42:1, 42:2,3, 42:4, 42:5,6, 42:7-9, 42:10-13, 42:14-17, 42:18-20, 42:21, 42:22, 42:23, 42:24, 42:25-28, 42:29-38
ఆదికాండము 42:1 ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసి కొనినప్పుడు మీరేల ఒకరి ముఖము ఒకరు చూచు చున్నారని తన కుమారులతో అనెను.
ఈ వచనంలో కనానులో నివసిస్తున్న యాకోబు కుటుంబం కూడా కరువు బారిన పడినట్టు మనం చూస్తాం (ఆదికాండము 41:57). దేవుడు అబ్రాహాము సంతానానికి వాగ్దానం చేసిన ఈ కనానులో ఆదికాండము 12:10 ప్రకారం; అబ్రాహాము, 26:1 ప్రకారం; ఇస్సాకు, ఇప్పుడు యాకోబు కూడా కరువు ప్రభావానికి గురయ్యారు.
కాబట్టి ఎంత దేవునిచేత పిలువబడిన విశ్వాసులైనా అన్నివేళలా సమృద్ధినే అనుభవిస్తారని మనం భావించకూడదు. అది గ్రహించిన యాకోబు ఆ కరవు నుండి తప్పించుకునే వైపుగా ఆలోచిస్తూ తామున్న పరిస్థితిని బట్టి ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో (ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ) జీవిస్తున్న తన కుమారులకు ఐగుప్తులో ధాన్యపు అమ్మకం జరుగుతుందని తెలియచేస్తున్నాడు.
ఆదికాండము 42:2,3 మరియు అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి.
ఈ వచనాలలో యాకోబు ఐగుప్తులో అమ్మబడుతున్న ధాన్యాన్ని కొనుక్కురమ్మని తన కుమారులను ప్రేరేపించడం మనం చూస్తాం. ఐగుప్తులో ధాన్యం ఉందని వృద్ధుడైన యాకోబు తెలుసుకున్న విషయం తన కుమారులు తెలుసుకోలేకపోయారు. ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో జీవిస్తున్నారు. దీనిని బట్టి కుటుంబాన్ని సంరక్షించే బాధ్యతలో యాకోబు మనకు మాదిరిగా కనిపిస్తున్నాడు.
"మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండి" ఈ మాటలు ప్రత్యేకంగా గమనించండి. దేవునిచేత వాగ్దానానికి వారసుడిగా పిలువబడిన అతను తన సంతానం ఆకాశనక్షత్రాల వలే విస్తరిస్తుందని దైవప్రమాణం పొందిన అతను "ఆ ప్రమాణం నిలుపుకోవడానికి మనం చావకుండా ఆయనే కాపాడతాడులే" అనే నమ్మకంతో బ్రతికెయ్యట్లేదు. "మనం చావకుండా ఉండేటట్టు ధాన్యం కొనుక్కురమ్మంటున్నాడు" అంటే ఆ ప్రమాణం నెరవేరేలా బ్రతికుండడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుని ప్రమాణం విషయంలో ఇది మానవబాధ్యత. ఆయన వాగ్దానం చేసాడు ఆ వాగ్దానం మనపట్ల నెరవేరేలా మన బాధ్యతను మనం నిర్వర్తించాలి. లేకుంటే మనం అసలు వాగ్దాన సంబంధులమే కాదు. ఎందుకంటే ఆయన వాగ్దానం దాని నెరవేర్పులో మన బాధ్యతేంటో మనకు నేర్పిస్తుంది, ఆ బాధ్యత నిర్వర్తించేలా నడిపిస్తుంది. ఈమాటలు మనం ప్రాముఖ్యంగా మన రక్షణ విషయంలో అన్వయించుకోవాలి. అందుకే "భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి" (ఫిలిప్పీ 2:12) అని రాయబడింది. ఈ పోరాటం మనలో లేకుంటే మనం రక్షణసంబంధులం కానట్టే. అందులో ఎలాంటి అనుమానమూ లేదు.
అదేవిధంగా ఐగుప్తీయులు అన్యదేవతలను పూజించేవారు. అయినప్పటికీ యాకోబు ధాన్యం కోసం ఆ దేశాన్ని ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి, విశ్వాసులు అవిశ్వాసుల క్రియల్లో పాలుపొందకూడదు కానీ వారితో క్రయవిక్రయాలు చెయ్యకూడదనే నియమేదీ మనముందు లేదు. అబ్రాహాము కూడా అన్యులైన కనానీయుల నుండి భూమిని కొన్నట్టు మనం చూసాం (ఆదికాండము 23:16-18).
ఆదికాండము 42:4 అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు.
ఈ వచనాలలో యాకోబు బెన్యామీనును ఐగుప్తుకు పంపకుండా తనవద్దే ఉంచుకోవడం మనం చూస్తాం. యాకోబు ప్రేమించి వివాహం చేసుకున్న రాహేలు కుమారులలో చివరివాడే ఈ బెన్యామీను. పెద్దవాడైన యోసేపు మరణించాడని అతను భావించడం వల్ల, ఇతని విషయంలో జాగ్రతలు తీసుకుంటూ వచ్చాడు. అందుకే తన మిగిలిన కుమారులతో ఇతడిని పంపడం లేదు.
ఆదికాండము 42:5,6 కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చినవారితో కూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారియైయుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి.
ఈ వచనాలలో యోసేపు సహోదరులు ఐగుప్తుకు వచ్చి అతనికి సాష్టాంగ నమస్కారం చెయ్యడం మనం చూస్తాం. యోసేపు కల నెరవేర్పుకు ఇది ప్రారంభం (ఆదికాండము 37:5-8).
ఆదికాండము 42:7-9 యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితిమనిరి. యోసేపు తన సహోదరులను గురుతుపట్టెను గాని వారతని గురుతుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొని మీరు వేగులవారు ఈ దేశముగుట్టు తెలిసికొన వచ్చితిరని వారితోననగా-
ఈ వచనాలలో యోసేపు తన సోదరులను గురుతుపట్టి తన కలలను జ్ఞాపకం చేసుకుంటూ వారితో కఠినంగా మాట్లాడడం మనం చూస్తాం. ప్రస్తుతం యోసేపు వయసులో పెద్దవాడయ్యాడు, ఐగుప్తీయుల ప్రధానిగా మంచి వస్త్రాలతో ఉన్నకారణం చేత వారు అతడిని గుర్తించలేదు. అయితే యోసేపు తన సోదరులపై పగతో ఇలా కఠినంగా మాట్లాడడం లేదు. అదే నిజమైతే వెంటనే వారిని శిక్షించియుండేవాడు. కానీ వారిలో పశ్చాత్తాపాన్ని కలిగించడానికీ మరియు అతని మిగిలిన కుటుంబ వివరాలను తెలుసుకోడానికీ ఈవిధంగా మాట్లాడుతున్నాడు. యోసేపు దేవుని సార్వభౌమత్వాన్ని నమ్మిన కారణం చేత తన సోదరులపై పగతీర్చుకోవాలని అనుకోవడం లేదు. మనం కూడా దేవుని సార్వభౌమత్వాన్ని నమ్ముతున్నప్పుడు మనసులో ఇతరులపై పగకు చోటుండదు.
ఆదికాండము 42:10-13 వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము. మేము యథార్థవంతులమేగాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి. అయితే అతడులేదు, ఈ దేశము గుట్టు తెలిసి కొనుటకై వచ్చితిరని వారితో అనెను. అందుకు వారునీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనాను దేశములో నున్న ఒక్క మనుష్యుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు. ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి.
ఈ వచనాలలో యాకోబు కుమారులు యోసేపు ఏ ఉద్దేశంతో ఐతే వారితో కఠినంగా మాట్లాడుతున్నాడో దానికి తగినట్టుగా వారు తమ కుటుంబ వివరాలు తెలియచెయ్యడం మనం చూస్తాం. బహుశా వారు జీవితంలో మొదటిసారిగా ఇంత తీవ్రమైన భయానికి లోనైయ్యుంటారు.
ఆదికాండము 42:14-17 అయితే యోసేపు మీరు వేగులవారని నేను మీతో చెప్పినమాట నిజమే. దీనివలన మీ నిజము తెలియబడును. ఫరో జీవము తోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడ నుండి వెళ్లకూడదు. మీ తమ్ముని తీసికొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి. అయితే మీరు బంధింపబడి యుందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేనియెడల ఫరో జీవముతోడు, మీరు వేగులవారని చెప్పి వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను.
ఈ వచనాలలో యాకోబు కుమారులు తమ కుటుంబ వివరాలు తెలియచేసినప్పటికీ యోసేపు వారితో కఠినంగానే ప్రవర్తిస్తూ తన తమ్ముడైన బెన్యామీనును అక్కడికి రప్పించే ప్రయత్నం చెయ్యడం మనం చూస్తాం. ఎందుకంటే యాకోబు తనపై చూపించిన ప్రేమనే తన తమ్ముడైన బెన్యామీనుపై కూడా చూపిస్తాడని ఊహించిన యోసేపు వీరు అతనికి కూడా హాని చేసారేమో అని అనుమానించి ఉంటాడు, అందుకే బెన్యామీనును చూడాలి అనుకుంటున్నాడు.
అదేవిధంగా ఈ సందర్భంలో యోసేపు ఫరో జీవముతోడని ప్రమాణం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం అతను ఐగుప్తీయుడిగానే కనుపరుచుకోవాలి. అలాగని ఆ ప్రమాణంలో ఏ ఇబ్బందీ లేదు, జీవము తోడు అంటే అతని ప్రాణం లేక అతని అధికారం తోడు అని అర్థం. యోసేపుకు కలిగిన అధికారం ఒకవిధంగా ఫరో ఇచ్చిందేగా. కాబట్టి అతనేమీ "దేవుని జీవము తోడు" అనే తరహాలో ఆ ప్రమాణం చెయ్యలేదు అందుకే అతను నేను దేవునికి భయపడేవాడనంటూ తాను విశ్వసించే యెహోవా దేవుని గురించి ప్రకటిస్తున్నాడు.
ఆదికాండము 42:18-20 మూడవ దినమున యోసేపు వారిని చూచినేను దేవునికి భయపడువాడను. మీరు బ్రదుకునట్లు దీని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొని పోవుడి. మీ తమ్ముని నా యొద్దకు తీసికొని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి.
ఈ వచనాలలో యోసేపు తన అన్నలతో నేను దేవునికి భయపడేవాడినని చెబుతూ వారిముందు న్యాయబద్ధమైన ప్రత్యమ్నాయం పెట్టడం మనం చూస్తాం. అతను నేను దేవునికి భయపడేవాడినని చెప్పడం ద్వారా వారు కూడా అతను చెప్పినట్టు చెయ్యడానికి ధైర్యం తెచ్చుకున్నారు. ఎందుకంటే దేవునికి భయపడేవారు మాట తప్పి క్రూరత్వాన్ని ప్రదర్శించరని వారికి తెలుసు. దేవునిపట్ల భయం చిన్న పొరపాట్లను సైతం నిలువరిస్తుంది.
ఉదాహరణకు ఈ సందర్భం చూడండి.
నెహెమ్యా 5:15 అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనులయొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయము చేత నేనాలాగున చేయలేదు.
ఈ సందర్భంలో నెహెమ్యా దేవునిపట్ల తనకున్న భయం చేత అతనికి ముందున్న అధికారులు తీసుకున్నట్టుగా జీతం కూడా తీసుకోకుండా పని చేసానంటున్నాడు. బైబిల్ గ్రంథంలో విశ్వాసులు దేవునిపట్ల భయంతో ఇలాంటి చిన్న పొరపాట్లను కూడా చెయ్యకుండా జాగ్రత్తపడితే ఈరోజు విశ్వాసులమని చెప్పుకునే చాలామంది దేవుడు అసహ్యించుకునే కార్యాల విషయంలో రాజీపడిపోతున్నారు. అలాంటి వారు నిజంగా దేవునిపట్ల భయాన్ని కలిగియున్నారో లేదో ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే "యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు" (సామెతలు 16:6) అనీ "యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే" (సామెతలు 8:13) అని కూడా స్పష్టంగా రాయబడింది.
ఆదికాండము 42:21 అప్పుడు వారు నిశ్చ యముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.
ఈ వచనంలో యోసేపు అన్నలు తాము చిక్కులో ఉన్నట్టు గుర్తించి తమ తమ్ముడి విషయంలో చేసినదానికి ఫలితం అనుభవిస్తున్నట్టు జ్ఞాపకం చేసుకోవడం మనం చూస్తాం. పాపపు ఫలితం ఎప్పటికైనా ఇలానే ఎదురౌతుంది. అందుకే "మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసికొనుడి" సంఖ్యాకాండము 32:23) అని రాయబడింది. యోసేపును వీరు గుంటలోకి త్రోసివేసే సమయంలో అతను ఎంతగా బ్రతిమిలాడుతున్నప్పటికీ తమ మనస్సులను కఠినపరచుకుని భోజనాలకు కూర్చున్నారు చివరికి అతడిని అన్యాయంగా అమ్మివేసారు. కానీ ఈ సందర్భంలో దేవుడు వారు చేసిన ఆ అన్యాయాన్ని ఒకప్పుడు కఠినపరచుకున్న మనస్సాక్షి ద్వారానే ఒప్పింపచేస్తున్నాడు.
ఆదికాండము 42:22 మరియు రూబేను ఈ చిన్నవానియెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మనమీద మోపబడుచున్నదని వారికుత్తరమిచ్చెను.
ఈ వచనంలో రూబేను యోసేపు విషయంలో వారు చేసిన అన్యాయాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ వారిని నిందించడం మనం చూస్తాం. వారు యోసేపుకు హాని చెయ్యాలనుకునే సమయంలో రూబేను వారిని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ (ఆదికాండము 37:21,22), వారు అతని మాట వినలేదు. గమనించండి; ప్రస్తుతం రూబేను వారి దుర్మార్గంలో పాలివాడు కాలేదు కాబట్టి అతని మనసుకు ఆ సమాధానమైనా మిగిలి ఉంది.
ఆదికాండము 42:23 అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు.
ఈ వచనంలో ద్విభాషి యొక్క ప్రస్తావన మనం చూస్తాం. ఐగుప్తీయుల బాష యాకోబు కుమారులు మాట్లాడే భాష ఒకటి కాదు, యోసేపు వారిమధ్య ఐగుప్తీయుడిగా కనుపరచుకున్నాడు కాబట్టి వారి బాష అతనికి తెలిసినప్పటికీ వారితో ఇప్పటిదాకా చేసిన సంభాషణ అంతా అనువాదకుడి (Translator) ద్వారానే చేసాడు. దీనివల్ల యాకోబు కుమారులు అనువాదకుడు లేనప్పుడు వారి మాటలు యోసేపుకు అర్థం కావనే ఉద్దేశంతో తాము అమ్మివేసిన సోదరుడికోసం పశ్చాత్తాపంతో మాట్లాడుకోసాగారు. కానీ యోసేపుకు వారి భాష తెలుసు కాబట్టి వారు మాట్లాడుకున్నదంతా గ్రహించాడు.
ఆదికాండము 42:24 అతడు వారియొద్దనుండి అవతలకు పోయి యేడ్చి, మరల వారియొద్దకు వచ్చి వారితో మాటలాడి, వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను.
ఈ వచనంలో తన సోదరుల మాటలను గ్రహించిన యోసేపు మొదట ఏడ్చినప్పటికీ వారిలో ఇంకా మార్పు తీసుకురావాలన్నదీ అలానే బెన్యామీను కూడా తన దగ్గరకు రావాలన్నదే తన ఉద్దేశం కాబట్టి వారితో చెప్పినట్టు షిమ్యోనును బంధించడం మనం చూస్తాం. ఇక్కడ అతను తనకున్న ప్రేమను బట్టి తొందరపడకుండా వారిలో మార్పు తీసుకురావాలనే తన బాధ్యతకు కట్టుబడియున్నాడు. మనం కూడా మన కుటుంబసభ్యులను ప్రేమించాలి, అలాగని వారితో కఠినంగా ప్రవర్తించవలసిన సమయంలో అలానే ప్రవర్తించాలి. లేకుంటే మన ప్రేమవల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రేమ అవసరమైన సమయంలో కఠినంగానే ప్రవర్తించి తప్పులను సరిచేస్తుంది. అందుకేగా "మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును" (సామెతలు 27:6) అని రాయబడింది.
ఆదికాండము 42:25-28 మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజనపదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారియెడలనిట్లు జరిగించెను. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదలమీద ఎక్కించుకొని అక్కడనుండి వెళ్లిపోయిరి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేతపెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనెమూతిలో ఉండెను. అప్పుడతడు నా రూకలు తిరిగి యిచ్చివేసినారు. ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదిరిపోయినవారై జడిసి ఇదేమిటి? దేవుడు మనకిట్లు చేసెనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.
ఈ వచనాలలో యోసేపు తన అన్నలు ధాన్యం కొనడానికి తెచ్చిన ధనాన్ని తిరిగి వారి సంచులలోనే వేయించడం ద్వారా వారిపై దొంగతనపు ఆరోపణ మోపబడుతుందని వారు భావించడం మనం చూస్తాం. యోసేపు ఇలా చెయ్యడం ద్వారా వారికి దేవుడు గుర్తువచ్చేలా చేసాడు అందుకే వారు దేవుడు మనకిలా చేసాడేంటని భయపడుతున్నారు. వీరికి కష్టం రాగానే జ్ఞాపకం వచ్చిన దేవుడు తన సోదరుడిని అన్యాయంగా అమ్మివేసేటప్పుడు మాత్రం జ్ఞాపకం రాలేదు. ఇది మానవుడిలోని పతనస్వభావాన్ని తెలియచేస్తుంది, చాలామంది తాము పాపాలు చేసేటప్పుడు దేవుడికి లెక్కచెప్పాలని (రోమా 14:12) జ్ఞాపకం చేసుకోరు కానీ తమ పాపఫలితాన్ని చూసినప్పుడు మాత్రం దేవుడు నాకెందుకిలా చేసాడంటూ వాపోతుంటారు. అదేవిధంగా ఇక్కడ యోసేపు ఇలా చెయ్యడం ద్వారా తన కుటుంబం నుండి ఎలాంటి ధనమూ తీసుకోకుండా ఉచితంగా వారికి ఆహారమిస్తూ తన బాధ్యతను నెరవేర్చుకుంటున్నాడు.
ఆదికాండము 42:29-38 వారు కనాను దేశమందున్న తమ తండ్రియైన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియ చేసిరి. ఎట్లనగాఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము ఆ దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను. అప్పుడుమేము యథార్థవంతులము, వేగులవారము కాము. పండ్రెండుమంది సహోదరులము, ఒక్కతండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రియొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచిమీరు యథార్థవంతులని దీనివలన నేను తెలిసికొందును. మీ సహోదరులలో ఒకనిని నాయొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరవు తీరునట్లు ధాన్యము తీసికొనిపోయి, నాయొద్దకు ఆ చిన్నవాని తోడుకొనిరండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలిసికొని మీ సహోదరుని మీకప్పగించెదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపా రము చేసికొనవచ్చునని చెప్పెననిరి. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి. అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు. షిమ్యోను లేడు. మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు. ఇవన్నియు నాకు ప్రతి కూలముగా ఉన్నవని వారితో చెప్పెను. అందుకు రూబేనునేనతని నీయొద్దకు తీసికొని రానియెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును. అతని నా చేతికప్పగించుము, అతని మరల నీయొద్దకు తీసికొని వచ్చి అప్పగించెదనని తన తండ్రితో చెప్పెను. అయితే అతడునా కుమారుని మీతో వెళ్లనియ్యను. ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.
ఈ వచనాలలో యాకోబు కుమారులు తమ తండ్రికి ఐగుప్తులో జరిగిన సంగతంతా వివరించడం మనం చూస్తాం. ఇదంతా యాకోబు తనకు ప్రతికూలంగా జరుగుతున్నట్టుగా భావించాడు కాబట్టి రూబేను తన కుమారులను కొదువపెట్టి బెన్యామీనును తీసుకుని వెళ్ళేందుకు ప్రయత్నించినప్పటికీ అతను దానికి ఒప్పుకోకుండా బెన్యామీనుకు కూడా ఏదైనా హాని జరిగితే తన మరణం బాధతో జరుగుతుందని వారిని అడ్డగిస్తున్నాడు. కానీ ఇక్కడ యాకోబు నా కుటుంబానికే ఎందుకిలా జరుగుతుందని దేవుణ్ణి నిందించడం లేదు. కాబట్టి విశ్వాసుల కుటుంబాలలో ప్రతికూలమైన పరిస్థితులు చోటుచేసుకున్నప్పటికీ తమ దేవుణ్ణి నిందించకుండా యాకోబులా జాగ్రతపడాలి. ఆ పరిస్థితి నుండి కాపాడమని దేవుణ్ణి విధేయతతో వేడుకోవాలి.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 42
42:1, 42:2,3, 42:4, 42:5,6, 42:7-9, 42:10-13, 42:14-17, 42:18-20, 42:21, 42:22, 42:23, 42:24, 42:25-28, 42:29-38
ఆదికాండము 42:1 ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసి కొనినప్పుడు మీరేల ఒకరి ముఖము ఒకరు చూచు చున్నారని తన కుమారులతో అనెను.
ఈ వచనంలో కనానులో నివసిస్తున్న యాకోబు కుటుంబం కూడా కరువు బారిన పడినట్టు మనం చూస్తాం (ఆదికాండము 41:57). దేవుడు అబ్రాహాము సంతానానికి వాగ్దానం చేసిన ఈ కనానులో ఆదికాండము 12:10 ప్రకారం; అబ్రాహాము, 26:1 ప్రకారం; ఇస్సాకు, ఇప్పుడు యాకోబు కూడా కరువు ప్రభావానికి గురయ్యారు.
కాబట్టి ఎంత దేవునిచేత పిలువబడిన విశ్వాసులైనా అన్నివేళలా సమృద్ధినే అనుభవిస్తారని మనం భావించకూడదు. అది గ్రహించిన యాకోబు ఆ కరవు నుండి తప్పించుకునే వైపుగా ఆలోచిస్తూ తామున్న పరిస్థితిని బట్టి ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో (ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ) జీవిస్తున్న తన కుమారులకు ఐగుప్తులో ధాన్యపు అమ్మకం జరుగుతుందని తెలియచేస్తున్నాడు.
ఆదికాండము 42:2,3 మరియు అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి.
ఈ వచనాలలో యాకోబు ఐగుప్తులో అమ్మబడుతున్న ధాన్యాన్ని కొనుక్కురమ్మని తన కుమారులను ప్రేరేపించడం మనం చూస్తాం. ఐగుప్తులో ధాన్యం ఉందని వృద్ధుడైన యాకోబు తెలుసుకున్న విషయం తన కుమారులు తెలుసుకోలేకపోయారు. ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో జీవిస్తున్నారు. దీనిని బట్టి కుటుంబాన్ని సంరక్షించే బాధ్యతలో యాకోబు మనకు మాదిరిగా కనిపిస్తున్నాడు.
"మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండి" ఈ మాటలు ప్రత్యేకంగా గమనించండి. దేవునిచేత వాగ్దానానికి వారసుడిగా పిలువబడిన అతను తన సంతానం ఆకాశనక్షత్రాల వలే విస్తరిస్తుందని దైవప్రమాణం పొందిన అతను "ఆ ప్రమాణం నిలుపుకోవడానికి మనం చావకుండా ఆయనే కాపాడతాడులే" అనే నమ్మకంతో బ్రతికెయ్యట్లేదు. "మనం చావకుండా ఉండేటట్టు ధాన్యం కొనుక్కురమ్మంటున్నాడు" అంటే ఆ ప్రమాణం నెరవేరేలా బ్రతికుండడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుని ప్రమాణం విషయంలో ఇది మానవబాధ్యత. ఆయన వాగ్దానం చేసాడు ఆ వాగ్దానం మనపట్ల నెరవేరేలా మన బాధ్యతను మనం నిర్వర్తించాలి. లేకుంటే మనం అసలు వాగ్దాన సంబంధులమే కాదు. ఎందుకంటే ఆయన వాగ్దానం దాని నెరవేర్పులో మన బాధ్యతేంటో మనకు నేర్పిస్తుంది, ఆ బాధ్యత నిర్వర్తించేలా నడిపిస్తుంది. ఈమాటలు మనం ప్రాముఖ్యంగా మన రక్షణ విషయంలో అన్వయించుకోవాలి. అందుకే "భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి" (ఫిలిప్పీ 2:12) అని రాయబడింది. ఈ పోరాటం మనలో లేకుంటే మనం రక్షణసంబంధులం కానట్టే. అందులో ఎలాంటి అనుమానమూ లేదు.
అదేవిధంగా ఐగుప్తీయులు అన్యదేవతలను పూజించేవారు. అయినప్పటికీ యాకోబు ధాన్యం కోసం ఆ దేశాన్ని ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి, విశ్వాసులు అవిశ్వాసుల క్రియల్లో పాలుపొందకూడదు కానీ వారితో క్రయవిక్రయాలు చెయ్యకూడదనే నియమేదీ మనముందు లేదు. అబ్రాహాము కూడా అన్యులైన కనానీయుల నుండి భూమిని కొన్నట్టు మనం చూసాం (ఆదికాండము 23:16-18).
ఆదికాండము 42:4 అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు.
ఈ వచనాలలో యాకోబు బెన్యామీనును ఐగుప్తుకు పంపకుండా తనవద్దే ఉంచుకోవడం మనం చూస్తాం. యాకోబు ప్రేమించి వివాహం చేసుకున్న రాహేలు కుమారులలో చివరివాడే ఈ బెన్యామీను. పెద్దవాడైన యోసేపు మరణించాడని అతను భావించడం వల్ల, ఇతని విషయంలో జాగ్రతలు తీసుకుంటూ వచ్చాడు. అందుకే తన మిగిలిన కుమారులతో ఇతడిని పంపడం లేదు.
ఆదికాండము 42:5,6 కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చినవారితో కూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారియైయుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి.
ఈ వచనాలలో యోసేపు సహోదరులు ఐగుప్తుకు వచ్చి అతనికి సాష్టాంగ నమస్కారం చెయ్యడం మనం చూస్తాం. యోసేపు కల నెరవేర్పుకు ఇది ప్రారంభం (ఆదికాండము 37:5-8).
ఆదికాండము 42:7-9 యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితిమనిరి. యోసేపు తన సహోదరులను గురుతుపట్టెను గాని వారతని గురుతుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొని మీరు వేగులవారు ఈ దేశముగుట్టు తెలిసికొన వచ్చితిరని వారితోననగా-
ఈ వచనాలలో యోసేపు తన సోదరులను గురుతుపట్టి తన కలలను జ్ఞాపకం చేసుకుంటూ వారితో కఠినంగా మాట్లాడడం మనం చూస్తాం. ప్రస్తుతం యోసేపు వయసులో పెద్దవాడయ్యాడు, ఐగుప్తీయుల ప్రధానిగా మంచి వస్త్రాలతో ఉన్నకారణం చేత వారు అతడిని గుర్తించలేదు. అయితే యోసేపు తన సోదరులపై పగతో ఇలా కఠినంగా మాట్లాడడం లేదు. అదే నిజమైతే వెంటనే వారిని శిక్షించియుండేవాడు. కానీ వారిలో పశ్చాత్తాపాన్ని కలిగించడానికీ మరియు అతని మిగిలిన కుటుంబ వివరాలను తెలుసుకోడానికీ ఈవిధంగా మాట్లాడుతున్నాడు. యోసేపు దేవుని సార్వభౌమత్వాన్ని నమ్మిన కారణం చేత తన సోదరులపై పగతీర్చుకోవాలని అనుకోవడం లేదు. మనం కూడా దేవుని సార్వభౌమత్వాన్ని నమ్ముతున్నప్పుడు మనసులో ఇతరులపై పగకు చోటుండదు.
ఆదికాండము 42:10-13 వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము. మేము యథార్థవంతులమేగాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి. అయితే అతడులేదు, ఈ దేశము గుట్టు తెలిసి కొనుటకై వచ్చితిరని వారితో అనెను. అందుకు వారునీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనాను దేశములో నున్న ఒక్క మనుష్యుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు. ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి.
ఈ వచనాలలో యాకోబు కుమారులు యోసేపు ఏ ఉద్దేశంతో ఐతే వారితో కఠినంగా మాట్లాడుతున్నాడో దానికి తగినట్టుగా వారు తమ కుటుంబ వివరాలు తెలియచెయ్యడం మనం చూస్తాం. బహుశా వారు జీవితంలో మొదటిసారిగా ఇంత తీవ్రమైన భయానికి లోనైయ్యుంటారు.
ఆదికాండము 42:14-17 అయితే యోసేపు మీరు వేగులవారని నేను మీతో చెప్పినమాట నిజమే. దీనివలన మీ నిజము తెలియబడును. ఫరో జీవము తోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడ నుండి వెళ్లకూడదు. మీ తమ్ముని తీసికొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి. అయితే మీరు బంధింపబడి యుందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేనియెడల ఫరో జీవముతోడు, మీరు వేగులవారని చెప్పి వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను.
ఈ వచనాలలో యాకోబు కుమారులు తమ కుటుంబ వివరాలు తెలియచేసినప్పటికీ యోసేపు వారితో కఠినంగానే ప్రవర్తిస్తూ తన తమ్ముడైన బెన్యామీనును అక్కడికి రప్పించే ప్రయత్నం చెయ్యడం మనం చూస్తాం. ఎందుకంటే యాకోబు తనపై చూపించిన ప్రేమనే తన తమ్ముడైన బెన్యామీనుపై కూడా చూపిస్తాడని ఊహించిన యోసేపు వీరు అతనికి కూడా హాని చేసారేమో అని అనుమానించి ఉంటాడు, అందుకే బెన్యామీనును చూడాలి అనుకుంటున్నాడు.
అదేవిధంగా ఈ సందర్భంలో యోసేపు ఫరో జీవముతోడని ప్రమాణం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం అతను ఐగుప్తీయుడిగానే కనుపరుచుకోవాలి. అలాగని ఆ ప్రమాణంలో ఏ ఇబ్బందీ లేదు, జీవము తోడు అంటే అతని ప్రాణం లేక అతని అధికారం తోడు అని అర్థం. యోసేపుకు కలిగిన అధికారం ఒకవిధంగా ఫరో ఇచ్చిందేగా. కాబట్టి అతనేమీ "దేవుని జీవము తోడు" అనే తరహాలో ఆ ప్రమాణం చెయ్యలేదు అందుకే అతను నేను దేవునికి భయపడేవాడనంటూ తాను విశ్వసించే యెహోవా దేవుని గురించి ప్రకటిస్తున్నాడు.
ఆదికాండము 42:18-20 మూడవ దినమున యోసేపు వారిని చూచినేను దేవునికి భయపడువాడను. మీరు బ్రదుకునట్లు దీని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొని పోవుడి. మీ తమ్ముని నా యొద్దకు తీసికొని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి.
ఈ వచనాలలో యోసేపు తన అన్నలతో నేను దేవునికి భయపడేవాడినని చెబుతూ వారిముందు న్యాయబద్ధమైన ప్రత్యమ్నాయం పెట్టడం మనం చూస్తాం. అతను నేను దేవునికి భయపడేవాడినని చెప్పడం ద్వారా వారు కూడా అతను చెప్పినట్టు చెయ్యడానికి ధైర్యం తెచ్చుకున్నారు. ఎందుకంటే దేవునికి భయపడేవారు మాట తప్పి క్రూరత్వాన్ని ప్రదర్శించరని వారికి తెలుసు. దేవునిపట్ల భయం చిన్న పొరపాట్లను సైతం నిలువరిస్తుంది.
ఉదాహరణకు ఈ సందర్భం చూడండి.
నెహెమ్యా 5:15 అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనులయొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయము చేత నేనాలాగున చేయలేదు.
ఈ సందర్భంలో నెహెమ్యా దేవునిపట్ల తనకున్న భయం చేత అతనికి ముందున్న అధికారులు తీసుకున్నట్టుగా జీతం కూడా తీసుకోకుండా పని చేసానంటున్నాడు. బైబిల్ గ్రంథంలో విశ్వాసులు దేవునిపట్ల భయంతో ఇలాంటి చిన్న పొరపాట్లను కూడా చెయ్యకుండా జాగ్రత్తపడితే ఈరోజు విశ్వాసులమని చెప్పుకునే చాలామంది దేవుడు అసహ్యించుకునే కార్యాల విషయంలో రాజీపడిపోతున్నారు. అలాంటి వారు నిజంగా దేవునిపట్ల భయాన్ని కలిగియున్నారో లేదో ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే "యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు" (సామెతలు 16:6) అనీ "యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే" (సామెతలు 8:13) అని కూడా స్పష్టంగా రాయబడింది.
ఆదికాండము 42:21 అప్పుడు వారు నిశ్చ యముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.
ఈ వచనంలో యోసేపు అన్నలు తాము చిక్కులో ఉన్నట్టు గుర్తించి తమ తమ్ముడి విషయంలో చేసినదానికి ఫలితం అనుభవిస్తున్నట్టు జ్ఞాపకం చేసుకోవడం మనం చూస్తాం. పాపపు ఫలితం ఎప్పటికైనా ఇలానే ఎదురౌతుంది. అందుకే "మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసికొనుడి" సంఖ్యాకాండము 32:23) అని రాయబడింది. యోసేపును వీరు గుంటలోకి త్రోసివేసే సమయంలో అతను ఎంతగా బ్రతిమిలాడుతున్నప్పటికీ తమ మనస్సులను కఠినపరచుకుని భోజనాలకు కూర్చున్నారు చివరికి అతడిని అన్యాయంగా అమ్మివేసారు. కానీ ఈ సందర్భంలో దేవుడు వారు చేసిన ఆ అన్యాయాన్ని ఒకప్పుడు కఠినపరచుకున్న మనస్సాక్షి ద్వారానే ఒప్పింపచేస్తున్నాడు.
ఆదికాండము 42:22 మరియు రూబేను ఈ చిన్నవానియెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మనమీద మోపబడుచున్నదని వారికుత్తరమిచ్చెను.
ఈ వచనంలో రూబేను యోసేపు విషయంలో వారు చేసిన అన్యాయాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ వారిని నిందించడం మనం చూస్తాం. వారు యోసేపుకు హాని చెయ్యాలనుకునే సమయంలో రూబేను వారిని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ (ఆదికాండము 37:21,22), వారు అతని మాట వినలేదు. గమనించండి; ప్రస్తుతం రూబేను వారి దుర్మార్గంలో పాలివాడు కాలేదు కాబట్టి అతని మనసుకు ఆ సమాధానమైనా మిగిలి ఉంది.
ఆదికాండము 42:23 అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు.
ఈ వచనంలో ద్విభాషి యొక్క ప్రస్తావన మనం చూస్తాం. ఐగుప్తీయుల బాష యాకోబు కుమారులు మాట్లాడే భాష ఒకటి కాదు, యోసేపు వారిమధ్య ఐగుప్తీయుడిగా కనుపరచుకున్నాడు కాబట్టి వారి బాష అతనికి తెలిసినప్పటికీ వారితో ఇప్పటిదాకా చేసిన సంభాషణ అంతా అనువాదకుడి (Translator) ద్వారానే చేసాడు. దీనివల్ల యాకోబు కుమారులు అనువాదకుడు లేనప్పుడు వారి మాటలు యోసేపుకు అర్థం కావనే ఉద్దేశంతో తాము అమ్మివేసిన సోదరుడికోసం పశ్చాత్తాపంతో మాట్లాడుకోసాగారు. కానీ యోసేపుకు వారి భాష తెలుసు కాబట్టి వారు మాట్లాడుకున్నదంతా గ్రహించాడు.
ఆదికాండము 42:24 అతడు వారియొద్దనుండి అవతలకు పోయి యేడ్చి, మరల వారియొద్దకు వచ్చి వారితో మాటలాడి, వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను.
ఈ వచనంలో తన సోదరుల మాటలను గ్రహించిన యోసేపు మొదట ఏడ్చినప్పటికీ వారిలో ఇంకా మార్పు తీసుకురావాలన్నదీ అలానే బెన్యామీను కూడా తన దగ్గరకు రావాలన్నదే తన ఉద్దేశం కాబట్టి వారితో చెప్పినట్టు షిమ్యోనును బంధించడం మనం చూస్తాం. ఇక్కడ అతను తనకున్న ప్రేమను బట్టి తొందరపడకుండా వారిలో మార్పు తీసుకురావాలనే తన బాధ్యతకు కట్టుబడియున్నాడు. మనం కూడా మన కుటుంబసభ్యులను ప్రేమించాలి, అలాగని వారితో కఠినంగా ప్రవర్తించవలసిన సమయంలో అలానే ప్రవర్తించాలి. లేకుంటే మన ప్రేమవల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రేమ అవసరమైన సమయంలో కఠినంగానే ప్రవర్తించి తప్పులను సరిచేస్తుంది. అందుకేగా "మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును" (సామెతలు 27:6) అని రాయబడింది.
ఆదికాండము 42:25-28 మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజనపదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారియెడలనిట్లు జరిగించెను. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదలమీద ఎక్కించుకొని అక్కడనుండి వెళ్లిపోయిరి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేతపెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనెమూతిలో ఉండెను. అప్పుడతడు నా రూకలు తిరిగి యిచ్చివేసినారు. ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదిరిపోయినవారై జడిసి ఇదేమిటి? దేవుడు మనకిట్లు చేసెనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.
ఈ వచనాలలో యోసేపు తన అన్నలు ధాన్యం కొనడానికి తెచ్చిన ధనాన్ని తిరిగి వారి సంచులలోనే వేయించడం ద్వారా వారిపై దొంగతనపు ఆరోపణ మోపబడుతుందని వారు భావించడం మనం చూస్తాం. యోసేపు ఇలా చెయ్యడం ద్వారా వారికి దేవుడు గుర్తువచ్చేలా చేసాడు అందుకే వారు దేవుడు మనకిలా చేసాడేంటని భయపడుతున్నారు. వీరికి కష్టం రాగానే జ్ఞాపకం వచ్చిన దేవుడు తన సోదరుడిని అన్యాయంగా అమ్మివేసేటప్పుడు మాత్రం జ్ఞాపకం రాలేదు. ఇది మానవుడిలోని పతనస్వభావాన్ని తెలియచేస్తుంది, చాలామంది తాము పాపాలు చేసేటప్పుడు దేవుడికి లెక్కచెప్పాలని (రోమా 14:12) జ్ఞాపకం చేసుకోరు కానీ తమ పాపఫలితాన్ని చూసినప్పుడు మాత్రం దేవుడు నాకెందుకిలా చేసాడంటూ వాపోతుంటారు. అదేవిధంగా ఇక్కడ యోసేపు ఇలా చెయ్యడం ద్వారా తన కుటుంబం నుండి ఎలాంటి ధనమూ తీసుకోకుండా ఉచితంగా వారికి ఆహారమిస్తూ తన బాధ్యతను నెరవేర్చుకుంటున్నాడు.
ఆదికాండము 42:29-38 వారు కనాను దేశమందున్న తమ తండ్రియైన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియ చేసిరి. ఎట్లనగాఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము ఆ దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను. అప్పుడుమేము యథార్థవంతులము, వేగులవారము కాము. పండ్రెండుమంది సహోదరులము, ఒక్కతండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రియొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచిమీరు యథార్థవంతులని దీనివలన నేను తెలిసికొందును. మీ సహోదరులలో ఒకనిని నాయొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరవు తీరునట్లు ధాన్యము తీసికొనిపోయి, నాయొద్దకు ఆ చిన్నవాని తోడుకొనిరండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలిసికొని మీ సహోదరుని మీకప్పగించెదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపా రము చేసికొనవచ్చునని చెప్పెననిరి. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి. అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు. షిమ్యోను లేడు. మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు. ఇవన్నియు నాకు ప్రతి కూలముగా ఉన్నవని వారితో చెప్పెను. అందుకు రూబేనునేనతని నీయొద్దకు తీసికొని రానియెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును. అతని నా చేతికప్పగించుము, అతని మరల నీయొద్దకు తీసికొని వచ్చి అప్పగించెదనని తన తండ్రితో చెప్పెను. అయితే అతడునా కుమారుని మీతో వెళ్లనియ్యను. ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.
ఈ వచనాలలో యాకోబు కుమారులు తమ తండ్రికి ఐగుప్తులో జరిగిన సంగతంతా వివరించడం మనం చూస్తాం. ఇదంతా యాకోబు తనకు ప్రతికూలంగా జరుగుతున్నట్టుగా భావించాడు కాబట్టి రూబేను తన కుమారులను కొదువపెట్టి బెన్యామీనును తీసుకుని వెళ్ళేందుకు ప్రయత్నించినప్పటికీ అతను దానికి ఒప్పుకోకుండా బెన్యామీనుకు కూడా ఏదైనా హాని జరిగితే తన మరణం బాధతో జరుగుతుందని వారిని అడ్డగిస్తున్నాడు. కానీ ఇక్కడ యాకోబు నా కుటుంబానికే ఎందుకిలా జరుగుతుందని దేవుణ్ణి నిందించడం లేదు. కాబట్టి విశ్వాసుల కుటుంబాలలో ప్రతికూలమైన పరిస్థితులు చోటుచేసుకున్నప్పటికీ తమ దేవుణ్ణి నిందించకుండా యాకోబులా జాగ్రతపడాలి. ఆ పరిస్థితి నుండి కాపాడమని దేవుణ్ణి విధేయతతో వేడుకోవాలి.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Add comment