28:1,2, 28:3-5, 28:6-9, 28:10,11, 28:12-15, 28:16-19, 28:20,21, 28:22
ఆదికాండము 28:1,2 ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు. నీవు లేచి పద్దనరాములో నున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి-
ఈ వచనాలలో ఇస్సాకు యాకోబుతో నీ తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెను వివాహం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇదంతా అతను రిబ్కా ప్రేరణతోనే మాట్లాడుతున్నాడు. ఈమాటలను బట్టి మనం మూడు ప్రాముఖ్యమైన విషయాలు గ్రహించాలి.
1. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న యాకోబు శాపగ్రస్తులైన కనానీయులను కాకుండా తన బంధువుల స్త్రీని మాత్రమే వివాహం చేసుకునేలా ఇక్కడ ఆజ్ఞాపించబడుతున్నాడు. దీనిప్రకారం; దేవుని ఆశీర్వాదం పొందుకున్న ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించడానికి ఆయన అనుమతించలేదు. వారు దేవుని ఆజ్ఞల ప్రకారంగానే జీవించాలి. అందుకే మనముందు కూడా ఎన్నో ఆజ్ఞలు రాయబడ్డాయి.
2. యాకోబు ఈ సంఘటన జరగడానికి ముందు ఆత్మీయంగానూ భౌతికంగానూ ఆశీర్వదించబడ్డాడు (ఆదికాండము 27:28,29). కానీ ఇప్పుడు తన తండ్రి ఆజ్ఞ ప్రకారం; ఏమీలేని పరదేశిగా మరోచోటికి వెళ్ళబోతున్నాడు. ఎందుకంటే ఆ ఆశీర్వాదం వెంటనే జరిగేది కాదు, దాని నెరవేర్పుకు కొంతసమయం పడుతుంది. కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందుకున్న ప్రజలు వెంటనే దాని ప్రతిఫలం అనుభవించకపోవచ్చు, అలాంటి సమయంలో నిరాశ చెందకూడదు.
3. యాకోబు ఆశీర్వదించబడడం దేవుని నిర్ణయమే అయినప్పటికీ దానికై అతను పాల్పడిన మోసానికి తానే బాధ్యుడని గత అధ్యాయంలో వివరించాను (ఆదికాండము 27:5-10 వ్యాఖ్యానం చూడండి). ఆ మోసానికై అతను క్రమశిక్షణ కూడా చెయ్యబడాలి. అందుకే అతను తన మామ ఇంటికి వెళ్ళి కష్టాలు పడబోతున్నాడు. ఎందుకంటే అతను చేసిన ఆ మోసాన్ని బట్టే ఏశావు అతనిపై పగబట్టాడు, ఆ భయంతోనే రిబ్కా యాకోబును అక్కడికి పంపబోతుంది.
ఆదికాండము 28:3-5 సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసి కొనునట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేసెను. అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను.
ఈ వచనాలలో ఇస్సాకు; అబ్రాహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని యాకోబుకు జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. ఆ వాగ్దానం యాకోబులో నెరవేరినట్టుగా అతని జీవితచరిత్రను బట్టి మనకు అర్థమౌతుంది. ఎలాగంటే అబ్రాహాము పిల్లలలో ఇస్సాకు మాత్రమే ఆ వాగ్దానానికి వారసుడయ్యాడు, ఇస్సాకు పిల్లలలో యాకోబు మాత్రమే దానికి వారసుడయ్యాడు. కానీ యాకోబు విషయంలో అతని పిల్లలంతా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు (ఇశ్రాయేలీయులు).
అదేవిధంగా ఇక్కడ ఇస్సాకు తనను మోసగించిన యాకోబుపై ఎలాంటి కోపమూ చూపించకుండా అతన్ని మరలా దీవిస్తున్నాడు. ఎందుకంటే; చివరికి దేవుని నిర్ణయమే నెరవేరిందని అతను భావించాడు. లేకుంటే శపించియుండేవాడు కదా!
ఆదికాండము 28:6-9 ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతనినక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్లిపోయెననియు ఏశావు తెలిసికొనినప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయేలునొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడ పెండ్లి చేసికొనెను.
ఈ వచనాలలో ఏశావు ఇష్మాయేలు కుమార్తెను కూడా వివాహం చేసుకోవడం మనం చూస్తాం. ఎందుకంటే; కనానీయుల కుమార్తెలు తన తండ్రికి ఇష్టురాండ్రు కాదు కాబట్టి తన బంధువుడైన ఇష్మాయేలు కుమార్తెను వివాహం చేసుకుంటే అది తన తండ్రి దృష్టికి ఇష్టమౌతుందని అతను భావించాడు. కానీ ఇదంతా మారుమనస్సు పొంది కాకుండా ఏదోలా తన తండ్రిని సంతోషపెట్టి అతని నుండి ఏదో ఒకటి పొందుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాడు. సాధారణంగా దుష్టులకు ఉండే లక్షణం ఏంటంటే; ఏదొక మంచి పని చేసి గతంలో చేసిన చెడు అంతా మాసిపోయిందని మనసాక్షికి సర్దిచెప్పుకుంటూ ఆ మంచి పనిని బట్టి లాభం సంపాదించుకోవాలి అనుకుంటారు (పుణ్యం లా). ఇక్కడ ఏశావులో అదే కనిపిస్తుంది.
ఇలాంటి సంఘటననే మనం న్యాయాధిపతులు 18వ అధ్యాయంలో చూస్తాం. దానీయుల గోత్రం వారు తాము చేసే చెడునంతా చేస్తుండి వారికి ఒక లేవీయుడు పరిచయమయ్యేసరికి, చెక్కబడిన ఒక ప్రతిమకు ఆ లేవీయుడిని యాజకుడిగా చేసి తాము చేసేది సరైనదిగా భావిస్తారు. ఎందుకంటే; ధర్మశాస్త్రం ప్రకారం యాజకత్వాన్ని లేవీయులు మాత్రమే చెయ్యాలి. అందుకే లేవీయుడిని ధర్మశాస్త్ర ప్రకారం నియమించుకుని తాము చేసినదానిని బట్టి దేవుడు తమకు తోడైయుంటాడని ఆశపడుతున్నారు. కానీ ఆ లేవీయుడిని వారు దేవుడు అసహ్యించుకునే ప్రతిమకు కదా ప్రతిష్టించారు.
మరోవిషయం ఏంటంటే; కనానీయులైన తన భార్యలు తన తండ్రికి ఇష్టురాండ్రు కారని, ఆ తండ్రి ఇష్టపడేలా ఏదోటి చెయ్యాలని ఇష్మాయేలు కుమార్తెను వివాహం చేసుకున్న ఏశావు, అలా కూడా దేవుని ఆశీర్వాదానికి అపాత్రుడనని చాటుకుంటున్నాడు. ఎందుకంటే; ఇస్సాకుతో ఇష్మాయేలు వారసుడు కానేరడు (ఆదికాండము 21:9-12). దీనిప్రకారం ఎవరైతే ఇస్సాకుతో కలసి వారసుడిగా ఉండకూడదో అదే ఇష్మాయేలు కుమార్తెను అతను తమ కుటుంబంలోకి తీసుకుని వచ్చాడు. కాబట్టి దుష్టులు తమ దుష్టత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో ఒకోసారి తెలియకుండానే మరలా దుష్టత్వంలో పడుతుంటారు. అందుకే "భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలె పలుకుచున్నది వాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు" (కీర్తనలు 36:1) అని రాయబడింది.
అదేవిధంగా ఏశావు తన పెదనాన్న కుమార్తెను వివాహం చేసుకున్నట్టు మనం చదువుతున్నాం. మనదేశ సంస్కృతి ప్రకారం ఇది తప్పుగా అనిపిస్తుంది కానీ వారి సంస్కృతిలో ఇది సరైనదే. ఇప్పటికీ ఇతరదేశాల్లో ఈ వరసల్లోనే వివాహాలు జరుగుతుంటాయి. కాబట్టి బైబిల్ లోని సంఘటనలను అధ్యయనం చేసేటప్పుడు మన దేశ సంస్కృతులూ కాలాన్ని బట్టి కాకుండా ఆయా వ్యక్తులు నివసించిన సంస్కృతులు, కాలాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మనకు బైబిల్ మాత్రమే నైతికనియమం తప్ప మన దేశ సంస్కృతులు కాదు. ఎందుకంటే వాటిని ప్రవేశపెట్టింది ఎవరో ఏ తార్కిక, నైతిక కారణాలను బట్టి వాటికి ప్రవేశపెట్టారో కూడా మనకు తెలియదు. అవన్నీ మనుషులు కల్పించినవే (మూఢనమ్మకాలే). ఉదాహరణకు; పెదనాన్న కూతుర్ని వివాహం చేసుకోవడం తప్పైనప్పుడు మేనత్త కూతుర్ని వివాహం చేసుకోవడం ఎలా సరౌతుంది? ఇద్దరూ తండ్రి రక్తసంబంధులే కదా? కాబట్టి మనం లేవీకాండము 18వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞాపించిన నియమాలను ఇరు కోణాల (అమ్మాయి&అబ్బాయి) నుంచీ పాటిస్తూ ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు.
ఆదికాండము 28:10,11 యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండుకొనెను.
ఈ వచనాలలో యాకోబు తాము నివసిస్తున్న బెయేర్షెబా నుండి బయలుదేరి ఒకచోట నిలిచినట్టు మనం చూస్తాం. ఇప్పుడు యాకోబు పరిస్థితి ఆలోచిస్తే ఇస్సాకు అతనిని పంపేటప్పుడు ఒంటరిగానే పంపాడు తప్ప తనకున్న పరివారాన్ని కానీ ఒంటెలను కానీ తోడు ఇవ్వలేదు. కారణం; వాగ్దాన నెరవేర్పుకై దేవుడు అతనికి తోడుగా ఉంటాడనే విశ్వాసం. దీనినిబట్టి అతను వన్యమృగాలకూ చోరులకూ భయపడుతున్న పరిస్థితిలో పడుకుని ఉంటాడు. గుడారంలో సాధువుగా జీవించిన యాకోబు రాతితో తలగడ చేసుకుని నేలపై పడుకున్నాడు. కాబట్టి అతని మనసులో భయం, బాధ కలగడం సహజం కానీ ఇస్సాకు విశ్వసించినట్టు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అందుకే అప్పుడు ఏం జరిగిందో క్రింది వచనాల్లో రాయబడింది.
ఆదికాండము 28:12-15 అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడియుండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును. నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా-
ఈ వచనాలలో యాకోబుకు దేవుడు స్వప్నంలో ప్రత్యక్షమై, అబ్రాహాముకు తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి ధైర్యపరచడం మనం చూస్తాం. ఆ వాగ్దానం నెరవేరాలంటే యాకోబు బ్రతికే ఉండాలి. కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందుకున్న విశ్వాసులు కొన్నిసార్లు ఒంటరిగా మారినప్పటికీ ఎన్నో భయాలూ బాధలూ వెంటాడుతున్నప్పటికీ ఆయన తోడుగా ఉన్నాడని గుర్తుంచుకోవాలి.
అదేవిధంగా పరలోకానికీ భూమికీ మధ్యలో ఒక నిచ్చెన వెయ్యబడి దానిపై దేవదూతలు ఎక్కుతూ దిగుతుండడం ఇక్కడ చదువుతున్నాం. అది దేవుని సన్నిధినీ సహవాసాన్నీ సూచిస్తుంది. మనం కూడా అలాంటి సన్నిధినీ సహవాసాన్ని యేసుక్రీస్తు ద్వారా అనుభవించబోతున్నాం (యోహాను 1:51).
ఆదికాండము 28:16-19 యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అది నాకు తెలియక పోయెననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.
ఈ వచనాలలో నిద్రలేచిన యాకోబు అది దేవుడున్న స్థలమని గుర్తించి భయపడడం మనం చూస్తాం. ఇది దేవునిపట్ల అతనికున్న విధేయతను తెలియచేస్తుంది. అలానే తర్వాత అతను ఆ రాయిని నిలిపి దానిపై నూనె పోస్తుంది ఆ రాయిలో ఏదో ఉందని కాదు కానీ ఆ కాలంలో బలిపీఠాలను ప్రతిష్టించడానికి అలా చేసేవారు.
ఆదికాండము 28:20,21 అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడైయుండును.
ఈ వచనంలో యాకోబు దేవునిముందు ఒప్పందం చేసుకోవడం మనం చూస్తాం. అతను మొదటిగా దేవుడు తనకు తోడైయుండాలని కోరుకుంటూ తదుపరి కనీస అవసరాలైన వస్త్రాలనూ ఆహారాన్నీ దయ చెయ్యమంటున్నాడే తప్ప దురాశలకు పోవట్లేదు. అతను గొప్ప ఐశ్వర్యానికి వారసుడిగా దీవించబడినప్పటికీ ప్రస్తుతం అతని మనసు కేవలం కనీస అవసరతలపైనే ఉండడానికి కారణం అతనిలో ఆ దేవుని వాగ్దానానికి తగిన మార్పు ప్రారంభమవ్వడమే. కాబట్టి గతకాలపు పాపాల విషయంలో మారుమనస్సు పొంది విశ్వాసులుగా జీవిస్తున్న మనం మొదటిగా దేవుని తోడునూ తదుపరి మన పరిస్థితికి తగిన అవసరాలనూ అడగాలి తప్ప దురాశలకు పోకూడదు. కొందరు అడుగుడి మీకియ్యబడును అనే మాటలను అడ్డుపెట్టుకుని అలానే చేస్తుంటారు. అందుకే ఈమాటలు ప్రత్యేకంగా చెబుతున్నాను.
1 తిమోతికి 6:6-10 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమైయున్నది. మన మీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలో నుండి ఏమియు తీసికొనిపోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమైయుండి వాటితో తృప్తి పొందియుందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.
ఆదికాండము 28:22 మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కుకొనెను.
ఈ వచనాలలో యాకోబు అతను కోరుకున్నట్టుగా దేవుడు తనకు తోడైయుండి, ఆయన వాగ్దానం చేసినట్టు మరలా స్వదేశానికి చేరిస్తే అతను రాయి నిలిపినచోట మందిరం కడతానని, తన సంపాదనలో పదియవ భాగం చెల్లిస్తానని మ్రొక్కుకోవడం మనం చూస్తాం. దేవుడు ఇచ్చినదానిలో ఆయనకు కృతజ్ఞతగా కొంత చెల్లించడం ఆరాధనా పద్ధతిలో ఒక భాగంగా లేఖనాలలో కనిపిస్తుంది. అదే మోషే ధర్మశాస్త్రంలో దశమభాగంగా పిలవబడింది. ప్రస్తుత విశ్వాసులు దశమభాగం ఇవ్వాలనే నియమం క్రింద లేనప్పటికీ వారి సంపాదన నుండి కృతజ్ఞతగా సంఘక్షేమాభివృద్ధి నిమిత్తం ఇస్తుండాలి. నేను సంఘక్షేమాభివృద్ధి నిమిత్తం అంటున్నాను, దానర్థం బోధకుడి విలాశవంతమైన జీవితం కోసమని కాదు సుమా!
అయితే యాకోబు కాలానికి సంఘం కానీ దేవాలయం కానీ లేనప్పుడు అతను పదివంతులు దేవునికి ఎలా చెల్లిస్తాడనే ప్రశ్నతలెత్తవచ్చు. దీనికి సమాధానం ఏంటంటే; బలిపీఠం మీద జంతువులను దహనబలిగా అర్పించడం, బీదలకు దానం చెయ్యడం కూడా ఆయనకు చెల్లించడమే ఔతుంది. యాకోబు ఇదే చేసాడని మనం భావించాలి (సామెతలు 19:17). పౌలు కూడా కొరింథీయులను నిలువ చెయ్యమన్న సొమ్మును యెరుషలేములోని పేదలకే తీసుకువెళ్ళాడు.
అదేవిధంగా యాకోబు ఇక్కడ దేవునికి మ్రొక్కుబడి చేసుకుంటున్నాడు. మ్రొక్కుబడి చేసుకోవడం కూడా దేవునిపట్ల భక్తులకుండే విధేయతను సూచిస్తుంది (యోనా 1:16, 1 సమూయేలు 1:11, కీర్తనలు 22: 25). కాబట్టి లేఖనాలప్రకారం మనం మ్రొక్కుబళ్ళు చేసుకోవాలి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వాటిని చెల్లించాలి.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 28
28:1,2, 28:3-5, 28:6-9, 28:10,11, 28:12-15, 28:16-19, 28:20,21, 28:22
ఆదికాండము 28:1,2 ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు. నీవు లేచి పద్దనరాములో నున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి-
ఈ వచనాలలో ఇస్సాకు యాకోబుతో నీ తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెను వివాహం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇదంతా అతను రిబ్కా ప్రేరణతోనే మాట్లాడుతున్నాడు. ఈమాటలను బట్టి మనం మూడు ప్రాముఖ్యమైన విషయాలు గ్రహించాలి.
1. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న యాకోబు శాపగ్రస్తులైన కనానీయులను కాకుండా తన బంధువుల స్త్రీని మాత్రమే వివాహం చేసుకునేలా ఇక్కడ ఆజ్ఞాపించబడుతున్నాడు. దీనిప్రకారం; దేవుని ఆశీర్వాదం పొందుకున్న ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించడానికి ఆయన అనుమతించలేదు. వారు దేవుని ఆజ్ఞల ప్రకారంగానే జీవించాలి. అందుకే మనముందు కూడా ఎన్నో ఆజ్ఞలు రాయబడ్డాయి.
2. యాకోబు ఈ సంఘటన జరగడానికి ముందు ఆత్మీయంగానూ భౌతికంగానూ ఆశీర్వదించబడ్డాడు (ఆదికాండము 27:28,29). కానీ ఇప్పుడు తన తండ్రి ఆజ్ఞ ప్రకారం; ఏమీలేని పరదేశిగా మరోచోటికి వెళ్ళబోతున్నాడు. ఎందుకంటే ఆ ఆశీర్వాదం వెంటనే జరిగేది కాదు, దాని నెరవేర్పుకు కొంతసమయం పడుతుంది. కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందుకున్న ప్రజలు వెంటనే దాని ప్రతిఫలం అనుభవించకపోవచ్చు, అలాంటి సమయంలో నిరాశ చెందకూడదు.
3. యాకోబు ఆశీర్వదించబడడం దేవుని నిర్ణయమే అయినప్పటికీ దానికై అతను పాల్పడిన మోసానికి తానే బాధ్యుడని గత అధ్యాయంలో వివరించాను (ఆదికాండము 27:5-10 వ్యాఖ్యానం చూడండి). ఆ మోసానికై అతను క్రమశిక్షణ కూడా చెయ్యబడాలి. అందుకే అతను తన మామ ఇంటికి వెళ్ళి కష్టాలు పడబోతున్నాడు. ఎందుకంటే అతను చేసిన ఆ మోసాన్ని బట్టే ఏశావు అతనిపై పగబట్టాడు, ఆ భయంతోనే రిబ్కా యాకోబును అక్కడికి పంపబోతుంది.
ఆదికాండము 28:3-5 సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసి కొనునట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేసెను. అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను.
ఈ వచనాలలో ఇస్సాకు; అబ్రాహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని యాకోబుకు జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. ఆ వాగ్దానం యాకోబులో నెరవేరినట్టుగా అతని జీవితచరిత్రను బట్టి మనకు అర్థమౌతుంది. ఎలాగంటే అబ్రాహాము పిల్లలలో ఇస్సాకు మాత్రమే ఆ వాగ్దానానికి వారసుడయ్యాడు, ఇస్సాకు పిల్లలలో యాకోబు మాత్రమే దానికి వారసుడయ్యాడు. కానీ యాకోబు విషయంలో అతని పిల్లలంతా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు (ఇశ్రాయేలీయులు).
అదేవిధంగా ఇక్కడ ఇస్సాకు తనను మోసగించిన యాకోబుపై ఎలాంటి కోపమూ చూపించకుండా అతన్ని మరలా దీవిస్తున్నాడు. ఎందుకంటే; చివరికి దేవుని నిర్ణయమే నెరవేరిందని అతను భావించాడు. లేకుంటే శపించియుండేవాడు కదా!
ఆదికాండము 28:6-9 ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతనినక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్లిపోయెననియు ఏశావు తెలిసికొనినప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయేలునొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడ పెండ్లి చేసికొనెను.
ఈ వచనాలలో ఏశావు ఇష్మాయేలు కుమార్తెను కూడా వివాహం చేసుకోవడం మనం చూస్తాం. ఎందుకంటే; కనానీయుల కుమార్తెలు తన తండ్రికి ఇష్టురాండ్రు కాదు కాబట్టి తన బంధువుడైన ఇష్మాయేలు కుమార్తెను వివాహం చేసుకుంటే అది తన తండ్రి దృష్టికి ఇష్టమౌతుందని అతను భావించాడు. కానీ ఇదంతా మారుమనస్సు పొంది కాకుండా ఏదోలా తన తండ్రిని సంతోషపెట్టి అతని నుండి ఏదో ఒకటి పొందుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాడు. సాధారణంగా దుష్టులకు ఉండే లక్షణం ఏంటంటే; ఏదొక మంచి పని చేసి గతంలో చేసిన చెడు అంతా మాసిపోయిందని మనసాక్షికి సర్దిచెప్పుకుంటూ ఆ మంచి పనిని బట్టి లాభం సంపాదించుకోవాలి అనుకుంటారు (పుణ్యం లా). ఇక్కడ ఏశావులో అదే కనిపిస్తుంది.
ఇలాంటి సంఘటననే మనం న్యాయాధిపతులు 18వ అధ్యాయంలో చూస్తాం. దానీయుల గోత్రం వారు తాము చేసే చెడునంతా చేస్తుండి వారికి ఒక లేవీయుడు పరిచయమయ్యేసరికి, చెక్కబడిన ఒక ప్రతిమకు ఆ లేవీయుడిని యాజకుడిగా చేసి తాము చేసేది సరైనదిగా భావిస్తారు. ఎందుకంటే; ధర్మశాస్త్రం ప్రకారం యాజకత్వాన్ని లేవీయులు మాత్రమే చెయ్యాలి. అందుకే లేవీయుడిని ధర్మశాస్త్ర ప్రకారం నియమించుకుని తాము చేసినదానిని బట్టి దేవుడు తమకు తోడైయుంటాడని ఆశపడుతున్నారు. కానీ ఆ లేవీయుడిని వారు దేవుడు అసహ్యించుకునే ప్రతిమకు కదా ప్రతిష్టించారు.
మరోవిషయం ఏంటంటే; కనానీయులైన తన భార్యలు తన తండ్రికి ఇష్టురాండ్రు కారని, ఆ తండ్రి ఇష్టపడేలా ఏదోటి చెయ్యాలని ఇష్మాయేలు కుమార్తెను వివాహం చేసుకున్న ఏశావు, అలా కూడా దేవుని ఆశీర్వాదానికి అపాత్రుడనని చాటుకుంటున్నాడు. ఎందుకంటే; ఇస్సాకుతో ఇష్మాయేలు వారసుడు కానేరడు (ఆదికాండము 21:9-12). దీనిప్రకారం ఎవరైతే ఇస్సాకుతో కలసి వారసుడిగా ఉండకూడదో అదే ఇష్మాయేలు కుమార్తెను అతను తమ కుటుంబంలోకి తీసుకుని వచ్చాడు. కాబట్టి దుష్టులు తమ దుష్టత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో ఒకోసారి తెలియకుండానే మరలా దుష్టత్వంలో పడుతుంటారు. అందుకే "భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలె పలుకుచున్నది వాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు" (కీర్తనలు 36:1) అని రాయబడింది.
అదేవిధంగా ఏశావు తన పెదనాన్న కుమార్తెను వివాహం చేసుకున్నట్టు మనం చదువుతున్నాం. మనదేశ సంస్కృతి ప్రకారం ఇది తప్పుగా అనిపిస్తుంది కానీ వారి సంస్కృతిలో ఇది సరైనదే. ఇప్పటికీ ఇతరదేశాల్లో ఈ వరసల్లోనే వివాహాలు జరుగుతుంటాయి. కాబట్టి బైబిల్ లోని సంఘటనలను అధ్యయనం చేసేటప్పుడు మన దేశ సంస్కృతులూ కాలాన్ని బట్టి కాకుండా ఆయా వ్యక్తులు నివసించిన సంస్కృతులు, కాలాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మనకు బైబిల్ మాత్రమే నైతికనియమం తప్ప మన దేశ సంస్కృతులు కాదు. ఎందుకంటే వాటిని ప్రవేశపెట్టింది ఎవరో ఏ తార్కిక, నైతిక కారణాలను బట్టి వాటికి ప్రవేశపెట్టారో కూడా మనకు తెలియదు. అవన్నీ మనుషులు కల్పించినవే (మూఢనమ్మకాలే). ఉదాహరణకు; పెదనాన్న కూతుర్ని వివాహం చేసుకోవడం తప్పైనప్పుడు మేనత్త కూతుర్ని వివాహం చేసుకోవడం ఎలా సరౌతుంది? ఇద్దరూ తండ్రి రక్తసంబంధులే కదా? కాబట్టి మనం లేవీకాండము 18వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞాపించిన నియమాలను ఇరు కోణాల (అమ్మాయి&అబ్బాయి) నుంచీ పాటిస్తూ ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు.
ఆదికాండము 28:10,11 యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండుకొనెను.
ఈ వచనాలలో యాకోబు తాము నివసిస్తున్న బెయేర్షెబా నుండి బయలుదేరి ఒకచోట నిలిచినట్టు మనం చూస్తాం. ఇప్పుడు యాకోబు పరిస్థితి ఆలోచిస్తే ఇస్సాకు అతనిని పంపేటప్పుడు ఒంటరిగానే పంపాడు తప్ప తనకున్న పరివారాన్ని కానీ ఒంటెలను కానీ తోడు ఇవ్వలేదు. కారణం; వాగ్దాన నెరవేర్పుకై దేవుడు అతనికి తోడుగా ఉంటాడనే విశ్వాసం. దీనినిబట్టి అతను వన్యమృగాలకూ చోరులకూ భయపడుతున్న పరిస్థితిలో పడుకుని ఉంటాడు. గుడారంలో సాధువుగా జీవించిన యాకోబు రాతితో తలగడ చేసుకుని నేలపై పడుకున్నాడు. కాబట్టి అతని మనసులో భయం, బాధ కలగడం సహజం కానీ ఇస్సాకు విశ్వసించినట్టు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అందుకే అప్పుడు ఏం జరిగిందో క్రింది వచనాల్లో రాయబడింది.
ఆదికాండము 28:12-15 అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడియుండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును. నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా-
ఈ వచనాలలో యాకోబుకు దేవుడు స్వప్నంలో ప్రత్యక్షమై, అబ్రాహాముకు తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి ధైర్యపరచడం మనం చూస్తాం. ఆ వాగ్దానం నెరవేరాలంటే యాకోబు బ్రతికే ఉండాలి. కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందుకున్న విశ్వాసులు కొన్నిసార్లు ఒంటరిగా మారినప్పటికీ ఎన్నో భయాలూ బాధలూ వెంటాడుతున్నప్పటికీ ఆయన తోడుగా ఉన్నాడని గుర్తుంచుకోవాలి.
అదేవిధంగా పరలోకానికీ భూమికీ మధ్యలో ఒక నిచ్చెన వెయ్యబడి దానిపై దేవదూతలు ఎక్కుతూ దిగుతుండడం ఇక్కడ చదువుతున్నాం. అది దేవుని సన్నిధినీ సహవాసాన్నీ సూచిస్తుంది. మనం కూడా అలాంటి సన్నిధినీ సహవాసాన్ని యేసుక్రీస్తు ద్వారా అనుభవించబోతున్నాం (యోహాను 1:51).
ఆదికాండము 28:16-19 యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అది నాకు తెలియక పోయెననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.
ఈ వచనాలలో నిద్రలేచిన యాకోబు అది దేవుడున్న స్థలమని గుర్తించి భయపడడం మనం చూస్తాం. ఇది దేవునిపట్ల అతనికున్న విధేయతను తెలియచేస్తుంది. అలానే తర్వాత అతను ఆ రాయిని నిలిపి దానిపై నూనె పోస్తుంది ఆ రాయిలో ఏదో ఉందని కాదు కానీ ఆ కాలంలో బలిపీఠాలను ప్రతిష్టించడానికి అలా చేసేవారు.
ఆదికాండము 28:20,21 అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడైయుండును.
ఈ వచనంలో యాకోబు దేవునిముందు ఒప్పందం చేసుకోవడం మనం చూస్తాం. అతను మొదటిగా దేవుడు తనకు తోడైయుండాలని కోరుకుంటూ తదుపరి కనీస అవసరాలైన వస్త్రాలనూ ఆహారాన్నీ దయ చెయ్యమంటున్నాడే తప్ప దురాశలకు పోవట్లేదు. అతను గొప్ప ఐశ్వర్యానికి వారసుడిగా దీవించబడినప్పటికీ ప్రస్తుతం అతని మనసు కేవలం కనీస అవసరతలపైనే ఉండడానికి కారణం అతనిలో ఆ దేవుని వాగ్దానానికి తగిన మార్పు ప్రారంభమవ్వడమే. కాబట్టి గతకాలపు పాపాల విషయంలో మారుమనస్సు పొంది విశ్వాసులుగా జీవిస్తున్న మనం మొదటిగా దేవుని తోడునూ తదుపరి మన పరిస్థితికి తగిన అవసరాలనూ అడగాలి తప్ప దురాశలకు పోకూడదు. కొందరు అడుగుడి మీకియ్యబడును అనే మాటలను అడ్డుపెట్టుకుని అలానే చేస్తుంటారు. అందుకే ఈమాటలు ప్రత్యేకంగా చెబుతున్నాను.
1 తిమోతికి 6:6-10 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమైయున్నది. మన మీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలో నుండి ఏమియు తీసికొనిపోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమైయుండి వాటితో తృప్తి పొందియుందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.
ఆదికాండము 28:22 మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కుకొనెను.
ఈ వచనాలలో యాకోబు అతను కోరుకున్నట్టుగా దేవుడు తనకు తోడైయుండి, ఆయన వాగ్దానం చేసినట్టు మరలా స్వదేశానికి చేరిస్తే అతను రాయి నిలిపినచోట మందిరం కడతానని, తన సంపాదనలో పదియవ భాగం చెల్లిస్తానని మ్రొక్కుకోవడం మనం చూస్తాం. దేవుడు ఇచ్చినదానిలో ఆయనకు కృతజ్ఞతగా కొంత చెల్లించడం ఆరాధనా పద్ధతిలో ఒక భాగంగా లేఖనాలలో కనిపిస్తుంది. అదే మోషే ధర్మశాస్త్రంలో దశమభాగంగా పిలవబడింది. ప్రస్తుత విశ్వాసులు దశమభాగం ఇవ్వాలనే నియమం క్రింద లేనప్పటికీ వారి సంపాదన నుండి కృతజ్ఞతగా సంఘక్షేమాభివృద్ధి నిమిత్తం ఇస్తుండాలి. నేను సంఘక్షేమాభివృద్ధి నిమిత్తం అంటున్నాను, దానర్థం బోధకుడి విలాశవంతమైన జీవితం కోసమని కాదు సుమా!
అయితే యాకోబు కాలానికి సంఘం కానీ దేవాలయం కానీ లేనప్పుడు అతను పదివంతులు దేవునికి ఎలా చెల్లిస్తాడనే ప్రశ్నతలెత్తవచ్చు. దీనికి సమాధానం ఏంటంటే; బలిపీఠం మీద జంతువులను దహనబలిగా అర్పించడం, బీదలకు దానం చెయ్యడం కూడా ఆయనకు చెల్లించడమే ఔతుంది. యాకోబు ఇదే చేసాడని మనం భావించాలి (సామెతలు 19:17). పౌలు కూడా కొరింథీయులను నిలువ చెయ్యమన్న సొమ్మును యెరుషలేములోని పేదలకే తీసుకువెళ్ళాడు.
అదేవిధంగా యాకోబు ఇక్కడ దేవునికి మ్రొక్కుబడి చేసుకుంటున్నాడు. మ్రొక్కుబడి చేసుకోవడం కూడా దేవునిపట్ల భక్తులకుండే విధేయతను సూచిస్తుంది (యోనా 1:16, 1 సమూయేలు 1:11, కీర్తనలు 22: 25). కాబట్టి లేఖనాలప్రకారం మనం మ్రొక్కుబళ్ళు చేసుకోవాలి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వాటిని చెల్లించాలి.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Add comment