లేవీయకాండము 15:1,2
మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి ఒకని దేహమందు స్రావమున్నయెడల ఆ స్రావమువలన వాడు అపవిత్రుడగును.
ఈ వచనాల్లో స్రావం విషయమైన అపవిత్రతను మనం చూస్తాం. స్త్రీలలో ఎలాగైతే రక్త స్రావం (లూకా 8:42) అనే రోగం ఉంటుందో పురుషుల్లో కూడా అలాంటి రోగం ఉంటుంది (2 సమూయేలు 3:29). దాని గురించే ఇక్కడ చెప్పబడుతుంది.
లేవీయకాండము 15:3-12
వాని స్రావము కారినను కారక పోయినను ఆ దేహస్థితినిబట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావముగలవాడు పండుకొను ప్రతి పరుపు అప విత్రము; వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. అట్టివాడు దేని మీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును. స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. స్రావముగలవాడు పవిత్రుని మీద ఉమ్మివేసినయెడల వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము. వాని క్రిందనుండిన యే వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. స్రావముగలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునోవాడు తన బట్టలు ఉదుకుకొని స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. స్రావముగలవాడు ముట్టుకొనిన మంటిపాత్రను పగలగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలెను.
ఈ వచనాల్లో ఆ స్రావం గలవాడి వస్తువులూ వాటిని తాకినవారు ఇలా ఆ ప్రభావానికి గురైన ప్రతీదీ అపవిత్రమని చెప్పబడడం మనం చూస్తాం. గమనించండి; ఈ నియమాలు ధర్మశాస్త్రంలోని ఆచారాలు, శుద్ధీకరణలకు (Sermonial Law) సంబంధించినవి (హెబ్రీ 9:10). ఈ అపవిత్రతలన్నీ మన ఆధ్యాత్మిక అపవిత్రతలకు ఛాయగా చెప్పబడ్డాయి. ప్రతీరోగమూ పాపపు పర్యవసానంగానే లోకంలోకి ప్రవేశించింది కాబట్టి పాపపు అపవిత్రతకు ఛాయగా వీటిని భావించాలి. ఆవిధంగా ఆలోచించినప్పుడు ఈ నియమాలను బట్టి మనల్ని అపవిత్రపరిచే పాపం విషయంలో జాగ్రత్త వహించాలని ఇవి నేర్పిస్తున్నాయి. అలానే ఈ నియమాలు ఇశ్రాయేలీయుల ఆరోగ్యరీత్యా కూడా చెప్పబడ్డాయి.
లేవీయకాండము 15:13-15
స్రావముగలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందునప్పుడు, తన పవిత్రత విషయమై యేడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకు కొని పారు నీటితో ఒడలును కడుగుకొని పవిత్రుడగును. ఎనిమిదవనాడు రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసికొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలెను. యాజకుడు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.
ఈ వచనాలలో స్రావం నుండి శుద్ధుడైన వ్యక్తి ఏడు రోజుల తర్వాత అనగా ఎనిమిదవ రోజున పాపపరిహార్థ బలిగా దహనబలిగా రెండు పక్షులను అర్పించాలని మనం చూస్తాం. పై వచనాలలో వివరించినట్టు ప్రతీరోగం పాపం వల్లే ఈలోకంలో ప్రవేశించింది కాబట్టి అతను శుద్ధుడైనప్పుడు మొదట పాపపరిహారార్థ బలిని అర్పించాలి, తనను శుద్ధునిగా చేసిన దేవునికి కృతజ్ఞతగా దహనబలిని కూడా అర్పించాలి.
లేవీయకాండము 15:16,17
ఒకనికి వీర్యస్ఖలనమైన యెడల వాడు సర్వాంగ స్నానము చేసికొని సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. ఏ బట్టమీదను ఏ తోలుమీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలము వరకు అపవిత్రమై యుండును.
ఈ వచనాల్లో వీర్యస్ఖలనానికి సంబంధించిన అపవిత్రతను మనం చూస్తాం. ఈ నియమాలన్నీ శరీరసంబంధమైన అపవిత్రతకు సంబంధించినవి కాబట్టి వీర్యస్ఖలనం కూడా అపవిత్రంగానే చెప్పబడింది. అనగా ఇవి శారీరక శుభ్రతను సూచిస్తున్నాయి. అలానే 14వ వచనపు వ్యాఖ్యానంలో వివరించినట్టు ఇవన్నీ ఆధ్యాత్మిక అపవిత్రతకు ఛాయగా ఉండి ఆ విషయంలో మనల్ని హెచ్చరిస్తున్నాయి.
లేవీయకాండము 15:18
వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించినయెడల వారిద్దరు నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రులై యుందురు.
ఈ వచనంలో "వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించినయెడల" వారు సాయంకాలం వరకూ అపవిత్రులు అనే మాటలు మనం చూస్తాం. ఈ మాటలు వైవాహిక లైంగికసంబంధాన్ని సూచిస్తున్నాయి. ఆ సంబంధంలో పాల్గొన్న భార్యాభర్తలు సాయంకాలం వరకూ అపవిత్రులుగా ఉండాలి అనగా ప్రత్యక్షగుడారానికి సంబంధించినవాటిని తినడం కానీ అందులో ప్రవేశించడం కానీ చెయ్యకుండా ఆరోజంతా ప్రత్యేకంగా ఉండాలి. "అపవిత్రులుగా లేక కడగా" ఉండడం అంటే అదే.
కొందరు దుర్బోధకులు ఈ వాక్యభాగాన్ని వక్రీకరించి, ఎవరితోనైనా వీర్యం కారేలా శయనిస్తే పాపం కానీ వీర్యస్ఖలనం కాకుండా ఏం చేసినా అది వ్యభిచారం కాదని బోధిస్తున్నారు. కానీ ఇక్కడ అలాంటి అసహ్యమైన మినహాయింపేమీ లేదు. మోహపు చూపు చూడడమే వ్యభిచారం అయినప్పుడు వీర్యం కారినా కారకపోయినా భార్య/భర్తకాని వారితో లైంగికసంబంధంలో పాల్గోవడం వ్యభిచారమే ఔతుంది. అలాంటివారికి రాళ్ళతో కొట్టి మరణ దండన విధించమని రాయబడింది.
లేవీయకాండము 15:19-27
స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైనయెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరు సాయంకాలమువరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును; ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. అది ఆమె పరుపుమీదనైనను ఆమె కూర్చుండిన దానిమీదనైనను ఉండినయెడల దానిని ముట్టు వాడు సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినయెడల, వాడు ఏడు దినములు అపవిత్రుడగును; వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము. ఒక స్త్రీ కడగా ఉండుకాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంక అనేకదినములు స్రవించినను ఆమె కడగానుండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలోవలెనే ఆ స్రావదినములన్నియు ఉండును, ఆమె అపవిత్రురాలు. ఆమె స్రావదినములన్నియు ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచమువలె ఉండ వలెను. ఆమె దేనిమీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రతవలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును.
ఈ వచనాలలో రుతుస్రావానికి సంబంధించిన అపవిత్రతను మనం చూస్తాం. స్రావం గల పురుషుడి విషయంలో చెప్పబడినట్టే ఈ రుతుస్రావం విషయంలో కూడా చెప్పబడుతుంది. ఎందుకంటే రెండూ స్రావాలే రెండూ శారీరక అపవిత్రతలే. కొందరు దీనిని లింగవివక్షతో ముడిపెడుతుంటారు కానీ అలాంటి ఆస్కారమేమీ ఇక్కడ లేదు. ఆ మాటకొస్తే ఇక్కడే కాదు, బైబిల్ లో మరెక్కడా ఆ ఆరోపణకు తావులేదు. బైబిల్ దేవుడు వివక్ష, పక్షపాతాలకు అతీతుడు. దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
"ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినయెడల, వాడు ఏడు దినములు అపవిత్రుడగును; వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము" అనే మాటలు కూడా ఇక్కడ చదువుతున్నాం. అనగా భార్యాభర్తలు లైంగిక సంబంధంలో ఉండగా ఆమెకు రుతుస్రావం అయ్యి భర్తకు ఆ స్రావం అంటుకుంటే అతను కూడా ఏడుదినాల పాటు అపవిత్రునిగానే పరిగణించబడతాడు. గమనించండి; రుతుస్రావం అనేది ప్రతీనెలా అదేరోజు అదే సమయానికి అవ్వదు. కొందరు స్త్రీలకైతే రోజుల వ్యత్యాసం కూడా ఉంటుంది. అలా అది ఎప్పుడు ఔతుందో ఆమెకు కానీ ఆమె భర్తకు కానీ తెలియదు కాబట్టి వారిద్దరూ సంబంధంలో ఉండగా అది జరిగితే అతను కూడా ప్రత్యేకంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ మాటలు చెప్పబడ్డాయి. అంతేతప్ప రుతుస్రావం సమయంలో కలిసుండడానికి బైబిల్ అంగీకరించట్లేదు. "అపవిత్రతవలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు" (లేవీయకాండము 18:19) అని స్పష్టంగా రాయబడింది.
కొందరు భర్తలు ఆ సమయంలో కూడా ఇబ్బందిపెడుతుంటారని తెలిసింది కాబట్టి ఈమాటలు ప్రత్యేకంగా చెబుతున్నాను. అలానే కొందరు స్త్రీలు కూడా ఆ సమయంలోనే ఎక్కువ వాంఛకు లోనై భర్తలను ప్రేరేపిస్తుంటారంట. అలా చేస్తే వారిద్దరూ దోషులే. ఇది ధర్మశాస్త్రంలో శుద్ధీకరణకు సంబంధించిన నియమం కదా మనకు వర్తించదని భావించడానికి లేదు. ఎందుకంటే లేఖనంలోని ప్రతీనియమమూ ఏదోవిధంగా మనకు వర్తిస్తుంది. ప్రాముఖ్యంగా ఈ నియమం ఎవరి మానచ్ఛాదనము తియ్యకూడదో వివరించబడిన నైతికధర్మశాస్త్రంలో కూడా నిషేధించబడి ఆ నియమాన్ని మీరిన భార్యాభర్తలను ప్రజల్లోనుండి కొట్టివెయ్యాలని రాయబడింది (లేవీయకాండము 20:18). కాబట్టి విశ్వాసులు దీనిని పాటించవలసిందే. ఇది ఆరోగ్యపరంగా వారికి మేలు కూడా. ఆ విషయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు ప్రేమపూర్వకంగా నచ్చచెప్పుకోవాలి. ఆ సమయంలో లైంగిక వాంఛలను ప్రక్కనపెట్టి వారి భవిష్యత్తు గురించీ వారి ఆధ్యాత్మిక అభివృద్ధి గురించీ చర్చించుకోవాలి.
లేవీయకాండము 15:28-30
ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైనయెడల ఆమె యేడుదినములు లెక్కించు కొని అవి తీరిన తరువాత పవిత్రురాలగును. ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తేవలెను. యాజకుడు ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావవిషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.
ఈ వచనాలలో స్రావం గల పురుషుడి విషయంలో చెప్పబడినట్టే రుతుస్రావం నిలిచిన స్త్రీ కూడా ఏడుదినాలు లెక్కించుకుని ఎనిమిదవ దినాన పాపపరిహారార్థ బలిగా దహనబలిగా రెండు పక్షులను అర్పించాలని మనం చూస్తాం. ఆ సందర్భంలో వివరించినట్టుగా ప్రతీరోగమూ ప్రతీ వేదనా పాపఫలితంగానే లోకంలో ప్రవేశించింది కాబట్టి రుతుస్రావపు వేదన నిలిచిన స్త్రీ కూడా పాపపరిహార్థబలినీ దహనబలినీ అర్పించాలి.
గమనించండి; ఈ నియమాలన్నీ ఇశ్రాయేలీయుల శరీరసంబంధమైన ఆచారాలని అవి మన ఆధ్యాత్మిక అపవిత్రతలకు ఛాయగా మాత్రమే చెప్పబడ్డాయని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం కూడా కొందరు స్త్రీలు రుతుస్రావం సమయంలో చర్చులకు హాజరు కాకపోవడం, బైబిల్ ముట్టకపోవడం వంటివి చేస్తుంటారు. కానీ వారు వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ కాలేజీలకూ ఉద్యోగాలకు ఎలా వెళ్తుంటారో అలానే చర్చులకూ హాజరు కావొచ్చు. బైబిల్ ధ్యానంలో గడపవచ్చు. నిజానికి ఆ సమయంలో వారి మానసిక పరిస్థితిని బట్టి మరి ఎక్కువగా బైబిల్ ధ్యానం, ప్రార్థనలో గడపాలని నా అభిప్రాయం.
లేవీయకాండము 15:31-33
ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాసస్థల మును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రతవలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండ మీరు వారిని కాపాడవలెను. స్రావముగలవాని గూర్చియు, వీర్యస్ఖలనమువలని అప విత్రతగలవాని గూర్చియు, కడగానున్న బలహీనురాలిని గూర్చియు, స్రావముగల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో శయనించు వాని గూర్చియు విధింపబడినది ఇదే.
ఇప్పటివరకూ దేవుడు మోషే అహరోనులకు ఆయా అపవిత్రతలన్నిటి గురించీ వివరించడానికి కారణం ఈ వచనంలోని మాటలే. ఇప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుని ప్రత్యక్షగుడారం ఉంది. పాపఫలితంగా లోకంలో ప్రవేశించిన రోగాలు పాపానికి ఛాయగా ఉన్న అపవిత్రతలు కలిగినవారు అందులో ప్రవేశిస్తే వారు మరణించవలసి ఉంటుంది. అందుకే దేవుడు ఈ నియమాలన్నీ మోషే అహరోనులకు వివరించి వాటిని ప్రజలకు తెలియచెయ్యమంటున్నాడు.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
లేవీయకాండము అధ్యాయం 15
లేవీయకాండము 15:1,2
మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి ఒకని దేహమందు స్రావమున్నయెడల ఆ స్రావమువలన వాడు అపవిత్రుడగును.
ఈ వచనాల్లో స్రావం విషయమైన అపవిత్రతను మనం చూస్తాం. స్త్రీలలో ఎలాగైతే రక్త స్రావం (లూకా 8:42) అనే రోగం ఉంటుందో పురుషుల్లో కూడా అలాంటి రోగం ఉంటుంది (2 సమూయేలు 3:29). దాని గురించే ఇక్కడ చెప్పబడుతుంది.
లేవీయకాండము 15:3-12
వాని స్రావము కారినను కారక పోయినను ఆ దేహస్థితినిబట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావముగలవాడు పండుకొను ప్రతి పరుపు అప విత్రము; వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. అట్టివాడు దేని మీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును. స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. స్రావముగలవాడు పవిత్రుని మీద ఉమ్మివేసినయెడల వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము. వాని క్రిందనుండిన యే వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. స్రావముగలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునోవాడు తన బట్టలు ఉదుకుకొని స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. స్రావముగలవాడు ముట్టుకొనిన మంటిపాత్రను పగలగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలెను.
ఈ వచనాల్లో ఆ స్రావం గలవాడి వస్తువులూ వాటిని తాకినవారు ఇలా ఆ ప్రభావానికి గురైన ప్రతీదీ అపవిత్రమని చెప్పబడడం మనం చూస్తాం. గమనించండి; ఈ నియమాలు ధర్మశాస్త్రంలోని ఆచారాలు, శుద్ధీకరణలకు (Sermonial Law) సంబంధించినవి (హెబ్రీ 9:10). ఈ అపవిత్రతలన్నీ మన ఆధ్యాత్మిక అపవిత్రతలకు ఛాయగా చెప్పబడ్డాయి. ప్రతీరోగమూ పాపపు పర్యవసానంగానే లోకంలోకి ప్రవేశించింది కాబట్టి పాపపు అపవిత్రతకు ఛాయగా వీటిని భావించాలి. ఆవిధంగా ఆలోచించినప్పుడు ఈ నియమాలను బట్టి మనల్ని అపవిత్రపరిచే పాపం విషయంలో జాగ్రత్త వహించాలని ఇవి నేర్పిస్తున్నాయి. అలానే ఈ నియమాలు ఇశ్రాయేలీయుల ఆరోగ్యరీత్యా కూడా చెప్పబడ్డాయి.
లేవీయకాండము 15:13-15
స్రావముగలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందునప్పుడు, తన పవిత్రత విషయమై యేడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకు కొని పారు నీటితో ఒడలును కడుగుకొని పవిత్రుడగును. ఎనిమిదవనాడు రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసికొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలెను. యాజకుడు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.
ఈ వచనాలలో స్రావం నుండి శుద్ధుడైన వ్యక్తి ఏడు రోజుల తర్వాత అనగా ఎనిమిదవ రోజున పాపపరిహార్థ బలిగా దహనబలిగా రెండు పక్షులను అర్పించాలని మనం చూస్తాం. పై వచనాలలో వివరించినట్టు ప్రతీరోగం పాపం వల్లే ఈలోకంలో ప్రవేశించింది కాబట్టి అతను శుద్ధుడైనప్పుడు మొదట పాపపరిహారార్థ బలిని అర్పించాలి, తనను శుద్ధునిగా చేసిన దేవునికి కృతజ్ఞతగా దహనబలిని కూడా అర్పించాలి.
లేవీయకాండము 15:16,17
ఒకనికి వీర్యస్ఖలనమైన యెడల వాడు సర్వాంగ స్నానము చేసికొని సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. ఏ బట్టమీదను ఏ తోలుమీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలము వరకు అపవిత్రమై యుండును.
ఈ వచనాల్లో వీర్యస్ఖలనానికి సంబంధించిన అపవిత్రతను మనం చూస్తాం. ఈ నియమాలన్నీ శరీరసంబంధమైన అపవిత్రతకు సంబంధించినవి కాబట్టి వీర్యస్ఖలనం కూడా అపవిత్రంగానే చెప్పబడింది. అనగా ఇవి శారీరక శుభ్రతను సూచిస్తున్నాయి. అలానే 14వ వచనపు వ్యాఖ్యానంలో వివరించినట్టు ఇవన్నీ ఆధ్యాత్మిక అపవిత్రతకు ఛాయగా ఉండి ఆ విషయంలో మనల్ని హెచ్చరిస్తున్నాయి.
లేవీయకాండము 15:18
వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించినయెడల వారిద్దరు నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రులై యుందురు.
ఈ వచనంలో "వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించినయెడల" వారు సాయంకాలం వరకూ అపవిత్రులు అనే మాటలు మనం చూస్తాం. ఈ మాటలు వైవాహిక లైంగికసంబంధాన్ని సూచిస్తున్నాయి. ఆ సంబంధంలో పాల్గొన్న భార్యాభర్తలు సాయంకాలం వరకూ అపవిత్రులుగా ఉండాలి అనగా ప్రత్యక్షగుడారానికి సంబంధించినవాటిని తినడం కానీ అందులో ప్రవేశించడం కానీ చెయ్యకుండా ఆరోజంతా ప్రత్యేకంగా ఉండాలి. "అపవిత్రులుగా లేక కడగా" ఉండడం అంటే అదే.
కొందరు దుర్బోధకులు ఈ వాక్యభాగాన్ని వక్రీకరించి, ఎవరితోనైనా వీర్యం కారేలా శయనిస్తే పాపం కానీ వీర్యస్ఖలనం కాకుండా ఏం చేసినా అది వ్యభిచారం కాదని బోధిస్తున్నారు. కానీ ఇక్కడ అలాంటి అసహ్యమైన మినహాయింపేమీ లేదు. మోహపు చూపు చూడడమే వ్యభిచారం అయినప్పుడు వీర్యం కారినా కారకపోయినా భార్య/భర్తకాని వారితో లైంగికసంబంధంలో పాల్గోవడం వ్యభిచారమే ఔతుంది. అలాంటివారికి రాళ్ళతో కొట్టి మరణ దండన విధించమని రాయబడింది.
లేవీయకాండము 15:19-27
స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైనయెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరు సాయంకాలమువరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును; ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. అది ఆమె పరుపుమీదనైనను ఆమె కూర్చుండిన దానిమీదనైనను ఉండినయెడల దానిని ముట్టు వాడు సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినయెడల, వాడు ఏడు దినములు అపవిత్రుడగును; వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము. ఒక స్త్రీ కడగా ఉండుకాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంక అనేకదినములు స్రవించినను ఆమె కడగానుండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలోవలెనే ఆ స్రావదినములన్నియు ఉండును, ఆమె అపవిత్రురాలు. ఆమె స్రావదినములన్నియు ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచమువలె ఉండ వలెను. ఆమె దేనిమీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రతవలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును.
ఈ వచనాలలో రుతుస్రావానికి సంబంధించిన అపవిత్రతను మనం చూస్తాం. స్రావం గల పురుషుడి విషయంలో చెప్పబడినట్టే ఈ రుతుస్రావం విషయంలో కూడా చెప్పబడుతుంది. ఎందుకంటే రెండూ స్రావాలే రెండూ శారీరక అపవిత్రతలే. కొందరు దీనిని లింగవివక్షతో ముడిపెడుతుంటారు కానీ అలాంటి ఆస్కారమేమీ ఇక్కడ లేదు. ఆ మాటకొస్తే ఇక్కడే కాదు, బైబిల్ లో మరెక్కడా ఆ ఆరోపణకు తావులేదు. బైబిల్ దేవుడు వివక్ష, పక్షపాతాలకు అతీతుడు. దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
"ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినయెడల, వాడు ఏడు దినములు అపవిత్రుడగును; వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము" అనే మాటలు కూడా ఇక్కడ చదువుతున్నాం. అనగా భార్యాభర్తలు లైంగిక సంబంధంలో ఉండగా ఆమెకు రుతుస్రావం అయ్యి భర్తకు ఆ స్రావం అంటుకుంటే అతను కూడా ఏడుదినాల పాటు అపవిత్రునిగానే పరిగణించబడతాడు. గమనించండి; రుతుస్రావం అనేది ప్రతీనెలా అదేరోజు అదే సమయానికి అవ్వదు. కొందరు స్త్రీలకైతే రోజుల వ్యత్యాసం కూడా ఉంటుంది. అలా అది ఎప్పుడు ఔతుందో ఆమెకు కానీ ఆమె భర్తకు కానీ తెలియదు కాబట్టి వారిద్దరూ సంబంధంలో ఉండగా అది జరిగితే అతను కూడా ప్రత్యేకంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ మాటలు చెప్పబడ్డాయి. అంతేతప్ప రుతుస్రావం సమయంలో కలిసుండడానికి బైబిల్ అంగీకరించట్లేదు. "అపవిత్రతవలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు" (లేవీయకాండము 18:19) అని స్పష్టంగా రాయబడింది.
కొందరు భర్తలు ఆ సమయంలో కూడా ఇబ్బందిపెడుతుంటారని తెలిసింది కాబట్టి ఈమాటలు ప్రత్యేకంగా చెబుతున్నాను. అలానే కొందరు స్త్రీలు కూడా ఆ సమయంలోనే ఎక్కువ వాంఛకు లోనై భర్తలను ప్రేరేపిస్తుంటారంట. అలా చేస్తే వారిద్దరూ దోషులే. ఇది ధర్మశాస్త్రంలో శుద్ధీకరణకు సంబంధించిన నియమం కదా మనకు వర్తించదని భావించడానికి లేదు. ఎందుకంటే లేఖనంలోని ప్రతీనియమమూ ఏదోవిధంగా మనకు వర్తిస్తుంది. ప్రాముఖ్యంగా ఈ నియమం ఎవరి మానచ్ఛాదనము తియ్యకూడదో వివరించబడిన నైతికధర్మశాస్త్రంలో కూడా నిషేధించబడి ఆ నియమాన్ని మీరిన భార్యాభర్తలను ప్రజల్లోనుండి కొట్టివెయ్యాలని రాయబడింది (లేవీయకాండము 20:18). కాబట్టి విశ్వాసులు దీనిని పాటించవలసిందే. ఇది ఆరోగ్యపరంగా వారికి మేలు కూడా. ఆ విషయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు ప్రేమపూర్వకంగా నచ్చచెప్పుకోవాలి. ఆ సమయంలో లైంగిక వాంఛలను ప్రక్కనపెట్టి వారి భవిష్యత్తు గురించీ వారి ఆధ్యాత్మిక అభివృద్ధి గురించీ చర్చించుకోవాలి.
లేవీయకాండము 15:28-30
ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైనయెడల ఆమె యేడుదినములు లెక్కించు కొని అవి తీరిన తరువాత పవిత్రురాలగును. ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తేవలెను. యాజకుడు ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావవిషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.
ఈ వచనాలలో స్రావం గల పురుషుడి విషయంలో చెప్పబడినట్టే రుతుస్రావం నిలిచిన స్త్రీ కూడా ఏడుదినాలు లెక్కించుకుని ఎనిమిదవ దినాన పాపపరిహారార్థ బలిగా దహనబలిగా రెండు పక్షులను అర్పించాలని మనం చూస్తాం. ఆ సందర్భంలో వివరించినట్టుగా ప్రతీరోగమూ ప్రతీ వేదనా పాపఫలితంగానే లోకంలో ప్రవేశించింది కాబట్టి రుతుస్రావపు వేదన నిలిచిన స్త్రీ కూడా పాపపరిహార్థబలినీ దహనబలినీ అర్పించాలి.
గమనించండి; ఈ నియమాలన్నీ ఇశ్రాయేలీయుల శరీరసంబంధమైన ఆచారాలని అవి మన ఆధ్యాత్మిక అపవిత్రతలకు ఛాయగా మాత్రమే చెప్పబడ్డాయని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం కూడా కొందరు స్త్రీలు రుతుస్రావం సమయంలో చర్చులకు హాజరు కాకపోవడం, బైబిల్ ముట్టకపోవడం వంటివి చేస్తుంటారు. కానీ వారు వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ కాలేజీలకూ ఉద్యోగాలకు ఎలా వెళ్తుంటారో అలానే చర్చులకూ హాజరు కావొచ్చు. బైబిల్ ధ్యానంలో గడపవచ్చు. నిజానికి ఆ సమయంలో వారి మానసిక పరిస్థితిని బట్టి మరి ఎక్కువగా బైబిల్ ధ్యానం, ప్రార్థనలో గడపాలని నా అభిప్రాయం.
లేవీయకాండము 15:31-33
ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాసస్థల మును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రతవలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండ మీరు వారిని కాపాడవలెను. స్రావముగలవాని గూర్చియు, వీర్యస్ఖలనమువలని అప విత్రతగలవాని గూర్చియు, కడగానున్న బలహీనురాలిని గూర్చియు, స్రావముగల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో శయనించు వాని గూర్చియు విధింపబడినది ఇదే.
ఇప్పటివరకూ దేవుడు మోషే అహరోనులకు ఆయా అపవిత్రతలన్నిటి గురించీ వివరించడానికి కారణం ఈ వచనంలోని మాటలే. ఇప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుని ప్రత్యక్షగుడారం ఉంది. పాపఫలితంగా లోకంలో ప్రవేశించిన రోగాలు పాపానికి ఛాయగా ఉన్న అపవిత్రతలు కలిగినవారు అందులో ప్రవేశిస్తే వారు మరణించవలసి ఉంటుంది. అందుకే దేవుడు ఈ నియమాలన్నీ మోషే అహరోనులకు వివరించి వాటిని ప్రజలకు తెలియచెయ్యమంటున్నాడు.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.