34:1, 34:2, 34:3,4, 34:5, 34:6, 34:7, 34:8-10, 34:11,12, 34:13, 34:14-17, 34:18,19, 34:20-24, 34:25,26, 34:27-29, 34:30, 34:31
ఆదికాండము 34:1 లేయా యాకోబునకు కనిన కుమార్తెయైన దీనా. ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్లెను.
ఈ వచనంలో యాకోబు కుమార్తెయైన దీనా కనాను దేశంలోని అమ్మాయిలను చూడడానికి వెళ్ళినట్టు మనం చూస్తాం. కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఆ దేశంలో అది పండుగ రోజు. అయితే యాకోబు కుటుంబం ఒంటరిగా లేదు, అతనికి దాసదాసీలు కూడా ఉన్నారు. అంటే వారికి పిల్లలూ ఉండుంటారు. ఇది మనకు అతను బేతేలుకు వెళ్ళేటప్పుడు కూడా అర్థమౌతుంది (ఆదికాండము 35:2). అంటే ఆమె చుట్టూ మనుషులు ఉన్నప్పటికీ ఆమె ఆ దేశపు కుమార్తెలు ఎలా ఉంటారో చూడడానికి వెళ్ళింది.
ఒకవిధంగా ఇది నేత్రాశను సూచిస్తుంది. అంటే నేను నూతనప్రదేశాలను చూడడం కానీ నూతనవ్యక్తులను కలవడం కానీ తప్పని చెప్పడం లేదు. అయితే అధ్యాత్మిక కుటుంబానికి సంబంధించిన ఈమె పనిగట్టుకుని మరీ ఆ విగ్రహారాధికులను చూడడానికి వెళ్ళాల్సిన అవసరం లేదంటున్నాను. పైగా ఆ ప్రాంతంలో నైతికనియమాలు అంతగా ఉండవు. ఆ విషయం ఈమెకు కూడా తెలుసుండాలి (దాని గురించి క్రింది వచనాల్లో వివరిస్తాను). అయినా వెళ్ళింది అది కూడా ఒంటరిగా వెళ్ళింది.
ఆదికాండము 34:2 ఆ దేశమునేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను.
ఈ వచనంలో హమోరు కుమారుడైన షెకెము దీనాను బలాత్కారం చెయ్యడం మనం చూస్తాం. కారణం: తనది కాని ప్రాంతానికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలనే బాధ్యతను ఆమె నిర్లక్ష్యపెట్టింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో నైతిక విలువలు పాటించే పరిస్థితి (ముఖ్యంగా లైంగికత విషయంలో) అంతగా ఉండదు (ఆదికాండము 26:10). ఆ విషయం ఆమెకు కూడా తెలిసుంటుంది. శారా రిబ్కాల సంఘటనలు ఈమె కుటుంబ చరిత్రనేగా. అక్కడికి వెళ్తున్న విషయం కనీసం ఆమె తన కుటుంబ సభ్యులకైనా తెలియచేసిందో లేదో మనకు తెలియదు. తెలియచేసే ఉంటే తనను ఒంటరిగా పంపిన కుటుంబం కూడా ఆమె విషయంలో సరైన జాగ్రతను తీసుకోలేదని మనం భావించాలి. కాబట్టి దీనా విషయంలో జరిగినదానిని బట్టి మనం వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం మరచిపోకూడదు. ప్రాముఖ్యంగా నైతిక ప్రమాణాలు పాటించని వ్యక్తులకు దూరంగా ఉండాలి. లేకుంటే మనకే ప్రమాదం. ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది.
ఆదికాండము 34:3,4 అతని మనస్సు యాకోబు కుమార్తెయైన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి ఈ చిన్నదాని నాకు పెండ్లిచేయుమని తన తండ్రియైన హమోరును అడిగెను.
ఈ వచనాలలో షెకెము దీనాను ప్రేమించి, ఆమెను వివాహం చేసుకునే ఉద్దేశంతో తన తండ్రిని ప్రేరేపించడం మనం చూస్తాం. ఇక్కడ ఈ షెకెము అనేవ్యక్తి గురించి మనం ఆలోచిస్తే యాకోబు కనానుకు వచ్చినప్పుడు ఇతని సహోదరుల దగ్గరే పొలం కొని అందులో నివసిస్తున్నాడు (ఆదికాండము 33:19). దీనిప్రకారం యాకోబు కుటుంబానికి షెకెముకూ పరిచయం ఉండి అతను దీనాను ప్రేమిస్తున్నాడేమో. అయితే అతను తొందరపడి అలా బలాత్కారం చెయ్యకుండా ముందే వివాహం చేసుకునే ప్రయత్నం చేసుంటే బావుండేది. కానీ అతను అలా చెయ్యకుండా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల చివరికి తన ప్రాణంతో పాటుగా ఆ ఊరి పురుషులందరి ప్రాణాలూ పోవడానికి కారణమయ్యాడు. కానీ ఈ షెకెములో ఒకటి మాత్రం మనం స్పష్టంగా గమనిస్తున్నాం. అతను దీనా విషయంలో తప్పిదం చేసినప్పటికీ వివాహం ద్వారా దానిని సరిచేసుకోవాలి అనుకుంటున్నాడు. దావీదు కుమారుడైన అమ్నోనులా కోరిక తీర్చుకుని విడిచిపెట్టడం లేదు (2 సమూయేలు 13:15,16).
ఆదికాండము 34:5 తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువులతో పొలములలోనుండినందున వారు వచ్చువరకు ఊరకుండెను.
ఈ వచనంలో యాకోబు తన కుమార్తె విషయంలో జరిగినదానిని విని తన కుమారులు వచ్చేంతవరకూ ఊరుకుండడం మనం చూస్తాం. ఎందుకంటే యాకోబు కుమారులు అప్పటికి యవ్వనస్తులుగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో తనకు తానుగా నిర్ణయం తీసుకోవడం లేదు.
ఆదికాండము 34:6 షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాటలాడుటకు అతనియొద్దకు వచ్చెను.
ఈ వచనంలో హమోరు దీనాతో తన కుమారుడికి వివాహం జరిపించమని యాకోబుతో మాట్లాడడానికి రావడం మనం చూస్తాం. అతను తలచుకుంటే అన్యాయానికి గురైన దీనా విషయంలో యాకోబుకు ఎలాంటి సంజాయిషీ ఇవ్వకుండా తప్పించుకోగలడు, తన కుమారుడి కోరికను కూడా లక్ష్యపెట్టకపోదుడు. ఎందుకంటే యాకోబుతో పోలిస్తే అతని బలం ఎక్కువ. కానీ అలా చెయ్యకుండా సత్ప్రవర్తననే అనుసరిస్తున్నాడు. కనానీయులు దుర్మార్గులే అయినప్పటికీ అబ్రాహాము యాకోబుల కాలంలో అక్కడ మంచివారు కూడా మనకు కనిపిస్తుంటారు. శారా చనిపోయినప్పుడు వారు అబ్రాహాముపై చూపిన అభిమానాన్ని బట్టి అది గమనిస్తాం (ఆదికాండము 23వ అధ్యాయము).
ఈ విషయంలో విశ్వాసులు తమను తాము పరీక్షించుకోవాలి. కనానీయులైన షెకెము హమోరులే తమవల్ల జరిగిన తప్పిదాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవునిపిల్లలమైన మనపై ఆ బాధ్యత మరెంతగా ఉంటుంది? కానీ మనలో చాలామందిమి అలా చెయ్యము. తప్పించుకోవడానికే ప్రయత్నిస్తుంటాం. ఇది విశ్వాసుల లక్షణం కాదు.
ఆదికాండామము 34:7 యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములోనుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపము వచ్చెను.
ఈ వచనంలో యాకోబు కుమారులు ఆ సంగతి విని కోపంతోనూ బాధతోనూ నిండుకున్నట్టు మనం చూస్తాం. అయితే కనాను చుట్టుపక్కల ప్రజల్లో వివాహానికి ముందు ఒక స్త్రీతో శయనించకూడదనే నియమం అంత కఠినంగా ఉండదు, అందుచేత కూడా షెకెము అలా చేసాడు. ఎందుకంటే ఈ కనానుకు సమీపంగా ఉన్న పిలిష్తీయుల దేశంలో శారా రిబ్కాల విషయంలో కూడా వారు అలానే ఆలోచించినప్పుడు దేవుడు వారిద్దరినీ కాపాడినట్టు మనం చదువుతాం (ఆదికాండము 26:10,11).
ఆదికాండము 34:8-10 అప్పుడు హమోరు వారితో షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లిచేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ యెదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారముచేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను.
ఈ వచనాలలో షెకెము తండ్రియైన హమోరు యాకోబుతోనూ అతని కుమారులతోనూ వివాహం విషయం మాట్లాడడం మనం చూస్తాం. దీనివల్ల వారికి కలిగే ప్రయోజనాలు కూడా అతను తెలియచేస్తున్నాడు. పైన వివరించినట్టుగా అతను సమాధానపడడానికే ప్రయత్నిస్తున్నాడు తప్ప తనకున్న బలంతో దౌర్జన్యం చెయ్యడం లేదు.
ఆదికాండము 34:11,12 మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానీయుడి. మీరేమి అడుగుదురో అది యిచ్చెదను. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి. మీరు అడిగినంత యిచ్చెదను. మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోను చెప్పెను.
ఈ వచనాలలో హమోరు మరింతగా వారిని బ్రతిమిలాడుతూ ఓలి కట్నం గురించి కూడా మాట్లాడడం మనం చూస్తాం. ఈ విధంగా అతను తన కుమారుడు దీనా పట్ల చేసిన తప్పిదానికి ప్రాయుశ్చిత్తం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆదికాండము 34:13 అయితే తమ సహోదరియైన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రియైన హమోరుతోను కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా-
ఈ వచనంలో యాకోబు కుమారులు షెకెము కుటుంబాన్ని హత్య చెయ్యాలనే ఉద్దేశంతో వారికి కపటంగా ఉత్తరమిస్తున్నట్టు మనం చూస్తాం. ఈవిధంగా మాట్లాడుతున్న "యాకోబు కుమారులు" లేవి షిమ్యోనులే అని (అందరూ కాదు) తదుపరి వచనాలలో మనకు అర్థమౌతుంది. కానీ కపటంగా హత్య చెయ్యాలి అనుకోవడం దేవుని న్యాయానికి పూర్తి వ్యతిరేకం (కీర్తనలు 5:6). అలానే మనపట్ల చేసిన తప్పిదం విషయంలో పశ్చాత్తాపపడి, దానిని సరిచేసుకునే ప్రయత్నం చేస్తుప్పుడు కూడా వారిని శిక్షించాలనుకోవడం దేవుని పిల్లల లక్షణం కాదు (మత్తయి 6:14,15).
ఆదికాండము 34:14-17 మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకొననివానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలె నుండినయెడల సరి. ఆ పక్షమందు మీ మాటకొప్పుకొని, మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని, మీ మధ్య నివసించెదము, అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని యెడల మా పిల్లను తీసికొని పోవుదుమని చెప్పగా-
ఈ వచనంలో యాకోబు కుమారులైన లేవి షిమ్యోనులు హమోరు అభ్యర్థనకు అభ్యంతరంగా సున్నతిని ప్రస్తావించడం, వారు సున్నతి పొందేలా ప్రేరేపించడం మనం చూస్తాం. ఈ అభ్యంతరం వారి కపటబుద్ధిలో భాగం. చూడండి; ఇక్కడ వీరు తమ చెల్లెలి విషయంలో జరిగినదానికి పగతీర్చుకునే ఉద్దేశంతో సున్నతిని అడ్డుపెట్టుకుంటూ దేవుడు తన నిబంధనకు గుర్తుగా నియమించిన ఆ ఆచారాన్ని దారుణంగా అవమానిస్తున్నారు. యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడమే పాపమైనప్పుడు (ద్వితియోపదేశకాండము 5:11) ఆయన తన నిబంధనకు గుర్తుగా నియమించిన సున్నతిని పగతీర్చుకోవడానికై అడ్డుపెట్టుకోవడం మరెంత ఘోరపాపమో ఆలోచించండి. కాబట్టి వీరు భక్తికి సంబంధించిన ఆచారాలను అడ్డుపెట్టుకుని తమ ఉద్దేశాలను నెరవేర్చుకునే దుష్టులతో సమానులుగా కనిపిస్తున్నారు. విశ్వాసులు ఇలాంటి దిగజారుడు స్థితికి చేరకుండా జాగ్రత వహించాలి.
ఆదికాండము 34:18,19 వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా నుండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెయందు ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవుచేయలేదు. అతడు తన తండ్రి యింటి వారందరిలో ఘనుడు.
ఈ వచనాలలో షెకెముకు దీనాపట్ల ఉన్న ప్రేమ మరోసారి బహిర్గతం ఔతున్నట్టు మనం చూస్తాం. దానికి తన తండ్రి కూడా అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ వారు తలచుకుంటే ఇలాంటి షరతు తమకు అవమానంగా భావించి దానిని తృణీకరించగలిగేవారు.
ఆదికాండము 34:20-24 హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరిగవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాటలాడుచు ఈ మనుష్యులు మనతో సమాధానముగానున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి యిందులో వ్యాపారము చేయనియ్యుడి. ఈ భూమి వారికిని చాలినంత విశాలమైయున్నది గదా, మనము వారి పిల్లలను పెండ్లి చేసికొని మన పిల్లలను వారికి ఇత్తము. అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందినయెడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి యేకజనముగా నుందురు. వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నియు మనవగునుగదా. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందము, అప్పుడు వారు మనలో నివసించెదరనగా హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పినమాట అతని ఊరిగవిని ద్వారా వెళ్లువారందరు వినిరి. అప్పుడతని ఊరి గవిని ద్వారా వెళ్లువారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను.
ఈ వచనాలలో షెకెము హమోరులు, తమ ఊరి పురుషులందరూ సున్నతి పొందేలా దానివల్ల వారికి కలిగే ప్రయోజనాలను వివరించడం మనం చూస్తాం. వారు కూడా షెకెము, హమోరుల మాటలకు సమ్మతించి సున్నతి పొందారు. కానీ వారు దైవ నిబంధనకు గురుతైన సున్నతిని ఆ దేవుని గురించి ఏమాత్రం తెలుసుకోకుండా పొందేసారు. అంటే వారు యాకోబు కుటుంబం నుండి లాభం కలుగుతుందనేసరికి ఇక ఏమాత్రం ఆలోచించకుండా తాము ఎరుగని ఒక అన్యదేవుడి ఆచారాన్ని పాటించారు, దురాశకు పోయారు. కానీ వీరికి ఏం జరిగిందో ఈ క్రింది వచనాల్లో రాయబడింది. వారు ఏదో సంపాదించుకోవాలని సున్నతి పొందితే చివరికి తమ ప్రాణాలతో సహా ఉన్నదంతా పోగొట్టుకున్నారు. దైవిక సంబంధమైన ఆచారాలను లాభం సంపాదించుకోవడానికి పాటిస్తే చివరికి ఇలా ఊహించని నష్టమే కలుగుతుంది.
ప్రస్తుత సంఘాలలో దేవుని గురించి ఏమీ తెలుసుకోకుండా లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో బాప్తీస్మాలు పొందేవారూ ఇతర దైవిక కార్యక్రమాల్లో పాలుపొందేవారూ ఇలాంటివారే. వీరిని లేఖనం చెడిపోయిన మనస్సు కలిగినవారని పేర్కొంది (1 తిమోతికి 6:5).
ఆదికాండము 34:25,26 మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు, తమ కత్తులు చేతపట్టుకొని యెవరికి తెలియకుండ ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటనుండి దీనాను తీసికొని వెళ్లిపోయిరి.
ఈ వచనాలలో లేవి షిమ్యోనులు ముందుగా వేసుకున్న దుష్టప్రణాళిక ప్రకారం, ఆ ఊరి పురుషులందరూ సున్నతివల్ల కలిగే బాధనుబట్టి బలహీనులుగా ఉన్నప్పుడు వారిపై దాడిచేసి షెకెము, హమోరులతో సహా అందరినీ చంపివేసినట్టు, తమ చెల్లెలిని షెకెము ఇంటి నుండి తీసుకుపోయినట్టు మనం చూస్తాం.
జరిగిన ఈ సంఘటనలో రెండు విషయాలను మనం అర్థం చేసుకోవాలి.
1. వీరు చేసింది దేవుని న్యాయానికి పూర్తి వ్యతిరేకం (కీర్తనలు 5:6, సామెతలు 3:29). అందుకే తమ తండ్రియైన యాకోబు తన మరణ సమయంలో దీనిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రెండు గోత్రాలవారినీ శపించాడు, "నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంఘముతో కలిసికొనవద్దు" అంటూ వారి దుష్టప్రవర్తనతో తన్ను తాను వేరు చేసుకున్నాడు (ఆదికాండము 49:5-7).
2. లేవీ షిమ్యోనులు దైవవిరుద్ధంగా చేసిన ఈ హింస కూడా దేవుని సార్వభౌమత్వాన్నే నెరవేరుస్తుంది (కీర్తనలు 76:10). ఎందుకంటే అబ్రాహాముకు పుట్టిన ఇష్మాయేలే ఇస్సాకుతో కలసి ఏకజనం కానప్పుడు, ఇస్సాకుకు పుట్టిన ఏశావుకు కూడా ఆ ఘనత దక్కనప్పుడు శపించబడిన కనానీయులు మాత్రం ఇశ్రాయేలీయులతో ఏకజనం ఎలా అవ్వగలరు?. ఆ ఊరిప్రజలు ఇశ్రాయేలీయులతో ఏకజనం అవ్వాలనే ఉద్దేశంతో కూడా సున్నతి పొందారు. కానీ వారికున్న ఆ ఆశ నెరవేరకుండా హతమయ్యారు. ఈవిధంగా ఇక్కడ దేవుని చిత్తమే నెరవేరింది. అయినప్పటికీ ఆ హింసను జరిగించిన లేవీ షిమ్యోనులు వారి కపటబుద్ధిని బట్టి దేవునిదృష్టికి దోషులూ ఆయన న్యాయానికి విరుద్ధంగా ప్రవర్తించిన హేయులూను.
ఆదికాండము 34:27-29 తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడినవారు ఉన్నచోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొఱ్ఱెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లలనందరిని వారి స్త్రీలను చెరపట్టి, యిండ్లలోనున్నదంతయు దోచుకొనిరి.
ఈ వచనాలలో లేవి షిమ్యోనులు ఆ ఊరి పురుషులను అన్యాయంగా చంపడమే కాకుండా వారి స్త్రీలనూ మిగిలిన సొత్తు అంతటినీ దోచుకున్నట్టు మనం చూస్తాం. కాబట్టి వీరు వారి సొత్తును కూడా దోచుకోవాలనే దురుద్దేశంతో కూడా ఇదంతా చేసారు.
ఆదికాండము 34:30 అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే. వారు నామీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటివారును నాశనమగుదమని చెప్పెను.
ఈ వచనాలలో యాకోబు తన కుమారులైన లేవీ షిమ్యోనులు చేసినదానిని బాధపడడం మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పటివరకూ యాకోబు వారిమధ్యలో ఒక మంచి వ్యక్తిగా నివసించాడు. పైగా వారిమధ్య యెహోవా దేవునికి బలిపీఠం కట్టడం ద్వారా తనను తాను దేవునికి లోబడే దాసునిగా అందరికీ ప్రకటించుకున్నాడు. ఇప్పుడు అతని కుమారులు షెకెమువారిపై కపటంగా చేసిన హింసను బట్టి చుట్టుపక్కల ప్రజల దృష్టిలో అతను అసహ్యుడిగా మారడమే కాదు, అతను నమ్మిన దేవుని నామం కూడా అవమానించబడుతుంది. భక్తిపరుడిగా పేరుపొందిన ఒక వ్యక్తి చేసే చెడుకార్యపు ప్రభావం అతను భక్తికలిగున్న దేవునిపై కూడా తప్పకుండా పడుతుంది. ఉదాహరణకు దావీదు చేసిన హేయకార్యం వల్ల దేవుని నామం దూషించబడింది (2 సమూయేలు 12:13,14). కాబట్టి ఒక విశ్వాసి తాను చేసే పనుల విషయంలోనూ తన కుటుంబం చేసే పనుల విషయంలో కూడా జాగ్రత కలిగుండాలి. ప్రస్తుతం కొందరు విశ్వాసులుగా పిలవబడేవారు చేసే చెడుకార్యాలను బట్టి దేవుని నామం ఎంతగా దూషించబడుతుందో మనకు తెలుసు, వీరు దానికి తగిన శిక్షను తప్పించుకోలేరు.
అలానే తన కుమారులు చేసిన ఆ హింసాకాండను బట్టి మిగిలిన కనానీయుల ఊర్లు తనపై దాడి చేసి అందర్నీ చంపేస్తారని కూడా అతను భయపడ్దాడు అందుకే "నా జనసంఖ్య కొంచెమే. వారు నామీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటివారును నాశనమగుదమని" కూడా అంటున్నాడు.
ఆదికాండము 34:31 అందుకు వారు వేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా అనిరి.
ఈ వచనంలో లేవి షిమ్యోనులు తమ చెల్లెలి పట్ల షెకెము చేసినదానిని ప్రస్తావించి తాము చేసిన హింసను సమర్థించుకుంటున్నట్టు మనం చూస్తాం. అయితే అక్కడ షెకెము తమ చెల్లెలి విషయంలో చేసినదానినీ తరువాత వీరు చేసిన హింసనూ పోల్చిచూస్తే వీరే అత్యంత కఠినమైన నేరస్తులుగా కనిపిస్తారు. ఎందుకంటే షెకెము తమ చెల్లెలి పట్ల తప్పిదం చేసినప్పటికీ తర్వాత దానిని సరిచేసుకోడానికి ప్రయత్నించాడు, తనకున్న బలంతో వీరిపై దౌర్జన్యం చెయ్యకుండా ఆమె కోసం వీరు చెప్పిన మాటలకు సమ్మతించాడు. కానీ వీరు షెకెముపైనా అతని ఊరుపైనా పగ తీర్చుకోడానికి దేవుని నిబంధనకు గురుతైన సున్నతిని అడ్డుపెట్టుకున్నారు. వారు దానికి సమ్మతించి, వీరి మాట ప్రకారమే నడుచుకున్నప్పుడు కూడా కనికరం లేకుండా ఆ ఊరివారంతా బలహీనులుగా ఉన్న సమయంలో వారిపై దాడికి పాల్పడ్డారు. తమ చెల్లెలి విషయంలో పొరపాటు చేసింది షెకెము ఒకడే ఐతే వీరు ఆ ఊరిలో ఉన్న అమాయక (ఆ విషయంలో) పురుషులందరినీ చంపి, వారికున్న సమస్తాన్నీ స్త్రీలతో సహా దోచుకున్నారు.
చివరికి వీరు ఏ చెల్లికోసమైతే ఇదంతా చేసామని తమ తండ్రికి గర్వంగా సమాధానం చెబుతున్నారో ఆ చెల్లెలిపట్ల కూడా వీరు చేసింది అన్యాయమే ఔతుంది. ఎందుకంటే షెకెము మొదట ఆమెను బలవంతం చేసినప్పటికీ తర్వాత ఆమెను ప్రేమించి ఆమెకోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడ్డాడు. అంతగా తమ చెల్లిని ప్రేమించినవాడిని వీరు చంపేసి తమ చెల్లి విషయంలో ప్రతీకారం చేసామని భావిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత ఆమె జీవితం ఎలా గడిచిందో ఆమెకు మరలా వివాహం అయిందో లేదో మనకు వివరించబడలేదు. ఆమె వంశావళి ఎక్కడా రాయబడకుండడాన్ని బట్టి ఆమె అవివాహితురాలిగానే ఉండిపోయుంటుందని వ్యక్తిగతంగా భావిస్తున్నాను.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 34
34:1, 34:2, 34:3,4, 34:5, 34:6, 34:7, 34:8-10, 34:11,12, 34:13, 34:14-17, 34:18,19, 34:20-24, 34:25,26, 34:27-29, 34:30, 34:31
ఆదికాండము 34:1 లేయా యాకోబునకు కనిన కుమార్తెయైన దీనా. ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్లెను.
ఈ వచనంలో యాకోబు కుమార్తెయైన దీనా కనాను దేశంలోని అమ్మాయిలను చూడడానికి వెళ్ళినట్టు మనం చూస్తాం. కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఆ దేశంలో అది పండుగ రోజు. అయితే యాకోబు కుటుంబం ఒంటరిగా లేదు, అతనికి దాసదాసీలు కూడా ఉన్నారు. అంటే వారికి పిల్లలూ ఉండుంటారు. ఇది మనకు అతను బేతేలుకు వెళ్ళేటప్పుడు కూడా అర్థమౌతుంది (ఆదికాండము 35:2). అంటే ఆమె చుట్టూ మనుషులు ఉన్నప్పటికీ ఆమె ఆ దేశపు కుమార్తెలు ఎలా ఉంటారో చూడడానికి వెళ్ళింది.
ఒకవిధంగా ఇది నేత్రాశను సూచిస్తుంది. అంటే నేను నూతనప్రదేశాలను చూడడం కానీ నూతనవ్యక్తులను కలవడం కానీ తప్పని చెప్పడం లేదు. అయితే అధ్యాత్మిక కుటుంబానికి సంబంధించిన ఈమె పనిగట్టుకుని మరీ ఆ విగ్రహారాధికులను చూడడానికి వెళ్ళాల్సిన అవసరం లేదంటున్నాను. పైగా ఆ ప్రాంతంలో నైతికనియమాలు అంతగా ఉండవు. ఆ విషయం ఈమెకు కూడా తెలుసుండాలి (దాని గురించి క్రింది వచనాల్లో వివరిస్తాను). అయినా వెళ్ళింది అది కూడా ఒంటరిగా వెళ్ళింది.
ఆదికాండము 34:2 ఆ దేశమునేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను.
ఈ వచనంలో హమోరు కుమారుడైన షెకెము దీనాను బలాత్కారం చెయ్యడం మనం చూస్తాం. కారణం: తనది కాని ప్రాంతానికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలనే బాధ్యతను ఆమె నిర్లక్ష్యపెట్టింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో నైతిక విలువలు పాటించే పరిస్థితి (ముఖ్యంగా లైంగికత విషయంలో) అంతగా ఉండదు (ఆదికాండము 26:10). ఆ విషయం ఆమెకు కూడా తెలిసుంటుంది. శారా రిబ్కాల సంఘటనలు ఈమె కుటుంబ చరిత్రనేగా. అక్కడికి వెళ్తున్న విషయం కనీసం ఆమె తన కుటుంబ సభ్యులకైనా తెలియచేసిందో లేదో మనకు తెలియదు. తెలియచేసే ఉంటే తనను ఒంటరిగా పంపిన కుటుంబం కూడా ఆమె విషయంలో సరైన జాగ్రతను తీసుకోలేదని మనం భావించాలి. కాబట్టి దీనా విషయంలో జరిగినదానిని బట్టి మనం వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం మరచిపోకూడదు. ప్రాముఖ్యంగా నైతిక ప్రమాణాలు పాటించని వ్యక్తులకు దూరంగా ఉండాలి. లేకుంటే మనకే ప్రమాదం. ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది.
ఆదికాండము 34:3,4 అతని మనస్సు యాకోబు కుమార్తెయైన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి ఈ చిన్నదాని నాకు పెండ్లిచేయుమని తన తండ్రియైన హమోరును అడిగెను.
ఈ వచనాలలో షెకెము దీనాను ప్రేమించి, ఆమెను వివాహం చేసుకునే ఉద్దేశంతో తన తండ్రిని ప్రేరేపించడం మనం చూస్తాం. ఇక్కడ ఈ షెకెము అనేవ్యక్తి గురించి మనం ఆలోచిస్తే యాకోబు కనానుకు వచ్చినప్పుడు ఇతని సహోదరుల దగ్గరే పొలం కొని అందులో నివసిస్తున్నాడు (ఆదికాండము 33:19). దీనిప్రకారం యాకోబు కుటుంబానికి షెకెముకూ పరిచయం ఉండి అతను దీనాను ప్రేమిస్తున్నాడేమో. అయితే అతను తొందరపడి అలా బలాత్కారం చెయ్యకుండా ముందే వివాహం చేసుకునే ప్రయత్నం చేసుంటే బావుండేది. కానీ అతను అలా చెయ్యకుండా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల చివరికి తన ప్రాణంతో పాటుగా ఆ ఊరి పురుషులందరి ప్రాణాలూ పోవడానికి కారణమయ్యాడు. కానీ ఈ షెకెములో ఒకటి మాత్రం మనం స్పష్టంగా గమనిస్తున్నాం. అతను దీనా విషయంలో తప్పిదం చేసినప్పటికీ వివాహం ద్వారా దానిని సరిచేసుకోవాలి అనుకుంటున్నాడు. దావీదు కుమారుడైన అమ్నోనులా కోరిక తీర్చుకుని విడిచిపెట్టడం లేదు (2 సమూయేలు 13:15,16).
ఆదికాండము 34:5 తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువులతో పొలములలోనుండినందున వారు వచ్చువరకు ఊరకుండెను.
ఈ వచనంలో యాకోబు తన కుమార్తె విషయంలో జరిగినదానిని విని తన కుమారులు వచ్చేంతవరకూ ఊరుకుండడం మనం చూస్తాం. ఎందుకంటే యాకోబు కుమారులు అప్పటికి యవ్వనస్తులుగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో తనకు తానుగా నిర్ణయం తీసుకోవడం లేదు.
ఆదికాండము 34:6 షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాటలాడుటకు అతనియొద్దకు వచ్చెను.
ఈ వచనంలో హమోరు దీనాతో తన కుమారుడికి వివాహం జరిపించమని యాకోబుతో మాట్లాడడానికి రావడం మనం చూస్తాం. అతను తలచుకుంటే అన్యాయానికి గురైన దీనా విషయంలో యాకోబుకు ఎలాంటి సంజాయిషీ ఇవ్వకుండా తప్పించుకోగలడు, తన కుమారుడి కోరికను కూడా లక్ష్యపెట్టకపోదుడు. ఎందుకంటే యాకోబుతో పోలిస్తే అతని బలం ఎక్కువ. కానీ అలా చెయ్యకుండా సత్ప్రవర్తననే అనుసరిస్తున్నాడు. కనానీయులు దుర్మార్గులే అయినప్పటికీ అబ్రాహాము యాకోబుల కాలంలో అక్కడ మంచివారు కూడా మనకు కనిపిస్తుంటారు. శారా చనిపోయినప్పుడు వారు అబ్రాహాముపై చూపిన అభిమానాన్ని బట్టి అది గమనిస్తాం (ఆదికాండము 23వ అధ్యాయము).
ఈ విషయంలో విశ్వాసులు తమను తాము పరీక్షించుకోవాలి. కనానీయులైన షెకెము హమోరులే తమవల్ల జరిగిన తప్పిదాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవునిపిల్లలమైన మనపై ఆ బాధ్యత మరెంతగా ఉంటుంది? కానీ మనలో చాలామందిమి అలా చెయ్యము. తప్పించుకోవడానికే ప్రయత్నిస్తుంటాం. ఇది విశ్వాసుల లక్షణం కాదు.
ఆదికాండామము 34:7 యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములోనుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపము వచ్చెను.
ఈ వచనంలో యాకోబు కుమారులు ఆ సంగతి విని కోపంతోనూ బాధతోనూ నిండుకున్నట్టు మనం చూస్తాం. అయితే కనాను చుట్టుపక్కల ప్రజల్లో వివాహానికి ముందు ఒక స్త్రీతో శయనించకూడదనే నియమం అంత కఠినంగా ఉండదు, అందుచేత కూడా షెకెము అలా చేసాడు. ఎందుకంటే ఈ కనానుకు సమీపంగా ఉన్న పిలిష్తీయుల దేశంలో శారా రిబ్కాల విషయంలో కూడా వారు అలానే ఆలోచించినప్పుడు దేవుడు వారిద్దరినీ కాపాడినట్టు మనం చదువుతాం (ఆదికాండము 26:10,11).
ఆదికాండము 34:8-10 అప్పుడు హమోరు వారితో షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లిచేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ యెదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారముచేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను.
ఈ వచనాలలో షెకెము తండ్రియైన హమోరు యాకోబుతోనూ అతని కుమారులతోనూ వివాహం విషయం మాట్లాడడం మనం చూస్తాం. దీనివల్ల వారికి కలిగే ప్రయోజనాలు కూడా అతను తెలియచేస్తున్నాడు. పైన వివరించినట్టుగా అతను సమాధానపడడానికే ప్రయత్నిస్తున్నాడు తప్ప తనకున్న బలంతో దౌర్జన్యం చెయ్యడం లేదు.
ఆదికాండము 34:11,12 మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానీయుడి. మీరేమి అడుగుదురో అది యిచ్చెదను. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి. మీరు అడిగినంత యిచ్చెదను. మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోను చెప్పెను.
ఈ వచనాలలో హమోరు మరింతగా వారిని బ్రతిమిలాడుతూ ఓలి కట్నం గురించి కూడా మాట్లాడడం మనం చూస్తాం. ఈ విధంగా అతను తన కుమారుడు దీనా పట్ల చేసిన తప్పిదానికి ప్రాయుశ్చిత్తం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆదికాండము 34:13 అయితే తమ సహోదరియైన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రియైన హమోరుతోను కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా-
ఈ వచనంలో యాకోబు కుమారులు షెకెము కుటుంబాన్ని హత్య చెయ్యాలనే ఉద్దేశంతో వారికి కపటంగా ఉత్తరమిస్తున్నట్టు మనం చూస్తాం. ఈవిధంగా మాట్లాడుతున్న "యాకోబు కుమారులు" లేవి షిమ్యోనులే అని (అందరూ కాదు) తదుపరి వచనాలలో మనకు అర్థమౌతుంది. కానీ కపటంగా హత్య చెయ్యాలి అనుకోవడం దేవుని న్యాయానికి పూర్తి వ్యతిరేకం (కీర్తనలు 5:6). అలానే మనపట్ల చేసిన తప్పిదం విషయంలో పశ్చాత్తాపపడి, దానిని సరిచేసుకునే ప్రయత్నం చేస్తుప్పుడు కూడా వారిని శిక్షించాలనుకోవడం దేవుని పిల్లల లక్షణం కాదు (మత్తయి 6:14,15).
ఆదికాండము 34:14-17 మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకొననివానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలె నుండినయెడల సరి. ఆ పక్షమందు మీ మాటకొప్పుకొని, మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని, మీ మధ్య నివసించెదము, అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని యెడల మా పిల్లను తీసికొని పోవుదుమని చెప్పగా-
ఈ వచనంలో యాకోబు కుమారులైన లేవి షిమ్యోనులు హమోరు అభ్యర్థనకు అభ్యంతరంగా సున్నతిని ప్రస్తావించడం, వారు సున్నతి పొందేలా ప్రేరేపించడం మనం చూస్తాం. ఈ అభ్యంతరం వారి కపటబుద్ధిలో భాగం. చూడండి; ఇక్కడ వీరు తమ చెల్లెలి విషయంలో జరిగినదానికి పగతీర్చుకునే ఉద్దేశంతో సున్నతిని అడ్డుపెట్టుకుంటూ దేవుడు తన నిబంధనకు గుర్తుగా నియమించిన ఆ ఆచారాన్ని దారుణంగా అవమానిస్తున్నారు. యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడమే పాపమైనప్పుడు (ద్వితియోపదేశకాండము 5:11) ఆయన తన నిబంధనకు గుర్తుగా నియమించిన సున్నతిని పగతీర్చుకోవడానికై అడ్డుపెట్టుకోవడం మరెంత ఘోరపాపమో ఆలోచించండి. కాబట్టి వీరు భక్తికి సంబంధించిన ఆచారాలను అడ్డుపెట్టుకుని తమ ఉద్దేశాలను నెరవేర్చుకునే దుష్టులతో సమానులుగా కనిపిస్తున్నారు. విశ్వాసులు ఇలాంటి దిగజారుడు స్థితికి చేరకుండా జాగ్రత వహించాలి.
ఆదికాండము 34:18,19 వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా నుండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెయందు ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవుచేయలేదు. అతడు తన తండ్రి యింటి వారందరిలో ఘనుడు.
ఈ వచనాలలో షెకెముకు దీనాపట్ల ఉన్న ప్రేమ మరోసారి బహిర్గతం ఔతున్నట్టు మనం చూస్తాం. దానికి తన తండ్రి కూడా అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ వారు తలచుకుంటే ఇలాంటి షరతు తమకు అవమానంగా భావించి దానిని తృణీకరించగలిగేవారు.
ఆదికాండము 34:20-24 హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరిగవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాటలాడుచు ఈ మనుష్యులు మనతో సమాధానముగానున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి యిందులో వ్యాపారము చేయనియ్యుడి. ఈ భూమి వారికిని చాలినంత విశాలమైయున్నది గదా, మనము వారి పిల్లలను పెండ్లి చేసికొని మన పిల్లలను వారికి ఇత్తము. అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందినయెడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి యేకజనముగా నుందురు. వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నియు మనవగునుగదా. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందము, అప్పుడు వారు మనలో నివసించెదరనగా హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పినమాట అతని ఊరిగవిని ద్వారా వెళ్లువారందరు వినిరి. అప్పుడతని ఊరి గవిని ద్వారా వెళ్లువారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను.
ఈ వచనాలలో షెకెము హమోరులు, తమ ఊరి పురుషులందరూ సున్నతి పొందేలా దానివల్ల వారికి కలిగే ప్రయోజనాలను వివరించడం మనం చూస్తాం. వారు కూడా షెకెము, హమోరుల మాటలకు సమ్మతించి సున్నతి పొందారు. కానీ వారు దైవ నిబంధనకు గురుతైన సున్నతిని ఆ దేవుని గురించి ఏమాత్రం తెలుసుకోకుండా పొందేసారు. అంటే వారు యాకోబు కుటుంబం నుండి లాభం కలుగుతుందనేసరికి ఇక ఏమాత్రం ఆలోచించకుండా తాము ఎరుగని ఒక అన్యదేవుడి ఆచారాన్ని పాటించారు, దురాశకు పోయారు. కానీ వీరికి ఏం జరిగిందో ఈ క్రింది వచనాల్లో రాయబడింది. వారు ఏదో సంపాదించుకోవాలని సున్నతి పొందితే చివరికి తమ ప్రాణాలతో సహా ఉన్నదంతా పోగొట్టుకున్నారు. దైవిక సంబంధమైన ఆచారాలను లాభం సంపాదించుకోవడానికి పాటిస్తే చివరికి ఇలా ఊహించని నష్టమే కలుగుతుంది.
ప్రస్తుత సంఘాలలో దేవుని గురించి ఏమీ తెలుసుకోకుండా లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో బాప్తీస్మాలు పొందేవారూ ఇతర దైవిక కార్యక్రమాల్లో పాలుపొందేవారూ ఇలాంటివారే. వీరిని లేఖనం చెడిపోయిన మనస్సు కలిగినవారని పేర్కొంది (1 తిమోతికి 6:5).
ఆదికాండము 34:25,26 మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు, తమ కత్తులు చేతపట్టుకొని యెవరికి తెలియకుండ ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటనుండి దీనాను తీసికొని వెళ్లిపోయిరి.
ఈ వచనాలలో లేవి షిమ్యోనులు ముందుగా వేసుకున్న దుష్టప్రణాళిక ప్రకారం, ఆ ఊరి పురుషులందరూ సున్నతివల్ల కలిగే బాధనుబట్టి బలహీనులుగా ఉన్నప్పుడు వారిపై దాడిచేసి షెకెము, హమోరులతో సహా అందరినీ చంపివేసినట్టు, తమ చెల్లెలిని షెకెము ఇంటి నుండి తీసుకుపోయినట్టు మనం చూస్తాం.
జరిగిన ఈ సంఘటనలో రెండు విషయాలను మనం అర్థం చేసుకోవాలి.
1. వీరు చేసింది దేవుని న్యాయానికి పూర్తి వ్యతిరేకం (కీర్తనలు 5:6, సామెతలు 3:29). అందుకే తమ తండ్రియైన యాకోబు తన మరణ సమయంలో దీనిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రెండు గోత్రాలవారినీ శపించాడు, "నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంఘముతో కలిసికొనవద్దు" అంటూ వారి దుష్టప్రవర్తనతో తన్ను తాను వేరు చేసుకున్నాడు (ఆదికాండము 49:5-7).
2. లేవీ షిమ్యోనులు దైవవిరుద్ధంగా చేసిన ఈ హింస కూడా దేవుని సార్వభౌమత్వాన్నే నెరవేరుస్తుంది (కీర్తనలు 76:10). ఎందుకంటే అబ్రాహాముకు పుట్టిన ఇష్మాయేలే ఇస్సాకుతో కలసి ఏకజనం కానప్పుడు, ఇస్సాకుకు పుట్టిన ఏశావుకు కూడా ఆ ఘనత దక్కనప్పుడు శపించబడిన కనానీయులు మాత్రం ఇశ్రాయేలీయులతో ఏకజనం ఎలా అవ్వగలరు?. ఆ ఊరిప్రజలు ఇశ్రాయేలీయులతో ఏకజనం అవ్వాలనే ఉద్దేశంతో కూడా సున్నతి పొందారు. కానీ వారికున్న ఆ ఆశ నెరవేరకుండా హతమయ్యారు. ఈవిధంగా ఇక్కడ దేవుని చిత్తమే నెరవేరింది. అయినప్పటికీ ఆ హింసను జరిగించిన లేవీ షిమ్యోనులు వారి కపటబుద్ధిని బట్టి దేవునిదృష్టికి దోషులూ ఆయన న్యాయానికి విరుద్ధంగా ప్రవర్తించిన హేయులూను.
ఆదికాండము 34:27-29 తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడినవారు ఉన్నచోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొఱ్ఱెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లలనందరిని వారి స్త్రీలను చెరపట్టి, యిండ్లలోనున్నదంతయు దోచుకొనిరి.
ఈ వచనాలలో లేవి షిమ్యోనులు ఆ ఊరి పురుషులను అన్యాయంగా చంపడమే కాకుండా వారి స్త్రీలనూ మిగిలిన సొత్తు అంతటినీ దోచుకున్నట్టు మనం చూస్తాం. కాబట్టి వీరు వారి సొత్తును కూడా దోచుకోవాలనే దురుద్దేశంతో కూడా ఇదంతా చేసారు.
ఆదికాండము 34:30 అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే. వారు నామీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటివారును నాశనమగుదమని చెప్పెను.
ఈ వచనాలలో యాకోబు తన కుమారులైన లేవీ షిమ్యోనులు చేసినదానిని బాధపడడం మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పటివరకూ యాకోబు వారిమధ్యలో ఒక మంచి వ్యక్తిగా నివసించాడు. పైగా వారిమధ్య యెహోవా దేవునికి బలిపీఠం కట్టడం ద్వారా తనను తాను దేవునికి లోబడే దాసునిగా అందరికీ ప్రకటించుకున్నాడు. ఇప్పుడు అతని కుమారులు షెకెమువారిపై కపటంగా చేసిన హింసను బట్టి చుట్టుపక్కల ప్రజల దృష్టిలో అతను అసహ్యుడిగా మారడమే కాదు, అతను నమ్మిన దేవుని నామం కూడా అవమానించబడుతుంది. భక్తిపరుడిగా పేరుపొందిన ఒక వ్యక్తి చేసే చెడుకార్యపు ప్రభావం అతను భక్తికలిగున్న దేవునిపై కూడా తప్పకుండా పడుతుంది. ఉదాహరణకు దావీదు చేసిన హేయకార్యం వల్ల దేవుని నామం దూషించబడింది (2 సమూయేలు 12:13,14). కాబట్టి ఒక విశ్వాసి తాను చేసే పనుల విషయంలోనూ తన కుటుంబం చేసే పనుల విషయంలో కూడా జాగ్రత కలిగుండాలి. ప్రస్తుతం కొందరు విశ్వాసులుగా పిలవబడేవారు చేసే చెడుకార్యాలను బట్టి దేవుని నామం ఎంతగా దూషించబడుతుందో మనకు తెలుసు, వీరు దానికి తగిన శిక్షను తప్పించుకోలేరు.
అలానే తన కుమారులు చేసిన ఆ హింసాకాండను బట్టి మిగిలిన కనానీయుల ఊర్లు తనపై దాడి చేసి అందర్నీ చంపేస్తారని కూడా అతను భయపడ్దాడు అందుకే "నా జనసంఖ్య కొంచెమే. వారు నామీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటివారును నాశనమగుదమని" కూడా అంటున్నాడు.
ఆదికాండము 34:31 అందుకు వారు వేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా అనిరి.
ఈ వచనంలో లేవి షిమ్యోనులు తమ చెల్లెలి పట్ల షెకెము చేసినదానిని ప్రస్తావించి తాము చేసిన హింసను సమర్థించుకుంటున్నట్టు మనం చూస్తాం. అయితే అక్కడ షెకెము తమ చెల్లెలి విషయంలో చేసినదానినీ తరువాత వీరు చేసిన హింసనూ పోల్చిచూస్తే వీరే అత్యంత కఠినమైన నేరస్తులుగా కనిపిస్తారు. ఎందుకంటే షెకెము తమ చెల్లెలి పట్ల తప్పిదం చేసినప్పటికీ తర్వాత దానిని సరిచేసుకోడానికి ప్రయత్నించాడు, తనకున్న బలంతో వీరిపై దౌర్జన్యం చెయ్యకుండా ఆమె కోసం వీరు చెప్పిన మాటలకు సమ్మతించాడు. కానీ వీరు షెకెముపైనా అతని ఊరుపైనా పగ తీర్చుకోడానికి దేవుని నిబంధనకు గురుతైన సున్నతిని అడ్డుపెట్టుకున్నారు. వారు దానికి సమ్మతించి, వీరి మాట ప్రకారమే నడుచుకున్నప్పుడు కూడా కనికరం లేకుండా ఆ ఊరివారంతా బలహీనులుగా ఉన్న సమయంలో వారిపై దాడికి పాల్పడ్డారు. తమ చెల్లెలి విషయంలో పొరపాటు చేసింది షెకెము ఒకడే ఐతే వీరు ఆ ఊరిలో ఉన్న అమాయక (ఆ విషయంలో) పురుషులందరినీ చంపి, వారికున్న సమస్తాన్నీ స్త్రీలతో సహా దోచుకున్నారు.
చివరికి వీరు ఏ చెల్లికోసమైతే ఇదంతా చేసామని తమ తండ్రికి గర్వంగా సమాధానం చెబుతున్నారో ఆ చెల్లెలిపట్ల కూడా వీరు చేసింది అన్యాయమే ఔతుంది. ఎందుకంటే షెకెము మొదట ఆమెను బలవంతం చేసినప్పటికీ తర్వాత ఆమెను ప్రేమించి ఆమెకోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడ్డాడు. అంతగా తమ చెల్లిని ప్రేమించినవాడిని వీరు చంపేసి తమ చెల్లి విషయంలో ప్రతీకారం చేసామని భావిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత ఆమె జీవితం ఎలా గడిచిందో ఆమెకు మరలా వివాహం అయిందో లేదో మనకు వివరించబడలేదు. ఆమె వంశావళి ఎక్కడా రాయబడకుండడాన్ని బట్టి ఆమె అవివాహితురాలిగానే ఉండిపోయుంటుందని వ్యక్తిగతంగా భావిస్తున్నాను.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Add comment