
ఈ వచనంలో నోవహు నీతిపరుడునూ తన తరంలో నిందారహితుడిగానూ ఉండి దేవునితో నడుస్తున్నట్టు మనం చూస్తాం. కానీ నోవహు జలప్రళయం నుండి రక్షించబడడానికి కేవలం దేవుని కృపయే కారణమని ఇప్పటికీ వివరించుకున్నాం. కాబట్టి ఇక్కడ నోవహు దేవునితో నిందారహితుడిగా నీతిపరుడిగా నడవడానికి కూడా ఆయన కృపయే కారణం. ఎందుకంటే నోవహు ఆ విధంగా నడుచుకునేలా దేవునికృపనే అతనికి బోధించింది, మనకు కూడా బోధిస్తుంది (తీతుకు 2:11-13). కాబట్టి ప్రతీకాలంలోనూ
దేవుని కృప పొందినవారు, ఈ నోవహులానే ఈలోకంనుండి ప్రత్యేకించబడి దేవునికి శేషంగా జీవిస్తారు (దేవునితో నడుస్తారు). ఇది వారి గొప్పతనం కాదు కానీ దేవుని కృపను బట్టే అది వారికి సాధ్యమౌతుంది.
ఆదికాండము 6:10 షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను.
ఈ వచనంలో నోవాహు ముగ్గురు కుమారుల పేర్లూ రాయబడడం మనం చూస్తాం. జలప్రళయం తర్వాత వీరినుండే మానవజాతి విస్తరించింది (ఆదికాండము 10).
ఆదికాండము 6:11 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.
ఈ వచనంలో భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయి, బలాత్కారంతో నిండియున్నట్టు మనం చూస్తాం. ఈ భూమిపై జరిగే ఏ పాపమూ కూడా దేవుని సన్నిధిని మరుగైయుండలేదని ఇది ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాయి. చివరికి అవి మనకే తెలియని మన రహస్య పాపాలు కూడా. అందుకే మోషే "మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడుచున్నవి" (కీర్తనలు 90:8) అని అంటున్నాడు. "చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధ కారమును వెలుగులోనికి రప్పించును" (యోబు 12:22) అని కూడా రాయబడింది.
ఆదికాండము 6:12 దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయియుండెను; భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.
ఈ వచనంలో దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నట్టుగా మనుషులంతా తమ మార్గాన్ని చెరిపివేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ "దేవుడు చూచెను" అన్నప్పుడు కూడా ఆ మాటలు మనకు అర్థమయ్యేలా Anthropomorphism పద్ధతిలో చెప్పబడ్డాయి. వాస్తవానికి ఆయన మనవలే ఒక్కోసారి ఒక్కో ప్రదేశాన్ని చూడడు. ఆయనకు తన సమస్త సృష్టిలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అంతా తెలుసు (కీర్తనలు 139:4,7-12).
అదేవిధంగా సమస్తశరీరులూ తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు అనంటే దేవుడు వారిముందు ఒక మార్గాన్ని పెట్టినట్టుగా మనకు అర్థమౌతుంది. కాబట్టి ఏ కాలంలో అయినా దేవుని మార్గం మనుషులకు మరుగైయుండలేదు. వారు ఎలా జీవించాలో ఆయన బోధిస్తూనే ఉన్నాడు. మనసాక్షి ద్వారా కొంత, తన భక్తుల ద్వారా మరికొంత ఆ మార్గం బోధించబడుతూనే ఉంది. ఈ వ్యాసం చదవండి.
మోషే ధర్మశాస్త్రానికి ముందు నైతిక ఆజ్ఞలు లేవా?
ఆదికాండము 6:13 దేవుడు నోవహుతో సమస్తశరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.
ఈ వచనంలో దేవుడు భూమిపైకి రాబోతున్న తన తీర్పు గురించి నోవహుకు తెలియచెయ్యడం మనం చూస్తాం. దీనిని బట్టి అప్పటి ప్రజల పాపం సంపూర్ణమైనట్టుగా మనకు అర్థమౌతుంది. ఎందుకంటే దేవుడు వారి పాపం పరిపూర్ణమవ్వకుండా ఎవరికీ తీర్పు తీర్చడు, అవకాశం ఇస్తూనే ఉంటాడు (ఆదికాండము 15:16, ఆదికాండము18:20,21).
ఆదికాండము 6:14-16 చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయ వలెను. నీవు దాని చేయవలసిన విధమిది; ఆ ఓడ మూడువందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల యెత్తును గలదై యుండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను; ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను; క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను.
ఈ వచనాలలో దేవుడు నోవహుకు ఓడ కట్టమని ఆజ్ఞాపించి దానిని ఎలా నిర్మించాలో వివరించడం మనం చూస్తాం. ఇక్కడ మన తెలుగు బైబిల్ లో "చితిసారకపు" అని తర్జుమా చేసిన చోట హీబ్రూలో גּפֶר (gopher) అనే పదం వాడారు ఇది ఒక చెట్టు పేరు. అదేవిధంగా ఇక్కడ మూరలు అన్నప్పుడు అప్పటి ఈజిప్టువంటి దేశాల కొలమానం ప్రకారం 18 నుండి 28 అంగుళాలు దాకా ఉంటుందని కొందరు బైబిల్ పండితులు వెల్లడించారు.
అయితే ఇక్కడ దేవుడు ఓడకొలతల గురించి వివరించినదానిని కొందరు వక్రీకరించి బైబిల్ లో కూడా వాస్తు ఉందని బోధిస్తుంటారు. కానీ బైబిల్ వాస్తు వంటి మూఢనమ్మకాలను ఎక్కడా ప్రోత్సహించదు, సమర్థించదు. ఇక్కడ దేవుడు నోవాహుకు వాస్తు ప్రకారం కొలతలు ఇవ్వడం లేదు కానీ ఆ ఓడ పరిమాణం ఏమేరకు ఉండాలో దానికి మాత్రమే కొలతలు ఇస్తున్నాడు. ఎందుకంటే; ఆ ఓడలో నివశించబోయే నోవహు కుటుంబానికీ మిగిలిన జీవరాశులన్నిటికీ వారందరికీ కావలసిన ఆహారం నిల్వచేయడానికీ అది ఎంత పరిమాణంలో ఉండాలో ఏ భాగంలో ఏది పెడితే వారికి నివాసయోగ్యంగా ఉంటుందో ఆయనకు మాత్రమే తెలుసు. ఆ ఓడ ఇప్పటి మన కొలతల ప్రకారం 450 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు, మూడు అంతస్తులు కలపి 45 అడుగుల ఎత్తు కలదిగా ఉంటుంది. ఇది 522 రైలుపెట్టెలకు సమానం.
నోవహు కేవలం దేవుని మాటలపై విశ్వాసంతో తాను కానీ తన పితరులు కానీ చూడని జలప్రళయం నుండి తప్పించుకోడానికి ఇంత పెద్ద ఓడను సిద్ధం చేసాడు కాబట్టే, ఆ తరం వారిపైన నేరస్థాపన చెయ్యగలిగాడు (హెబ్రీ 11:7). అదేసమయంలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా అప్పటిప్రజల మధ్యకు ఆత్మరూపిగా వెళ్ళి వారి మనసాక్షుల ద్వారా వారికి సువార్త ప్రకటించారని లేఖనం చెబుతుంది (1పేతురు 3: 20)
ఆదికాండము 6:17 ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రిందనుండకుండ నాశనము చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును.
ఈ వచనంలో దేవుడు సమస్త భూమిపైకీ జలప్రళయం సంభవించి, జీవవాయువు గల (ఊపిరి తీసుకునే) ప్రతీదీ చనిపోబోతున్నట్టుగా తెలియచెయ్యడం మనం చూస్తాం. ఇక్కడ భూమి అన్నప్పుడు అది ఏదో ఒక ప్రదేశాన్ని సూచిస్తూ అలంకారంగా చెప్పబడిన మాట కాదు. అదే నిజమైతే నోవహు ఓడను కట్టవలసిన అవసరం లేదు, మరో ప్రదేశానికి వెళ్ళి రక్షించబడేవాడు. అదేవిధంగా జీవరాశులను కూడా అతను ఓడలో కాపాడవలసిన అవసరం ఉండేది కాదు. కాబట్టి ఆ జలప్రళయం భూమి అంతటా సంభవించింది. అందుకు శాస్త్రీయ రుజువులెన్నో మనముందు ఉన్నాయి. ఈ ఆధారాలు చదవండి
https://answersingenesis.org/kids/geology/evidence-flood/
ఆదికాండము 6:18 అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును; నీవును నీతోకూడ నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను.
బైబిల్ గ్రంథం అంతటిలోనూ నిబంధన (Covenant) అనే పదం ఈ వచనంలోనే మొదటిసారిగా మనకు కనిపిస్తుంది. అంతకుముందు కూడా దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు (హోషేయా 6:7). దేవుడు మానవులతో చేసిన ఈ నిబంధనలు రెండు విధాలైనవిగా మనకు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది షరతులతో కూడిన నిబంధన. అనగా మానవుడు ఆ షరతులను పాటించినంతవరకే ఆ నిబంధన కొనసాగుతుంది. లేదో కొట్టివెయ్యబడుతుంది ఉదాహరణకు; ఆదాము ముందు మంచిచెడ్డల వృక్షఫలాలను తినకూడదనే ఆజ్ఞ, దేవుడు అతనితో చేసిన నిబంధనకు షరతుగా ఉంది. అతను దానిని మీరాడు ఏదెను నుండి గెంటివెయ్యబడ్డాడు. మోషేతో దేవుడు చేసిన నిబంధన (ధర్మశాస్త్రం) కూడా షరతులతో కూడిన నిబంధనే.
రెండవది కృపతో కూడిన నిబంధన, ఇక్కడ నోవహుతో చెయ్యబడుతుంది అదే. అందుకే నోవహు దేవుని దృష్టికి కృపపొందినవాడు ఆయెనని చెప్పబడింది (ఆదికాండము 6:8). ఇందులో మానవుడి ప్రమేయం లేకుండా దేవుడే దానిని కొనసాగిస్తాడు (రోమా 11:6). అనగా నోవహును ఆయన రక్షించితీరుతాడు, అతని సంతానాన్ని విస్తరింపచేస్తాడు. యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనతో చెయ్యబడింది కూడా ఇలాంటి కృపతో కూడిన నిబంధనే. ఈ నిబంధన ప్రకారం, తాను ఏర్పరచుకున్న వారిని ఆయనే రక్షించి పరలోకరాజ్యం చేరుస్తాడు (1యోహాను 2: 25, 2 థెస్సలోనిక 3:3). ఈ నిబంధన మన క్రియలపై ఆధారపడి ఉండదు కానీ అబ్రహాము తన నీతికి గుర్తుగా సున్నతి పొందినట్టు (రోమా 4:11) మన రక్షణకు ఆ దేవుని క్రియలు రుజువులుగా ఉంటాయి (ఎఫెసీ 2:10). అనగా ఈ నిబంధన క్రిందకు వచ్చినవారు (రక్షించబడినవారు) గ్రుడ్డివాడికి చూపువస్తే లోకాన్ని చూడడం ప్రారంభించినట్టుగా దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలను తప్పక చేస్తారు. ఉదాహరణకు ఈ నోవహులానే లోకం నుండి తనను తాను ప్రత్యేకపరచుకుని దేవునితో నడుస్తారు, ఆయన ఆజ్ఞలను గైకొంటారు. పైన తెలియచేసినట్టు ఈ లక్షణమే (క్రియలే) వారు రక్షించబడ్డారు అనేందుకు సాక్ష్యంగా ఉంటుంది. ఈ అంశం (రక్షణ) గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
రక్షణ యెహోవాదే
ఆదికాండము 6:19,20 మరియు నీతోకూడ వాటిని బ్రదికించియుంచుకొనుటకు సమస్తజీవులలో అనగా సమస్తశరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను; వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. నీవు వాటిని బ్రదికించి యుంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకువాటన్నిటిలోను, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును.
ఈ వచనాలలో దేవుడు జలప్రళయంలో నశించిపోకుండా నోవహు కుటుంబంతో పాటుగా జీవరాశులను కూడా కాపాడబోతున్నట్టు మనం చూస్తాం. ఆయన ఇక్కడ ఆ జీవరాశుల విషయంలో నోవహుకు ఆజ్ఞాపిస్తున్నదానిని బట్టి, ఆయన మనిషికి సాధ్యం కాని భారాన్ని అతనిపై మోపడని అర్థమౌతుంది. ఎందుకంటే ఆయన మొదటిగా కొన్ని జీవరాశులను జతలచొప్పున ఓడలోకి తెమ్మన్నాడు, కానీ అన్నిటినీ నోవహు తేలేడు. అందుకే అలాంటివి తమంతట తాముగా నీదగ్గరకు వస్తాయని తదుపరి మాటల్లో తెలియచేస్తున్నాడు.
అదేవిధంగా నోవహు కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో ఓడను కట్టడం, అక్కడున్న ప్రజలందరి మూఢత్వంపైనా సాక్ష్యంగా ఉంది. అంతేకాకుండా దేవుడు ఆజ్ఞాపించినట్టుగా జంతువులన్నీ జతలు జతలుగా నోవహు దగ్గరకు వస్తున్నప్పుడు, అందులో క్రూరమృగాలు కూడా ఉంటాయి కాబట్టి, ఆ దృష్యాన్ని చూస్తున్న ప్రజలు అది దేవుడు చేస్తున్న కార్యమని నమ్మే అవకాశం మరింత ఎక్కువగా ఉంది. కానీ అప్పటికి కూడా వారు నమ్మలేదు, ఓడలోకి చేరలేదు. తన పాపం సంపూర్ణమైన మనిషి దేవుని కార్యాలు గుర్తించి, పశ్చాత్తాపడలేడని, దేవుని యొద్దకు రాలేడని ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది. ఉదాహరణకు ఫరో వంటి పాపుల విషయంలో ఇలాంటి కఠినస్వభావమే మనం గమనిస్తాం.
ఆదికాండము 6:21 మరియు తినుటకు నానావిధములైన ఆహారపదార్థములను కూర్చుకొని నీదగ్గర ఉంచుకొనుము; అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను.
ఈ వచనంలో నోవహు కుటుంబానికీ అతనితో ఓడలో ఉన్న జీవరాశులకూ ఆహారాన్ని సిద్ధపరచుకునే పనిని దేవుడు నోవహుకు అప్పగిస్తున్నట్టు మనం చూస్తాం. దీనిప్రకారం, మనం పైన వివరించుకున్నట్టుగా నోవహు కృపచేత చెయ్యబడిన నిబంధనలో ఉన్నప్పటికీ పనినుండి మినహాయించబడలేదు. ప్రతీ నిబంధనలోనూ దేవుని పని చెయ్యవలసిన బాధ్యత మనిషిపై ఉంటుంది. కానీ ఆ పనిని బట్టి నిబంధన స్థిరపడడం, కొట్టివెయ్యబడడం మాత్రం జరగదు. ఈరోజు మనముందు కూడా దేవుడు ఆజ్ఞాపించిన పని ఎంతో ఉంది. యేసుక్రీస్తు వలే మనమందరమూ ఆ పనిలో నిమగ్నులమై యుండాలి.
ఆదికాండము 6:22 నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.
ఈ సందర్భంలో నోవహు దేవుడు ఆజ్ఞాపించిన యావత్తూ పూర్తిచేసినట్టు మనం చూస్తాం. ఓడకట్టడం, ఆహారాన్ని సేకరించడం, జీవరాశులను జతలు జతలుగా సమకూర్చడం ఇవన్నీ అతను పూర్తిచేసాడు. దీనికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మనం కచ్చితంగా చెప్పలేము కానీ 3వ వచనం ప్రకారం; ఆయన ఆ ప్రజల ఆయుష్షు 120 యేండ్లు ఔతుందని నిర్ణయించాడు. ఆ అంతం నోవహు యొక్క వయస్సు ఆరువందల సంవత్సరం రెండవ నెలలో సంభవించింది (ఆదికాండము 7:11). దీనిప్రకారం దేవుడు జలప్రళయం ద్వారా భూమిని నాశనం చెయ్యాలని తీర్పు తీర్చేసరికి నోవహు వయస్సు 480 సంవత్సరాలు. అతను 500 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ముగ్గురు కుమారులను కన్నాడు (ఆదికాండము 5:32), ఆ తర్వాత వారు పెద్దవారయ్యే సమయానికి అతను దేవుని చేత ఓడకట్టమని ఆజ్ఞాపించబడ్డాడు. ఎందుకంటే ఆ సందర్భంలో దేవుడు అతనితో మాట్లాడేటప్పుడు అతని కోడళ్ళ ప్రస్తావన కూడా తీసుకువచ్చాడు.
అదేవిధంగా నోవహు ఓడను కడుతుండగా అప్పటిలోకం నుండి అతనికి ఎన్నో విమర్శలు, అవమానాలు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటిప్రజలకు జలప్రళయం అంటే ఏంటో తెలియదు. కానీ నోవహు, వాటన్నిటిని బట్టి కృంగిపోలేదు, తన పనిని ఆపి వెయ్యలేదు. దేవునిపై విశ్వాసంతో ముందుకుసాగాడు. మనం కూడా ఈలోకంలో దేవుని పని చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, అవమానాలు, విమర్శలు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. కాబట్టి మనం వాటన్నిటినీ నోవహులా జయించగలగాలి. మన నిబంధనకు ప్రధానయాజకుడైన యేసుక్రీస్తు అనుభవించిన నిందలు, అవమానాలు, శ్రమలతో పోల్చుకున్నప్పుడు మనం అనుభవిస్తున్నవి ఏమాత్రం ఎంచతగినవి కావని గుర్తించి ముందుకు సాగాలి.
హెబ్రీయులకు 12: 3,4 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 6
6:1,2, 6:3, 6:4, 6:5, 6:6, 6:7, 6:8, 6:9, 6:10, 6:11, 6:12, 6:13, 6:14-16, 6:17, 6:18, 6:19,20, 6:21, 6:22
ఆదికాండము 6:1,2 నరులు భూమిమీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.
ఈ వచనంలో దేవుని కుమారులు నరుల కుమార్తెల అందాన్ని చూసి తమ మనసుకు నచ్చినవారిని వివాహాలు చేసుకున్నట్టు మనం చూస్తాం. ఈ "దేవుని కుమారులు - నరుల కుమార్తెలపై" క్రైస్తవసమాజంలో ప్రాముఖ్యంగా రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. యూదులకు కూడా ఇది ఒక వివాదాస్పదపు అంశమే. ఇది మన రక్షణకు కానీ విశ్వాసానికి కానీ దేవుని గుణలక్షణాలకు కానీ లేఖనాల ప్రామాణికతకు కానీ సంబంధించిన అంశం కానప్పటికీ లేఖనంలో రాయబడినవాటిని క్షుణ్ణంగా పరిశీలించి (సాధ్యమైనంతమట్టుకు) సరైనదానిని విశ్వసించడం మన బాధ్యత కాబట్టి కొంచెం విస్తారంగానే దీనిపై చర్చించదలిచాను. అందుకే ఈ అంశంపై ఉన్న ఆ రెండు అభిప్రాయాలనూ వాటిలో నేను గమనించిన లోపాలనూ మీతో పంచుకుని చివరిగా నేనేం విశ్వసిస్తున్నానో కూడా తెలియచేస్తాను. నిజానికి నేను మూడవ అభిప్రాయం విశ్వసిస్తాను.
ఈ దేవునికుమారుల విషయమై మొదటి అభిప్రాయం ప్రకారం; హీబ్రూబాషలో అక్కడ בני האלהים (Benay ha Elohim) అనేపదం వాడారు. పాతనిబంధనలో ఈ పదం కేవలం దేవదూతలను ఉద్దేశించి మాత్రమే వాడబడింది. ఉదాహరణకు; యోబు 1:6, 2:1, 38:7. ఈ కారణం చేత, అక్కడ మనకు కనిపించే దేవుని కుమారులు దేవదూతలేయని వీరు విశ్వసిస్తారు. అయితే ఈ వాదనపై చాలా ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ప్రాముఖ్యంగా పరలోకంలో దేవదూతలు పెండ్లికియ్యబడరు అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు (మార్కు12:25).
అయితే ఆ ప్రశ్నకు వీరు ఆదికాండము 18వ అధ్యాయంలో యెహోవా ఇద్దరు దేవదూతలతో అబ్రాహామును దర్శించి అతని ఇంట భోజనం చేసిన సందర్భాన్ని చూపించి సులభంగానే సమాధానం చెబుతుంటారు. అక్కడ దేవదూతలు మానవదేహాన్ని ధరించుకున్నారు, ఆహారం కూడా తిన్నారు. అదేవిధంగా వారు మానవ దేహాలను ధరించుకుని మానవ స్త్రీలను వివాహం చేసుకున్నారు అన్నదే ఆ సమాధానం.
నాకు ఈ సమాధానంలో సమస్యగా అనిపించిన విషయం ఏంటంటే అబ్రాహాము ఇంటికి వచ్చిన దూతలు దేవునితో కలసి వచ్చారు. కాబట్టి వారు మానవరూపాన్ని కలిగియుండడం, ఆయనతో కలసి భోజనం చెయ్యడంలో విచిత్రమేమీ లేదు. కానీ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే దూతలు కూడా తమకు ఇష్టమైనప్పుడు మానవదేహాలను ధరించుకునే సామర్థ్యం కలిగియుంటారు అనడానికి లేఖనాలలో ఒక్క ఆధారం కూడా లేదు. పైగా ఆ దూతలు మానవ స్త్రీల అందాన్ని చూసి దానిని అనుభవించడానికి మానవ దేహాలను ధరించుకోవలసిన అవసరం ఏముంటుంది?. యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాటల ప్రకారం వారు పెండ్లికియ్యబడరు అంటే మనకు ఉన్నట్టుగా వారికి లైంగిక కోరికలు ఉండవని అర్థం. ఆ కోరికలు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించాలనే దేవుని సంకల్పాన్ని బట్టి మనకూ (మనుషులకు) జంతువులకూ మాత్రమే అనుగ్రహించబడ్డాయి (ఆదికాండము 1:21,22, 1:27,28).
మరి లైంగిక కోరికలే లేని దేవదూతలు మానవ స్త్రీల అందానికి ఎలా ఆకర్షితులయ్యారు?. ఉదాహరణకు, నాకు ఆకలివేస్తుంది కాబట్టి అన్నం తింటాను, అది నా స్వభావం. ఒకవేళ నా స్వభావంలో ఆకలే లేకపోతే దానిని పుట్టించుకుని తినవలసిన అవసరం నాకు ఉండదు కదా!. ఎందుకంటే దానికోసం మళ్ళీ శ్రమపడాలి. పైగా మానవ స్త్రీలను వివాహం చేసుకున్న ఆ దేవుని కుమారులు పిల్లలను కూడా కన్నట్టుగా చదువుతున్నాం (ఆదికాండము 6:4). దేవుడు స్త్రీ పురుషుల కలయిక ద్వారా పిల్లలు జన్మించేలా నియమించాడు. ఆ ప్రక్రియ దేవదూతలు కూడా మానవ దేహాన్ని ధరించుకుంటే కొనసాగుతుందా?. నేనైతే దీనికి అంగీకరించను. దేవుడు మాత్రమే సృష్టికర్త అయినప్పుడు దేవదూతలు తమంతట తాముగా మానవదేహాలను అది కూడా ప్రత్యుత్పత్తి చేసే సామర్థ్యంతో ఎలా సృష్టించుకోగలిగారు? దేవదూతలు కూడా సృష్టికర్తలేనా? కాదు.
అయితే దేవదూతలు ఎందుకలా చేసారు? వారికి ఆ అవసరం ఏముంది? అని పైన నేను ప్రస్తావించిన ప్రశ్నకు కొందరు వారు దేవుడు చేసిన నరులను (సృష్టిని) పాడుచెయ్యాలనే ఉద్దేశంతో అలా చేసారని చెబుతుంటారు. కానీ వాక్యభాగాన్ని పరిశీలించినప్పుడు, వారు నరుల కుమార్తెలను వివాహం చేసుకోవడానికి వారి అందమే (చక్కనివారని చూసి) కారణమని స్పష్టంగా రాయబడింది. వారు అలా చెయ్యడానికి కారణమేంటో లేఖనం అంత స్పష్టంగా చెబుతున్నప్పుడు అది పక్కనపెట్టేసి ఇంకేదో కారణం చెప్పడం సమంజసం కాదు.
మరికొందరు ఇక్కడ చెప్పబడుతున్న దేవదూతలు అప్పటికే పతనమైన దేవదూతలని వారు దేవునిపై కోపంతోనే అలా చేసారని కూడా చెబుతుంటారు. యూదా చరిత్రకారుడైన ప్లేవియస్ జోసెఫస్ రచనల్లోనూ (The antiquities of the Jew), book of Enoch లోనూ మిగిలిన కొన్ని యూదా రచనల్లో కూడా ఈ దేవుని కుమారులు దేవదూతలే అని, నెఫీలీయులు వారి సంతానమే అని రాయబడింది. అదే నిజమైతే పతనమైన దేవదూతలు కూడా దేవుని కుమారులుగానే పిలవబడతారా? పతనమైన ఆ దూతలు అబ్రాహాము, లోతు దగ్గరకు వెళ్ళినప్పటివలే మానవదేహాన్ని ధరించుకోలరా? పైన తెలియచేసినట్టుగా లేఖనంలో దీనికి ఒక్క ఆధారం కూడా లేదు. మళ్ళీ చెబుతున్నాను. వాక్యంలో రాయబడినదాని ప్రకారం; దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకోవడానికి వారి అందమే కారణం తప్ప, దేవునిపై కోపం కూడా కారణం కాదు.
అయితే ఈ దేవుని కుమారులు దేవదూతలే అని వాదించేవారు దానికి ప్రధానమైన ఆధారంగా యూదాపత్రిక నుండి "మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను" (యూదా 1:6,7) అనే వాక్యభాగాన్ని చూపిస్తుంటారు.
అక్కడ యూదా దేవదూతలు చేసిన పాపం గురించి ప్రస్తావిస్తూ "ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు" అంటున్నాడు. అంటే ఈమాటల్లో దేవదూతలు చేసిన పాపం సొదొమ గొమొఱ్ఱాలు చేసిన పాపం ఒక్కటే (వ్యభిచారం) అని అర్థం వస్తుంది. దేవుని కుమారులు (దేవదూతలు) చేసినదానినే యూదా తన పత్రికలో ప్రస్తావిస్తున్నాడని వీరు చెబుతుంటారు. అయితే మనం మాట్లాడుకుంటున్న దేవునికుమారులు వ్యభిచారం చేసారా? లేక వివాహం చేసుకున్నారా?. వివాహమే కదా!.
"దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి"
కాబట్టి యూదా మాటలకు వీరు చెబుతున్న వ్యాఖ్యానం ప్రకారం దేవదూతలు వ్యభిచారం చేసారు అనుకున్నప్పటికీ ఈ దేవుని కుమారులు యూదా చెబుతున్న దేవదూతలే అని రుజువు చెయ్యలేరు. ఎందుకంటే వారు వివాహం చేసుకున్నారు. వ్యభిచారం చెయ్యలేదు. లేఖనంలో ఎక్కడా కూడా వివాహం వ్యభిచారంతో పోల్చబడలేదు. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధమైన కలయిక, వ్యభిచారం అనేది పతనస్వభావం నుండి పుట్టుకొచ్చిన పాపపు కోరిక (హెబ్రీ 13:4).
ఇకపోతే యూదా తన పత్రికలో "వీరివలెనే" అని సొదొమ గొమొఱ్ఱా పట్టణస్థు గురించి మాట్లాడుతున్నప్పుడు అతను దేవదూతలను ఉద్దేశించి కాదు కానీ అతను మొదటివచనం నుండీ ఎవరి గురించైతే మాట్లాడుతున్నాడో వారిని ఉద్దేశించే ఆ పదప్రయోగం చేసాడు.
యూదా 1:4-8 ఏలయనగా "కొందరు" రహస్యముగా జొరబడియున్నారు. "వారు" భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు "వారు" పూర్వమందే సూచింపబడిన వారు. ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్న దేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును "వీరివలెనే" వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలెనే "వీరును" కలలు కనుచు, శరీరమును అపవిత్ర పరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు.
ఈ సందర్భం అంతటినీ మనం పరిశీలించినప్పుడు యూదా అప్పటి సంఘంలో కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తున్న (వ్యభిచారం చేస్తున్న) వారిని ఉద్దేశించి మాట్లాడుతూ దేవుని తీర్పు గురించి హెచ్చరిస్తున్నాడు. ఆయన దృష్టికి పాపం చేసిన ఇశ్రాయేలీయులను ఆయన విడిచిపెట్టలేదు, తమ ప్రధానత్వాన్ని విడిచిపెట్టిన దూతలను ఆయన విడిచిపెట్టలేదు. అదేవిధంగా "వీరివలెనే" (కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తున్న వీరివలెనే) వ్యభిచారం చేసిన సొదొమ గొమొఱ్ఱా పట్టణస్థులను కూడా ఆయన విడిచిపెట్టలేదు. అలా ఆయన వీరిని కూడా విడిచిపెట్టడు అనేదే అతని మాటల సారాంశం. అంతేతప్ప అతను దేవదూతలు వ్యభిచారం చేసారని చెప్పట్లేదు.
ఇక ఈ దేవుని కుమారులు దేవదూతలే అనేవారు వారికీ మానవ స్త్రీలకూ పుట్టినపిల్లలను కూడా మరో ప్రాముఖ్యమైన ఆధారంగా తీసుకుంటారు. ఎందుకంటే వారి గురించి "ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే" (ఆదికాండము 6:4) అని రాయబడింది.
దేవుని కుమారులకూ మానవస్త్రీలకూ జన్మించిన ఆ నెఫీలులను ఇంగ్లీష్ బైబిల్ లో Giants అని తర్జుమా చెయ్యడం జరిగింది. హీబ్రూలో ఈ נפלים (Nephilim) అనేదానికి Fall (పతనం) అనే అర్థం వస్తుంది. వీరు సాధారణ మనుషులకంటే ఉన్నత దేహులు. ఆవిధంగా దేవుని కుమారులు దేవదూతలు కాబట్టే వారి సంతానమైన వీరు ఉన్నతదేహులుగా జన్మించారనేది వారి వాదన. ఈ నెఫీలీయులు ఉన్నతదేహులు అనడంలో మనకు ఏ సందేహమూ లేదు కానీ దేవుని కుమారులకూ నరుల కుమార్తెలకూ పుట్టిన అందరూ ఉన్నత దేహులేనా (నెఫీలీయులు) లేక కొందరే అలా ఉన్నారా అనేది నా ప్రశ్న. పైగా ఈ నెఫీలీయులు "తర్వాత కూడా" (జలప్రళయం తర్వాత కూడా) ఈ భూమిపై ఉన్నారని రాయబడింది (ఆదికాండము 6:4). ఆ సందర్భాలన్నీ సంఖ్యాకాండము 13:32,33, ద్వితీయోపదేశకాండము 2:10, 9:2 లలో మనకు కనిపిస్తాయి. దావీదు కాలంలో కూడా గొల్యాతు, రెఫామీయుల సంతతివారు ఉన్నత దేహులుగానే పేర్కోబడ్డారు (2 సమూయేలు 21:20). ఒకవేళ ఈ నెఫీలీయులు దేవదూతలకూ మానవస్త్రీలకూ పుట్టిన పిల్లలే ఐతే జలప్రళయంలో వారంతా నాశనమయ్యాక కూడా తర్వాత మళ్ళీ ఎలా ఉన్నారు?. కొందరు దీనికి నోవహు కుమారుడైన హాము భార్య ద్వారా ఆ జన్యువుల సంక్రమించాయని చెబుతుంటారు. కానీ ఇది నమ్మశక్యం కానటువంటి సమాధానం.
ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలపై ఉన్న రెండవ అభిప్రాయం ప్రకారం; ఆదికాండము నాలుగవ అధ్యాయంలో దుష్టుడైన కయీను సంతానం ఎలా విస్తరించిందో రాయబడింది, ఆ సంతానంలో హత్యలు చేసేవారూ బహు భార్యాత్వం కలిగినవారు (లెమెకు) మనకు కనిపిస్తారు. ఐదవ అధ్యాయంలో విశ్వాసియైన షేతు సంతానం గురించి రాయబడింది, ఆ సంతానంలో మనకు దేవునితో నడచినవారు (హనోకు, నోవహు) యెహోవా నామమున ప్రార్థన చేసినవారు (ఎనోషను) దర్శనమిస్తారు. ఈ రెండు వంశావళులూ రాయబడిన తర్వాతి అధ్యాయంలో (6వ) ఈ సంఘటన జరగడం వల్ల, అక్కడ దేవుని కుమారులంటే షేతు సంతానమని, నరుల కుమార్తెలంటే కయీను సంతానమని వీరు భావిస్తారు. లేఖనాలలో విశ్వాసులను దేవుని కుమారులుగా సంబోధించబడడం మనకు సాధారణంగానే కనిపిస్తుంటుంది (రోమీయులకు 8:14).
కానీ ఆ దేవుని కుమారులు ఆత్మీయతకు కాకుండా అందానికే ప్రాముఖ్యతను ఇస్తూ కయీను సంతానపు వారిని వివాహం చేసుకోవడం వారికి పాపమైంది అంట. అలా వారు చెడిపోవడమే కాకుండా వారికి పుట్టిన పిల్లలు కూడా బలాత్కారులుగా (నెఫీలీయులకు తెలుగు బైబిల్ లో పుట్ నోట్) తయారయ్యారనేది వీరి వాదన. ఎందుకంటే ఇలాంటి మిశ్రిత వివాహాల వల్ల వారి కుటుంబవ్యవస్థ తప్పకుండా దెబ్బతింటుంది.
మరి వారికి పుట్టిన పిల్లలు ఉన్నతదేహులుగా ఎలా ఉన్నారనే ప్రశ్నకు కూడా వీరు, అప్పటిప్రజల ఆయుష్షును ఉదాహరణగా తీసుకుంటూ అలానే వారిలో కొందరి దేహాలు కూడా పెద్దవిగా ఉన్నాయని (జన్యుపరమైన మార్పులు) సమాధానం ఇస్తుంటారు. అందుకే జలప్రళయం తర్వాత కాలంలో కూడా వారి ఉనికి ఉందట (సంఖ్యాకాండము 13:32,33, ద్వితీయోపదేశకాండము 2:10, 9:2). అయితే షేతు సంతానం కూడా నరులే అయినప్పుడు, మానవులకు నరులని దేవుడే పేరుపెట్టినప్పుడు, మోషే ఈ 6వ అధ్యాయంలో మాత్రం కయీను సంతానాన్ని నరుల కుమార్తెలని, షేతు సంతానాన్ని దేవుని కుమారులని వేరువేరుగా ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం ఔతుంది. కానీ ఈ ప్రశ్న ఈ వాదనను కాదనేంత బలీయమైనది కాదు. ఎందుకంటే నరులు అనేది అందరినీ ఉద్దేశించి సాధారణంగా వాడే పదమే అయినప్పటికీ (నరులు భూమిమీద విస్తరించనారంభించినప్పుడు) వారినుండి విశ్వాసులను ప్రత్యేకించి చూపించడానికి మోషే వారిని దేవుని కుమారులని ప్రస్తావించియుండవచ్చు కదా!. కానీ నాకు ఈ వాదనలో కలిగిన అసలైన అభ్యంతరాలు ఏంటంటే నెఫీలీయులు ఉన్నతదేహులుగా ఎందుకున్నారు అనే ప్రశ్నకు అప్పటి ప్రజల ఆయుష్షును బట్టి చెప్పే సమాధానం సరైందైతే ఆ సంఘటన జరగడానికి ముందు అలాంటివారు ఎందుకు పుట్టలేదు? అలానే విశ్వాసులైన వీరు షేతు సంతానంలో అందగత్తెలు లేరనే కయీను సంతానపు స్త్రీలను వివాహం చేసుకున్నారా?
అందుకే నేను ఈ రెండు అభిప్రాయాలకంటే మూడవ అభిప్రాయాన్నే ఎక్కువగా విశ్వసిస్తున్నాను. అదేంటంటే; DR. John Gill గారు తన ఆదికాండము 6 వ్యాఖ్యానంలో యూదులకు చెందిన Targums of Onkelos and Jonathan, Jarchi and Aben Ezraలలో అక్కడ ఈ "దేవునికుమారులను" గొప్పవ్యక్తులు, న్యాయాధిపతులు, బలవంతులు పాలకులుగా వివరించారని తెలియచేసాడు. కాబట్టి పురాతన యూదులు "Benay ha Elohim" అన్నప్పుడు ఇలాంటివారిని కూడా పరిగణలోకి తీసుకునేవారని మనకు అర్థమౌతుంది. ఆవిధంగా "Benay ha Elohim" (దేవుని కుమారులు) అనేది అప్పుడు కొందరు కలిగియున్న బిరుదు (Title). కాబట్టి నాకు దేవునికుమారులు అనగానే లేఖనాల ప్రకారం విశ్వాసులు అని భావించడం కంటే చరిత్రను బట్టి కొందరు కలిగియున్న బిరుదుగా (Title) గా భావించడమే సరి అనిపించింది. ఉదాహరణకు; నిమ్రోదుకు "అతడు యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తికలదు" (ఆదికాండము 10:9) అని బిరుదు ఉంది. నిజానికి యూదా చరిత్ర ప్రకారం అతను మంచివాడు కాదు. కాబట్టి ఈ దేవుని కుమారులను విశ్వాసులుగా భావించనక్కర్లేదు. వీరు ఆ ప్రజల్లో గొప్పవారు బలవంతులు కాబట్టి "Benay ha Elohim" అని పిలవబడ్డారు. అలానే తమకున్న బలాన్నీ అధికారాన్నీ ప్రదర్శించి ఇష్టానుసారంగా వివాహాలు చేసుకున్నారు. అలాంటి వివాహాలు దేవుని చిత్తం కాదు అందుకే ఆయన వాటిని నేరంగా చూసాడు. బహుశా ఆయన శాపం కారణంగానే వారి పిల్లలు ఇతరులకంటే భిన్నంగానూ మరింత నాశనం కలిగించేవారిగానూ పుట్టియుండవచ్చు. తర్వాత కాలంలో కూడా శపించబడిన జాతుల్లోనే అలాంటి ఉన్నతదేహులను మనం చూస్తున్నాము (ఆ వాక్యభాగాలు ఇప్పటికే ప్రస్తావించాను).
ఏది ఏమైనప్పటికీ ఈ దేవునికుమారులు మనుషులే అనేది మాత్రం సత్యం. దీనికి 3వ వచనంలోని "అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించడు" అనే మాటలు కూడా మంచి ఆధారంగా ఉన్నాయి.
ఆదికాండము 6:3 అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు (మూలభాషను బట్టి ఇక్కడ 'వాదించడు' అనేది సరైన అనువాదం; 'వాదించదు' అని తెలుగు బైబిల్లో ఉన్న స్త్రీలింగ/తటస్థ లింగ పదప్రయోగం అనువాదలోపం అని గమనించాలి). వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.
ఈ వచనంలో దేవుడు నరుల అక్రమం గురించి మాట్లాడడం మనం చూస్తాం. దీనిప్రకారం పై వచనాలలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఇద్దరూ కూడా నరులేయనే వాదన మరింతగా బలపడుతుంది. ఎందుకంటే అక్కడ పాపం చేసిన ఇద్దరూ నరులు కాబట్టే దేవుడు నరుల గురించి మాట్లాడుతున్నాడు. అయితే దేవుని కుమారులు దేవదూతలని నమ్మేవారు, ఈ వచనానికీ పై రెండు వచనాలకూ మధ్యలో చాలా సమయం గడచిందని, దేవుని కుమారులు (దేవదూతలు) మానవ స్త్రీలను వివాహం చేసుకోగా జన్మించిన నెఫీలీయుల కారణంగా అప్పుడున్న మనుషులంతా చెడిపోయారని, వారు మనుషులకు దైవవిరుద్ధమైన చాలా కార్యాలను నేర్పించారని Book of Enochలో రాయబడిన కొన్నిమాటల ఆధారంగా చెబుతుంటారు. ఆ నెఫీలీయుల వల్ల చెడిపోయిన నరుల గురించే దేవుడు ఈ సందర్భంలో ఇలా మాట్లాడుతున్నాడు అంట.
కానీ 4వ వచనంలోని "ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే" అనే మాటల ప్రకారం; దేవుడు ఈమాటలు పలికేసరికి నెఫీలీయులు కూడా ఈ భూమిపైనే ఉన్నారు. దేవుడు వారిని కూడా నరులనే సంబోధిస్తున్నాడు. ఎందుకంటే 5వ వచనం ప్రకారం ఆయన "నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డది" అని నరుల చెడుతనాన్ని ప్రస్తావించి, 7వ వచనంలో ఆ నరులను నాశనం చేస్తాను అంటున్నాడు.
"అప్పుడు యెహోవా నేను సృజించిన నరులును నరులతో కూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాననెను"
ఒకవేళ నెఫీలీయులు దేవదూతలకూ మనుషులకూ పుట్టినవారే ఐతే వారు పూర్తిగా నరులు ఎలా ఔతారు? దేవునికుమారులు దేవదూతలే అని అంటున్నవారి వాదనప్రకారం వారు ఒక విధంగా రాక్షసజాతి కదా!.
అదేవిధంగా, ఆ సందర్భంలో దేవుడు నా ఆత్మనరులతో ఎల్లప్పుడూ వాదించడని పలకడం మనం చూస్తాం. దీనికి ఆయన ఆత్మ (పరిశుద్ధాత్మ) నరులు చేస్తున్న పాపాన్ని చూస్తూ వారిని శిక్షవిధించకుండా వాదిస్తూనే (భరిస్తూనే) ఉండడని అర్థం. అందుకే వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులు (శరీరస్వభావం గలవారు/దైవవిరుద్ధంగా శరీరేచ్చలు నెరవేర్చుకునేవారు) అయినప్పుడు దేవుడు వారిని నాశనం చేసే ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. అలాంటి శరీరస్వభావం గలవారి గురించి ఏమని రాయబడిందో చూడండి.
రోమీయులకు 8:7-10,12,13 ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము. "మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు" గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.
"అయిననూ వారి దినములు 120 యేండ్లగుననెను"
దేవుడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించడని (శిక్షవిధించకుండా భరించడని) చెబుతున్న క్రమంలోనే ఈమాటలు కూడా పలకడం మనం గమనిస్తాం. దీనిని కొందరు అప్పటినుండి మానవుల ఆయిష్షును ఆయన 120 యేళ్ళకు కుదించివేసాడని అపార్థం చేసుకుంటుంటారు. కానీ, ఇది మానవుల ఆయుష్షుకోసం చెప్పబడినమాట కాదు. ఎందుకంటే 11వ అధ్యాయం ప్రకారం; నోవహు కుమారుల సంతానం వందల సంవత్సరాలు బ్రతికినట్టు మనం చూస్తాం. అదేవిధంగా అబ్రాహాము 175 సంవత్సరాలు బ్రతికాడు (ఆదికాండము 25:7), ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు (ఆదికాండము 35:28), యాకోబు కూడా 147 సంవత్సరాలు బ్రతికాడు (ఆదికాండము 47:28).
కాబట్టి ఆ సందర్భంలో దేవుడు వారి దినములు 120 యేండ్లగును అనంటే అది మానవుల ఆయుష్షుకోసం కాదు కానీ అప్పుడున్న మనుషుల అంతం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ మాటలు పలికినప్పటినుండి జలప్రళయం వచ్చి వారిని నాశనం చేసేవరకూ మధ్య ఉన్న సమయమే ఆ 120 సంవత్సరాలు. దేవుడు ఈ మాటలు పలికే సమయానికి నోవహుకు ఇంకా కుమారులు జన్మించలేదు. ఎందుకంటే ఆదికాండము 5:32 ప్రకారం; నోవహు 500 యేండ్లకు కుమారులను కన్నాడు. ఆదికాండము 7:6 ప్రకారం; నోవహుకు 600 యేండ్లు వచ్చినప్పుడు రెండవనెలలో జలప్రళయం వచ్చింది. దీనిప్రకారం, దేవుడు ఈ మాటలు పలికేసరికి నోవాహు వయస్సు 480 సంవత్సరాలు.
గమనించండి. దీర్ఘశాంతుడైన దేవుడు అప్పటి నరులు పాపం చెయ్యగానే వారిని అంతం చెయ్యకుండా వారికి 120 సంవత్సరాలు గడువు ఇచ్చాడు. అప్పటికి కూడా వారిలో ఎవరూ మార్పుచెందనప్పుడు ఆయన తన ఉగ్రతను వారిపై కురిపించి నాశనం చేసాడు. దీనిని బట్టి, దేవుడు దీర్ఘశాంతుడు అనగానే ఎల్లప్పుడూ మన పాపాలను భరించేవాడిగా మనం భావించకూడదు. మారుమనస్సు పొందడానికి ఆయన ఈరోజు ఇచ్చిన అవకాశం రేపు ఇవ్వకపోవచ్చు, కాబట్టి సమయం ఉండగానే మన తప్పులు సరిచేసుకోవాలి. ఈ వాక్యభాగాలు పరిశీలించండి.
కీర్తనలు 50: 21 ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను.
యిర్మియా 13:16 ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకము నుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవు డైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి.
ప్రకటన 2:21,22 మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడ వ్యభిచరించు వారు దాని క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును.
ఆదికాండము 6:4 ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే.
ఈ నెఫీలుల గురించి ఇప్పటికే పైన మనం విస్తృతంగా చర్చించుకున్నాము. వీరిని మన తెలుగు బైబిల్ పుట్ నోట్ లో బలత్కారులు అని పేర్కోవడం జరిగింది. ఎందుకంటే వీరు అప్పటి సమాజంలో తమకంటే బలహీనులపై దౌర్జన్యం జరిగిస్తూ హింసకు మరోపేరుగా నిలిచారని కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం. వీరు శూరులు అన్నప్పుడు అది వీరి బలాన్ని సూచిస్తుంది.
ఆదికాండము 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి-
ఈ వచనం మానవుడు చేసే క్రియలను బట్టే కాదు అతని ఊహను బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడని తెలియచేస్తుంది, ఎన్నో లేఖనాలు దీనికి సాక్ష్యంగా ఉన్నాయి (యిర్మియా 17:9,10, 1 కోరింథీ 4:5).
దేవుడు మనిషిని తనకు అనుకూలమైన ఆలోచనలు, ఊహలు కలిగియుండాలనే ఉద్దేశంతోనే ఆలోచించే ఊహించే వ్యక్తిగా తయారుచేశాడు (మనసాక్షి కలిగినవాడిగా). కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి దైవ విరుద్ధమైన ఆలోచనలతో ఊహలతో జీవిస్తాడో అప్పుడే ఆయన యెదుట పాపిగా తీర్పు పొందుకుంటాడు. ఎందుకంటే ప్రతీ పాపమూ క్రియారూపం దాల్చడానికంటే ముందుగా మానవుని ఆలోచనలోనే రూపుదిద్దుకుంటుంది. అలానే ప్రతీపాపమూ ఆయన పరిశుద్ధస్వభావానికి వ్యతిరేకంగానే చెయ్యబడుతుంది. కాబట్టి దేవునిపిల్లలు, దైవవిరుద్ధమైన ఆలోచనలకూ ఊహలకూ మనసులో తావివ్వకుండా జాగ్రతపడాలి, ఆ విధంగా ప్రేరేపించేవాటికి దూరంగా ఉండాలి. ప్రస్తుత సినిమాలు, ఇతర చిత్రీకరణలు, నవలలు చాలామట్టుకు మనిషిని ఈవిధంగానే ప్రేరేపిస్తున్నాయి.
సామెతలు 4: 23 నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.
ఫిలిప్పీయులకు 4:8 మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి.
ఈ వ్యాసం చదవండి.
సినిమాలు-క్రైస్తవులు
ఆదికాండము 6:6 తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకొనెను.
ఈ వచనంలో దేవుడు నరుల పాపాన్ని బట్టి వారిని చేసినందుకు సంతాపపడి, హృదయంలో నొచ్చుకున్నట్టు మనం చూస్తాం. అయితే సార్వభౌముడైన దేవునికి ఈ సృష్టిని చెయ్యకముందే అలా జరుగుతుందని తెలుసు, తెలిసే ఆయన ఈ సృష్టిని చేసాడు. అయినప్పటికీ ఆయనకు విరుద్ధమైన కార్యం సృష్టిలో జరుగుతున్న సమయంలో ఆ పాపం పట్ల తన వ్యతిరేఖ భావాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటాడు, దానిద్వారానే లోకానికి తీర్పుతీరుస్తాడు. ఈ సందర్భంలో అదే జరుగుతుంది.
కీర్తనలు 5:4 నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు.
హబక్కూకు 1:13 నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా.
అదేవిధంగా మొదటి అధ్యాయపు వ్యాఖ్యానంలో దేవునికి మనవలే శరీరం ఉన్నట్టుగా వర్ణించబడిన పద్ధతిని Anthropomorphism (మానవునికి అర్థమయ్యేలా కనిపించడం) అంటారని వివరించాను (ఆదికాండము 1:26 వ్యాఖ్యానం చూడండి). ఈ వచనంలో ఐతే మానవునికి ఏ విధంగా భావనలు పుడుతాయో అలాంటి భావనలే దేవునికి కూడా పుడుతున్నట్టుగా వర్ణించడం జరిగింది (సంతాపపడడం, నొచ్చుకోవడం). కానీ దేవునికి హృదయంలో ఆలోచనలు, బాధలు (సంతాపం) సందర్భాన్ని బట్టి మనకు పుట్టినట్టుగా పుట్టవు. ఎందుకంటే ఆయన నిత్యుడు (యెషయా 40:28), ఆయన మార్పులేనివాడు (మలాకీ 3:6). తన చిత్తం విషయంలో విఫలం కానివాడు (దానియేలు 4:35, యెషయా 46:10, యోబు 42:2). కాబట్టి దేవునికి పాపం పట్ల ఉండే వ్యతిరేక వైఖరి మనకు అర్థమయ్యేలా తెలియచెయ్యడానికే ఆయనకు కూడా సమయాన్ని బట్టి భావనలు పుడుతున్నట్టుగా (సంతాపం, నొచ్చుకోవడం) ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మానవుని భావనలను దేవునికి ఆపాదించి మాట్లాడడాన్ని Anthropopathism అంటారు.
ఆదికాండము 6:7 అప్పుడు యెహోవా నేను సృజించిన నరులును నరులతో కూడ జంతువులును పురుగులును ఆకాశపక్ష్యాదులును భూమి మీదనుండకుండ తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునొంది యున్నాననెను.
ఈ వచనంలో దేవుడు నరులతో సహా జీవరాశులను కూడా నాశనం చెయ్యబోతున్నట్టు ప్రకటించడం మనం చూస్తాం. మానవుడు చేసే పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత కొన్నిసార్లు సమస్త జీవరాశుల మీదకు కూడా వస్తుంటుంది. ఎందుకంటే ఆయన ఈ సృష్టిలో సమస్తం మానవుని కోసమే సృష్టించాడు, మానవుడిని వాటన్నిటిపై ఏలికగా నియమించాడు.
ఆదికాండము 6:8 అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.
ఈ వచనంలో దేవుడు రప్పించబోతున్న జలప్రళయంలో నశించిపోకుండా నోవహు ఆయన కృపను పొందుకోవడం మనం చూస్తాం. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. పై వచనాలలో దేవుడు నరులందరినీ నాశనం చేస్తానని పలికినట్టు రాయబడింది. దానర్థం, నరులను చెయ్యడంలో ఆయనకున్న ఉద్దేశం విఫలమైనట్టు కాదు. ఒకవేళ అదే నిజమైతే ఆయన నోవహును కూడా కాపాడకుండా నశింపచేసి ఉండేవాడు. కానీ దుష్టుడైన కయీను సంతానాన్ని సమూలంగా నాశనం చేసి, షేతు సంతానమైన నోవహు మూలంగా ఈ భూమిని నిండించాలన్నదే దేవుని చిత్తం కాబట్టి ఆయన నోవహునూ అతని కుటుంబాన్నీ కాపాడుతున్నాడు.
యెషయా 46: 10 "నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు", చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.
యోబు 42:2 నీవు సమస్త క్రియలను చేయగలవనియు "నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు" నేనిప్పుడు తెలిసికొంటిని.
అదేవిధంగా నోవహు యెహోవా దృష్టియందు కృపపొందినవాడు అంటే అది అతని గొప్పతనమో అతను చేసిన మంచిపనుల గొప్పతనమో కాదు. కృప అంటే అది పొందుకోవడానికి మనం యోగ్యులం కానప్పటికీ ఆ అర్హత మనకు లేనప్పటికీ ఆయన మనపై దృష్టి నిలపడం, కరుణించడం (దానం). ఈరోజు మనం కూడా నోవహు వలే దేవుని దృష్టియందు కృపపొందబట్టే రక్షించబడ్డాం, విశ్వసించాం. అది మన గొప్పతనం వల్ల కానీ మనం చేసిన మంచిక్రియల వల్ల కానీ కాదు. అందుకే పౌలు "మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే" (ఎఫెసీ 2:8) అని రాస్తున్నాడు.
ఆదికాండము 6:9 నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.
ఈ వచనంలో నోవహు నీతిపరుడునూ తన తరంలో నిందారహితుడిగానూ ఉండి దేవునితో నడుస్తున్నట్టు మనం చూస్తాం. కానీ నోవహు జలప్రళయం నుండి రక్షించబడడానికి కేవలం దేవుని కృపయే కారణమని ఇప్పటికీ వివరించుకున్నాం. కాబట్టి ఇక్కడ నోవహు దేవునితో నిందారహితుడిగా నీతిపరుడిగా నడవడానికి కూడా ఆయన కృపయే కారణం. ఎందుకంటే నోవహు ఆ విధంగా నడుచుకునేలా దేవునికృపనే అతనికి బోధించింది, మనకు కూడా బోధిస్తుంది (తీతుకు 2:11-13). కాబట్టి ప్రతీకాలంలోనూ
దేవుని కృప పొందినవారు, ఈ నోవహులానే ఈలోకంనుండి ప్రత్యేకించబడి దేవునికి శేషంగా జీవిస్తారు (దేవునితో నడుస్తారు). ఇది వారి గొప్పతనం కాదు కానీ దేవుని కృపను బట్టే అది వారికి సాధ్యమౌతుంది.
ఆదికాండము 6:10 షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను.
ఈ వచనంలో నోవాహు ముగ్గురు కుమారుల పేర్లూ రాయబడడం మనం చూస్తాం. జలప్రళయం తర్వాత వీరినుండే మానవజాతి విస్తరించింది (ఆదికాండము 10).
ఆదికాండము 6:11 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.
ఈ వచనంలో భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయి, బలాత్కారంతో నిండియున్నట్టు మనం చూస్తాం. ఈ భూమిపై జరిగే ఏ పాపమూ కూడా దేవుని సన్నిధిని మరుగైయుండలేదని ఇది ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాయి. చివరికి అవి మనకే తెలియని మన రహస్య పాపాలు కూడా. అందుకే మోషే "మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడుచున్నవి" (కీర్తనలు 90:8) అని అంటున్నాడు. "చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధ కారమును వెలుగులోనికి రప్పించును" (యోబు 12:22) అని కూడా రాయబడింది.
ఆదికాండము 6:12 దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయియుండెను; భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.
ఈ వచనంలో దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నట్టుగా మనుషులంతా తమ మార్గాన్ని చెరిపివేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ "దేవుడు చూచెను" అన్నప్పుడు కూడా ఆ మాటలు మనకు అర్థమయ్యేలా Anthropomorphism పద్ధతిలో చెప్పబడ్డాయి. వాస్తవానికి ఆయన మనవలే ఒక్కోసారి ఒక్కో ప్రదేశాన్ని చూడడు. ఆయనకు తన సమస్త సృష్టిలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అంతా తెలుసు (కీర్తనలు 139:4,7-12).
అదేవిధంగా సమస్తశరీరులూ తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు అనంటే దేవుడు వారిముందు ఒక మార్గాన్ని పెట్టినట్టుగా మనకు అర్థమౌతుంది. కాబట్టి ఏ కాలంలో అయినా దేవుని మార్గం మనుషులకు మరుగైయుండలేదు. వారు ఎలా జీవించాలో ఆయన బోధిస్తూనే ఉన్నాడు. మనసాక్షి ద్వారా కొంత, తన భక్తుల ద్వారా మరికొంత ఆ మార్గం బోధించబడుతూనే ఉంది. ఈ వ్యాసం చదవండి.
మోషే ధర్మశాస్త్రానికి ముందు నైతిక ఆజ్ఞలు లేవా?
ఆదికాండము 6:13 దేవుడు నోవహుతో సమస్తశరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.
ఈ వచనంలో దేవుడు భూమిపైకి రాబోతున్న తన తీర్పు గురించి నోవహుకు తెలియచెయ్యడం మనం చూస్తాం. దీనిని బట్టి అప్పటి ప్రజల పాపం సంపూర్ణమైనట్టుగా మనకు అర్థమౌతుంది. ఎందుకంటే దేవుడు వారి పాపం పరిపూర్ణమవ్వకుండా ఎవరికీ తీర్పు తీర్చడు, అవకాశం ఇస్తూనే ఉంటాడు (ఆదికాండము 15:16, ఆదికాండము18:20,21).
ఆదికాండము 6:14-16 చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయ వలెను. నీవు దాని చేయవలసిన విధమిది; ఆ ఓడ మూడువందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల యెత్తును గలదై యుండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను; ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను; క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను.
ఈ వచనాలలో దేవుడు నోవహుకు ఓడ కట్టమని ఆజ్ఞాపించి దానిని ఎలా నిర్మించాలో వివరించడం మనం చూస్తాం. ఇక్కడ మన తెలుగు బైబిల్ లో "చితిసారకపు" అని తర్జుమా చేసిన చోట హీబ్రూలో גּפֶר (gopher) అనే పదం వాడారు ఇది ఒక చెట్టు పేరు. అదేవిధంగా ఇక్కడ మూరలు అన్నప్పుడు అప్పటి ఈజిప్టువంటి దేశాల కొలమానం ప్రకారం 18 నుండి 28 అంగుళాలు దాకా ఉంటుందని కొందరు బైబిల్ పండితులు వెల్లడించారు.
అయితే ఇక్కడ దేవుడు ఓడకొలతల గురించి వివరించినదానిని కొందరు వక్రీకరించి బైబిల్ లో కూడా వాస్తు ఉందని బోధిస్తుంటారు. కానీ బైబిల్ వాస్తు వంటి మూఢనమ్మకాలను ఎక్కడా ప్రోత్సహించదు, సమర్థించదు. ఇక్కడ దేవుడు నోవాహుకు వాస్తు ప్రకారం కొలతలు ఇవ్వడం లేదు కానీ ఆ ఓడ పరిమాణం ఏమేరకు ఉండాలో దానికి మాత్రమే కొలతలు ఇస్తున్నాడు. ఎందుకంటే; ఆ ఓడలో నివశించబోయే నోవహు కుటుంబానికీ మిగిలిన జీవరాశులన్నిటికీ వారందరికీ కావలసిన ఆహారం నిల్వచేయడానికీ అది ఎంత పరిమాణంలో ఉండాలో ఏ భాగంలో ఏది పెడితే వారికి నివాసయోగ్యంగా ఉంటుందో ఆయనకు మాత్రమే తెలుసు. ఆ ఓడ ఇప్పటి మన కొలతల ప్రకారం 450 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు, మూడు అంతస్తులు కలపి 45 అడుగుల ఎత్తు కలదిగా ఉంటుంది. ఇది 522 రైలుపెట్టెలకు సమానం.
నోవహు కేవలం దేవుని మాటలపై విశ్వాసంతో తాను కానీ తన పితరులు కానీ చూడని జలప్రళయం నుండి తప్పించుకోడానికి ఇంత పెద్ద ఓడను సిద్ధం చేసాడు కాబట్టే, ఆ తరం వారిపైన నేరస్థాపన చెయ్యగలిగాడు (హెబ్రీ 11:7). అదేసమయంలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా అప్పటిప్రజల మధ్యకు ఆత్మరూపిగా వెళ్ళి వారి మనసాక్షుల ద్వారా వారికి సువార్త ప్రకటించారని లేఖనం చెబుతుంది (1పేతురు 3: 20)
ఆదికాండము 6:17 ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రిందనుండకుండ నాశనము చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును.
ఈ వచనంలో దేవుడు సమస్త భూమిపైకీ జలప్రళయం సంభవించి, జీవవాయువు గల (ఊపిరి తీసుకునే) ప్రతీదీ చనిపోబోతున్నట్టుగా తెలియచెయ్యడం మనం చూస్తాం. ఇక్కడ భూమి అన్నప్పుడు అది ఏదో ఒక ప్రదేశాన్ని సూచిస్తూ అలంకారంగా చెప్పబడిన మాట కాదు. అదే నిజమైతే నోవహు ఓడను కట్టవలసిన అవసరం లేదు, మరో ప్రదేశానికి వెళ్ళి రక్షించబడేవాడు. అదేవిధంగా జీవరాశులను కూడా అతను ఓడలో కాపాడవలసిన అవసరం ఉండేది కాదు. కాబట్టి ఆ జలప్రళయం భూమి అంతటా సంభవించింది. అందుకు శాస్త్రీయ రుజువులెన్నో మనముందు ఉన్నాయి. ఈ ఆధారాలు చదవండి
https://answersingenesis.org/kids/geology/evidence-flood/
ఆదికాండము 6:18 అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును; నీవును నీతోకూడ నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను.
బైబిల్ గ్రంథం అంతటిలోనూ నిబంధన (Covenant) అనే పదం ఈ వచనంలోనే మొదటిసారిగా మనకు కనిపిస్తుంది. అంతకుముందు కూడా దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు (హోషేయా 6:7). దేవుడు మానవులతో చేసిన ఈ నిబంధనలు రెండు విధాలైనవిగా మనకు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది షరతులతో కూడిన నిబంధన. అనగా మానవుడు ఆ షరతులను పాటించినంతవరకే ఆ నిబంధన కొనసాగుతుంది. లేదో కొట్టివెయ్యబడుతుంది ఉదాహరణకు; ఆదాము ముందు మంచిచెడ్డల వృక్షఫలాలను తినకూడదనే ఆజ్ఞ, దేవుడు అతనితో చేసిన నిబంధనకు షరతుగా ఉంది. అతను దానిని మీరాడు ఏదెను నుండి గెంటివెయ్యబడ్డాడు. మోషేతో దేవుడు చేసిన నిబంధన (ధర్మశాస్త్రం) కూడా షరతులతో కూడిన నిబంధనే.
రెండవది కృపతో కూడిన నిబంధన, ఇక్కడ నోవహుతో చెయ్యబడుతుంది అదే. అందుకే నోవహు దేవుని దృష్టికి కృపపొందినవాడు ఆయెనని చెప్పబడింది (ఆదికాండము 6:8). ఇందులో మానవుడి ప్రమేయం లేకుండా దేవుడే దానిని కొనసాగిస్తాడు (రోమా 11:6). అనగా నోవహును ఆయన రక్షించితీరుతాడు, అతని సంతానాన్ని విస్తరింపచేస్తాడు. యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనతో చెయ్యబడింది కూడా ఇలాంటి కృపతో కూడిన నిబంధనే. ఈ నిబంధన ప్రకారం, తాను ఏర్పరచుకున్న వారిని ఆయనే రక్షించి పరలోకరాజ్యం చేరుస్తాడు (1యోహాను 2: 25, 2 థెస్సలోనిక 3:3). ఈ నిబంధన మన క్రియలపై ఆధారపడి ఉండదు కానీ అబ్రహాము తన నీతికి గుర్తుగా సున్నతి పొందినట్టు (రోమా 4:11) మన రక్షణకు ఆ దేవుని క్రియలు రుజువులుగా ఉంటాయి (ఎఫెసీ 2:10). అనగా ఈ నిబంధన క్రిందకు వచ్చినవారు (రక్షించబడినవారు) గ్రుడ్డివాడికి చూపువస్తే లోకాన్ని చూడడం ప్రారంభించినట్టుగా దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలను తప్పక చేస్తారు. ఉదాహరణకు ఈ నోవహులానే లోకం నుండి తనను తాను ప్రత్యేకపరచుకుని దేవునితో నడుస్తారు, ఆయన ఆజ్ఞలను గైకొంటారు. పైన తెలియచేసినట్టు ఈ లక్షణమే (క్రియలే) వారు రక్షించబడ్డారు అనేందుకు సాక్ష్యంగా ఉంటుంది. ఈ అంశం (రక్షణ) గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
రక్షణ యెహోవాదే
ఆదికాండము 6:19,20 మరియు నీతోకూడ వాటిని బ్రదికించియుంచుకొనుటకు సమస్తజీవులలో అనగా సమస్తశరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను; వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. నీవు వాటిని బ్రదికించి యుంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకువాటన్నిటిలోను, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును.
ఈ వచనాలలో దేవుడు జలప్రళయంలో నశించిపోకుండా నోవహు కుటుంబంతో పాటుగా జీవరాశులను కూడా కాపాడబోతున్నట్టు మనం చూస్తాం. ఆయన ఇక్కడ ఆ జీవరాశుల విషయంలో నోవహుకు ఆజ్ఞాపిస్తున్నదానిని బట్టి, ఆయన మనిషికి సాధ్యం కాని భారాన్ని అతనిపై మోపడని అర్థమౌతుంది. ఎందుకంటే ఆయన మొదటిగా కొన్ని జీవరాశులను జతలచొప్పున ఓడలోకి తెమ్మన్నాడు, కానీ అన్నిటినీ నోవహు తేలేడు. అందుకే అలాంటివి తమంతట తాముగా నీదగ్గరకు వస్తాయని తదుపరి మాటల్లో తెలియచేస్తున్నాడు.
అదేవిధంగా నోవహు కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో ఓడను కట్టడం, అక్కడున్న ప్రజలందరి మూఢత్వంపైనా సాక్ష్యంగా ఉంది. అంతేకాకుండా దేవుడు ఆజ్ఞాపించినట్టుగా జంతువులన్నీ జతలు జతలుగా నోవహు దగ్గరకు వస్తున్నప్పుడు, అందులో క్రూరమృగాలు కూడా ఉంటాయి కాబట్టి, ఆ దృష్యాన్ని చూస్తున్న ప్రజలు అది దేవుడు చేస్తున్న కార్యమని నమ్మే అవకాశం మరింత ఎక్కువగా ఉంది. కానీ అప్పటికి కూడా వారు నమ్మలేదు, ఓడలోకి చేరలేదు. తన పాపం సంపూర్ణమైన మనిషి దేవుని కార్యాలు గుర్తించి, పశ్చాత్తాపడలేడని, దేవుని యొద్దకు రాలేడని ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది. ఉదాహరణకు ఫరో వంటి పాపుల విషయంలో ఇలాంటి కఠినస్వభావమే మనం గమనిస్తాం.
ఆదికాండము 6:21 మరియు తినుటకు నానావిధములైన ఆహారపదార్థములను కూర్చుకొని నీదగ్గర ఉంచుకొనుము; అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను.
ఈ వచనంలో నోవహు కుటుంబానికీ అతనితో ఓడలో ఉన్న జీవరాశులకూ ఆహారాన్ని సిద్ధపరచుకునే పనిని దేవుడు నోవహుకు అప్పగిస్తున్నట్టు మనం చూస్తాం. దీనిప్రకారం, మనం పైన వివరించుకున్నట్టుగా నోవహు కృపచేత చెయ్యబడిన నిబంధనలో ఉన్నప్పటికీ పనినుండి మినహాయించబడలేదు. ప్రతీ నిబంధనలోనూ దేవుని పని చెయ్యవలసిన బాధ్యత మనిషిపై ఉంటుంది. కానీ ఆ పనిని బట్టి నిబంధన స్థిరపడడం, కొట్టివెయ్యబడడం మాత్రం జరగదు. ఈరోజు మనముందు కూడా దేవుడు ఆజ్ఞాపించిన పని ఎంతో ఉంది. యేసుక్రీస్తు వలే మనమందరమూ ఆ పనిలో నిమగ్నులమై యుండాలి.
ఆదికాండము 6:22 నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.
ఈ సందర్భంలో నోవహు దేవుడు ఆజ్ఞాపించిన యావత్తూ పూర్తిచేసినట్టు మనం చూస్తాం. ఓడకట్టడం, ఆహారాన్ని సేకరించడం, జీవరాశులను జతలు జతలుగా సమకూర్చడం ఇవన్నీ అతను పూర్తిచేసాడు. దీనికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మనం కచ్చితంగా చెప్పలేము కానీ 3వ వచనం ప్రకారం; ఆయన ఆ ప్రజల ఆయుష్షు 120 యేండ్లు ఔతుందని నిర్ణయించాడు. ఆ అంతం నోవహు యొక్క వయస్సు ఆరువందల సంవత్సరం రెండవ నెలలో సంభవించింది (ఆదికాండము 7:11). దీనిప్రకారం దేవుడు జలప్రళయం ద్వారా భూమిని నాశనం చెయ్యాలని తీర్పు తీర్చేసరికి నోవహు వయస్సు 480 సంవత్సరాలు. అతను 500 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ముగ్గురు కుమారులను కన్నాడు (ఆదికాండము 5:32), ఆ తర్వాత వారు పెద్దవారయ్యే సమయానికి అతను దేవుని చేత ఓడకట్టమని ఆజ్ఞాపించబడ్డాడు. ఎందుకంటే ఆ సందర్భంలో దేవుడు అతనితో మాట్లాడేటప్పుడు అతని కోడళ్ళ ప్రస్తావన కూడా తీసుకువచ్చాడు.
అదేవిధంగా నోవహు ఓడను కడుతుండగా అప్పటిలోకం నుండి అతనికి ఎన్నో విమర్శలు, అవమానాలు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటిప్రజలకు జలప్రళయం అంటే ఏంటో తెలియదు. కానీ నోవహు, వాటన్నిటిని బట్టి కృంగిపోలేదు, తన పనిని ఆపి వెయ్యలేదు. దేవునిపై విశ్వాసంతో ముందుకుసాగాడు. మనం కూడా ఈలోకంలో దేవుని పని చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, అవమానాలు, విమర్శలు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. కాబట్టి మనం వాటన్నిటినీ నోవహులా జయించగలగాలి. మన నిబంధనకు ప్రధానయాజకుడైన యేసుక్రీస్తు అనుభవించిన నిందలు, అవమానాలు, శ్రమలతో పోల్చుకున్నప్పుడు మనం అనుభవిస్తున్నవి ఏమాత్రం ఎంచతగినవి కావని గుర్తించి ముందుకు సాగాలి.
హెబ్రీయులకు 12: 3,4 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Add comment