విమర్శలకు జవాబు

రచయిత: కె. విద్యా సాగర్

ముఖ్య గమనిక: ఈ పుస్తకంలో నేను ప్రస్తావించిన హిందూమతోన్మాదులు, హిందువులు ఒకటి కాదు. సాధారణ హిందువులతో మాకు మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. కానీ మతోన్మాదంతో బైబిల్ పైనా బైబిల్ దేవునిపైనా అన్యాయంగా దాడిచేస్తున్నవారినే ఇక్కడ నేను హిందూమతోన్మాదులుగా ప్రస్తావించడం జరిగింది. ఉదాహరణకు: కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్, రాధా మనోహర్ దాస్, హమారా ప్రసాద్, భాస్కర్ రాజు, తదితరులు. బైబిల్ పై వారు చేస్తున్న అబద్ధపు ఆరోపణలకు సమాధానం ఇచ్చే క్రమంలో నేను హిందూ దేవతల గురించి కూడా ప్రస్తావించింది హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికో లేక మా గ్రంథంపై ఆరోపణలు చేస్తే మీ గ్రంథంపైనా ఆరోపణలు చేస్తామని బెదిరించడానికో కాదు. మా గ్రంథంలో మనుషులు పాపం చేసారు, మా దేవుడు వాటిని‌ ఖండించాడు. వాటివల్ల ఎవరూ ఆ పాపాలను ప్రామాణికంగా తీసుకునే అవకాశం లేదు. కానీ హిందూ గ్రంథాలలో దేవుళ్ళే ఘోరపాపాలు చేసారు, దీనివల్ల ఆ దేవుళ్ళను పూజించే ప్రజలు వాటినీ‌ వారినీ అనుసరించే పరిస్థితి కలుగుతుంది. ఆవిధంగా ఆ దేవుళ్ళు పాటించిన సంస్కృతి మన సమాజానికి చాలా ప్రమాదకరం కాబట్టి, ఆ దేవుళ్ళ చరిత్ర గురించి తెలియనివారిని హెచ్చరించడానికే అలా చేసాను. ఇది ఆ హిందూ మతోన్మాదులకు కూడా చెంపపెట్టు లాంటిది. అయితే ఇక్కడ నేను హిందూ దేవుళ్ళ గురించి ప్రస్తావించిన మాటలను వారు విస్మరిస్తూ సంస్కృతంలో అక్కడ అలా లేదు, ఇక్కడ ఇలా లేదంటూ అబద్ధాలు చెబుతారని‌ నాకు బాగా తెలుసు. అలాగైతే వారు సంస్కృతంలో అక్కడ ఏముందో ఇక్కడ ఏముందో సందర్భానుసారంగా చూపించాలి. అప్పుడు మాట్లాడదాం. ఎవరి మతగ్రంథంలోనైనా భాషను బట్టి కొన్ని పదాల అర్థాలు మారిపోవచ్చు కానీ సందర్భం మారిపోదుగా? నేను హిందూ దేవుళ్ళ గురించి చూపించినవి  సందర్భాలు. ఒకవేళ ఎవరైనా నేను కొన్నిచోట్ల References మాత్రమే పెట్టాను, అక్కడున్న శ్లోకాలూ వాటి తాత్పర్యం పెట్టలేదు, అక్కడ నేను చెప్పినటువంటి భావం ఏమీలేదని తప్పించుకోవాలని చూస్తే ఆ References లో ఏముందో వారి పుస్తకాల నుండి చూపించాలి. చదువరులను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకే‌ కొన్నిచోట్ల References తో సరిపెట్టాను.

విషయసూచిక

  1. బైబిల్లో అన్నాచెల్లెళ్ళ వివాహం
  2. బైబిల్లో తండ్రీకూతుళ్ళ అక్రమ సంబంధం
  3. బైబిల్లో మామాకోడళ్ళ అక్రమ సంబంధం
  4. బైబిల్లో తల్లీకొడుకుల అక్రమ సంబంధం
  5. బైబిల్లో అత్తాఅల్లుళ్ళ అక్రమ సంబంధం
  6. దావీదు బత్షెబా పాపం
  7. బైబిల్ దేవుడు సౌలు భార్యలను దావీదు కౌగిట్లో చేర్చాడా?
  8. తండ్రి తప్పు చేస్తే కొడుకుకు మరణశిక్ష
  9. అమ్నోను తామారు
  10. తండ్రి భార్యలను కొడుకుకు అప్పగించిన బైబిల్ దేవుడు
  11. శీలపరీక్షలు చేయించిన బైబిల్ దేవుడు
  12. పరమగీతాల్లో సెక్స్
  13. యెహోవాకు ఇద్దరు భార్యలు (యెహెజ్కేలు 23)
  14. లంగాలు ఎత్తి చూపిస్తానన్న బైబిల్ దేవుడు
  15. యేసుక్రీస్తు వ్యభిచారమందు పుట్టాడా?

క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము (1యోహాను 2:18)

"భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును" (యెషయా 57:20) అని రాయబడినట్టుగా మన దేశంలో కొందరు "హిందూమతోన్మాదులు" బయల్దేరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పైనా బైబిల్ దేవునిపైనా తమ వక్రీకరణలతోనూ అసత్యాలతోనూ బురద చల్లడం ఈమధ్య విపరీతంగా చూస్తున్నాం. వారి గ్రంథాలలోని బూతుచరిత్రలనూ వారి దేవుళ్ళ అనైతికతనూ కప్పిపుచ్చుకోవడానికి బైబిల్లో కూడా అలాంటివి ఉన్నాయని, బైబిల్ దేవుడు కూడా అలాంటివాడేనని ప్రజలను మభ్యపెట్టడానికే ఆ ప్రయాసయంతా. కానీ బైబిల్ విషయంలో మనకు అలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి లేదు, లేఖనాలు పరిశుద్ధమైనవి (2 తిమోతీ 3:14, రోమా 7:12) బైబిల్ దేవుడు పరిశుద్ధుడు (కీర్తనలు 99:3,5,9, యెషయా 6:3). ఈ సత్యాన్ని మనం ఎలుగెత్తి చాటగలం. అందుకే బైబిల్ పైనా బైబిల్ దేవునిపైనా హిందూ మతోన్మాదులు చేస్తున్నటువంటి అపవిత్ర ఆరోపణలకు సమాధానంగా ఈ వ్యాసం రాస్తున్నాను. ఈ క్రమంలో అవసరమైనప్పుడల్లా హిందూ దేవుళ్ళ చరిత్రలను కూడా ప్రస్తావిస్తుంటాను.

1. బైబిల్లో అన్నాచెల్లెళ్ళ వివాహం

హిందూ మతోన్మాదులు, ఆదాము హవ్వలకు మొదటిగా జన్మించిన కయీనును ప్రస్తావిస్తూ బైబిల్లో అన్నాచెల్లెళ్ళ వివాహం అనుమతించబడిందని, అందుకు నిదర్శనమే కయీను తన స్వంత చెల్లెలిని వివాహం చేసుకోవడమని బురద చల్లుతుంటారు. దురదృష్టవశాత్తూ కొందరు బైబిల్ బోధకులు కయీను తన చెల్లెలినే వివాహం చేసుకున్నాడని బోధించడం‌ కూడా ఇందుకు కారణం. కానీ పరాయి మతగ్రంథంపై విమర్శలు చేసేముందు అందులో ఏముందో తెలుసుకోవలసిన విజ్ఞత విమర్శించేవారికి ఉండాలిగా? ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా కయీను తన చెల్లెలినే వివాహం చేసుకున్నాడని లేదు. మరి ఏముందో చూడండి -

ఆదికాండము 4:16,17 అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను.

ఈ వాక్యభాగంలో ఎక్కడా కూడా కయీను తన చెల్లెలిని వివాహం చేసుకున్నాడని లేదు. మరి‌ కయీను వివాహం చేసుకున్న ఆ స్త్రీ ఎవరంటే ఆమెను దేవుడు సిద్ధపరచిన ప్రత్యేకమైన ఏర్పాటుగానే భావించాలి. అది ఎలా జరిగిందో మనకు వివరించబడలేదు, అన్నీ వివరించబడవలసిన అవసరం కూడా లేదు (ద్వితియోపదేశకాండము 29:29). "ఆయన‌ ఒకనినుండి (ఆదాము) ప్రతీజాతి మనుష్యులనూ సృష్టించాడు" అనేది వాస్తవం (అపో.కార్యములు 17:26), ఆమె (హవ్వ) జీవముగల ప్రతివానికిని తల్లి (ఆదికాండము 20) అనేది కూడా వాస్తవం. ఆ పరిధిలోనే ఆయన కయీనుకూ ఆదాము హవ్వలకు జన్మించిన మొదటి తరమంతటికీ జీవితభాగస్వాములను ‌సిద్ధపరచియుండాలి. ఎలాగంటే హవ్వ ఆదాముకు జన్మించలేదు కానీ అతని‌నుండే సృష్టించబడింది. అలానే దేవుడు ఆదాము మొదటి తరమంతటికీ భార్యలను నియమించాడు అనేది నా వాదన (మరి‌ కుమార్తెల సంగతేంటి ఆదాముకు‌ కుమార్తెలు కూడా ఉన్నట్టు రాయబడిందిగా అంటే దానికి క్రింద సూచించే వ్యాసంలో సమాధానం పొందుపరిచాను). ఎవరైనా కాదు అనంటే కయీను తన చెల్లెలినే వివాహం చేసుకున్నట్టు ఎక్కడ రాయబడిందో చూపించాలి.

నేనిలా మతోన్మాదుల ఆరోపణకు వ్యతిరేకంగా వాదించడానికి బైబిలే నాకు ఆధారం‌ ఇస్తుంది. "కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను" (ఆదికాండము 4:17) అని రాయబడింది కానీ చెల్లెలిని కూడగా అని కాదు. బైబిల్లో ఎక్కడైనా "అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను" (నిర్గమకాండము 6:20) అని రాయబడినట్టుగా (దీనిగురించి కూడా ముందుముందు మాట్లాడతాను) "కయీను తన చెల్లెలిని వివాహం చేసుకొనెను" అని చూపించగలరా? అలానే యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల ద్వారా కనానీయులను నిర్మూలం‌ చేసినప్పుడు ఆ కనానీయులు ఎలాంటి హేయకృత్యాలు జరిగించారో వివరించాడు. అందులో ఒకానొకటి - వావివరసలు లేకుండా అన్నాచెల్లెళ్ళు వివాహం చేసుకోవడం (లేవీయకాండము 18:9-25). ధర్మశాస్త్రానికి ముందటి కాలంలో కూడా కనానీయులు తమ‌ స్వంత అన్నాచెల్లెళ్ళను వివాహం చేసుకుంటున్నప్పుడు దేవుడు దానిని మరణానికి తగిన నేరంగా ఎంచి వారిని నిర్మూలం చేసాడు.‌ బైబిల్ దేవుడు ఇంత‌ తీవ్రంగా ఆ అనైతికతను ఖండిస్తుంటే బైబిల్లో అన్నాచెల్లెళ్ళ వివాహం ఎక్కడ అనుమతించబడిందో ఈ మతోన్మాదులు ఆధారాలతో రుజువు చెయ్యాలి.  దీనిగురించి మరింత‌ వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

కయీను తన చెల్లినే వివాహం చేసుకున్నాడా?

"బైబిల్లో అన్నా చెల్లెళ్ళ వివాహం అనుమతించబడిందని ఆరోపించడానికి మతోన్మాదులు తీసుకునే మరో ఉదాహరణ అబ్రాహాము శారాల వివాహం"

అంతేకాక ఆమె నా చెల్లెలనుమాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది (ఆదికాండము 20:12). 

కానీ ఇక్కడ అబ్రాహాము శారా తనకు తన తండ్రివైపు నుండి‌ చెల్లెలు‌ వరస (నా తండ్రి కుమార్తె) ఔతుందని హెబ్రీయుల సంస్కృతి ప్రకారం మాట్లాడుతున్నాడు‌ తప్ప, ఆమె నా తండ్రికి పుట్టిన స్వంతకుమార్తె అనే భావంలో కాదు. హెబ్రీయులు తమ తండ్రి వంశానికి చెందిన పిల్లలందర్నీ నా తండ్రి కుమారులు, కుమార్తెలు అనే సంబోధిస్తారు. అంతమాత్రాన వారు స్వంత అన్నాచెల్లెళ్ళు అని అర్థం కాదు. అబ్రాహాము తన తండ్రికి పుట్టిన స్వంత చెల్లెలిని వివాహం చేసుకోలేదని వాదించడానికి బైబిల్ నుండే స్పష్టమైన ఆధారం పెడుతున్నాను చూడండి.

ఆదికాండము 11:26,27 తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను. తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను.

ఈ వాక్యభాగం ప్రకారం అబ్రాహాము తండ్రియైన తెరహుకు అబ్రాహాము, నాహోరు, హారాను అనబడే ముగ్గురు మగసంతానమే తప్ప ఒక్క ఆడసంతానం కూడా లేదు. కావాలంటే ఈ తెరహుకు ముందున్న వంశావళిని పరిశీలించండి, అక్కడ తెరహు పితరులు ఎవరికైనా ఆడసంతానం ఉంటే దాని గురించి ప్రస్తావించబడింది, కానీ తెరహు విషయంలో మాత్రం అలా రాయబడలేదు. పైగా తెరహుకు అబ్రాహాము భార్యయైన శారా కుమార్తె కాదు కోడలు అని స్పష్టంగా రాయబడింది (ఆదికాండము 11:31). ఒకవేళ ఆమె తెరహుకు స్వంత కుమార్తెనే అయ్యుంటే కోడలు అని కాకుండా ప్రధానమైన ఆ బంధం గురించే రాయబడేదిగా? కాబట్టి అబ్రాహాము తన స్వంత చెల్లెలిని వివాహం చేసుకున్నాడని ఎవరూ నిరూపించలేరు.

2. బైబిల్లో తండ్రీకూతుళ్ళ అక్రమ సంబంధం

బైబిల్లో ఉన్న రెండు సందర్భాలను ప్రస్తావించి హిందూ మతోన్మాదులు బైబిల్లో తండ్రీ కూతుర్ల సెక్స్ ఉందని ఆరోపిస్తుంటారు.

1. లోతు & అతని కుమార్తెల సందర్భం.

2. 1 కొరింథీ 7:36 వాక్యభాగపు వక్రీకరణ.

ఇప్పుడు వీటి గురించి వివరంగా మాట్లాడుకుందాం.

1. ఆదికాండము 19:30-36 లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలివాడు; సర్వ లోకమర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగచేసికొందము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను. ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షా రసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి.

ఈ సందర్భంలో నిజంగా‌నే లోతు కుమార్తెలు అతనికి ద్రాక్షారసం తాగించి అతని ద్వారా గర్భవతులైనట్టు చదువుతున్నాం. అయితే ఈ సంఘటన తండ్రీకూతుళ్ళు సెక్స్ చేసుకోవచ్చు అనడానికి అనుమతిగా రాయబడిందా? లేదు‌, విశ్వాసియైన అబ్రాహామును విడిచిపెట్టి దుష్టరాజ్యమైన సొదొమవైపుకు వెళ్ళిన లోతుకు ఎలాంటి పరిస్థితి దాపరించిందో, సొదొమలోని వావివరసలు లేని లైంగిక అపవిత్రత లోతు కుమార్తెలను ఎలా ప్రభావితం చేసిందో మనకు తెలియచేసేలా చారిత్రక కోణంలో ఇది రాయబడింది. ఇక్కడ లోతు కుమార్తెలు అనుసరించింది బైబిల్ సంస్కృతి కాదు, సొదొమ సంస్కృతి. వారి చరిత్రను బట్టి మనమంతా అలాంటి నీచసంస్కృతులకు లోనై జీవించకూడదని హెచ్చరించడానికే ఇదంతా రాయబడింది.

1 కోరింథీయులకు 10:11 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.

ఇలా చారిత్రక కోణంలో రాయబడిన సంఘటనలను, మనం అలా చెయ్యకూడదని హెచ్చరికలుగా రాయబడిన మాటలను తీసుకుని బైబిల్లో తండ్రీకూతుళ్ళ సెక్స్ ఉందని, బైబిల్ తండ్రీకూతుళ్ళ మధ్య సెక్స్ ను ప్రోత్సహిస్తుందని బైబిల్ పై బురద చల్లడం హిందూ మతోన్మాదుల నీచబుద్ధికి మంచి నిదర్శనం. బైబిల్లో పలాన వ్యక్తి అపవిత్రంగా జీవించాడు అని రాయబడినంత మాత్రాన బైబిల్ అపవిత్రమైపోదు. బైబిల్ దానిని ప్రోత్సహిస్తున్నప్పుడు మాత్రమే ఆ ఆరోపణకు అవకాశం ఉంటుంది. బైబిల్లోతు కూతుళ్ళు చేసినదానిని ప్రోత్సహిస్తుందో ఖండిస్తుందో ఈమాటలు చూడండి-

లేవీయకాండము 18:6 మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు; నేను యెహోవాను.

అలానే "ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు" (లేవీయకాండము 18:17) అని స్పష్టంగా రాయబడింది.‌ అంటే తల్లిదీ (భార్యదీ) ఆమె కుమార్తెదీ (కూతురుదీ).‌ అలా చేసినవారిని అగ్నితో కాల్చివెయ్యాలనే కఠినశిక్ష‌ కూడా విధించబడింది (లేవీయకాండము 20:14). బైబిల్ ఇంత స్పష్టంగా లోతు కుమార్తెలు లోనైనటువంటి లైంగిక అపవిత్రతలను ఖండిస్తుంటే బైబిల్ దేనినైతే ఖండిస్తుందో ఆ పాపాన్ని బైబిల్ కు ఆపాదించడం ఎంత దుర్మార్గమో ఆలోచించండి. మరలా చెబుతున్నాను, బైబిల్లో ఒక అపవిత్ర కార్యం గురించి (చరిత్రగా), అది కూడా మీరు అలా చెయ్యకూడదనే‌ హెచ్చరికగా రాయబడితే బైబిల్ దానిని సమర్థిస్తున్నట్టు కాదు. అలాగైతే మనం ప్రతీరోజూ చదివే వార్తల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నో రాయబడతాయి. మతోన్మాదులు ఆ వార్తలపై వాటి నిర్వాహకులపై అలాంటి ఆరోపణలు చెయ్యగలరా? కోర్టు జడ్జిమెంటుల్లో కూడా పలానా వ్యక్తి పలానా నేరం చేసాడని వివరంగా రాయబడుతుంది. ఆ నేరం ప్రస్తావించబడిన జడ్జిమెంట్ పైన, అది రాసిన జడ్జిపైనా ఆ నేరారోపణ చెయ్యగలరా? మతోన్మాదులు ప్రయత్నించి చూడాలి, అప్పుడు ఏమౌతుందో మేమూ‌ చూస్తాం.

ఈ లోతు సందర్భం గురించి మరికొన్ని విషయాలు తెలియచేస్తున్నాను.

1. జరిగిన ఆ సంఘటనలో లోతు తప్పిదమేమైనా ఉంటే అది అబ్రాహామును విడిచి లైంగిక అపవిత్రతలు ఉన్న సొదొమవైపుగా వెళ్ళడమూ మహా ఐతే మత్తుడయ్యేంత వరకూ ద్రాక్షారసం సేవించడమే తప్ప అతనేమీ ఉద్దేశపూర్వకంగా తన కుమార్తెలతో లైంగికసంబంధం పెట్టుకోలేదు. అతను ద్రాక్షారసం తాగి‌ మత్తుడిగా ఉన్న సమయంలో ఆ సంఘటన జరిగింది. పురుషులు మత్తులుగా ఉన్నప్పుడు కూడా వారి శారీరకస్వభావం స్త్రీతో శయనించడానికి సహకరిస్తుంది. అందుకే "ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి" అని రాయబడింది. ఈ రోజు ఎవరైనా కామాంధుడు ఒక స్త్రీకి మద్యం కానీ మత్తుమందు కానీ తాగించి ఆమెపై అత్యాచారం చేస్తే దానికి ఆమెను ఎలా బాధ్యురాలిని చెయ్యలేమో అలాగే ఆ సంఘటన విషయంలో లోతును కూడా బాధ్యునిగా చెయ్యలేము.

2. లోతు కుమార్తెలు చేసిన పాపాన్ని దేవుడు ఖండించాడు కాబట్టే ఆ పాపానికి గుర్తుగా వారికి పుట్టిన సంతానాన్ని ఆయన తన సన్నిధికి రాకుండా బహిష్కరించాడు (ద్వితీయోపదేశకాండము 23:3). ఈ బహిష్కరణ లోతు కుమార్తెలు చేసింది ఆయన దృష్టికి హేయం అనడానికి జ్ఞాపకంగా ఉంది. తర్వాత కాలంలో‌ మోయాబీయురాలైన రూతు, అపవిత్రమైన తన జాతితో సంపూర్ణంగా తెగదెంపులు చేసుకుని, కష్టమైనా నష్టమైనా ఇశ్రాయేలీయురాలిగానే యెహోవా దేవుని భక్తురాలిగానే జీవిస్తానని నయోమీని వెంబడించిన కారణాన్ని‌ బట్టి (రూతు 1:16,17) కనికరం కలిగిన దేవుడు ఆమెపై కనికరం చూపించాడు. శాపగ్రస్త సంతానమైనా యథార్థంగా మారుమనస్సు పొందినవారిని ఆయన క్షమిస్తాడు అనడానికి ఇది మంచి నిదర్శనం. అందుకే యేసుక్రీస్తు వంశావళిలో కూడా ఆమెకు చోటు‌ దక్కింది (ఈ వంశావళి గురించి తదుపరి భాగంలో మాట్లాడతాను). ఈవిధంగా యథార్థంగా మారుమనస్సు పొందిన రూతుకు మినహా లోతు కూతుళ్ళకు పుట్టిన సంతానంలో మరెవ్వరికీ దేవుని సన్నిధిలో‌ చోటు దక్కలేదు. పైన వివరించినట్టు ఈ బహిష్కరణ లోతు కుమార్తెలు చేసిన హేయకార్యంపై దేవుని అసహ్యతను సూచిస్తుంది. ఇప్పుడు చెప్పండి లోతు కుమార్తెలు చేసినదానిని బైబిల్ ప్రోత్సహిస్తుందా? ఖండిస్తుందా?

లేవీయకాండము 18:6,24-29 మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు; నేను యెహోవాను. వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు, అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక, యీ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలొ నుండి కొట్టి వేయబడుదురు.

3. లోతు కానీ లోతు కుమార్తెలు కానీ మాకు మాదిరి కాదు. వారిని ఆదర్శంగా తీసుకుని జీవించండని బైబిల్లో ఎక్కడా బోధించబడలేదు.

4. అయితే ఈ మతోన్మాదులు "ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి" (2పేతురు 2:8) అని బైబిల్లో లోతు నీతిమంతుడిగా సంబోధించబడటాన్ని చూపించి కూతుర్లతో సెక్స్ చేసినందుకే లోతును బైబిల్ నీతిమంతుడని ప్రస్తావించినట్టు వక్రీకరిస్తారు. కానీ జరిగిన తప్పిదంలో లోతు తప్పేమీ లేదని ఇప్పటికే వివరించాను, అలా కూడా అతను నీతిమంతుడే అయినప్పటికీ బైబిల్లో "ఆ నీతిమంతుడు" అని లోతును సంబోధించిన సందర్భం పూర్తిగా వేరు. అక్కడ అతను సొదొమ గొమొఱ్ఱా పట్టణస్థుల పాపంలో పాలివాడు కాకుండా వారి పాపాలను బట్టి దినదినమూ తన మనస్సును నొచ్చుకోబట్టి నీతిమంతుడిగా సంబోధించబడ్డాడు. ఆ సందర్భం పెడుతున్నాను చూడండి.‌

2 పేతురు 2:6-8 మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.

చూసారా? "ఆ నీతిమంతుడు" అని లోతు ప్రస్తావించబడిన సందర్భం అతను సొదొమ గొమొఱ్ఱా పట్టణస్థుల పాపంలో పాలివాడు కాకుండా తన నీతిగల మనస్సును నొప్పించుకోవడానికి సంబంధించిదైతే ఈ మతోన్మాదులు దానిని కూతుర్లతో సెక్స్ చెయ్యడానికి ముడిపెడుతుంటారు. ఈ మతోన్మాదుల నీచ, వక్ర బుద్ధికి ఇదో నిదర్శనం.

హిందూ‌ మతోన్మాదుల్లారా, మీ సంగతేంటి? మీ దేవుళ్ళు మీకు మాదిరులా కాదా? వారు పాటించింది సొదొమ సంస్కృతి కాదా? మీ దేవుడైన బ్రహ్మ ఏం చేసాడో మీకు తెలియదా? తెలియకపోతే తన స్వంత కుమార్తెయైన సరస్వతిని ఆయన ఎంత కామంతో చూసాడో ఎలా గర్భవతిని చేసాడో శ్లోకాలతో సహా పెడుతున్నాను చదువుకోండి.

"మత్స్య పురాణం, 3వ అధ్యాయం, 31-44 శ్లోకాలు"

బ్రహ్మా న కించి దదృశే తన్ము ఖాలోక నాదృతః | అహో రూప మహెూ రూప మితి ప్రాహ పునః పునః తతః ప్రణామసక్తాం తు పురస్తా దవలోకయత్ |
అథ ప్రదక్షిణం చకే సా పితుర్వరవర్ణినీ.
పుత్తేభ్యో లజ్జితస్యాస్య తదూపాలోక నేచ్చయా!
ఆవిర్భూత మథో వక్తం దక్షిణం పాణ్డుగండవత్.
విస్మయస్ఫుర దోష్ఠం చ పాశ్చాత్యముదగా త్తత |
చతుర్థ మభవ త్పశ్చా తామం కామశ రాశురమ్.
తతోన్య దభపత్తస్య కామానుగతయా తదా !
ఉత్పతస్త్యా స్తదాకాశ మాలోక్యచ కుతూహలాత్
సృష్ట్యర్థం యత్కృతం తేన తపః పరమదారుణమ్ | తత్సర్వం నాశ మగమ త్స్వసుతోపగ మేచ్చయా లితతోర్ధ్వవ మభవ త్ప్యమం తస్య ధీమతః | ఆవిర్భూతం చ త త్రోవ తద్వక్ర మపరం ప్రభోః స తు తా న బ్రవీద్బహ్మా వ్యగ్రా నాతనిసమ్బవాక్ ! ప్రజా సృజధ్వం సమ్భూతా స్సదేవాసురమానుషాః ఏవ ముక్తా స్తత స్సర్వే ససృజు ర్వివిధాః ప్రజాః ।
గతేషు తేషు సృష్ట్యర్థం ప్రణమ్రవదనా మీమామ్ ఉపయే మే న విశ్వాత్మా శతరూపా మనిన్దితామ్ ।
స బభూవ తయా సార్ధ మతికామాతురో విభుః సలజ్జిం చడ మే దేవః కమలోదరమన్దిరే యావదబ్ధశ తం దివ్యం యథాన్యః ప్రాకృతో జనః కాలేన మహతా తస్య తద్వ త్పుతోభవ న్మనుః |
స్వాయమ్బువ ఇతి ఖ్యాత స్స విరాడితి నశ్శుతమ్ తద్రూపగుణసామాన్యా దధిపూరుష ఉచ్యతే |
వై రాజా యత్ర తే జాతాః ప్రభవ స్సంశితవ్రతాః స్వాయమ్భువా మహాభాగా సప్తసప్త తథాపరే॥ స్వారోచిషాద్యా స్సర్వే తే బ్రహ్మతుల్యస్వరూపిణః ఉత్తమ ప్రముఖా సద్వ దేతేషాం సప్తమోధునా

తాత్పర్యము: బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి వెంటనే కామ బాణములచే బాధనొంది ఎటువంటి సౌందర్యము అని మాటిమాటికి ఆశ్చర్యముతో పలికెను. అంతలో సరస్వతి తన తండ్రియైన బ్రహ్మ చుట్టూ తిరిగి ప్రదక్షణ చేసెను. ఆమె సౌందర్యమును చూడదలచియు తన కొడుకుల ఎదుట ఆ పని చేయుటకు సిగ్గు పడుచున్న బ్రహ్మకు వెంటనే వెలవెల పోవుచున్న చెక్కిళ్లుగల దక్షణ మొఖమును, వణుకుచున్న పెదవులుకల పశ్చిమ ముఖమును, కామపరవశమైన నాలుగవదగు ఉత్తర ముఖము కలిగెను. తన తండ్రి యొక్క కామపు చూపులనుండి తప్పించుకోవటానికి సరస్వతి ఆకాశం వైపు లేచింది, తన కూతురైన సరస్వతిని కామంతో చూస్తున్న బ్రహ్మకు తన పైభాగంలో కూడా ఐదవ తల మొలిచెను. బ్రహ్మ తన కూతురిని మోహించుట వలన తన తపశ్శక్తి నాశనమాయెను. అందువలన దేవతలను, రాక్షసులను, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులకు ఆజ్ఞాపించెను. ఆ మాట విని వారు అందరు వెళ్ళి సృష్టికి ఉపక్రమించిరి. మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్ళగానే బ్రహ్మ వినయముతో తన కాళ్ళ వద్ద వంగియున్న శతరూప(సరస్వతి)ని అనగా తన కూతురిని పెళ్ళి చేసుకొనెను. కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైన సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసెను, ఆమె గర్భము నుండి స్వయంభువ మనువు జన్మించెను.

దీని సంగతేంటి? ఈ ఆరోపణ నుండి తప్పించుకోవడానికి కామమంటే కామం కాదు, మోహమంటే మోహం కాదు వంటి కథలు‌ చెప్పకండి. మీ గ్రంథాలలోనే బ్రహ్మ చేసిన ఆ పనిని ఆక్షేపించిన ప్రస్తావనలు, మాదిరిగా తీసుకున్న సంఘటనలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి‌. "పోతన భాగవతం, 3వ స్కంధం"లో కొందరు మునులు బ్రహ్మ సరస్వతిని మోహించి వివాహం చేసుకోవడాన్ని అక్షేపిస్తూ గడ్డి పెడతారు. అక్కడ వారు బ్రహ్మను ఉద్దేశించి "కామాంధుడికి కళ్ళు కనిపించవు" అనే లోకోక్తిని కూడా ఉపయోగించారు. దానికి బ్రహ్మ కూడా సిగ్గుతో తలదించుకుంటాడు. "యముడు చెల్లెలైన యమి" తన అన్నయైన యముడిని వివాహం చేసుకోమని కోరినప్పుడు అతను నీవు నా స్వంత చెల్లెలివి కాబట్టి అలా చెయ్యకూడదని హెచ్చరిస్తే ఆమె బ్రహ్మ చేసినదానినే ప్రస్తావించి సృష్టికర్తయైన బ్రహ్మనే తన కూతురిని వివాహం చేసుకున్నప్పుడు మనం అలా చెయ్యడం ఎలా తప్పు ఔతుందని బ్రహ్మ చేసినదానిని మాదిరిగా తీసుకుని వాదిస్తుంది (ఋగ్వేదం, 10వ మండలం).  

ఇప్పుడు చెప్పండి మతోన్మాదుల్లారా, లోతు మాకు ఆదర్శం కాదని మేము సునాయసంగా చెప్పగలం‌. మీ దేవుళ్ళు మీకు ఆదర్శం కాదని మీరు ధైర్యంగా చెప్పగలరా? అలాగైతే మీ దేవుళ్ళకంటే మీరే చాలా మంచివారైయ్యుండాలి.  ఔను అన్నదే నా అభిప్రాయం.  మీరు లోతుపై ఆరోపించే అదే చెడుతనాన్ని, కాదు కాదు, అంతకంటే దారుణమైన చెడుతనాన్ని ఆచరించిన దేవుళ్ళను మీరెందుకు దేవుళ్ళుగా భావిస్తున్నారన్నది మీ మనసాక్షికి మీరే చెప్పుకోవలసిన సమాధానం.

మేమైతే మా దేవుణ్ణి బట్టి అతిశయిస్తూ ఆయన పరిశుద్ధతను బట్టి ఆయనను ఇలా కొనియాడతాం.

నిర్గమకాండము 15:11 యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు.

2. ఈ మతోన్మాదులు 1 కోరింథీ 7:36లో ఉన్న ఒక అనువాద లోపాన్ని ఆధారం చేసుకుని కూడా బైబిల్లో తండ్రీకూతుర్ల సెక్స్ అనుమతించబడిందంటూ బురద చల్లుతుంటారు. ఆ వాక్యభాగంలో ఏముందో చూద్దాం.

1 కోరింథీయులకు 7:36 అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన యెడలను, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన యెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన యెడలను, అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును.

అయితే ఆ వాక్యభాగంలో పెండ్లీడు మించిన కుమార్తెను తండ్రి వివాహమాడొచ్చని అర్థం చేసుకోవడానికి ఎలాంటి తావులేదు. ఆ మాటకొస్తే అది అసలు తండ్రి కుమార్తెలకు సంబంధించిన వాక్యమే కాదు. అదంతా "కన్య" అని అనువదించాల్సిన "పార్తెనోస్" అనే గ్రీకు పదాన్ని "కుమార్తె" అని అనువదించడం వల్ల వచ్చిన అపార్థం. ఒకవేళ గ్రీకులో "తూగటేర్" అనే పదం వాడుంటే దానికి "కుమార్తె" అనే అనువాదం సరైనదిగా ఉండేది. కానీ "కన్య" అనే భావమిచ్చే "పార్తెనోస్" అనే పదం వాడడమే కాకుండా "తండ్రి" అని భావం వచ్చే ఏ పదమూ అక్కడ వాడబడలేదు కాబట్టి దానిని తండ్రి కుమార్తెలకు సంబంధించిన వాక్యంగా చిత్రీకరించడం పూర్తిగా అనుచితమైనది.

ఇక్కడ "కన్య" అనే అర్థమిచ్చే "పార్తెనోస్" అనే పదం కూడా ఒకరి అస్కలిత స్థితిని సూచించడానికి వాడబడిందే తప్ప అది పెళ్ళి కాని స్త్రీని మాత్రమే ఉద్దేశించి చెప్పబడిన మాట కాదు.

మూలభాషలో వాడిన "పార్తెనోస్" అనే పదాన్ని మాత్రమే ఆధారం చేసుకొని ఈ నిర్ణయానికి రాలేదని పాఠకులు గమనించాలి. నిజానికి ఈ అధ్యాయపు పూర్తి సందర్భం ఈ వివరణే సరైనది అని ఋజువు చేస్తుంది. అక్కడ పౌలు వైవాహికస్థితికి, అవివాహస్థితికి మధ్య తారతమ్యాన్ని చూపిస్తూ మాట్లాడుతున్నాడని ఈ అధ్యాయం మొదటి వచనం నుండే స్పష్టం ఔతోంది. పెళ్ళి చేసుకుంటే భార్యాభర్తలు ఒకరినొకరు సంతోషపెట్టాలనే ప్రయత్నంలోనే జీవితాన్ని వెళ్ళదీసే ప్రమాదముందని, వివాహం చేసుకోనివారికి అలాంటి కట్టుబాట్లేవీ లేవు కాబట్టి ప్రభువునే వారు సంతోషపెట్టే వీలుంటుందని తారతమ్యంగా మాట్లాడుతున్నాడు (1కొరింథి 7:32-35). అయితే అలా చెప్పినంత మాత్రాన పెళ్ళి చేసుకోడం తప్పు కాదని వివరణ ఇస్తూ పెండ్లీడు నిండిన ఎవరైనా స్థిరచిత్తునిగా ఉండలేక తన కన్యత్వ (అస్కలిత) స్థితిలో కొనసాగడం యోగ్యం కాదనుకుని, వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నా అది పాపం కాదని అతను స్పష్టం చేస్తున్నాడు (1కొరింథి 11:36-37). అలా తన అవివాహస్థితిని విడిచి పెట్టుకున్నవారు బాగుగా ప్రవర్తిస్తున్నారని, అలానే స్థిరచిత్తునిగా ఉండి వివాహం అవసరం లేకుండా కొనసాగగలిగేవారు కూడా మరి బాగుగా ప్రవర్తిస్తున్నారని అక్కడ అపోస్తలుని భావం (38వ వచనం). ఈ భావం సందర్భంతో చక్కగా పొసిగి, ఆ వాక్యభాగానికి అదే అసలు భావమని స్వయం నిర్ధారిస్తుంది.

గ్రీకులో ఉన్న మూలపదాలను సరిగ్గా సందర్భ వెలుగులో అనువదిస్తే 1కొరింథీ 17:36-38 వాక్యభాగం దాదాపుగా ఇలా ఉంటుంది;

36. అయితే అస్కలిత/బ్రహ్మచర్య స్థితిలో ఉన్న ఒకనికి ఈడు మించిపోయిన యెడలను, వివాహము అవసరమనిపించి తన అస్కలిత స్థితిని విడిచిపెట్టాల్సివచ్చిన యెడలను, వివాహము చేసుకోకుండా దానిలో కొనసాగుతా యోగ్యమైనది కాదని ఒకడు తలచిన యెడలను అతడు తన ఇష్టము చొప్పున చేసుకొనవచ్చును. అందులో పాపము లేదు. అతడు పెళ్ళి చేసుకొనవచ్చును.

37. యెవడైనను తన అస్కలిత స్థితిలోనే ఉంటూ పెళ్ళి చేసుకోనవసరం లేకయుండి అతడు స్థిరచిత్తుడును, తన ఇష్ట ప్రకారము జరుప శక్తిగలవాడునై దానిని వివాహము లేకుండా కాపాడుకొనవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనిన యెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు.

38. కాబట్టి తన అస్కలిత స్థితిని పెండ్లికి అప్పగించుకొనువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెండ్లి చేసుకొననివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు.

గమనించండి: 1కొరింథీ 5వ అధ్యాయంలో తన తండ్రి భార్యతో జారత్వం చేసిన ఒకడ్ని కఠినంగా ఖండించి సంఘం నుండి వెలివెయ్యమని ఆజ్ఞాపించిన పౌలు ఇప్పుడు తండ్రీకుమార్తెలు పెళ్ళి చేసుకోవచ్చని బోధించి లేవీకాండం 20:14లో ఉన్న నియమాన్ని ఉల్లంఘించాడని, అలాంటి అనైతిక వివాహాలు చేసుకున్నవారిని (బ్రహ్మ, సరస్వతిని) దేవుళ్ళుగా భావించే మతోన్మాదులు మాత్రమే ఆరోపించగలరు. పౌలు మాత్రం అలాంటి అసాంఘిక, అనైతిక మరియు ధర్మశాస్త్రానికి విరుద్ధమైన బోధను ఎప్పుడూ ఎక్కడా చెయ్యలేదు.

3. బైబిల్లో మామాకోడళ్ళ అక్రమ సంబంధం

మతోన్మాదులు యాకోబు కుమారుడైన యూదా తన కోడలైన తామారుతో వ్యభిచరించిన సంఘటనను కూడా చూపిస్తూ (ఆదికాండము 38 వ అధ్యాయం) బైబిల్లో మామాకోడళ్ళ సెక్స్ ఉందని ఆరోపిస్తుంటారు. ఇక్కడ లోతు విషయంలో చెప్పిన మాటలే మరోసారి ఇక్కడ జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను‌. జరిగిన సంఘటనలు చారిత్రక కోణంలో రాయబడినంత మాత్రాన బైబిల్ గ్రంథం ఆ అపవిత్రతను ఆమోదిస్తున్నట్టు కాదు. బైబిల్ దానిని ఆమోదిస్తుందో లేక పాపంగా ఖండిస్తుందో తెలియాలంటే అందులోని దైవాజ్ఞలను పరిశీలించాలి. ఈ మాటలు అవసరాన్ని బట్టి మరలా మరలా ప్రస్తావిస్తూనే ఉంటాను. కాబట్టి బైబిల్ మామాకోడళ్ళు వ్యభిచరించడాన్ని ఆమోదిస్తుందో లేక పాపంగా ఖండిస్తుందో చూడండి.

లేవీయకాండము 18:15 నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.

ఈ ఆజ్ఞ ప్రకారం, మామాకోడళ్ళు వ్యభిచరించడం దేవుని దృష్టికి ఇతరులతో వ్యభిచరించినదాని కంటే మరింత హేయం, పాపం. మరలా చెబుతున్నాను, ఆయన దృష్టికి వ్యభిచరించడం పాపం (నిర్గమకాండము 20:14, హెబ్రీ 13:4) వావివరసలు తప్పి వ్యభిచరించడం మరింత పాపం. బైబిల్ దీనిని ఎంతమాత్రమూ సమర్థించదు. ఇలాంటి హేయమైన కార్యాలు చేసిన కారణంగానే బైబిల్ దేవుడు కనానీయులను నిర్మూలం చేసాడని కయీను సందర్భంలోనూ లోతు సందర్భంలోనూ జ్ఞాపకం చేసాను, ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మున్ముందు కూడా దానిని ప్రస్తావిస్తూనే ఉంటాను. ఎందుకంటే మన్మథబాణాలతో కామాంధులయ్యే దేవతల్లా రుషుల్లా కల్మష వాదనలతో నిండిపోయిన మతోన్మాదులకు ఒకసారి చెబితే అర్థం కాదు.

లేవీయకాండము 18:15-28 నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్నవారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు, అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక, యీ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను.

ఇంతకూ యూదా తెలిసే తన కోడలితో వ్యభిచరించాడా? ఆ సందర్భం చూడండి -

ఆదికాండము 38:15-19 యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె నీవు నాతో వచ్చినయెడల నాకేమి యిచ్చెదవని అడిగెను. అందుకతడు నేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె అది పంపువరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను. అతడు నేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతికఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను; ఆమె అతని వలన గర్భవతి యాయెను. అప్పుడామె లేచిపోయి తన ముసుకు తీసివేసి తన వైధవ్యవస్త్రములను వేసికొనెను.

ఈ వాక్యభాగం ప్రకారం యూదాకు తాను శయనించిన స్త్రీ తన కోడలు అని ఏమాత్రం తెలియదు. ఆమె ఎవరో వేశ్య అనుకుని అలా చేసాడు (అది కూడా అతను తన తండ్రికి వేరై కనానీయులతో సన్నిహితంగా ఉండబట్టే దేవుడు అసహ్యించుకునే అలాంటి అలవాట్లకు లోనయ్యాడు ఆదికాండము 38:1). అయితే ఆమె తన కోడలు అని తెలిసినప్పుడు ఏమంటున్నాడో ఏం చేసాడో చూడండి -

ఆదికాండము 38:25,26 ఆమెను బయటికి తీసికొని వచ్చి నప్పుడు ఆమె తన మామయొద్దకు ఆ వస్తువులను పంపి ఇవి యెవరివో ఆ మనుష్యునివలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర యీ దారము ఈ కఱ్ఱ యెవరివో దయచేసి గురుతు పట్టుమని చెప్పించెను. యూదా వాటిని గురుతు పట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక "ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరియెప్పుడును ఆమెను కూడలేదు."

ఈ వాక్యభాగం ప్రకారం యూదా తాను శయనించింది తన కోడలితోనే అని తెలుసుకుని మరి ఎప్పుడూ ఆమెతో అలా ప్రవర్తించలేదు. వాదన కోసం ఈ ఆధారాలు అన్నీ ప్రక్కనపెట్టి యూదా కావాలనే అలా చేసాడనుకున్నా యూదా మాకు మాదిరి కాదు. అలానే మా దేవుడు ఆ సంఘటనను రాయించి అలా చెయ్యకూడదని హెచ్చరిస్తున్నాడు తప్ప చెయ్యమని కాదు.

లేవీయకాండము 18:15 నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.

అయితే యూదాకు తామారు ద్వారా పుట్టిన సంతానం నుండే యేసుక్రీస్తు జన్మించాడు కదా? ఆయన‌ వంశావళిలో తామారు ప్రస్తావన కూడా చెయ్యబడింది‌ కదా అనే ఆరోపణ చేస్తే, ఔను, యేసుక్రీస్తు జన్మించింది యూదా తామారుల ద్వారా పుట్టిన పెరెసు సంతానంలోనే (మత్తయి 1:3,4). అంతమాత్రమే కాదు యేసుక్రీస్తు వంశావళిలో మోయాబీయురాలైన రూతు, వేశ్యయైన రాహాబులు కూడా మనకు కనిపిస్తారు. యేసుక్రీస్తు వచ్చింది పాపులను రక్షించడానికి కాబట్టి (మత్తయి 1:21, 1తిమోతికి 1:15), పైగా ఆయనకున్న పరిశుద్ధత ఆయన వంశావళిని బట్టి సంక్రమించింది కాదు‌ కాబట్టి, అందులో ఆయన పరిశుద్ధతకు ఎలాంటి విఘాతం లేదు. ఎలాంటి పాపినైనా రక్షించడానికి ఆయనకున్న సిద్ధమనస్సును సూచించడా‌నికే‌ ఒకప్పుడు అపవిత్రమైన జీవితాలు జీవించిన తామారు, రాహాబు, బత్షెబాల ప్రస్తావన మరియు లోతు కుమార్తెలకు తమ తండ్రి ద్వారా జన్మించిన మోయాబు జాతి రూతు ప్రస్తావన కూడా యేసుక్రీస్తు వంశావళిలో చెయ్యబడింది. లేకుంటే ఆత్మ ప్రేరేపితుడైన గ్రంథకర్త మిగిలిన స్త్రీలందరినీ ప్రక్కనపెట్టి వారి పేర్లు మాత్రమే ఎందుకు ప్రస్తావించాడు? పైన ప్రస్తావించిన మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధత ఆయన వంశావళిని బట్టి సంక్రమించిందో ఆ వంశావళిని బట్టి క్షీణించిపోయేదో కాదు. దేవుడైన ఆయన ఈ లోకంలోకి రావడానికి ఒక వంశావళి అవసరం కాబట్టి ఆయన ఆ వంశావళిని ఎన్నుకున్నాడు.

హిందూ మతోన్మాదులు యేసుక్రీస్తు పరిశుద్ధత కూడా "తపస్సు చేసుకుంటున్న ఋషులపై, దేవుళ్ళపై ఎవరో బాణం వేస్తే వెంటనే వారు ఆ తపస్సును ప్రక్కన పెట్టి స్త్రీల వెంట పరుగు తీసేంత బలహీనమైనది అనుకుంటున్నారేమో! లేదా విష్ణువును మోహినీ వేషంలో చూసి ఆమె వెంట వీర్యం కార్చుకుంటూ పరుగు తీసిన శివుడు వంటిది అనుకుంటున్నారేమో". అలా కారిన శివుడి వీర్యం వల్లే భూమిలోకి బంగారం, వెండి వచ్చిందంట, శాస్త్రవేత్తలు చెబుతున్నట్టుగా Supernova వల్ల కాదంట. ఆ దరిద్రమంతా శ్లోకాలతో పాటు పెడుతున్నాను చదువుకోండి.

"భాగవతం 8వ స్కంధము, 12వ అధ్యాయం, 25-34 శ్లోకాలు"

25. స్త్రీ ప్రేక్షణప్రతిసమీక్షణవిహ్వలాత్మాజి నాత్మనమంతిక ఉమాం స్వగణాంశ్చ వేద ॥

26. తస్యాః కరాగ్రాత తు కందుకో యథాగతో విదూరం తమనువ్రజంత్యా వాసస్ససూత్రం లఘమారుతో హరత్ భవస్య దేవస్య కిలానుపశ్యతః

27. ఏవం తాం రుచిరాపాంగీం దర్శనీయాం మనోరమామ్ । దృష్ట్వా తస్యాం మనశ్చక్రే విలజ్జంత్యాం భవః కిల ॥

28. తయాం పహృతవిజ్ఞానః తత్కృతస్మరవిహ్వలః | భవాన్యా అపి పశ్యంత్యాః గతహ్రీస్తత్పదం యయౌ |

29. సా తమాయాంతమాలోక్య వివస్త్రా వ్రీడితా భృశమ్ | నిలీయమానా వృక్షేషు హసంతీ నాన్వతిష్ఠత ॥

30. తామస్వగచ్ఛద్భగవాన్ భవః ప్రమథితేంద్రియః | కామస్య చ వశం నీతః కరేణుమివ యూథపః ॥

31. సోనుప్రజ్యాతివేగేన గృహీత్వాం నిచ్ఛతీం ప్రియమ్ | కేశబంధ ఉపానీయ బాహుభ్యాం పరిషస్వజే ॥

32. సోపగూఢా భగవతా కరిణా కరిణీ యథా ఇతస్తతః ప్రసర్పంతీ విప్రకీర్ణశిరోరుహా ఆత్మానం మోచయిత్వాంగ సురర్షభభుజాంతరాత్ ప్రాద్రవత్సా పృథుశ్రోణీ మాయా విష్ణువినిర్మితా ॥

33. తస్యాసౌ పదవీం రుద్రో విష్ణోరద్భుతకర్మణః | ప్రత్యపద్యత కామేన వైరిణీవ వినిర్ణీతః । తస్యానుధావతో రేతః చస్కందామోఘ రేతసః ॥

34. శుష్మితో యూఢపస్యేవ వాసితామనుధావతః | యత్ర యత్రాపతన్మార్గే రేతస్తస్య మహాత్మనః తాని రౌప్యస్య హేమ్మశ్చ క్షేత్రాణ్యాసన్ మహీపతే ॥

తాత్పర్యము: ఆ మోహిని కందుక క్రీడనాడుతూ ఉంటే, ఆమె చిరునవ్వు చూసి, శివుడు మోహ పరవశుడైనాడు. పైగా ఆ సుందరి తన్ను చూచినందువల్ల, తన ప్రక్కనే ఉన్న పార్వతీదేవిని, తన అనుచర గణాలనన్నిటినీ మరచి, ఆమెనే తదేక దీక్షగా చూడసాగినాడు. ఆ కందుకం (బంతి) దూరంలో పడ్డందువల్ల, దానికై పరుగులిడుతూ ఉన్న ఆ మోహిని కొంగు గాలివల్ల జారిపోయింది. అప్పుడు శంకరుడామెను తదేకంగా చూడసాగినాడు. చాలా అందమైనది. సుందరమైన చూపులు కలదియైన ఆ సుందరి, సిగ్గుతో తన్ను చూస్తూ ఉన్నందువల్ల, మహాదేవుని మనస్సు ఆమెయందు ఆసక్తమైనది. అందువల్ల అతని వివేకం నశించింది. అట్లే ఆమె భావాలవల్ల, కామాతురుడై, భార్యయైన పార్వతీదేవి ప్రక్కనేయున్నా, సిగ్గు విడిచి, ఆమె దగ్గరకు పోయినాడు. వివస్త్రయై సిగ్గుతో కుంచించుకొనిపోతూ ఉన్న ఆ మోహిని దగ్గరకు శంకరుడు పోతూ ఉంటే, ఆమె అక్కడ నిలువజాలక, చెట్ల మాటుకు పోయింది. శంకరుడు కామవశుడై, తన ఇంద్రియాలు చలించిపోయినందువల్ల, ఆడఏనుగు వెంట పడ్డ మగఏనుగు వలె ఆమె వెంట పడినాడు. అతడు వేగంగా ఆ మోహిని దగ్గరకు పోయి, ఆమె వెండ్రుకలన్నీ పట్టుకొని, తన దగ్గరకు లాగుకొని, బలవంతంగా కౌగలించుకొన్నాడు. మగయేనుగు ఆడయేనుగును పెనవేసికొన్నట్లు, మహాదేవుడా మోహినిని పెనవేసి- కొన్నందువల్ల, ఆమె తలనిటునటూ తిప్పుతూ ఉంటే. ఆమె తల వెండ్రుకలన్నీ చెదరిపోసాగినాయి. దేవతామాయవంటి ఆ మోహిని మహాదేవుని కౌగిలినుండి ఏదో ఒకవిధంగా తప్పించుకొని, పరుగెత్త సాగింది. తన శత్రువైన మన్మథునిచే జయింపబడి, మోహినీరూపంతో, అద్భుతమైన లీలలను ఆచరించే శ్రీమన్నారాయణుడు, పరుగెత్తుతూ ఉంటే, మహాదేవుడు ఆమె వెంట పడ్డాడు. పుష్పవతియైన ఆడయేనుగువెంట, మదించిన మహాగజము పడ్డట్లు, మోహినివెంట పరుగెత్తుచున్న మహాదేవునికి, వెంటనే రేతఃస్ఖలనమైనది. "మహాత్ముడైన శంకరుని వీర్యము భూమిపై ఎక్కడెక్కడ జారి పడిపోయిందో, అక్కడ వెండి, బంగారు గనులేర్పడ్డాయి". ఆ మోహిని వెంట మహాదేవుడు, నదులు, సరస్సులు, పర్వతాలు, అడవులు, తోటలు, తపస్సు చేసికొనే మహర్షుల ఆశ్రమాలు మొదలైన స్థలాలెన్నో తిరిగినాడు.

కానీ యేసుక్రీస్తు పరిశుద్ధుడు అన్నప్పుడు ఆయనను ఏదీ అపవిత్రపరచలేదని భావం. అందుకే ఆయన ఇలా సవాల్ విసిరాడు :

యోహాను 8:46 నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? 

హెబ్రీయులకు 7:26 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు (లేక, తగినవాడు).

4. బైబిల్లో తల్లీకొడుకుల అక్రమ సంబంధం

మతోన్మాదులు యాకోబు పెద్దకుమారుడైన రూబేను అతని‌ పినతల్లియైన (యాకోబు ఉపపత్ని) బిల్హాతో చేసిన హేయకార్యాన్ని చూపించి బైబిల్లో తల్లీ కొడుకుల సెక్స్ ఉందంటూ బురద చల్లుతుంటారు. ఆ సందర్భం చూడండి -

ఆదికాండము 35:22 ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.

లోతు సందర్భంలోనూ యూదా సందర్భంలోనూ ప్రస్తావించినట్టు ఇది‌ చారిత్రక కోణంలో రాయబడిన సంఘటనే తప్ప తల్లీ‌కొడుకుల వ్యభిచారానికి అనుమతిగా రాయబడింది కాదు. రూబేను, బిల్హాలు చేసిన వ్యభిచారాన్ని బైబిల్ హేయమైనదిగా ఖండిస్తుంది.

లేవీయకాండము 18:7,8 నీ తండ్రికి మానాచ్ఛాదనముగానున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ తండ్రిదే.

ద్వితియోపదేశకాండము 22:30 ఎవడును తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు, తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు.

ద్వితియోపదేశకాండము 27:20 తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

బైబిల్ రూబేను చేసిన పనిని ఖండిస్తుందనీ మనం అలా చెయ్యకూడదని హెచ్చరిస్తుందనీ చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి? మతోన్మాదులకు మాత్రం ఇవేం అవసరం లేదు. చరిత్రలో జరిగిన సంఘటనల గురించి రాయబడితే చాలు, ఇక ఆ గ్రంథం దానిని అనుమతిస్తున్నట్టే ఆధారం వారికి. నేను కూడా అదే వాదన తీసుకుంటే హిందూ గ్రంథాలలో రాక్షసుల గురించి రాయబడింది. మరి హిందూ గ్రంథాలు రాక్షస గ్రంథాలా? రావణుడు సీతను ఎత్తుకుపోయిన సంఘటన గురించి రామాయణంలో రాయబడింది, అంటే రామాయణం స్త్రీలను అపహరించడాన్ని ప్రోత్సహిస్తుందా?

ఇక రూబేను దగ్గరకు వస్తే అతను చేసింది అత్యంత నీచమైన కార్యం అని పై లేఖనాల్లో మనం చూసాం. అందుకే యాకోబు తన మరణసమయంలో దానిని జ్ఞాపకం చేసుకుంటూ అతన్ని శపించాడు, అతని జ్యేష్టత్వపు హక్కును తొలగించాడు (ఆదికాండము 49:3,4, 1 దినవృత్తాంతములు 5:1). మరోసారి చెబుతున్నాను - రూబేను మాకు మాదిరి కాదు, మేము‌ అతను‌ చేసిన పనిని‌ బట్టి అలా‌ చెయ్యకూడదని‌ నేర్చుకుంటామే తప్ప అలా చెయ్యాలని కాదు. కానీ మీ దేవుళ్ళ సంగతేంటి? మీ దేవుళ్ళు మీకు మాదిరి కాదా మరి? "మీ దేవతయైన ఆదిపరాశక్తి మొదట బ్రహ్మను సృష్టించి తనతో శయనించమని (వివాహం చేసుకోమని) అడుగుతుంది, కానీ బ్రహ్మ తనను సృష్టించిన తల్లితో శయనించడానికి నిరాకరిస్తాడు.‌ వెంటనే ఆమెకు కోపం వచ్చి అతణ్ణి భస్మం చేస్తుంది. తర్వాత మరలా విష్ణువును సృష్టించి, అతనితో కూడా అదే కామకోరికను వెళ్ళబుచ్చుతుంది. కానీ అతను కూడా నిరాకరించడంతో బ్రహ్మను చేసినట్టే భస్మం చేసేస్తుంది. చివరిగా శివుణ్ణి సృష్టించి తన కోరికను తెలిపినప్పుడు శివుడు కాస్త తెలివిగా ఆలోచిస్తాడు, భస్మం చెయ్యబడిన బ్రహ్మ విష్ణువులను కూడా బ్రతికించమంటాడు. మీరు ప్రేమోన్మాదుల గురించి వినుంటారు, ఆదిపరాశక్తిది కామోన్మాదం కాదా? అది కూడా స్వంత కొడుకుల‌ పట్ల. ఈ కథకు ఆధారం హిందువులు గొప్ప స్వామీజీగా గౌరవించే దయానంద సరస్వతిగారి మాటల్లోనే పెడుతున్నాను చూడండి-

"సత్యార్ధప్రకాశము, 11వ అధ్యాయం, 321 పేజీ"

దేవీభాగవత గుణదోష నిరూపణ: దేవీభాగవతాన్ని చూడండి. అందు 'శ్రీ' అనుపేరు గల ఒక స్త్రీ దేవిగాను, శ్రీపురానికి స్వామిని గాను వ్రాసినారు. ఆమెయే సమస్త జగత్తును రచించినదని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కూడా ఆమెయే సృజించినదనీ వ్రాయబడింది. ఆ దేవికి కోరిక కలుగ ఆమె తన హస్తాన్ని నేలకు రుద్దింది. దానితో ఆమె హస్తంలో ఒక బొబ్బ పుట్టింది. దాని నుండి బ్రహ్మ జనించాడు. అతనితో దేవి "నీవు నన్ను వివాహమాడు" మన్నది. అందుకు బ్రహ్మ "నీవు నా తల్లివి, నిన్ను వివాహమాడలేను" అనగా అదివిన్న ఆ తల్లికి చాలా కోపం వచ్చింది. అతన్ని భస్మం చేసింది. మళ్ళీ మరొకసారి హస్తాన్ని నలిపి అదేవిధంగా రెండవ వానిని పుట్టించింది. అతనికి విష్ణువను నామం పెట్టింది. మరల అతనితో కూడా అదే రీతిగా పలికింది. దానికి అతడు అంగీకరించనందున అతనిని కూడా భస్మం చేసింది. తర్వాత అదే విధంగా మూడవ వానిని పుట్టించింది. అతనికి మహాదేవుడని పేరు పెట్టింది. అతనితో “నీవు నన్ను వివాహమాడు' మన్నది. అందుకు ఆ మహాదేవుడు "నేను నిన్ను వివాహమాడలేను. నీవు మరొ స్త్రీ దేహాన్ని ధరించు” అనగా దేవి అలానే చేసింది. అప్పుడు మహాదేవుడు "ఈ రెండు బూడిద కుప్పలలో ఉన్నదేమిటని ప్రశ్నించాడు. ఈ రెండు బూడిదకుప్పలు నీ సోదరులు. వీరు నా ఆజ్ఞను విననందుకు భస్మం చేసానని దేవి సమాధానం ఇచ్చింది. ఇది విని మహాదేవుడు "అలాగైతే నేనొక్కడను సృష్టి కార్యాలనెలా చేస్తాను? వీరిద్దరినీ బ్రతికించండి. ఇద్దరి స్త్రీలను కూడ సృజించండి. అప్పుడు మా ముగ్గురి వివాహాలు మీ ముగ్గురి స్త్రీలతో జరుగుతాయి” అనగా దేవి అలాగే చేస్తుంది. ముగ్గురితో వివాహాలు అయ్యాయి.

ఆహాహా! తల్లిని వివాహమాడలేదు. కాని సోదరిని వివాహమాడాడు. ఇది సరియైనదా? పాఠకులు ఊహింతురుగాక! ఆ తర్వాత ఇంద్రాదులను పుట్టించెను. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు మరియు ఇంద్రుడు ఈమె పల్లకిని మోయు బోయవాండ్రను సృజించారు. ఇలాంటి వ్యర్థపు మాటలు సుదీర్ఘంగా విస్తృతంగా తమ ఇష్టానుసారంగా వ్రాసారు. ఆ వ్రాసిన వారిని "ఆ దేవి శరీరాన్ని, ఆ శ్రీపురాన్ని సృజించిన వారెవరు? మరియు ఆ దేవి తల్లిదండ్రులెవరు?" అని ఎవరైనా ప్రశ్నించిన వారు “మీరు ఏదైనా అనండి దేవి అనాది" అని అంటారు. అలాగైతే సంయోగజన్య వస్తుత్వము ఎన్నడూ అనాది కాలేదు. తల్లిని కొడుకు వివాహమాడటానికి జంకిన, అన్న చెల్లెలిని వివాహమాడటంలో కలిగే మేలేమిటి?

గమనించండి: ఈ సన్నివేశం ప్రస్తుతమున్న దేవీభాగవతంలో మనకు కనిపించదు. కానీ దయానంద సరస్వతి గారు దీనిని ప్రస్తావించారంటే అతని సమయానికి (19వ శతాబ్దం) ఇది కచ్చితంగా ఉండుండాలి. లేకుంటే తన స్వంత మతగ్రంథంలో లేనిది కల్పించి మరీ ఆరోపణ చెయ్యాల్సిన అవసరం ఆయనకేంటి. కాబట్టి తర్వాత కాలంలో దీనిని తొలగించివేసారు. ఈ మతోన్మాదులు తమ గ్రంథాల్లో ఇబ్బందికరంగా ఉన్నవాటిని తొలగించే పనిలో ఉంటారు అనడానికి ఇదో మంచి నిదర్శనం. కొంతకాలం పోతే వీరు తమ గ్రంథాల నుండి వారి దేవుళ్ళ గురించి ఈ పుస్తకంలో నేను ప్రస్తావించిన అశ్లీలతను కూడా తొలగించెయ్యొచ్చు

5. బైబిల్లో అత్తాఅల్లుళ్ళ అక్రమ సంబంధం

హిందూ మతోన్మాదులు మోషే తల్లితండ్రులైన అమ్రాము యోకెబెదుల వివాహాన్ని ప్రస్తావిస్తూ అమ్రాముకు యోకెబెదు మేనత్త ఔతుందని, దీనిప్రకారం బైబిల్లో అత్తాఅల్లుళ్ళ సెక్స్ కూడా ఉందని బురద చల్లుతుంటారు.

నిర్గమకాండము 6:20 అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

ఈ వాక్యభాగంలో మతోన్మాదులు ఆరోపిస్తున్నట్టుగానే అమ్రాముకు యోకెబెదు మేనత్త అని రాయబడింది. కానీ అసలు విషయం ఏంటంటే అమ్రాము తాతయైన లేవీకి అసలు కుమార్తెలే లేరు. ఈ వాక్యభాగాలు చూడండి -

నిర్గమకాండము 6:16,18 లేవీ కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవీ నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను. కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.

ఆదికాండము 46:11 లేవీ కుమారులైన గెర్షోను కహాతు మెరారి.

లేవీకి ముగ్గురూ కొడుకులే, కూతుళ్ళు లేరు. కూతుళ్ళు లేనప్పుడు అమ్రాముకి మేనత్త ఎక్కడి నుండి వచ్చింది? అలాగే వేరొక సందర్భంలో కూడా అమ్రాము లేవీ కుమార్తెను వివాహం చేసుకున్నాడని రాయబడింది.

నిర్గమకాండము 2:1 లేవీ వంశస్థుడొకడు వెళ్లి లేవీ కుమార్తెను వివాహము చేసికొనెను.

దీనికి సమాధానం ఏంటి అంటే అమ్రాము వివాహం చేసుకుంది తన స్వంత మేనత్తను కాదు. తెలుగు బైబిల్లో మేనత్త అని తప్పుగా తర్జుమా చేసారు. ఇంగ్లీష్ బైబిల్లో Father's sister అని‌ మాత్రమే ఉంటుంది. హెబ్రీయుల విషయంలో Father's sister, Father's daughter అని ఉన్న ప్రతీసందర్భంలోనూ వారు తండ్రియొక్క స్వంత సహోదరీలు, తండ్రియొక్క స్వంత కూతుళ్ళు అని భావం కాదు. హెబ్రీయులు తమ తండ్రి సహోదరుల సంతానానికి చెందినవారిని కూడా తమ తండ్రి పేరుతోనే సంబోధిస్తారు. ఈ విషయం నేను అబ్రాహాము విషయంలో కూడా తెలియచేసాను. ఈ ప్రకారంగా అమ్రాము వివాహం చేసుకుంది తన స్వంత మేనత్తను కాదు. ఆమె లేవీ సహోదరుల సంతానానికి చెందిన స్త్రీ మాత్రమే. లేవీకి అసలు కుమార్తెలే లేరు.

వాదన కోసం అమ్రాము మేనత్తనే వివాహం చేసుకున్నాడు అనుకున్నప్పటికీ అమ్రాము, యోకెబెదులు మనుషులు, వారు తప్పు చేస్తే చేసుంటారు. కానీ మాకు దేవుడు ఏం చెబుతున్నాడు అనేదే ప్రామాణికం. దేవుడు దానిని ఆమోదించాడా లేక ఖండించాడా అనేదే అసలు విషయం. మేనత్తలను వివాహం చేసుకోవడం గురించి మా దేవుడు ఏం చెబుతున్నాడో చూడండి -

లేవీయకాండము 18:12 నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.

ఈ వాక్యభాగం ప్రకారం స్వంత మేనత్తలను వివాహం చేసుకోవడం బైబిల్ దేవుని దృష్టికి హేయమైన పాపం. అది సరే కానీ మీ హిందువులు చాలా పవిత్రమైనవిగా చేసుకుంటున్న మేనరికపు వివాహాల సంగతేంటి? బైబిల్ ప్రకారం మేనమామను వివాహం చేసుకోవడం పాపం‌ మరి.

లేవీయకాండము 18:13 నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.

ఈ వాక్యభాగంలో నీ తల్లి సహోదరిని వివాహం చేసుకోకూడదు అన్నది పురుషుల వైపునుండి చెప్పబడితే ఇవే మాటలు స్త్రీల వైపునుండి నీ తల్లి సహోదరుణ్ణి (మేనమామను) చేసుకోకూడదని చెప్పబడుతున్నాయి. ఈ వివాహాల కారణంగా పుట్టబోయే పిల్లలకు అంగవైకల్యాలు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రీయంగా కూడా రుజువు చెయ్యబడింది. మరి మీరు అశాస్త్రీయమైన, హేయమైన ఆ వివాహాలను ఎందుకు సమర్థిస్తున్నారు? మీరు మాత్రం బైబిలుకూ సైన్సుకూ వ్యతిరేకంగా వివాహాలను చేసుకోవచ్చు, బైబిల్ సంస్కృతిని పాటించేవారు మాత్రం ఆ సంస్కృతిలో ఆమోదించబడిన వరుసవారిని వివాహాలు చేసుకుంటే మీకు అభ్యంతరమా? మేనమామ కూతుళ్ళనూ మేనత్త కూతుళ్లనూ వివాహం చేసుకుంటే చాలా పవిత్రం, పెదనాన్న పెద్దమ్మ కూతుళ్లను, బాబాయి పిన్నిల కూతుళ్లను‌ వివాహం చేసుకుంటే అపవిత్రమా? ఇలా నిర్ణయించడానికి మీకున్న కొలమానం ఏంటి? ఇంతకూ‌‌ మీరు పూజించే దేవుళ్ళైనా మీ వరసల ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకున్నారా? బ్రహ్మసరస్వతుల గురించీ ఆదిపరాశక్తి గురించీ యముడి చెల్లి గురించీ ఇప్పటికే వివరించాను కదా! నేను బౌద్ధ రామాయణాన్ని పరిగణలోకి తీసుకుంటే మీ రాముడికి సీత ఏమౌద్దో కూడా వివరించగలను. కానీ మీరు దానిని ప్రామాణికంగా తీసుకోరు కాబట్టి నా నిజాయితీ వల్ల ఆ వాదనను విడిచిపెట్టాను.

6. దావీదు బత్షెబా పాపం

హిందూ మతోన్మాదులు రాజైన దావీదు ఊరియా భార్యయైన బత్షెబాతో వ్యభిచరించిన సంఘటనను ఎత్తిచూపుతూ బైబిల్ పై బురద చల్లుతుంటారు. దావీదు బత్షెబాతో వ్యభిచరించడం ఎవరికి తెలియని విషయం? దాదాపుగా అందరు సేవకులూ ఆ ఉదంతాన్ని ప్రస్తావించి, అంతటి భక్తుడైన దావీదే పాపంలో పడిపోతే మనం ఇంకా పడిపోయే అవకాశం ఉందని, కాబట్టి మనం మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేస్తుంటారు. దేవాది దేవుడు ఆ సంఘటనను అంత వివరంగా రాయించింది కూడా అందుకే (2 సమూయేలు 12:14). ఈ విషయంలో బైబిల్ పైన కానీ బైబిల్ దేవునిపై కానీ బురద చల్లే అవకాశం మతోన్మాదులకు ఎక్కడిది? దావీదు అలా చేసినంత‌ మాత్రాన బైబిల్ దానిని సమర్థిస్తుందా లేదా అనేది కదా అసలు విషయం. పరాయి పురుషుల భార్యలతో వ్యభిచరించడాన్ని, దానికి అంగీకరించడాన్ని బైబిల్ ఎలా, ఎంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తుందో చూడండి -

లేవీయకాండము 20:10 పరుని భార్యతో వ్యభిచరించినవానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.

ఈ న్యాయవిధి ప్రకారం, ఎవరైనా పరాయి పురుషుడి భార్యతో వ్యభిచరిస్తే వారిద్దరికీ మరణశిక్ష విధించాలి. రాజుగా ఆ శిక్షలను అమలు చెయ్యవలసిన దావీదే అలాంటి పని చేసినప్పుడు దానికి దేవుడు కూడా ఎలా స్పందించాడో చూడండి -

2 సమూయేలు 11:27 అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.

ఈ వాక్యభాగం ప్రకారం దావీదు చేసింది బైబిల్ దేవుడైన యెహోవా దృష్టికి దుష్కార్యం. అందుకే ఆయన ఆ దావీదు యొద్దకు నాతానును పంపించి "ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి" (2 సమూయేలు 12:14) అని నిందించాడు. అందుకు రాబోయే శిక్షేంటో కూడా ప్రకటించాడు (ఆ శిక్షలపై వస్తున్న ఆరోపణ గురించి మరలా మాట్లాడతాను). ఇలా బైబిల్ గ్రంథం దావీదు చేసినపనిని చెడ్డదిగా ఖండిస్తున్నప్పుడు, బైబిల్ దేవుడు ఆ విషయంలో దావీదుకు శిక్ష విధించినప్పుడు, మతోన్మాదులు మరలా మరలా ఆ సందర్భాన్ని ప్రస్తావించి బైబిల్ పై బైబిల్ దేవునిపై బురద చల్లడమేంటి? ఓహో, ఒకవేళ బైబిల్ మరియు బైబిల్ దేవుడు దావీదు చేసినపనిని మెచ్చుకుని ఉంటే వీరికి మంచిగా అనిపించేదేమో. ఎందుకంటే వీరి దేవుళ్ళు చేసింది అదే కదా! కృష్ణుడు పరాయి పురుషుల భార్యలతో వ్యభిచరించలేదా? (పోతన భాగవతం, 10వ స్కంధం, రాసలీలాపర్వం మరియు జలక్రీడాపర్వం). మళ్ళీ ఆ పాడుపనులకు "అగ్ని సమస్తమునూ దహించి దోషి కానట్టే క్రిష్ణుడు పరాయి పురుషుల భార్యలతో వ్యభిచరించినా దోషి, అపవిత్రుడు కాడని" ముని సమర్థింపు ఒకటి. ఏ జన్మలోనో వారికి వరం ఇచ్చాడని ఈ జన్మలో వారు చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు చేసుకుంటుంటే మాయ చేసి మరీ వారితో వ్యభిచారిస్తాడా? అసలు అలాంటి నీచమైన వరాన్ని ఎందుకు ఇవ్వాలి? ప్రధానంగా శివుడు రుషుల భార్యలతో వ్యభిచరించి వారి శాపం వల్ల పురుషాంగాన్ని పోగొట్టుకోలేదా? శ్లోకాలతో సహా పెడుతున్నాను చదువుకోండి.

"శివ పురాణం, కోటిరుద్ర సంహిత, 12వ అధ్యాయం, 1-52 శ్లోకాలు"

కల్ప భేద కథా చైవ శ్రుతా వ్యాసాన్మయా ద్విజాః । తామేవ కథయామ్యద్య శ్రూయతామృషిసత్తమాః ॥ పురా దారువనే జాతం యద్వృత్తం తు ద్విజన్మనామ్ | తదేవ శ్రూయతాం సమ్యక్ కథయామి యథాశ్రుతమ్॥ దారునామ వనం శ్రేష్ఠం తత్రా సన్నృషిసత్తమాః । శివభక్తాస్సదా నిత్యం శివధ్యానపరాయణాః॥ త్రికాలం శివపూజాం చ కుర్వంతి స్మ నిరంతరమ్ | నానా విధైః స్తవైర్దివ్యైస్తుష్టువుస్తే మునీశ్వరాః ॥ తే కదాచిద్వనే యాతా సృమిధాహరణాయ చ | సర్వే ద్విజర్షభాశ్మైవాళ్ళివధ్యాన పరాయణాః ॥ ఏతస్మిన్నంతరే సాక్షాచ్ఛంకరో నీలలోహితః । విరూపం చ సమాస్థాయ పరీక్షార్థం సమాగతః ॥ దిగంబరో తితేజస్వీ భూతిభూషణ భూషితః । స చేష్టామ కరో ద్దుష్టాం హస్తే లింగం విధారయన్ ॥ మనసా చ ప్రియం తేషాం కర్తుం వై వనవాసినామ్ ।
జగామ తద్వనం ప్రీత్యా భక్తప్రీతో హరస్వయమ్ ॥ తం దృష్ట్వా ఋషిపత్యస్తాః పరం త్రాసముపాగతాః । విహ్వలా విస్మితాశ్చాన్యాస్సమాజగ్ముస్తథా పునః ॥ ఆలిలింగుస్తథా చాన్యా కరం ధృత్వా తథాపరాః, పరస్పరం తు సంఘరాత్సంమగాస్తా స్త్రీ యస్తదా ॥ ఏతస్మిన్నేవ సమయే ఋషివర్యాస్సమాగమన్ | విరుద్ధం తం చ తే దృష్ట్వా దుఃఖితాః క్రోధమూర్చితాః ॥ తదా దుఃఖమను ప్రాప్తాః కోయం కోయం తథా బ్రువన్ | సమస్తా ఋషయస్తే వై శివమాయా విమోహితాః ॥ యదా చ నోక్తవాన్ కించిత్సోవధూతో దిగంబరః | ఊచుస్తం పురుషం భీమం తదా తే పరమరయః ॥ త్వయా విరుద్ధం క్రియతే వేదమార్గవిలోపి యత్ | తతస్త్వదీయం తల్లింగం పతతాం పృథివీతలే ॥ ఇత్యుక్తే తు తదా తైశ్చ లింగం చ పతితం క్షణాత్ | అవధూతస్య తస్యాశు శివస్యాద్భుతరూపిణః ॥ తల్లింగం చాగ్నివత్సర్వం యద్దదాహ పురస్థితమ్ | యత్ర యత్ర చ తద్యాతి తత్ర తత్ర దహేత్పునః ॥ పాతాలే చ గతం తచ్చ స్వర్గే చాపీ తథైవ చ | భూమౌ సర్వత్ర తద్యాతం న కుత్రాపి స్థిరం హి తత్ ॥ లోకాశ్చ వ్యాకులా జాతా ఋషయస్తేతిదుఃఖితాః | న శర్మ లేభిరే కే చిద్దేవాశ్చ ఋషయస్తథా ॥ న జ్ఞాతస్తు శివో యోస్తు తే సర్వే చ సురర్షయః | దుఃఖితా మిలితాశ్ళీ ఘ్రం బ్రహ్మాణం శరణం యయుః ॥ తత్ర గత్వా చ తే సర్వే సత్వా స్తుత్వా వీధిం ద్విజాః । తత్సర్వమవదన్ వృత్తం బ్రహ్మణే సృష్టికారిణే ॥ బ్రహ్మ తద్వచనం శ్రుత్వా శివమాయా విమోహితాన్ । జ్ఞాత్వా తాన్ శంకరం నత్వా ప్రోవాచ ఋషిసత్తమామ్ ॥
మహేశ్వర ఉవాచ !

హే దేవా ఋషయస్సర్వే మద్వచశ్శృణుతాదరాత్ । యోనిరూపేణ మల్లింగం ధృతం చేత్ స్యాత్తదా సుఖమ్ । పార్వతీం చ వినా నాన్యా లింగం ధారయితుం క్షమా | తయా ధృతం చ మల్లింగం ద్రుతం శాంతిం గమిష్యతి ॥ సూత ఉవాచ !

తచ్భుత్వా ఋషిభిర్దే వై స్సు ప్రసన్నైర్మునీశ్వరాః । గృహీత్వా చైవ బ్రహ్మాణం గిరిజా ప్రార్థితా తదా ॥ ప్రసన్నాం గిరిజాం కృత్వా వృషభధ్వజమేవ చ | పూర్వోక్తం చ విధిం కృత్వా స్థాపితం లింగముత్తమమ్ ॥ మంత్రోక్తేన విధానేన దేవాశ్చ ఋషయస్తథా। చక్రుః ప్రసన్నాం గిరిజాం శివం చ ధర్మహేతవే ॥ సమానర్చుర్విశేషేణ సర్వే దేవర్షయశ్శివమ్ । బ్రహ్మా విష్ణుః పరే చైవ త్రైలోక్యం సచరాచరమ్ ॥ సుప్రసన్నశ్శివో జాతశ్శివా చ జగదంబికా | ధృతం తయా చ తల్లింగం తేన రూపేణ వై తదా ॥ లోకానాం స్థాపితే లింగే కల్యాణం చాభవత్తదా । ప్రసిద్ధం చైవ తల్లింగం త్రైలో క్యామ భవద్ద్విజాః ॥ హాటకేశమితి ఖ్యాతం తచ్ఛివాశివమిత్యపి । పూజనాత్తస్య లో కానాం సుఖం భవతి సర్వథా ॥ ఇహ సర్వసమృద్ధి స్స్యాన్నానాసుఖవహాధికా। పరత్ర పరమా ముక్తిరాత్ర కార్యా విచారణా ॥

తాత్పర్యము: దారువనంలో కొంతమంది శివ భక్తులైన ఋషులు నివసించేవారు. యజ్ఞం కోసం కట్టెలు తేవడానికి ఋషులు అడవికి వెళ్లారు. ఋషులు లేని సమయంలో ఒంటరిగా ఉన్న ఋషుల యొక్క భార్యల వద్దకు శివుడు నగ్నంగా ఒంటినిండా బూడిద పూసుకుని వచ్చాడు. శివుడు తన పురుషాంగాన్ని చేత్తో పట్టుకొని వికృత చేష్టలు చేస్తూ ఉన్నాడు. అది చూసి ఋషుల యొక్క భార్యలు కొంత మంది భయపడ్డారు. కొంత మంది శివుడి వద్దకు వెళ్లి వాటేసుకున్నారు, మరి కొంత మంది శివుడి చేతులు పట్టుకొని సరస సల్లాపాలు ఆడుతున్నారు.

ఋషులు ఇంటికి వచ్చే సరికి వారియొక్క భార్యలు నగ్నముగా ఉన్న శివుణ్ణి కౌగిలించుకొని శృంగార చేష్టలలో మునిగి తేలుతున్నారు. అది చూసి కోపించిన ఋషులు శివుడి యొక్క పురుషాంగం తెగిపడునుగాక అని శపించారు. వెంటనే శివుడి యొక్క పురుషాంగం తెగి నేల మీద పడింది. తెగి పడిన శివుడి పురుషాంగం స్థిరంగా ఉండకుండా ముల్లోకాలను అగ్నితో దహించి వేస్తుంది. అది చూసి ఋషులు శివుణ్ణి శరణు వేడారు. వెంటనే శివుడు తన పురుషాంగం స్థిరంగా ఉండాలి అంటే పార్వతి యొక్క యోనిలో ఉంచితే మాత్రమే స్థిరంగా ఉంటుంది కనుక పార్వతి వద్దకు వెళ్ళండి అని చెప్పాడు. ఋషులు పార్వతి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పారు వెంటనే పార్వతి శివుడి యొక్క పురుషాంగాన్ని తన యోనిలో ధరించింది.

మతోన్మాదుల్లారా, ఈ అవమానం నుండి తప్పించుకోవడానికి లింగం అంటే లింగం కాదు, అది చేతిలో రాయి, గూటిలో గుడ్డు అని అబద్ధాలు చెప్పకండి, ఈ సందర్భాన్ని చదివిన ఎవరికైనా రుషుల శాపంతో ఊడిపడిందీ పార్వతి తన యోనిలో ధరించుకున్నదీ శివుడి పురుషాంగమే అని స్పష్టంగా అర్థమైపోతుంది. దానికి మీ మిగిలిన గ్రంథాలు కూడా సాక్ష్యమిస్తున్నాయి. కానీ నా వ్యాసంలో మరీ ఎక్కువ చండాలాన్ని చేర్చలేక వాటిని దాటవేస్తున్నాను.

గుర్తుంచుకోండి, దావీదు ఎంత గొప్ప భక్తుడైనప్పటికీ అతను కూడా ఒక మనిషి. అందరు మనుషుల్లానే అతనూ ఊరియా భార్య‌ విషయంలో పాపానికి లోనయ్యాడు. మా దేవుడు దానిని ఖండించాడు. శిక్ష విధించాడు. ఈ విషయంలో బైబిల్ కు కానీ బైబిల్ దేవుని పరిశుద్ధతకు కానీ ఎలాంటి విఘాతం కలగనేరదు.

"మరి దావీదుకు మరణశిక్ష ఎందుకు విధించలేదు?"

కొందరు మతోన్మాదులు ఇలా కూడా ప్రశ్నిస్తుంటారు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచరించినవారికి మరణశిక్ష విధించాలిగా (లేవీయకాండము 20:10) అనేది వారి అభ్యంతరం. దీనికి సమాధానం చెప్పేముందు అదే కొలమానాన్ని నేను కూడా తీసుకుని వారిని ప్రశ్నిస్తున్నాను. "మనుస్మృతి 11వ అధ్యాయం, 103,104 శ్లోకాలు, యజ్ఞవల్క్య స్మృతి 3వ అధ్యాయం, 259 శ్లోకం, విష్ణు ధర్మోత్తర పురాణము 73వ అధ్యాయం, 105-112 శ్లోకాలు, కూర్మ మహాపురాణము 32వ అధ్యాయం, 11-13 శ్లోకాలు, అగ్నిపురాణం 169వ అధ్యాయం, 22వ శ్లోకం, మహాభారతము 165వ అధ్యాయం, 49,50 శ్లోకాల" ప్రకారం, రుషుల (గురువుల) భార్యలతో వ్యభిచారం చేసినవారు తమ మర్మాంగాలను కోసుకుని దోసిలిలో పెట్టుకుని రక్తస్రావమై చనిపోయేంతవరకూ నడుచుకుంటూ పోవాలి. మరి రుషుల (గురువుల) భార్యలైయ్యుండి అలాంటి పాడుపని చేసిన ఆ భార్యలకు శిక్షేంటి? వ్యభిచారం అనేది ఇరువురి సమ్మతితోనూ జరిగే పాపం అయినప్పుడు ఇద్దరినీ సమానంగా అనగా అదే తరహాలో శిక్షించాలిగా? హిందూ గ్రంథాల్లో అలా ఎందుకు రాయబడలేదు. మాకైతే ఆ సమస్య లేదు. మా ధర్మశాస్త్రం వ్యభిచరించిన ఇద్దరినీ సమానంగా శిక్షిస్తుంది (లేవీయకాండము 20:10).

ఇక దావీదు విషయానికి వస్తే అక్కడ స్వయంగా దేవుడే కలుగచేసుకున్నాడు (2 సమూయేలు 12). అందుకే ఆయన మిగిలిన వ్యభిచారులకు నియమించినట్టు అతనికి మరణశిక్షను విధించలేదు. చట్టాలను అమలు చెయ్యవలసిన రాజు స్థానంలో ఉండి అతనే అలాంటి పని చేసినందుకు మరణంకంటే ఎక్కువ బాధను అనుభవించాలనే దేవుడు ఆవిధంగా చేసాడు. ఉదాహరణకు, హేబెలు హత్య విషయంలో కూడా ఆయన కయీను ప్రాణం తియ్యకుండా మరణం కంటే ఎక్కువ శిక్షను విధించినట్టు గమనిస్తాం. అందుకే కయీను ఆ శిక్షను బట్టి "అందుకు కయీను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది" (ఆదికాండము 4:13) అని విలపించాడు. దేవుని శిక్ష మరణమే కాదు కొన్నిసార్లు ఆ మరణం కంటే భయంకరంగా ఉంటుంది. దావీదు తన జీవితంలో మరణం కంటే ఎక్కువగా ఎలాంటి బాధను అనుభవించాడో ఒక ఉదాహరణకు ఈ మాటలు చూడండి -

2 సమూయేలు 18:33 అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి యేడ్చుచు, సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, "నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును" నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను.

తండ్రి స్థానంలో ఉన్నవాడికి తన కుమారుడు తన కళ్ళముందే చనిపోతే అది మరణం కంటే ఎక్కువ బాధను కలిగిస్తుందో లేదో అందరికీ బాగా తెలుసు. దావీదే కాదు అతనితో వ్యభిచరించిన బత్షెబా కూడా పుత్రశోకానికి గురై ఆ శిక్షను భరించింది (2సమూయేలు 12:16).

7. బైబిల్ దేవుడు సౌలు భార్యలను దావీదు కౌగిట్లో చేర్చాడా?

2 సమూయేలు 12:7,8 "నాతాను దావీదును చూచి-ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా- ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదావారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును."

ఈ సందర్భంలో దేవుడు దావీదుతో (నాతాను ద్వారా) "నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదావారిని నీకప్పగించితిని" అని పలకడం మనం చూస్తాం. మతోన్మాదులు ఈ మాటలను వక్రీకరించి, బైబిల్ దేవుడు సౌలు భార్యలను దావీదు కౌగిట్లో చేర్చాడని, అంటే ఆయ‌న ఒకరి భార్యలను ఇంకొకరికి అప్పగించేవాడని అపహాస్యం చేస్తుంటారు. జూదంలో భార్యను తాకట్టు పెట్టి తీరా అందులో ఓడిపోయాక ఆ భార్యను గెలిచినవాడికి అప్పగించే కథలు చదివీ చదివీ వీరికి అలా అర్థమయ్యింది పాపం (మహాభారతం, సభాపర్వం).

అయితే దావీదు విషయంలో "నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి.." అనే మాటలు అసలు లైంగికసంబంధాన్నే సూచించడం లేదు. అవి దేనిని సూచిస్తున్నాయో తెలుసుకునే ముందు ఇశ్రాయేలీయులను పరిపాలించబోయే రాజు విషయంలో యెహోవా దేవుడు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలు చూడండి.

ద్వితియోపదేశకాండము 17:17 తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు.

ఈ ఆజ్ఞ ప్రకారం, ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించబడినవాడు అనేకమంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు‌. ఏ దేవుడైతే ఇలాంటి ఆజ్ఞను జారీ చేసాడో అదే దేవుడు సౌలు భార్యలను తీసుకొచ్చి దావీదుకు భార్యలుగా (ఉపపత్నులుగా) అప్పగించాడని ఆరోపించడం కేవలం మతోన్మాదుల మూర్ఖత్వం. ఎందుకంటే యెహోవా దేవుడు తన ఆజ్ఞలకు తానే వ్యతిరేకంగా ప్రవర్తించడం అసాధ్యం. కాబట్టి "నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి..." అనే మాటలు కచ్చితంగా లైంగికసంబంధాన్ని సూచించడం లేదు. అవి పరిపాలనను సూచిస్తున్నాయి. ఉదాహరణకు-

సంఖ్యాకాండము 11:12 ​"నేనే యీ సర్వజనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు."

ఈ సందర్భంలో‌ మోషే ఇశ్రాయేలీయుల ప్రజలకు నాయకుడిగా వారిని నడిపించడాన్ని (పరిపాలించడాన్ని) "రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు" అంటూ వారిని కౌగిట్లో ఉంచుకోవడంతో పోలుస్తున్నాడు. కాబట్టి దావీదు సందర్భంలో కూడా "నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదావారిని నీకప్పగించితిని" అంటే, దావీదు రాజుగా ఉన్న రాజ్యం ఒకప్పుడు సౌలుది. కానీ సౌలు దేవునికి అవిధేయుడైన కారణంగా ఆయన అతనిని కొట్టివేసి ఆ స్థానంలో దావీదును ఉంచాడు (1 సమూయేలు 15:28). అలా ఆయన సౌలు రాజ్యాన్నీ అతని నగరినీ అతని కుటుంబాన్నీ (అతనికి చెందిన స్త్రీలను) కూడా దావీదు పరిపాలనకు అప్పగించాడని అర్థం. కాబట్టి ఇవి లైంగిక సంబంధానికి కాదు పరిపాలనకు సంబంధించిన మాటలు. అందుకే ఆయన "ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును" అని రాజ్యాన్ని అతనికి ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాడు.

ఇంతకూ సమాజాన్ని ఎలాంటి దేవుని వైపు లాక్కెళ్ళడానికి బైబిల్ దేవునిపై ఇలాంటి అభాండాలు వేస్తున్నారు? పరాయి పురుషుల భార్యలను అప్పగించేవాడనే బూచీని చూపించి ఏకంగా పరాయి పురుషుల భార్యలను అనుభవించే దేవుళ్ళ దగ్గరకు లాక్కెళ్ళాలి అనుకుంటున్నారు, అంతేకదా! ఉదాహరణకు, తులసిని భర్తవేషంలో వెళ్ళి మానభంగం చేసిన విష్ణువు వంటి వారియొద్దకూ వశీకరణమంత్రంతో స్త్రీలను లొంగదీసుకుని వారితో వ్యభిచరించిన శివుడి యొద్దకూ. బ్రహ్మ ఐతే పరాయి పురుషుల భార్యలను (పార్వతితో సహా) చూసి వీర్యం కార్చుకుంటుంటాడు. ఆ ఆధారాలు తదుపరి భాగాల్లో పొందుపరుస్తాను. ప్రస్తుతానికి విష్ణువూశివుల ఆ ఘనకార్యాలు చదవండి.

"దేవీభాగవతం, నవమ స్కంధం, 23వ అధ్యాయం, 13-24 శ్లోకాలు"

13. తులసీ వచనం శ్రుత్వా ప్రహస్య కమలాపతిః । శంఖచూడస్య రూపేణ తామువా చామృతం వచః ।

14. శ్రీభగవానువాచ : ఆవయోః సమరః కాంతే పూర్ణమబ్దం బభూవ హ నాశో బభూవ సర్వేషాం దానవానాంచ కామిని ।

15. ప్రీతిం చ కారయామాస బ్రహ్మాచ స్వయ మావయో దేవానా మధికార శ్చ ప్రదత్తో బ్రహ్మణా జ్ఞయా

16. మయాగతం స్వభవనం శివలోకం శివో గతః | ఇత్యుక్త్వా జగతాం నాథః శయనం చ చకారహ

17. రమే రమాపతి స్తోత్ర రమయా సహ నారద సా సాధ్వీ, సుఖసంభోగా దాకర్షణ వ్యతిక్రమాత్|

18. సర్వం వితర్కయామాస కస్త్వ మే వెత్యువాచ సా! తులస్యువాచ కోవాత్వం వద మాయేశ భుక్తాహం మాయయా త్వయా!

19. దూరీకృతం మత్సతీత్వం యదత స్వాం శపామహే । తులసీవచనం శ్రుత్వా హరిః శాపభయేన చ

20. దధార లీలయా బ్రహ్మన్సుమూర్తిం సుమనోహరమ్ దదర్శపురతో దేవీ దేవదేవం సనాతనమ్.

21. నవీన నీరదశ్యామం శరత్పంకజలోచనమ్ కోటికందర్పలీలాభం రత్నభూషణ భూషితమ్.

22. ఈషద్దాస్య ప్రసన్నాస్యం శోభితం పీతవాససమ్ | దృష్ట్వా కామినీ కామం మూర్ఛాం సంప్రాప లీలయా

23. పునశ్చ చేతనాం ప్రాప్య పునః సా తమువాచ హ హేనాథ తే దయా నాస్తి పాషాణ సదృశస్యచ |

24. ఛలేన ధర్మభంగేన మమ స్వామీ త్వయాహతః | పాషాణహృదయస్త్వం హి దయాహీనో యతః ప్రభో

తాత్పర్యము: శంఖచూడ రూపంలో ఉన్న శ్రీహరి నవ్వుతూ పలికాడు. కాంతామణీ! మా ఇద్దరికీ యుద్ధం నిండా నూరేళ్ళు జరిగింది. మన దానవ వీరులందరూ మరణించారు. నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను. అంతలోనే బ్రహ్మదేవుడు వచ్చాడు. మా ఇద్దరికీ ప్రీతికరంగా సయోధ్య కుదిర్చాడు. దేవతలకు వారి రాజ్యం వారికి ఇచ్చేసాను. సంతృప్తులై వెళ్ళిపోయారు. మన రాజ్యం మనకు మిగిలింది. ఆ తృప్తితో ఇంటికి తిరిగివచ్చాను. శివుడు తనలోకానికి వెళ్ళిపోయాడు. క్లుప్తంగా జరిగింది ఇది అంటూనే తులసిని మంచం మీదకు వాల్చాడు. ఆ ఆకర్షణకూ ఆ సంభోగసుఖాధిక్యానికీ అనుమానించిన తులసి రకరకాలుగా వితర్కించుకుంది. శంఖచూడుడు కాదని నిర్దారించుకుంది. చివాలున లేచింది. మాయావీ! నువ్వు ఎవడివో చెప్పు నా ప్రాతివత్యాన్ని నాశనం చేశావు, నన్ను అనుభవించావు. నిజం చెప్పకపోయావో శపిస్తాను అంటూ గాండ్రించింది. శపిస్తుందేమోనని భయపడి శ్రీహరి తన రూపాన్ని చూపించాడు. శ్రీహరి నవ్వులు చిందిస్తున్నాడు. పీతాంబరం గాలికి రెపరెపలాడుతోంది. శ్రీహరిని చూడగానే తులసీదేవి క్షణకాలం మూర్చిల్లింది. వెంటనే తేరుకుంది.

జగన్నాథా ! నీకు దయలేదు. నీవొక బండరాయివి. మోసగించి మానభంగం చేశావు. నా పాతివ్రత్యాన్ని ధ్వంసం చేశావు. నా భర్తను చంపావు. ఇంతటి దయలేనివాడివి ఎలా అయ్యావు ? ఈ ఘోరానికి నిన్ను శపించ వలసిందే. ఇకనుంచీ నువ్వు పాషాణరూపుడివి అయిపోతావు. నువ్వు సత్పురుషుడివనీ, కృపానిధివనీ పొగిడేవారు వట్టి అమాయకులు, భ్రాంతచిత్తులు. నీది గుండెకాదు, బండరాయి. ఏ అపరాధమూ చెయ్యని నీ భక్తుణ్ణి పరులకోసమని పొట్టబెట్టుకోడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? అని ప్రశ్నించి విష్ణువును శపించి దేహత్యాగం చేసింది.

"పద్మపురాణం, సృష్టి ఖండం, 56వ అధ్యాయం, 1-14శ్లోకాలు"

1. పురా శర్వ స్త్రియో దృష్ట్వా యువతీరూపశాలినీః । గంధర్వ కిన్నరాణాం చ మనుష్యాణాం చ సర్వతః ॥

2. మంత్రేణ తా స్సమాకృష్య త్వతి దూరే విహాయసి | తపో వ్యాజపరో దేవః తాస్తాసు సంగతమానసః ॥

3. అతిరమ్యాం కుటీం కృత్వా తాభిస్సహ మహేశ్వరః । క్రీడాం చకార సహసా మనోభవపరాభవః

4. ఏతస్మిన్నంతరే గౌర్యాః చిత్తముద్రాంతం గతమ్ | అపశ్యద్ధ్యానయోగేన క్రీడంతం జగదీశ్వరమ్ ॥

5. స్త్రీభిరంతర్గతం జ్ఞాత్వా రోషస్య వశగాభవత్ | తతః క్షేమంకరీ రూపా భూత్వా చ ప్రవివేశ సా॥

6. వ్యోమైకాంతేతి దూరే చ కామదేవసమప్రభమ్ | వామాతిమధ్యగం శుభ్రం పురుషం పురుషోత్తమమ్ ॥

7. స్త్రీభి స్సహ సమాలింగ్య ప్రకీడంతం ముహుర్ముహుః । చుంబంత నిర్భరం దేవం హరం రాగప్రపీడితమ్ ॥

8. వృత్తం క్షేమంకరీ దృష్ట్వా నిపపాతాగ్రతస్తదా। తాసాం కేశేషు చాకృష్య చకార చరణాహతిమ్ ॥

9. త్రపయా పీడితశ్శర్వః పర్మాఖమవస్థితః | కేశేష్వాకృప్యరోషాత్తాః పాతయామాసభూతలే ॥

10. స్త్రీయః సర్వా ధరాం ప్రాప్య సహసా వికృతాననాః । ఉమాశాపప్రద ంగా మేచ్ఛానాం వశమాగతాః ॥

11. తాచ్చాండాలస్త్రీయః ఖ్యాతా అధవా ధవసంయుతా ! అద్యాప్యుమాకృతం శాపం సర్వాస్తాశ్చ సమశ్నుయుః ॥

12. ఆథోమా శతధారూపం కృత్వేశం సంగతా తదా | ఏవం ప్రభావం జానీహి కామస్య సతతం ద్విజ ॥

13. తతశ్చిరాత్ తయా సార్ధం గతః కైలాసమందిరమ్ | అతః క్షేమంకరీం దృష్ట్వా యే భినందంతి మానవాః ॥

14. తేషాం విత్తబ్ధ విభవా భవంతీహ పరత్ర చ ॥ కుంకుమారక్త సర్వాంగి! కుందేందు ధవలాననే! |

తాత్పర్యము: పూర్వము శివుడు గంధర్వులలో, కిన్నెరులలో, మానవులలో ఉన్న అందమైన స్త్రీలను చూసి వారిపై వశీకరణ మంత్రము ప్రయోగించి వారిని దూరముగ తీసుకుని (ఆకాశములోకి) వెళ్ళుచుండెను. శివుడు అతి రమ్యమైన కుటీరమును నిర్మించి ఆ అందమైన స్త్రీలతో క్రీడించెను. ధ్యానము ద్వారా పార్వతికి ఈ విషయము తెలిసినది. శివుని ఆంతర్యమును గ్రహించిన పార్వతికి రోషము వచ్చినది అప్పుడు ఆమె క్షేమంకరీ రూపము ధరించి శంకరుడు ఉన్న ప్రదేశమునకు వచ్చెను.

అనేక మంది స్త్రీల మధ్య, ప్రకాశించుచున్న శంకరుని చూసెను కామపీడితుడై వారిని కౌగిలించుకొని వివిధ కామ చేష్టలు చేయుచున్న శివుడి ముందుకు క్షేమంకరి వెళ్ళెను. శివుడు తన భార్యను చూసి సిగ్గుతో తలతిప్పుకొనెను. అక్కడ ఉన్న స్త్రీలనందరినీ చూసి కోపముతో జుట్టుపట్టుకుని లాగి ఒక్క తన్ను తన్నగ వారు భూమిపై పడి వికృత రూపులయ్యిరి. పార్వతిదేవి శాప ప్రభావము వలన దగ్ధమైన అంగములు గలవారు మ్లేచ్చుల వశమయ్యిరి. ఆ స్త్రీలు చండాలస్త్రీలను ఖ్యాతిని పొందిరి. ఈ నాటికి కూడా వారు ఆ శాపమును అనుభవించు చున్నారు.

8. తండ్రి తప్పు చేస్తే కొడుకుకు మరణశిక్ష

2 సమూయేలు 12:14-18 అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. ఏడవ దినమున బిడ్డ చావగా-

ఈ సందర్భంలో దేవుడు, దావీదు బత్షెబాలకు పుట్టిన కుమారుడిని మొత్తడం, అప్పుడు ఆ కుమారుడు చనిపోవడం మనకు కనిపిస్తుంది. హిందూ మతోన్మాదులు ఈ సంఘటనను చూపించి తండ్రి తప్పు చేస్తే బిడ్డను చంపడమేంటని ఆరోపిస్తుంటారు. 

మనిషిని పుట్టించినవాడిగా ఆ మనిషిని తాను నిర్ణయించిన సమయంలో మరణానికి అప్పగించడం ఆయనకు న్యాయమే (కీర్తనలు 90:3). ఆ మరణం దావీదుకూ అతనితో కలసి పాపం చేసిన బత్షెబాకూ వేదనకరంగా ఉండేలా ఆయన నిర్ణయించాడు. ఇందులో అన్యాయమేమీ లేదు.  అన్యాయం అంటే ఇది కాదు. "రెండు‌కోతుల మధ్య యుద్ధం జరుగుతుంటే మధ్యలో ఒకడు చెట్టు చాటు నుండి బాణం వేసి అందులో ఒక కోతిని చంపేస్తాడు" చూడండి దానిని అనాలి అన్యాయమని (మళ్ళీ ధర్మాన్ని కాపాడటానికే అలా చేశాడని సమర్థింపు ఒకటి, ధర్మాన్ని కాపాడటానికి అధర్మంగా యుద్దం చెయ్యాలా? చంపాలా? ఇదేం ధర్మమో మరి).

దావీదు పాపం చేస్తే తన ఇంటివారికి యుద్ధం కలగడమేంటని మళ్ళీ ఎవరైనా ఆరోపిస్తే  (2 సమూయేలు 12:10). అసలు దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి కాపాడుతుందే దావీదును బట్టి‌. నిజానికి వారేమీ ఆయన ఆశీర్వాదాన్ని, కాపుదలను పొందుకునేంత మంచివారేం కారు. వారి స్వభావమే అలాంటిది. దీనికి మరింత వివరణ, 'అమ్నోను తామారు', 'తండ్రి భార్యలను కొడుకుకు అప్పగించిన బైబిల్ దేవుడు' భాగాలలో పొందుపరిచాను. ఇంతకూ హిందూగ్రంథాల ప్రకారం ఏ జన్మలోనో‌ పాపం చేస్తే అసలు ఆ పాపమేంటో కూడా తెలియకుండా ఈ‌ జన్మలో దానిని‌ అనుభవించడమేంటి?

భార్యలు కొడుకు వరస అయ్యేవాడిని తప్పుగా చూస్తే ఆ భార్యలని శిక్షించడం మానేసి ఆ స్వంత కొడుకుకు శ్రీకృష్ణుడు కుష్టురోగ శాపం పెట్టడమేంటి? ఆధారం పెడుతున్నాను చదువుకోండి.

"శ్రీ వరాహ మహాపురాణము 175వ అధ్యాయం"

అనంతరము వరాహ భగవానుడు ధరణీదేవితో శుభాంగీ! ఇప్పుడు నేను నీకు శ్రీకృష్ణునికి సంబంధించిన కథ యొక్క అద్భుత పరిణామము చెప్పుచున్నాను. వినుము. అది ద్వారకాపురికి సంబంధించిన వృత్తాంతము. దానితో పాటు సాంబుని శాపవృత్తాంతమును కూడా వినుము. ఒకమారు భగవంతుడు సానందుడు ద్వారకయందు విరాజమానుడై ఉండగా నారదమహాముని అచ్చటకు వచ్చెను. శ్రీ భగవానుడు ఆయనకు ఆసనము అర్ఘ్యము, పాద్యము, మధుపర్కముతో పాటు గోవులను కూడా సమర్పించెను. తదనంతరము ముని ఆయనకు నీతో ఏకాంతముగా సంభాషించవలెనని కోరుచున్నాను అని శ్రీకృష్ణునికి సూచించెను. పిమ్మట ఏకాంతములో నారదుడు ప్రభూ! నీ నవయువకుడైన పుత్రుడు సాంబుడు గొప్ప వాగి, రూపవంతుడు, పరమసుందరుడు. అట్లే దేవతలయందు కూడా విశేష ఆదరము పొందినవాడు. దేవేశ్వరా! దేవతలతో సమానులైన నీకు సంబంధించిన వేలకొలది స్త్రీలు ఆయన సౌందర్యమును చూచి ఆశ్చర్యచకితులు అగుచున్నారు. నీవు దివ్య స్త్రీలను ఇచటకు పిలిచి వస్తుతః వారియందు కలత కలదో లేదో సాంబునికి ఆ సహా ఆ స్త్రీలందరూ వచ్చి చేతులు జోడించి కూర్చొని పోయిరి. కొద్ది క్షణములు గడచిన పరీక్షింపుము. అని తెల్పగా, శ్రీకృష్ణుని ఆజ్ఞపై తరువాత శ్రీకృష్ణుని వద్దకు (సాంబునితో తర్వాత సాంబుడు శ్రీకృష్ణుని ప్రభూ! మీ ఆజ్ఞ ఏమి? వస్తుతః సాంబుని అందమును చూచి శ్రీకృష్ణుడు ఎదురుగా ఉన్న ఆ స్త్రీల మనసులయందు కలత ఉత్పన్నమైనది.

పొండు అని ఆజ్ఞాపించెను. శ్రీకృష్ణుని ఆజ్ఞను పొంది, ఆ స్త్రీలు తమ తమ స్థానములకు శ్రీకృష్ణ భగవానుడు దేవులారా! ఇప్పుడు మీరందరూ లేచి నిలబడి మీమీ స్థానములకు వెడలిపోయిరి. కాని సాంబుడు అక్కడనే కూర్చొని ఉండెను. అతడి దేహమునందు కంపము కలుగుచుండెను. అంతట శ్రీకృష్ణుడు నారదముని వర్యా! స్త్రీల స్వభావము చాలా విలక్షణముగా ఉండును. అని పల్కెను. అంతట నారదుడు ప్రభూ! వీరి ఈ ప్రవృత్తి చేత సత్యలోకమునందు కూడా మీపై నిందలు వేయబడుచున్నవి. అందుచే ఇప్పుడు సాంబుని పరిత్యజించుటయే ఉచితమైన పని. దేవా! ఈ విశ్వమునందు మిమ్ములను పోలినవాడు మరియొకరు లేడు. కావున ఈ పనిని మీరే చేయగలరు. అని చెప్పెను.

వసుంధరా! నారదుడు ఈ విధముగా చెప్పగా, శ్రీకృష్ణుడు సాంబుని రూపహీనుడు అగునట్లు శాపమును ఇచ్చెను. ఆ శాపము చేత సాంబుని శరీరమునందు కుష్ఠురోగము ప్రవేశించినది. అంతేగాక ఆతని శరీరము నుండి భయంకరముగా దుర్గంధము వచ్చు చుండగా, రక్తము బొట్లు బొట్లుగా పడుచున్నది. ఇప్పుడు అతడి శరీరము ఛిన్నాభిన్నములైన అంగములు కలిగిన పశువులవలె ఆ సాంబుని శరీరము కనిపించుచున్నది.

9. అమ్నోను తామారు

బైబిల్ చరిత్రలోని కొందరు వ్యక్తులు చేసిన పాపాలను తీసుకుని వాటిని బైబిల్ పైనా బైబిల్ దేవునిపైనా ఆపాదించే కుట్రలో భాగంగా హిందూ మతోన్మాదులు దావీదు కుమారుడైన అమ్నోను తన చెల్లెలిపై అత్యాచారం చేసిన సంఘటనను కూడా ప్రస్తావిస్తుంటారు. దావీదు కుమారుడైన అమ్నోను తన చెల్లెలి (Half-sister) పై చేసింది బైబిల్ దేవునికి హేయమైన చర్య అని చాలా స్పష్టంగా రాయబడింది. అలాంటి కార్యాలు చేసినందుకే ఆయన కనానీయులను నిర్మూలం చేసాడని ఇప్పటికే నేను వివరించాను.

లేవీయకాండము 18:9-25 నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్కయైనను నీ తల్లి కుమార్తెయొక్కయైనను మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.‌ వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్నవారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.

అమ్నోను ఈ నియమాన్ని మీరుతూ తన చెల్లెలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు (2 సమూయేలు 13). చివరికి తన సహోదరుడైన అబ్షాలోము చేతిలో హతమయ్యాడు. ఇందులో బైబిల్ పై కానీ బైబిల్ దేవునిపై కానీ బురద చల్లడానికి ఏముంది? బైబిల్ దేవుడేమైనా అమ్నోనును అలా చెయ్యమని ప్రేరేపించాడా? పైగా అలా చెయ్యకూడదని కచ్చితంగా ఆజ్ఞాపించాడు కదా! అమ్నోను ఎవరి ప్రేరణతో ఆ పని చేసాడో ఆ అధ్యాయంలో వివరంగా ఉంది (2 సమూయేలు 13:3-5). హిందూ మతోన్మాదుల కుయుక్తి ఇలా ఉంటుంది. జరిగిన ఒక సంఘటన చారిత్రక కోణంలో రాయబడితే చాలు ఇక బైబిల్ పై బురద చల్లేయ్యడమే. అలాగైతే రాక్షసుల గురించి రాయబడిన హిందూ గ్రంథాలు రాక్షసగ్రంథాలు ఔతాయని, రాక్షసుల చర్యలకు ఆ గ్రంథాలనే నిందించవలసి ఉంటుందని, సీతను ఎత్తుకుపోవడం గురించి రాయబడిన రామాయణం స్త్రీలను అపహరించే గ్రంథం ఔతుందని ఇప్పటికే హెచ్చరించాను.

హిందూ మతోన్మాదుల్లారా, అమ్నోను తన చెల్లెలిని మోహించి అత్యాచారం చెయ్యడాన్ని ప్రస్తావించి బైబిల్ పై బురద చల్లుతున్నారు కదా! అమ్నోను మాకు మాదిరి కాదు, అతను కనీసం దావీదులా భక్తుడు కూడా కాదు. అతను ఏం చేస్తే మాకేంటి? ఎలా చస్తే మాకేంటి? కానీ మీ సంగతేంటి? బ్రహ్మ మీకు దేవుడే కదా. మరి ఆ బ్రహ్మ శివపార్వతుల పెళ్ళికి పంతులుగా వెళ్ళి పార్వతిని చూసి వీర్యం కార్చుకోవడం సంగతేంటి?

"శివపురాణము, రుద్రసంహిత, పార్వతీ ఖండము, 19 అధ్యాయం, 17-36 శ్లోకాలు"

ప్రదక్షిణాం ప్రకుర్వంత్యా వహ్నే స్సత్యాః పద ద్వయమ్ । అవిర్బ భూవ వసనాత్తద ద్రాక్ష మహం మునే ॥ మదనా విష్టచే తాశ్చ భూత్వాంగాని వ్యలోకయం । అహం సత్యా ద్విజశ్రేష్ట శివమాయా విమోహితః ॥ యథా యథాహం రమ్యాణి వ్యైక్షమంగాని కౌతుకాత్! సత్యా బభూవ సమ్పృష్టః కామార్తో హి తథా తథా

ఓ మహర్షీ! వివాహ సమయంలో సతీదేవి అగ్నికి ప్రదక్షిణమును చేయు చుండగా ఆమె చీర తొలగి ఆమె పాదములు రెండు నాకు కనబడినవి. నేను వాటిని చూచితిని . ఓ బ్రాహ్మణోత్తమా శివమాయచే విమోహితుడనైన నేను మన్మథునిచే ఆవేశింపబడిన మనస్సు గలవాడనై సతీ దేవి యొక్క శరీర అవయవములను చూచితిని. నేను సతీదేవి యొక్క అంగములను ఉత్కంఠతో చూచు చుండగా, నాలోని కామవేదన అధికమయ్యెను.

ఆహమేవం తథా దృష్ట్వా దక్షజాం చ పతివ్రతామ్: స్మరావిష్టమనే వక్త్రం ద్రష్టుకామో? భవం మునే॥ న శంభోర్లజ్జయా వక్త్రం ప్రత్యక్షం చ విలోకీతమ్: న చ సా లజ్జ యావిష్టా కరోతి ప్రకటం ముఖమ్ ॥ తతస్తదర్శనార్ధాయ సదుపాయం విచారయన్ |
ధూమ్ర ఘోరేణ కామార్తో.. కారం తచ్చ తతః పరమ్ ॥ అర్జీంధనాని భూరీణి క్షిప్త్వా తత్ర విభావసౌ। స్వల్పా జ్యాహుతి విన్యాసా దార్ణద్రవ్యోద్భవ సథ =

ఓ మహర్షీ! పార్వతీదేవిని నేను ఈ తీరున చూచి మన్మధునిచే ఆవేశింపబడిన మనస్సు గలవాడనై ఆమె ముఖమును చూడగోరితిని . నేను సిగ్గుచే శివుడి ముఖమును ప్రత్యక్షముగా చూడలేదు. ఆమె సిగ్గుచే తన ముఖమును కనబడ కుండునట్లు కప్పుకొనియుండెను. ఆమె ముఖమును చూచే మంచి ఉపాయమును గూర్చి నేను ఆలోచించితిని. ఘోరమగు పాప ప్రభావముచే నేను కామ పీడితుడనై అప్పుడొక పనిని చేసితిని. అచట అగ్నిలో పచ్చి కర్రలను ఎక్కువగా వేసి, ఆజ్యాహుతిని తక్కువగా వేసి తడి ద్రవ్యము అధికముగ ఉండునట్లు చేసితిని.

ప్రాదుర్భూతస్తతో ధూమో భూయాంస్తత్ర సమంతతః | తాదృగ్ యేన తమో భూతం వేదీ భూమి వినిర్మితమ్ ॥ తతో ధూమాకులే నేత్రే మహేశః పరమేశ్వరః | హస్తాభ్యాం ఛాదయామాస బహులీలాకరః ప్రభుః ॥ తతో వస్త్రం సముత్ క్షిష్య సతీవక్రమహం మునే | అవేక్షం కిల కామార్తః ప్రహృష్టేనాంతరాత్మనా ॥ ముహుర్ముహురహం తాత పశ్యామి స్మ సతీముఖమ్ | ఆథేంద్రియ వికారం చ ప్రాప్తవానస్మి సో... వశః ॥

నేను అగ్నిలో పచ్చి కట్టెపుల్లలు వెయ్యటం వలన అక్కడ అంతటా పొగ అధికముగా వ్యాపించి, వేది సమీప భూమి అంతయూ చీకటి నిండినట్లు ఆయెను. అపుడు శివుడు పొగతో నిండిన కళ్లను రెండు చేతులతో మూసుకొనెను. ఓ మహర్షీ! అప్పుడు నేను పార్వతి యొక్క వస్త్రమును పైకి తీసి ఆమె ముఖమును సంతోషముతో నిండిన మనస్సు గలవాడనై చూచి కామ కోరికలతో నిండి పోయాను. నేను పార్వతీదేవి ముఖమును, ఆమె శరీర అవయవాలను అనేక సార్లు పదేపదే చూచి మోహంతో ఇంద్రియ నిగ్రహమును కోల్పోయాను.

మమ రేతః ప్రచస్కంద తతస్తద్వీక్షణా ద్రుతమ్ | చతుర్బిందు మితం భూమౌ తుషారచయ సంనిభమ్ ॥ తతో హం శంకితో మౌనీ తత్కృణం విస్మితో మునే | ఆచ్ఛాదయే స్మ తద్రేతో యథా కశ్చిద్బుబోధ న ॥ అథ తద్భగవాన్ శంభుర్ జ్ఞాత్వా దివ్యేన చక్షుషా! రేతో... వస్కంద నాత్తస్య కోపావేత దువాచ హ

"ఆమెను చూచుట వలన మంచు ముద్దవలే నాలుగు బిందువుల పరిమాణము గల నా వీర్యము భూమిపై జారిపడెను". ఓ మహర్షీ! నేను ఆ క్షణములో విస్మయమును చెంది భయపడినవాడనై ఏమియూ మాటలాడ కుండగా, ఆ రేతస్సును ఇతరులకు కానరాకుండునట్లు కప్పివేసితిని. అపుడు శివుడు దివ్యదృష్టిచే ఆ విషయమును తెలుసుకొనెను. నేను పార్వతిని మోహించి వీర్యస్ఖలనం చేసుకోవటం వలన శివుడికి చాల కోపము వచ్చెను. ఆయన ఇట్లు పలికెను.

కిమేతద్విహితం పాప త్వయా కర్మ విగరితమ్ । వివాహే మమ కాంతాయ వక్త్రం దృష్టం న రాగతః ॥ త్వం వేత్సి శంకరేణై తత్కర్మా జ్ఞాతం న కించన త్రిలోక్యేపి న మే. జ్ఞాతం గూడం తస్మాత్కథం విధే | యత్కించిత్త్రిషు లోకేషు జంగమం స్థావరం తథా | తస్యాహం మధ్యగో మూడతైలం యద్వత్తి లాంతక

ఓరీ పాపీ! నీవు ఇలాంటి జుగుప్సాకరమైన రోత పనిని ఏల చేసితివి? నీవు వివాహములో నా భార్య యొక్క ముఖమును అనురాగముతో చూడలేదు, కామంతో చూశావు. శంకరునకు తెలియనిది ఏదీ ఉండదని నీకు తెలుసు. ముల్లోకములలోనైననూ నాకు తెలియని రహస్యము లేదు. ఇలాంటి పని ఎందుకు చేశావు? ఓరీ మూర్ఖుడా! ఈ ముల్లోకములలో సమస్త చరాచర ప్రాణి సమూహము లోపల నేను నువ్వుల యందు నూనె వలె వ్యాపించి యున్నాను అని శివుడు పలికెను.

ఇత్యుక్త్వా ప్రియవిష్ణుర్మాం తదా విష్ణువచస్స్మరన్ | ఇయేష హంతుం బ్రహ్మాణం శూలముధ్యమ్య శంకరః ॥ శంభునో ద్యమితే శూలే మాం చ హంతుం ద్విజోత్తమ । మరీచి ప్రముఖాస్తే వై హాహాకారం చ చక్రిరే ॥ తతో దేవగణాస్సర్వే మునయశ్చాఖిలాస్తథా | తుష్టువు శ్శంకరం తత్ర ప్రజ్వలంతం భయంకరమ్ ॥

బ్రహ్మ ఇట్లు పలికెను విష్ణువు ప్రియమైన వాడుగా గల శంకరుడు అపుడు ఇట్లు పలికి, విష్ణువు మాటను స్మరించి, శూలము నెత్తి నామీదకు చంపటానికి వచ్చాడు. శివుడు శూలమునెత్తి నన్ను చంపుటకు సిద్ధపడగా, మరీచి మొదలగు వారందరూ హాహాకారములను చేసిరి. అపుడు సర్వదేవగణములు, మునులు మరియు ఇతరులు అందరూ, మండిపడుతూ భయంకరముగానున్న శంకరుని స్తుతించి నన్ను చంపకుండా రక్షించారు.

మా గ్రంథంపై మా దేవునిపై అక్రమంగా బురద చల్లాలని చూస్తే ఇలానే మీ గ్రంథంలో ఉన్న పెంటను వెలికి తీయవలసి ఉంటుంది జాగ్రత్త.

10. తండ్రి భార్యలను కొడుకుకు అప్పగించిన బైబిల్ దేవుడు

హిందూ మతోన్మాదులు అబ్షాలోము దావీదుపై కుట్ర చేసాక రాజనగరికి కాపలాగా ఉన్న అతని ఉపపత్నులతో శయనించడాన్ని చూపించి (2 సమూయేలు 16:22), అబ్షాలోముకు తన తండ్రి భార్యలను బైబిల్ దేవుడే అప్పగించాడని ఆరోపిస్తుంటారు. అందుకు ఆధారంగా వారు ఆయన దావీదుకు నాతాను ద్వారా ప్రకటించిన శిక్షలో పలికిన మాటలను వక్రీకరిస్తుంటారు.

2 సమూయేలు 12:11,12 నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా- నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; "నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికప్పగించెదను. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను".

అయితే ఇక్కడ "నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించెదను" అన్నప్పుడు మతోన్మాదులు ఆరోపిస్తున్న భావమే ఉందో లేదో‌ చూసేముందు అసలు అబ్షాలోము ఎవరి ప్రేరణతో ఆ పని చేసాడో ఒకసారి చదవండి.

2 సమూయేలు 16:20-22 అబ్షాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలిసికొనుటకై ఆలోచన చేతము రమ్ము అనగా అహీతోపెలు-నీ తండ్రిచేత ఇంటికి కావలియుంచబడిన ఉపపత్నులయొద్దకు నీవు పోయిన యెడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరు తెలిసికొందురు, అప్పుడు నీ పక్షముననున్నవారందరు ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులకందరికి తెలియునట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను.

ఈ వాక్యభాగంలో అహీతోపెలు అనేవాడి ఆలోచనను బట్టే అబ్షాలోము ఆ పని చేసినట్టు స్పష్టంగా రాయబడింది. అదేంటి మతోన్మాదులు ఆరోపణ ప్రకారం యెహోవా ప్రేరణతో చేసాడని కదా రాసుండాలి? ఇది ప్రక్కనపెడితే అబ్షాలోము చేసిన ఆ పనిని బట్టి బైబిల్ దేవుని‌ స్పందన ఎలా ఉందో చూడండి.

2 సమూయేలు 17:14 ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై .....

ఈ వాక్యభాగం ప్రకారం, అబ్షాలోను చేసిన ఆ పనిని బట్టి దేవుడు అతనిపైకి ఉపద్రవం రప్పించదలిచాడు. అదేంటి అతను ఆయన ఆలోచన చొప్పునే అదంతా చేస్తున్నప్పుడు మరలా అతన్ని చంపాలనుకోవడం ఎందుకు? ఎందుకంటే అబ్షాలోము అక్కడ చేసింది బైబిల్ దేవునికి అత్యంత హేయమైన చర్య (లేవీయకాండము 18:7,8, ద్వితియోపదేశకాండము 22:30, 27:20). ఈ ఆజ్ఞలను మీరుతూ తన తండ్రి భార్యలతో శయనించినందుకే దేవుడు అబ్షాలోమును చంపదలచి యోవాబు చేతికి అతనిని‌ అప్పగించాడు (2 సమూయేలు 18:14,15). ఇక్కడ ఎక్కడా కూడా అబ్షాలోము చేసిన పనిని దేవుడు అంగీకరించలేదు.

మరి "నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికప్పగించెదను. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును" అనే మాటలకు అర్థం తెలియాలంటే ఈ సందర్భాలు కూడా చూడండి -

న్యాయాధిపతులు 2:11-14‌ ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; "ఆయన దోచుకొనువారిచేతికి వారిని అప్పగించెను". వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి "శత్రువులచేతికి వారిని అప్పగించెను" గనుక వారు తమ శత్రువుల యెదుట నిలువలేకపోయిరి.

న్యాయాధిపతులు 13:1 ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా నలువది సంవత్సరములు వారిని ఫిలిష్తీయులచేతికి "అప్పగించెను".

ఈ సందర్భాల ప్రకారం, బైబిల్లో దేవుడు "అప్పగించెను, చేయించెను" అన్నప్పుడు ఆయనేదో వారిని తీసుకువెళ్ళి‌ ఎవరికో అప్పగించాడని కాదు. వారు చేసిన పాపాలను బట్టి వారిని కాపాడటం మానివేసాడని అర్థం. దావీదు బత్షెబాతో పాపం చెయ్యకుండా ఉండుంటే దేవుడు యోబు కుటుంబానికి కంచెవేసినట్టుగా (యోబు 1:10) అతని కుటుంబానికి కూడా కంచె వేసి అబ్షాలోములాంటివారు అలాంటి పనులు చెయ్యకుండా అనగా ఎవరికీ ఏ ప్రమాదం రాకుండా కాపాడియుండేవాడు. కానీ దావీదు చేసిన పాపం కారణంగా ఆయన ఆ కంచెను తీసివేసాడు (కాపాడటం మానివేసాడు). అబ్షాలోము అలాంటి పాపానికి ఒడిగట్టాడు. ఆయన దావీదు కుటుంబానికి ఉన్న తన కాపుదలను తొలగించగానే అలా జరుగుతుందని దేవునికి ముందే తెలుసు కాబట్టి అవే మాటలను నాతాను ద్వారా ప్రకటించాడు (హిజ్కియా రాజు విషయంలో కూడా ఇంచుమించు ఇలాంటి హెచ్చరికనే మనం గమనిస్తాం "యెషయా 39వ అధ్యాయం") ఇక్కడ దేవుడేమీ అబ్షాలోము మంచిగా ఉంటే అతనిని ప్రేరేపించి అలా చేయించలేదు, అసలు అబ్షాలోము స్వభావమే దుష్టస్వభావం. అతని‌ చరిత్రను పరిశీలిస్తే ఆ విషయం మనకు బాగా అర్థమౌతుంది. కానీ దావీదు పాపం చెయ్యకుండా ఉండుంటే అతను చెయ్యాలనుకున్న కీడు చెయ్యకుండా దేవుడు ఆపియుండేవాడు. ఇప్పుడు దావీదు చేసిన పాపం కారణంగా అలా అతణ్ణి ఆపవలసిన అవసరం దేవునికి లేదు. అందుకే అతను దావీదుపై కుట్రచేస్తున్నప్పుడు వాని పాపానికి వానిని‌ వదిలివేసాడు. 'ఆయన అప్పగించెను', 'ఆయన తప్పించెను' అన్నప్పుడు ఆయా వ్యక్తులపై ఆయన కాపుదల నిలపడం గురించీ దానిని ఉపసంహరించుకోవడం గురించీ చెప్పబడుతుంది. "నీ భార్యలను నీ చేరువవానికి అప్పగించెదను" అంటే ఇది అర్థం. ఒకవేళ దావీదు పాపం చేస్తే తన భార్యలకు ఎందుకు శిక్ష అని ఎవరైనా ఆరోపిస్తే ఒక వ్యక్తి చేసే పనుల పర్యవసానం అది మంచిదైనా చెడ్డదైనా సహజంగానే అతని ఇంటివారిని కూడా అది ప్రభావితం చేస్తుంది అన్నదే నా సమాధానం. ఏ పాపాన్ని అయినా తలపెట్టేవారు దీనిని ఆలోచించకపోవడం వారి స్వీయ బాధ్యతారాహిత్యంగానే పరిగణించాల్సి ఉంటుంది.

హిందూ మతోన్మాదుల్లారా మీ సంగతేంటి? "శివ పురాణం, రుద్ర సంహిత, యుద్ధ ఖండము, 22వ అధ్యాయం, 49 వ శ్లోకం-23 వ అధ్యాయం, 1-45 శ్లోకాల ప్రకారం, విష్ణువు, జలందరుడి భార్యయైన బృందను తన భర్తవేషంలో వెళ్ళి మానభంగం చేస్తాడు. జలందరుడు చంపబడతాడు. అది తెలుసుకున్న బృంద ఆత్మహత్య చేసుకుంటూ విష్ణువును "రాక్షసులు నీ భార్యను ఎత్తుకుపోతారని, నువ్వు అడవిలో అలమటిస్తావని శాపం పెడుతుంది". నిజానికి విష్ణువు రామావతారం ఎత్తిందే ఆ శాపం కారణంగా. రావణుడు సీతను ఎత్తుకుపోయినప్పుడు రాముడు కూడా దానిని ఒప్పుకుని తన పూర్వజన్మ పాపాల‌ (బృందను మానభంగం చెయ్యడం ఒకటి) కారణంగానే ఈ జన్మలో ఇన్ని వేదనలు ఎదుర్కొంటున్నానని వాపోతాడు

"వాల్మీకి రామాయణం, అరణ్యకాండ, 63వ సర్గ, 4వ శ్లోకం"

పూర్వం మయానూన మభిస్సీతాని పాపానికర్మణ్య ఆకృత్మృ తాని! తత్రామద్యాపతికో విపాకోదుఃఖేనదుఃఖంయదహంవిశాని

తాత్పర్యము: పూర్వము నేను నిశ్చయముగా యనేక పాప కర్మలు చేసితిని. కావున వాటి ఫలితమును ఇప్పుడు దుఃఖరూపమున అనుభవిస్తున్నాను అని శ్రీరాముడు చెప్పెను.

ఇప్పుడు చెప్పండి, రాముడు పూర్వజన్మలో మానభంగం చేస్తే ఈ జన్మలో అతని భార్యయైన సీతకు శిక్షయేంటి? బృంద శాపం కారణంగానే కదా ఆమెను రాక్షసుడైన రావణుడు ఎత్తుకుపోయాడు. లంకలో ఆమె చాలా వేదనపడవలసి వచ్చింది.

11. శీలపరీక్షలు చేయించిన బైబిల్ దేవుడు

సంఖ్యాకాండము 31:17,18‌ కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. "పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి".

ఈ సందర్భంలో మోషే మోయాబీయుల స్త్రీల విషయంలో మాట్లాడుతూ "పురుషసంయోగము ఎరిగిన స్త్రీలను చంపి, పురుషసంయోగము ఎరుగని ఆడపిల్లలను బ్రతకనివ్వమనడం" మనకు కనిపిస్తుంది. హిందూ మతోన్మాదులు దీనిని చూపిస్తూ "ఏ స్త్రీ పురుషసంయోగం ఎరిగిందో ఏ స్త్రీ ఎరగలేదో" వారికి ఎలా తెలుస్తుంది, అందుకే బైబిల్ దేవుడు ముందుగా ఆ స్త్రీలకు శీలపరీక్షలు చేయించాడని ఆరోపిస్తుంటారు.

ఇక్కడ ముందుగా మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ఇది యుద్ధానికి సంబంధించిన విషయం. పైగా ఈ యుద్ధం బిలాము ప్రేరణతో ఇశ్రాయేలీయులను దారి తప్పించిన మోయాబీయులతో జరుగుతుంది, అందులో స్త్రీలు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించారు.

సంఖ్యాకాండము 25:1,2 - "ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి".

కాబట్టి ఈ సందర్భంలో పురుషసంయోగం ఎరిగిన స్త్రీలు అంటే ఇశ్రాయేలీయులతో వ్యభిచరించిన మోయాబు స్త్రీలు అని స్పష్టంగా అర్థం ఔతుంది. ఆ కారణంగానే వారిని చంపమని ఆదేశిస్తున్నాడు. అలాంటప్పుడు పురుషసంయోగం ఎరిగిన స్త్రీలు, అంటే అక్కడున్న పురుషులతో వ్యభిచరించిన స్త్రీలు ఎవరో తెలుసుకోవడం కోసం మళ్ళీ ప్రత్యేకంగా శీలపరీక్షలు చెయ్యడం అవసరం లేదని వేరే చెప్పనవసరం లేదు.

ఇకపోతే "పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము వారిని బ్రతుకనియ్యుడి" అంటే వారిని శారీరకంగా అనుభవించడానికి అని కాదు. అలా చేస్తే వ్యభిచారం చెయ్యకూడదనే దేవుని ఆజ్ఞను (నిర్గమకాండము 20:14) ధిక్కరించినట్టు ఔతుంది. కాబట్టి మోషే చెబుతున్న మాటలకు అర్థం అది కాదు. "మీ నిమిత్తము వారిని బ్రతుకనియ్యుడి" అంటే వారిని దాసీలుగా చేసుకోవడానికి అని అర్థం. యుద్ధంలో ప్రాణం పోగొట్టుకోవడం కంటే ఇశ్రాయేలీయుల గృహాల్లో దాసీలుగా జీవించడం క్షేమమే కదా. పైగా ఇశ్రాయేలీయుల్లో బానిసలచేత కఠినసేవ చేయించుకోవడం నిషిద్ధం (నిర్గమకాండము 22:21). అంతేకాకుండా ఆ స్త్రీలలో ఎవరైనా ఇశ్రాయేలీయులకు నచ్చినట్టైతే వివాహం ద్వారా వారికి భార్య స్థానం కల్పించే అవకాశం కూడా ఉంది (ద్వితీయోపదేశకాండము 21:10-13). ఎలా చూసినా సరే యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకునేవారితో పోలిస్తే ఆ స్త్రీలకు మేలే జరుగుతుంది.

ఇక ఎవరు పురుషసంయోగము ఎరిగిన స్త్రీలో ఎవరు ఎరుగని స్త్రీలో శీలపరీక్షలు చేయించే నిర్థారించారా అంటే అలా ఎక్కడ రాసుందో హిందూ మతోన్మాదులు చూపించాలి. ఆ మాటలు వివాహం జరిగిన స్త్రీలా లేక వివాహం జరగని స్త్రీలా అని సాధారణంగా కన్యకలను గుర్తించే పద్ధతిలో చెప్పబడ్డాయి. సాధారణంగా మనం కూడా వివాహం కాని స్త్రీలను కన్యకలు అనే సంబోధిస్తుంటాము. వారికి శీలపరీక్షలు చేసి వచ్చే అలా అంటున్నామా? హిందూ గ్రంథాలలో కూడా కన్యకల ప్రస్తావన ఉంటుంది, అంటే ఆ గ్రంథాలు రాసినోళ్ళు ఆ స్త్రీలకు శీలపరీక్షలు చేసివచ్చాకే వారు కన్యకలు అని నిర్ధారించుకుని రాసారా? అది సరే శ్రీ కృష్ణుడు ఏ పరీక్షలు చేసొచ్చి అందమైన పురుషులను చూడగానే స్త్రీల యోని చెమ్మగిల్లుతుందని బోధించాడు?

"స్కందపురాణం, ప్రభాస ఖండము, 101వ అధ్యాయం, 28వ శ్లోకం"

ब्रहमचर्ये ऽ पि वर्त्तन्त्या योगिन्या वा प्रमादतः । प्रकृष्टं पुरुषं दृष्ट्वा वरा‌ङ्ग क्लिद्यते स्त्रियाः ॥२८॥

తాత్పర్యము: అందమైన పురుషులను చూసినప్పుడు మహిళల యోని చెమ్మగిల్లుతుంది.

మరికొందరు బైబిల్ విమర్శకులు "ద్వితీయోపదేశకాండము 22:13-18" వాక్యభాగాన్ని కూడా చూపించి యెహోవా దేవుడు శీలపరీక్షలు చేయించాడంటూ ఆరోపిస్తుంటారు. దానికి కూడా నేను సమాధానం ఇవ్వడం జరిగింది; ఈ వ్యాసం చదవండి.

స్త్రీకి శీలపరీక్ష, బైబిల్ దేవుని‌ వివక్షేనా?

12. పరమగీతాల్లో సెక్స్

హిందూ మతోన్మాదులు సొలోమోను రచించిన పరమగీతాలలో కొన్ని వాక్యాలను చూపించి అందులో సెక్స్ ఉందని ఆరోపిస్తుంటారు. నిజమే అందులో చాలా వాక్యభాగాలు లైంగికసంబంధం గురించే మాట్లాడుతున్నాయి. ఎందుకంటే అసలు ఆ పుస్తకం రాయబడిందే భార్యాభర్తల గురించీ వారిమధ్య ఉండాల్సిన లైంగిక ప్రేమను ప్రోత్సహించడానికీ. అలాంటప్పుడు అందులో లైంగికసంబంధం గురించిన మాటలు రాయబడితే అభ్యంతరమేంటి? భార్యాభర్తలు లైంగికంగా ఒకరితో ఒకరు సంతృప్తి చెందేటప్పుడు వారిమధ్య ప్రేమ మరింతగా బలపడుతుంది. వారి సంబంధం బలంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం సంతోషంగా క్షేమంగా ఉంటుంది. ఇది తెలియచెయ్యడానికే సొలోమోను ఆ పుస్తకం రచించాడు, అందుకే దానిని ప్రేమకావ్యం అని పిలుస్తారు. బైబిల్ అనేది చిన్నవారి దగ్గర నుండి పెద్దవారివరకూ అందరి కోసమూ రాయబడింది. ఉదాహరణకు, సామెతలు గ్రంథం చిన్నవారికీ యవ్వనస్తులకూ అవసరమైన బోధను చేస్తుంది. అలాగే పరమగీతాలు భార్యాభర్తల మధ్య ప్రేమను ప్రోత్సహిస్తుంది. దాని విషయంలో మతోన్మాదులు బురద చల్లడానికి ఏమీలేదు. పసిపిల్లల చేత పరమగీతాలు చదివించగలరా అంటే ఆ అవసరం మాకు లేదు, అది రాయబడింది భార్యాభర్తల కోసం. పసిపిల్లలకు వాటితో పనేంటి? వయసు వచ్చాక వారు కూడా చదువుతారు, భార్యతో/భర్తతో ఎంత అన్యోన్యంగా ఉండాలో నేర్చుకుంటారు. మతోన్మాదుల్లారా ఇంతకూ మీ గ్రంథాల్లో ఎన్ని గ్రంథాలు పసిపిల్లలు చదివేలా ఉన్నాయి? కనీసం పెద్దవారు కూడా చదివేలా లేవుగా అవి? వాటిలో కొన్ని ఇప్పటికే ప్రస్తావించాను, మరికొన్ని కూడా పెడుతున్నాను చూడండి.

వక్షోజాలనూ యోనినీ గోళ్ళతో గిచ్చేసిన శ్రీకృష్ణుడు

"బ్రహ్మ వైవర్త పురాణం, శ్రీకృష్ణ జన్మ ఖండము ఉత్తరార్థము, 72 అధ్యాయం, 59-63శ్లోకాలు"

ఇత్యుక్త్వా శ్రీనివాసశ్చ కృత్వా తామేవ, వక్షసి | నగ్నం చకార శృంగారం చుంబనం చాపికాముకీం ॥
సా సస్మితాచ శ్రీకృష్ణం నవసంగమలజ్జితా ।
చుచుంటే గండే క్రోడే తాం చకార కమలాం యథా |
సురతేర్విరతిర్నాస్తి దంపతీ రతి పండితౌ |
నానా ప్రకార సురతం బభూవ తత్ర నారద ॥
స్తనశ్రోణియుగం తస్యా వీక్షితం చ చకార హ
భగవాన్నఖరైస్తీక్షణైః దశనైరధరం వరం ॥
నిశావసాన సమయే వీర్యాధానం చకార సః |
సుఖసంభోగభోగేన మూర్ఛామాపచ సుందరీ ॥

తాత్పర్యము: ఆవిధంగా మాట్లాడుతూ కృష్ణుడు ఆమెను కౌగిలించు కున్నాడు. వస్త్రాలను విప్పి ఆమెను నగ్నంగా చేశాడు. మొదటిసారిగా ఆమె సంభోగ సుఖాన్ని అనుభవిస్తున్నందున సిగ్గుపడుతూ, చిరునవ్వు నవ్వుతూ శ్రీకృష్ణుని బుగ్గల పైన, వక్షఃస్థలము పైన ముద్దాడింది. లక్ష్మీదేవిని లాక్కున్నట్టు ఆమెను కృష్ణుడు తన ఒడిలోకి లాక్కున్నాడు. వారిద్దరూ విశ్రాంతి లేకుండా కామశాస్త్ర పండితులవలే రకరకాల శృంగార చేష్టలతో రతిలో మునిగితేలారు. కృష్ణుడు చేసిన రతిక్రీడలో గోటితో రక్కటం వలన ఆమెయొక్క రెండు రొమ్ములపైన గోటి గాట్లు పడ్డాయి. ఆమె యొక్క కటి ప్రదేశంలో అనగా రెండు పిరుదుల క్రింద భాగంలో కూడా కృష్ణుడి యొక్క పదునైన గోటి గాట్లు పడ్డాయి. అమృతం వలే ఉన్న ఆమె పెదవులను కృష్ణుడు జుర్రుకున్నాడు. అలా కృష్ణుడు ఆమెను సంభోగిస్తూ అర్ధరాత్రి సమయంలో ఆమె యోనిలో వీర్యం వదిలాడు. కృష్ణుడు చేసిన సుఖ సంభోగముతో ఆ సుందరి అలసిపోయి స్పృహ కోల్పోయింది.

శివపార్వతుల బహిరంగ సెక్స్

"శివపురాణం, రుద్రసంహిత, సతీఖండము, 21 అధ్యాయం, 20, 21 శ్లోకాలు"

సౌవర్ణ పద్మ కలికాతుల్యే తస్యాః కుచద్వయే ।
చకార భ్రమరాకారం మృగనాభి విశేషకమ్ ॥ హారమస్యాః కుచయుగాద్వియోజ్య సహసా హరః | న్యయోజయచ్చ తత్రైవ స్వకరస్పర్శనం ముహు ॥

తాత్పర్యము: బంగారు తామరపువ్వులవలే ఉన్న పార్వతీదేవి యొక్క రెండు రొమ్ముల మీద శివుడు కస్తూరి బొట్టుతో తుమ్మెదల చిత్రాలను చిత్రించెను. శివుడు హఠాత్తుగా పార్వతి యొక్క కుచముల (రొమ్ములు) నుండి హారమును తీయుట, మరల హారమును వేయుట అను పనులను చేస్తూ చేతితో ఆమె వక్షోజాలను పదే పదే వత్తుతూ ఉండెను.

"దేవీ భాగవతం, ప్రధమస్కంధము, 12 అధ్యాయం,  16-20 శ్లోకాలు"

ఏకదా గిరిశం ద్రష్టుమృషయః సనకాదయః |
దిశో వితిమిరాభాసాః కుర్వంతం సముపాగమన్ ॥
తస్మింశ్చ సమయే తత్ర శంకరః ప్రమదాయుతః |
క్రీడాసక్తో మహాదేవో వివస్త్రా కామినీ శివా ॥
ఉత్సంగే సంస్థితా భర్తూ రమమాణా మనోరమా ।
తా న్విలోక్యాంబికా దేవీ వివస్త్రా వ్రీడితా భృశమ్ ॥
భర్తురంకా త్సముత్థాయ వస్త్ర మాదాయ పర్యదాత్ | లజ్జావిష్టా స్థితా తత్ర వేపమానాతి మానినీ ॥ఋషయో పి తయో ర్వీక్ష్య ప్రసంగం రమమాణయోః | పరివృత్య యయు స్తూర్ణం నరనారాయణాశ్రమమ్ ॥

తాత్పర్యము: ఒకప్పుడు శివుడిని చూడటానికి సనకసనందనాది మహామునులు ఆ ఉద్యానవనానికి వచ్చారు. ఆ సమయంలో శివుడు పార్వతితో ఏకాంతమును అనుభవిస్తూ ఉన్నాడు. వారిద్దరూ కామక్రీడలో మునిగి ఉన్నారు. పార్వతి శరీరం మీద నూలుపోగు లేదు, నగ్నంగా ఉంది. శివుడి ఒడిలో కూర్చోని పరవశిస్తోంది. హఠాత్తుగా ఆ మునులు అక్కడికి వచ్చారు. వారినిచూసి పార్వతీదేవి సిగ్గుతో వణికిపోయింది. శివుడి ఒడిలో నుండి గబుక్కున లేచి చీర చుట్టుకుంది. వొణుకు తగ్గలేదు. మునులు నగ్నంగా తన శరీరాన్ని చూశారని సిగ్గుతో చచ్చిపోతూ, బాధపడుతూ నిలబడిపోయింది. ఋషులు పొరపాటును గ్రహించారు. వెంటనే అక్కడ ఉండకుండా నారాయణాశ్రమానికి పరుగుతీశారు.

బ్రాహ్మణుడి వేషంలో వచ్చిన రావణుడు తన రహస్య అవయవాలను కూడా అశ్లీలంగా పొగుడుతుంటే కోపపడకుండా మౌనంగా విన్న సీత.

"వాల్మీకి రామాయణం, అరణ్యకాండ, 46 సర్గ, 17-19 శ్లోకాలు"

సమా శ్శిఖరిణ స్నిగ్ధాః పాండురా దశనా స్తవ.
విశాలే విమలే నేత్రే రక్తాంతే కృష్ణ తార కే.
విశాలం జఘనం పీన మూరూ కరికరోపమౌ.

తాత్పర్యము: నీ నోటి పళ్ళు ఎగుడుదిగుడుగా లేకుండా సమానంగాఉన్నాయి. అవి తెల్లనివై మల్లెమొగ్గలవలె నున్నగా మొనదేలి యున్నవి. నీ కన్నులు విశాలములై, నిర్మలములై యున్నవి. కనుపాపలు నల్లనై, కనుకొన లెఱ్ఱనై యున్నవి. నీ నడుము విశాలంగా బాగా బలిసి యున్నది. నీ తొడలు ఏనుగు తొండముల వలె లావుగా నున్నగా ఉన్నాయి.

ఏతా వుపచితౌ వృత్తా సంహతౌ సంప్రవల్గితౌ. పీనోన్నతముకౌ కాంతౌస్నిగ్ధా తాళఫలోపమౌ మణిప్రవేకాభర నౌ రుచిరౌ తే పయోధరౌ విశాలం జఘనం పీనమూరూ కరికరోపమౌ ఏతావుపచితౌ వృత్తా సంహతౌ సమవల్గితౌ, పీనోన్నతముఖొ కానౌ స్నిగ్ధా తాలఫలోపమౌ మణిప్రవేకాభరణె రుచిరౌ తే పయోధరౌ.

తాత్పర్యము: నీ చన్నులు (వక్షోజాలు) పొడవుగా, గుండ్రముగా ఉన్నాయి. అవి ఒకదానితో ఒకటి రుద్దుకుంటూ ఉన్నాయి. అవి బరువుచే వంగి ఉన్నాయి, నీ చనుమొనలు గుండ్రంగా నునుపుదేలి అందంగా ఉన్నాయి. నీ చన్నులు రెండు తాటికాయలవలె గట్టిగా గుండ్రంగా ఉన్నాయి. నీ మెడలో ధరించిన మణిహారాలు నీ చన్నులపై పడటం వల్ల అవి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.

ఇలా రహస్య అవయవాలను కూడా అశ్లీలంగా‌ వర్ణిస్తుంటే ప్రతివ్రతలైన స్త్రీలెవరికైనా చెప్పుతో కొట్టాలనేంతగా కోపం వచ్చుద్ది, కొడతారు కూడా. కానీ ఇక్కడ సీతకు అలాంటి కోపం రాకపోగా అతనికి భిక్ష వెయ్యడానికి కూడా సిద్ధపడిందంటే సీత ఎంత గొప్ప ప్రతివ్రతనో కదా!

గుర్తుంచుకోండి: నేనింకా మీ ప్రధాన దేవీదేవుళ్ళ అశ్లీలతపైనే దృష్టి సారించాను, మిగిలినవారివి కూడా ప్రస్తావిస్తే చివరికి నీలిచిత్రాల్లో నటించేవారు కూడా అసహ్యపడతారేమో. అంత దరిద్రంగా ఉంటాయి ఆ చరిత్రలు.

13. యెహోవాకు ఇద్దరు భార్యలు (యెహెజ్కేలు 23)

హిందూ మతోన్మాదులు వారి దేవుళ్ళు ఇద్దరు ముగ్గురిని భార్యలుగా చేసుకున్న చరిత్రలనూ వారితో ఏకంగా సంవత్సరాలు సంవత్సరాలు ఆపకుండా సెక్స్ చేసిన కథలనూ చదివి "యెహోవా దేవుడు ఇశ్రాయేలు మరియు యూదా" దేశాల గురించి అలంకారంగా చెబుతున్న మాటలను వక్రీకరించి ఆయనకు కూడా ఇద్దరు భార్యలు ఉన్నారని బురద చల్లుతుంటారు. ఒకసారి ఆ సందర్భం చూడండి-

యెహెజ్కేలు 23:2-4 నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన యిద్దరు స్త్రీలు కలరు. వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె సహోదరి పేరు ఒహొలీబా. వీరు నాకు పెండ్లి చేయబడినవారై కుమారులను కుమార్తెలను కనిరి ఒహొలాయను పేరు షోమ్రోనునకును, ఒహొలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి.

ఈ సందర్భంలో ఆ ఇద్దరు స్త్రీలు ఒకప్పుడు ఐగుప్తులో జారత్వం చేసారని, ఒక స్త్రీ షోమ్రోనుకు, మరో స్త్రీ యెరూషలేముకు సూచనగా ఉందని స్పష్టంగా రాయబడింది. బైబిల్ చరిత్ర కొంచెంగా తెలిసినా సరే ఈ మాటలు ఇశ్రాయేలువారి కోసమూ యూదావారి కోసమూ చెప్పబడుతున్నాయని అర్థమైపోతుంది. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు షోమ్రోను రాజధాని, యూదావారికి యెరుషలేము రాజధాని. సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో ఒకే ఇశ్రాయేలు రాజ్యం అలా రెండుగా చీలిపోయింది (1 రాజుల గ్రంథం 12). ఐగుప్తుదేశంలో జారత్వం చేసి తర్వాత యెహోవా దేవుని ప్రజలుగా కనానులో ప్రవేశించింది ఇశ్రాయేలీయుల ప్రజలే (లేవీయకాండము 18:3, లేవీయకాండము 17:7, యెహెజ్కేలు 20:18). ఆ వాక్యభాగాల ప్రకారం, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండగా చేసిన విగ్రహారాధననే యెహెజ్కేలు 23లో జారత్వంగా పోల్చడం జరిగింది. విగ్రహారాధన అనే పాపం యొక్క తీవ్రతను తెలియచెయ్యడానికే అలా జారత్వంగా (భర్తను విడిచి వేరేవారితో శయనించడంగా) పోల్చబడింది.

లేవీయకాండము 17:7 ​వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇకమీదట తమ బలిపశువులను వధింపరాదు. ఇది వారి తర తరములకు వారికి నిత్యమైన కట్టడ.

యెహేజ్కేలు 20:30 ​కావున ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగామీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే వారు పెట్టుకొనిన విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే.

ఆ క్రమంలో వాడబడిన "యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి" (యెహెజ్కేలు 23:3) అనే పదజాలం కూడా ఆ పాపం (విగ్రహారాధన) పట్ల దేవుని‌కి ఎంత అసహ్యభావం ఉందో తెలియచెయ్యడానికే ఉపయోగించబడింది. మతోన్మాదులు ఈ పదజాలాన్ని కూడా పట్టుకుని అదిగో అశ్లీలం అశ్లీలం అంటూ గగ్గోలు పెడుతుంటారు. అందుకే ఈ మాటలు ప్రత్యేకంగా చెబుతున్నాను.

కాబట్టి ఒహొలా, ఒహొలీబా అంటే వారు అక్షరార్థంగా ఎవరో ఇద్దరు స్త్రీలు అని‌ కాదు. రెండు రాజ్యాలు అని అర్థం. బైబిల్ దేవుడు తన ప్రజలపై తన అధికారాన్ని తెలియచెయ్యడానికి, ఆయనకు ఆ ప్రజలు లోబడియుండాలని బోధించడానికి అలా భర్తగా పోల్చుకోవడం లేఖనాలలో చాలా సాధారణం (యెషయా 54:5). యేసుక్రీస్తు సంఘానికి భర్త అని కూడా ఇదే భావంలో చెప్పబడింది (ఎఫెసీ 5:23-27). మతోన్మాదులకు ఇవేం అవసరం లేదు, ఎలాగైనా బైబిల్ దేవుడు కూడా వారి దేవుళ్ళలాగా ఇద్దరు ముగ్గురు భార్యలను కలిగియున్నాడని, వారి దేవతల్లాగే ఆయన కూడా అపవిత్రమైన కార్యాలు చేసాడని అడ్డకోలుగా వాదించడమే వారి జీవితధ్యేయం. అందుకే ఈ కుట్రలన్నీ.

గుర్తుంచుకోండి: మానవులను స్త్రీనిగానూ పురుషునిగానూ సృష్టించిందే ఆయన (ఆదికాండము 5:1,2). వారి మధ్యలో లైంగిక సంబంధాన్ని పెట్టి వారిని‌ ఫలించమని చెప్పిందే ఆయన (ఆదికాండము 2:24, ఆదికాండము 1:27,28). ఆయనకు మనలాగా భార్య అవసరం కానీ లైంగికవాంఛను తీర్చుకోవాలనే కోరికలు కానీ ఉండవు. మనకున్న బంధాలనూ కోరికలనూ దేవునికి ఆపాదించకూడదు. అవి కేవలం మతోన్మాదుల కల్పిత దేవుళ్ళ కథలకు మాత్రమే పరిమితం.

14. లంగాలు ఎత్తి చూపిస్తానన్న బైబిల్ దేవుడు

యిర్మీయా 13:26‌ కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తుచున్నాను.

హిందూ మతోన్మాదులు ఈ వాక్యభాగాన్ని చూపించి మీ బైబిల్ దేవుడు స్త్రీల లంగాలు ఎత్తి చూపిస్తాను అన్నాడంటూ హేళన చేస్తుంటారు. కానీ ఒకసారి ఈ సందర్భం చూడండి.

యిర్మీయా 13:25-27 నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నాచేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను. నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జారకార్యములను కామాతురతను నేనెరుగుదును; పొలములలోనున్న మెట్టలమీద నీ హేయక్రియలు నాకు కనబడుచున్నవి; "యెరూషలేమా", నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్ర పరచుకొననొల్లవు; ఇక నెంత కాలము ఈలాగు జరుగును?

ఈ సందర్భం ప్రకారం ఆయన "కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తుచున్నాను" అంటున్న మాటలు ఎవరో కొందరు స్త్రీలను ఉద్దేశించి పలుకుతున్నవి కావు. ఆయన యెరూషలేము అనే పట్టణం (యూదా దేశం) గురించి ఇలా మాట్లాడుతున్నాడు. ఆ పట్టణం చేసిన హేయక్రియలను బట్టి ఆయన దానిని శత్రువుల చేతికి అప్పగించబోతున్నాడని అప్పుడు ఆ పట్టణానికి సిగ్గు కలుగబోతుందని వీటి భావం. శత్రువులు వచ్చి యెరూషలేము పట్టణంపై దాడి చేసి అందులో చెరపట్టబడినవారిని వివస్త్రలుగా తమ దేశానికి తీసుకుపోయేటప్పుడు అక్షరార్థంగానూ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఆ పట్టణానికి కలిగే అవమానాన్ని బట్టి అలంకారంగానూ ఈ మాటలు నెరవేరతాయి. ఉదాహరణకు ఈ మాటలు చూడండి.

యెషయా 20:4‌ ​అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశమునుండి కొనిపోబడిన కూషీయులను, పిన్నలను పెద్దలను, దిగంబరులనుగాను చెప్పులు లేనివారినిగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదులమీది వస్త్ర మును ఆయన తీసివేసి వారిని కొనిపోవును.

కాబట్టి అక్కడ దేవుడు పలుకుతున్నమాటలు యుద్ధానికి సంబంధించిన మాటలు. కానీ ఈ మతోన్మాదులకు ఎంతసేపూ లంగాలు ఎత్తడం, వీర్యం కార్చుకోవడం పైనే ధ్యాస. వారి గ్రంథాలు వారిని అలా తయారుచేసాయి మరి. మనం మాత్రం ఏం చెయ్యగలం తప్పు అని చెప్పడం తప్ప.

రతీదేవుని చూసి వీర్యం కార్చుకున్న బ్రహ్మ

"బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మ ఖండము, 4వ అధ్యాయం, 13వ శ్లోకము"

రతిం దృష్ట్యా బ్రహ్మణశ్చ రేతః పాతో బభూవ హ | తత్ర తస్టౌ మహాయోగీ వస్త్రేణాచ్ఛాద్యలజ్జయ ॥

తాత్పర్యము: రతీదేవిని చూచిన బ్రహ్మదేవునికి వెంటనే వీర్య స్కలనం జరిగినది. బ్రహ్మదేవుడు సిగ్గుతో గబగబా ఒక వస్త్రమును తెచ్చి వీర్యముపై వేసి అది ఎవరికీ కానరాకుండా కప్పివేసెను.

అగ్నిదేవుడి చేత వీర్యం త్రాగించిన శివుడు

"పద్మ పురాణం, సృష్టి ఖండము, 44 అధ్యాయం, 123-127 శ్లోకాలు"

ప్రవిశ్య పక్షి రంధ్రీణ శుకరూపీ హుతాశనః | 
దదర్శ శయనే సర్వం రతౌ గిరిశయా సహ॥
దదర్శ తం చ దేవేశో హుతాశం శుకరూపిణమ్ |
తమువాచ మహాదేవః కించిత్ కోప సమన్వితః ॥
నిషిక్తమర్థం దేవ్యాం మే వీర్యం చ శుకవిగ్రహ! |
లజ్జయా విరతిశ్చాస్య త్వమర్ధం పిబ పావక! ॥
యస్మాత్ తు త్వత్కృతే విఘ్నం తస్మాత్ త్వయ్యుపపద్యతే |
ఇత్యుక్తః ప్రాంజలి ర్వహ్ని రపిబద్వీర్యమాహితమ్ ॥
తేనాపుతాస్తతో దేవాః తన్ముఖా ఋభవో యతః |
విపాట్య జఠరం తేషాం వీర్యం మాహేశ్వరం తతః |

తాత్పర్యము: అగ్ని చిలుక రూపాన్ని ధరించి శివుని యొక్క రహస్య మందిరంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో శివుడు పార్వతితో సంభోగిస్తూ ఉన్నాడు. హఠాత్తుగా అగ్ని పక్షి రూపంలో లోపలికి వచ్చి శివుడి యొక్క సంభోగాన్ని చెడగొట్టాడు. దానికి శివుడు కోపించి అగ్నితో ఇలా అన్నాడు.

ఓ అగ్నీ! నేను పార్వతిని సంభోగిస్తుండగా నువ్వు హఠాత్తుగా వచ్చిసంభోగ కార్యాన్ని చెడగొట్టావు. సరిగ్గా నీవు వచ్చేసమయానికి నేను వీర్యమును ఆమె యోనిలో వదులుతూ ఉన్నాను. ఆ క్రమంలో సగం వీర్యం వదిలాను, మిగిలిన సగభాగం వీర్యం అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు నా వీర్యాన్ని త్రాగుము అన్నాడు. గత్యంతరం లేక అగ్ని అంగీకరించాడు. అప్పుడు శివుడు మిగిలిన తన వీర్యాన్ని అగ్ని నోట్లో వదిలాడు, అగ్ని శివుడి యొక్క వీర్యాన్ని త్రాగాడు.

ఈ శివుడు అగ్నిదేవుడి చేత తన వీర్యాన్ని త్రాగించడమే కాదు, ఇంకా దరిద్రంగా దేవతలకు తన వృషణాలను (Testicles) కూడా తినమని ఆజ్ఞాపిస్తాడు. 

"పద్మ పురాణం, సృష్టి ఖండము, 31 అధ్యాయము, 122 నుండి 128 శ్లోకాలు"

ఆసాం కృతం దేహి భోజ్యం దుర్లభం యత్రివిష్టపే | స్నేహాక్తం సగుడం హృద్యం సుపక్వం పరికల్పితం ॥ క్వచిన్నాన్యేన యద్భుక్తమపూర్వం పరమేశ్వర! | ఏవముక్తస్తదా సోపి దేవదేవో మహేశ్వరః ॥
భక్ష్యార్థం తాస్తదా ప్రాహ పార్వత్యాశ్చైవ సన్నిధౌ । మయా వై సాధితం చాన్నం ప్రకారైర్బహుభిః కృతమ్ ॥ తత్సర్యం చ వ్యయం యాతం న చాన్యదిహ దృశ్యతే | భవతీష్వాగతాస్వద్య కిం మయా దేయముచ్యతామ్ ॥ అపూర్వం భవతీనాం యన్మయా దేయం విశేషతః | ఆస్వాదితం న చాన్యేన భక్ష్యార్ధి చ దదామ్యహమ్ ॥ అధో భాగే చ మే నాభేర్వర్తులౌ ఫలసన్నిభౌ । భక్షయధ్వం హి సహితా లంబౌ మే వృషణావిమౌ ॥ అనేన చాపి భోజ్యేన పరా తృప్తిర్భవిష్యతి । మహాప్రసాదం తా లబ్ధ్వా దేవ్య స్సర్వాస్తదా శివమ్ ॥

తాత్పర్యము: శివదూతి ఇలా పలికింది. ఓ శంకరా! స్వర్గమునందు లభించనిది, నూనె బెల్లములతో కూడినది, చక్కగా వండినది, ఇంతకు మునుపు ఎవరూ రుచి చూడనిది, వారికి మాత్రమే చేయబడిన ఆహారమును ఈ దేవతలకు ఇవ్వుము అనెను. అంతట శివుడు పార్వతి సమక్షములో ఇలా పలికెను. ఎన్నోరకాల వంటకములను నీకు ఇచ్చాను. ఇక మిగిలినవి ఏవీ లేవు. ఇక నీకు క్రొత్తగా ఏమీ ఇవ్వవలయునో చెప్పు. నా బొడ్డు క్రింద పండ్లవంటి గుండ్రని వృషణములు (Testicles) (బీర్జములు) వ్రేలాడుతూ ఉన్నవి. వాటిని తినుట వలన మీకు తృప్తి కలుగును అనెను. అప్పుడు వారంతా మహా ప్రసాదమని పలికి శివునకు నమస్కరించిరి.

అంటే దేవతల చేత తన వీర్యాన్ని త్రాగించే మరియు తన వృషణాలను (Testicles) తినిపించేవాడా హిందువుల దేవుడు శివుడు? వారి గ్రంథాల్లో అలానే రాసుందిగా మరి.

15. యేసుక్రీస్తు వ్యభిచారమందు పుట్టాడా?

యోహాను 8:41 మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారు మేము వ్యభిచారము వలన పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా-

ఈ సందర్భంలో యూదులు యేసుక్రీస్తుతో "తమను తాము వ్యభిచారము వలన పుట్టినవారము కామని" ప్రస్తావించుకోవడాన్ని హిందూ మతోన్మాదులు వక్రీకరించి, అంటే వారు యేసుక్రీస్తు వ్యభిచారం‌ వల్ల పుట్టినవాడని ఆరోపిస్తున్నారని మాట్లాడుతుంటారు. కానీ యేసుక్రీస్తు యూదులలో ఎవరి కుమారుడిగా ఎంచబడ్డాడో చూడండి -

లూకా 3:23 యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడు; ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను.

మత్తయి 13:55 ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా?

ఈ వాక్యభాగాల ప్రకారం యేసుక్రీస్తును యూదులంతా యోసేపు కుమారుడిగానే భావించారు. యేసుక్రీస్తును కొందరు మెస్సీయ కాదని అనుమానించడానికి కూడా కారణం అదే (యోహాను 7:27‌ 27).

(గలిలీయలో పుట్టాడు అనుకుని ఆయన ఎక్కడివాడో మేము ఎరుగుదుము అనుకున్నారు, కానీ ఆయన పుట్టింది గలిలీయలో కాదు బెత్లెహేములో)

కాబట్టి యేసుక్రీస్తు వ్యభిచారం‌ వల్ల పుట్టాడనే అభిప్రాయం యూదులలో ఎంతమాత్రమూ లేదు. వారు ఆయనతో "మేము వ్యభిచారము వలన పుట్టినవారము కాము" అని పలుకుతున్న మాటలు "అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రాహామనిరి" (యోహాను 8:39) అనే సందర్భానికి చెందినవి. అంటే యేసుక్రీస్తు అక్కడ వారితో "మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు" (యోహాను 8:39) అన్న మాటలను వారు అపార్థం చేసుకుని అనగా ఆయన వారినేదో అబ్రాహాము వల్ల కాకుండా వ్యభిచారం వల్ల పుట్టినవారిగా నిందిస్తున్నట్టు అనుకుని "మేము వ్యభిచారము వలన పుట్టినవారము కాము" అనే మాటలు పలుకుతున్నారు. ఒకవేళ యూదులు యేసుక్రీస్తు గురించే ఆ మాటలు అంటుంటే మధ్యలో తమ గురించి చెప్పుకోవడం ఎందుకు, ఆయననే "నువ్వు వ్యభిచారం వల్ల పుట్టినవాడవు" అనొచ్చుగా? ఇలా ఉంటుంది హిందూ మతోన్మాదుల కుయుక్తి. వారు యథార్థంగా యేసుక్రీస్తు పుట్టుకపై బురద చల్లలేరు కాబట్టి, ఐతే ఎవడో రాసిన పుస్తకాలను ఆధారం చేసుకునో లేదా ఇలా వివరంగా ఉన్న మాటలను కూడా వక్రీకరించో ఏదోటి చెయ్యాలిగా మరి. వారి దేవుడైన శ్రీకృష్ణుడు వారికి అదే నేర్పించాడు (Like అశ్వత్థామ హతః కుంజరహా). ఆయనేమో వేళ్ళకు గోళ్ళు ఉన్నాయని ఎక్కడెక్కడో గిచ్చుతుంటాడు (యోని పైనా వక్షోజాల పైనా అని 12వ భాగంలో ఆధారాలతో వివరించాను) వీరేమో నోట్లో పళ్ళు ఉన్నాయని ఏదేదో వాగుతుంటారు.

వాస్తవానికి మరియమ్మ గర్భవతియైంది పరిశుద్ధాత్మ శక్తి కారణంగా అని, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాక అపోస్తలులు పరిశుద్ధాత్మ ప్రేరణతో సువార్తలు రాసేవరకూ ఎవరికీ తెలియదు. మరియ గర్భవతిగా ఉన్నప్పుడే యోసేపు ఆమెను చేర్చుకున్నాడు. అప్పటి నుండి ఆమెకు పుట్టిన యేసుక్రీస్తు యోసేపు కుమారుడిగానే పెంచబడ్డాడు. ఆయన ఎక్కడ పుట్టాడో (బెత్లెహేము) తెలియని యూదులకు (గలిలీయ అనుకున్నారు) ఆయన ఎలా పుట్టాడో ఎలా తెలుస్తుంది? అపోస్తలులు ఆయన కన్యకకు పుట్టాడని సువార్తలు రాసాకే కొందరు యూదులు ఆయన పుట్టుకపై తప్పుడు ఆరోపణలు చెయ్యడం ప్రారంభించారు. అంతకుముందు వారందరూ ఆయనను యోసేపు కుమారుడిగానే భావించారు. ఆ కారణంగా చిన్నచూపు చూసారు. "ఇతడు వడ్లవాని కుమారుడు కాడా?"

హిందూ మతోన్మాదులు చివరికి యేసుక్రీస్తు తల్లియైన మరియ పరిశుద్ధాత్మ మూలంగా గర్భవతియైనదానిని కూడా శారీరకసంబంధంతో ముడిపెడుతుంటారు. కానీ అక్కడ ఏమని రాయబడిందో చూడండి -

లూకా 1:35 దూత పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; "సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును" గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.

మరియ గర్భవతియైంది, సర్వోన్నతుడైన పరిశుద్ధాత్ముడు ఆమెపైకి వచ్చి ఆయన శక్తి ఆమెను కమ్ముకోవడాన్ని బట్టని ఈ వాక్యభాగం స్పష్టంగా తెలియచేస్తుంది. అంటే పరిశుద్ధాత్ముని అద్భుతం ద్వారా అది జరుగుతుందని అర్థం. లేఖనాలలో పరిశుద్ధాత్మ (యెహోవా ఆత్మ) ఒకరిపైకి దిగిరావడం లేదా కమ్ముకోవడం ఆయన వారి ద్వారా జరిగించబోయే అద్భుతాన్ని (కార్యాన్ని) సూచిస్తుంది. ఉదాహరణకు-

అపో.కార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.

న్యాయాధిపతులు 3:10 యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతని చేతికప్పగించెను, ఆతడు కూషన్రిషాతాయిమును జయించెను.

1 సమూయేలు 10:10 వారు ఆ కొండదగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను.

ఆ మాటలను (మీదికి రావడం, కమ్ముకోవడం) మీ దేవుళ్ళు పరాయి పురుషుల భార్యలతో పెట్టుకున్న లైంగికసంబంధంతో ముడిపెడితే ఎలా? ముందు సర్వోన్నతుడు అంటే అర్థం తెలుసుకోండి. బైబిల్ ప్రకారం సర్వోన్నతుడు అంటే దేవుడు. ఆయనకు భార్యల అవసరం కానీ లైంగికసంబంధం పెట్టుకోవాలనే కోరికలు కానీ ఉండవు. మీ దేవుళ్ళ చరిత్రలోని బురదను తీసుకువచ్చి మా దేవుడికి అంటించే ప్రయత్నాలు చెయ్యకండి. అది మీ వల్ల కాదు. చరిత్రలో అలా ప్రయత్నించిన మీకంటే ఉన్మాదులు కాలగర్భంలో కలసిపోయారు. ఇంతకూ మీ అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడో వివరించగలరా? నేను వివరిస్తున్నాను చూడండి.

"బ్రహ్మాండ పురాణం, ఉత్తరార్థం, 10వ అధ్యాయం, 71-77 శ్లోకాలు"

71. స్ఫురచ్చంద్రకలోత్తంసమదలోలవిలోచనా । సర్వశృంగారవేషాధ్యా సర్వాభరణమండితా ॥

72. తామిమాం కందుక క్రీడాలోలామాలోలభూషణామ్ | దృష్ట్వా క్షిప్రముమాం త్యక్త్వా స్కోం స్వధావదథేశ్వరః ॥

73. ఉమాపి తం సమావేక్ష్య ధావంతం చాత్మనః ప్రియమ్ । స్వాత్మానం స్వాత్మసౌందర్యం నిందంతీ చాతివిస్మితా ॥ తస్థానవాళ్ముఖీ తూషీం లజ్ఞాసూయాసమన్వితా ॥

74. గృహీత్వా కథమప్యేనామాలిలింగ ముహుర్ముహుః । ఉదూయోద్దూయ సౌప్యేవం ధావతిస్మ సుదూరతః ॥

75. పునర్గృహీత్వా తొమిశః కామం కామవశీకృతః | ఆక్లిష్టం చాతివేగేన తద్వీర్యం ప్రచ్యుతం తదా॥ తతః సముత్తితో దేవో మహాశాస్త్రో మహాబలః

76. అనేకకోటిదైత్యేంద్రగర్వనిర్వాపణక్షమః ॥ తద్వీర్యబిందుసంస్పర్శాతా భూమిస్తత్ర తత్రచ। రజతస్వర్ణవర్ణాభూలక్షణాద్విధ్యమర్దన ॥

77. తథైవాంతర్దధే షాపి దేవతా విశ్వమోహినీ । నివృత్తః స గిరీశోపి గిరిం గౌరీసఖి యయౌ ॥

తాత్పర్యము: ఆమె సర్వాభరణములనలంకరించు కొన్నది. ప్రస్తుతము కందుక క్రీడ (బంతాట)లో నిమగ్నమైయున్నది. ఆయాటచే ఆభరణములన్నియు కదలుచున్నవి. అట్టి మోహినిని జూచిన వెంటనే ఈశ్వరుడు ఉమను వదలి యామె వెంట పరుగెత్తెను. ఉమాదేవి కూడా మోహిని వెంట పరుగిడుచున్న తన ప్రియుని బాగుగా జూచీ, మిక్కిలి యాశ్చర్యము చెంది, తనను తన సౌందర్యమును నిందించుకొనెను. అసూయతో తలవంచుకొని నిలుచుండెను. చిట్ట చివరకు శివుడు ఆ మోహినిని మాటిమాటికి కౌగిలించుకొనేను, మోహిని కూడా దూరముగా విదిలించుకొని పరుగెత్తుచుండెను. కామంతో ఉన్న శివుడు ఆమెను మరలబట్టుకొని యతివేగముగా ఆమెయందు వీర్యస్కలనం చేసెను. "ఓ యగస్త్య మహర్షి దాని నుండి మహాబలుడు దేవుడైన మహాశాస్త్ర యావిర్భవించెను". అతడు అనేక కోటి దైత్యేంద్రుల గర్వమును నశింపజేయ సమర్థుడు. శివుని వీర్యబిందువులు భూమిమీద పడినచోటల్లా ఆ భూభాగం మొత్తం వెండి, బంగారముగా మారిపోయినది.

అలానే "భాగవతం 8వ స్కంధము, 12వ అధ్యాయం, 25-34 శ్లోకాల" ప్రకారం మోహిని రూపంలో ఉన్న విష్ణువును చూసిన శివుడు వీర్యం కార్చుకుంటూ పరుగెత్తాడు, అలా కారిన వీర్యమే భూమిపై బంగారం, వెండిగా అవతరించింది. మిగిలిన వీర్యంతో విష్ణువుకూ శివుడికీ అంటే ఒక మగాడికీ మరో మగాడికీ పుట్టినవాడే అయ్యప్ప. కాదని ఏ మతోన్మాదైనా వారి గ్రంథాల ఆధారంగా నిరూపించగలడా? నాకు తెలుసు దీనిపై కొన్ని సమర్థింపులు వస్తాయి. ఉదాహరణకు, అక్కడ విష్ణువు పూర్తిగా స్త్రీ రూపంలో అనగా మోహినీగా మారిపోయాడు కాబట్టి పూర్తి స్త్రీగా ఉన్న మోహినీతో శివుడు సెక్స్ చెయ్యడం తప్పు కాదు అని. కానీ వాస్తవికంగా ఇద్దరూ మగాళ్ళా కాదా? అది నా ప్రశ్న. అవతల ఉన్నది ఆడదాని వేషం ధరించిన మగాడు (విష్ణువు) అని తెలిసినా శివుడు వీర్యం కార్చుకుంటా అతని (ఆమె) వెంటపరుగెట్టాడా లేదా? ఇది అభ్యంతరం. అలా కొండలపైనా గుట్టలపైనా కారగా కారగా మిగిలిన శివుడి వీర్యంతోనే అయ్యప్ప జన్మించాడా లేదా? ఇది నా ఆరోపణ.

యెషయా 57:3-6 మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యాసంతానమా, మీరక్కడికి రండి. మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా? మస్తచావృక్షములను చూచి పచ్చని ప్రతిచెట్టు క్రిందను కామము రేపుకొనువారలారా, లోయలలో రాతిసందులక్రింద పిల్లలను చంపువారులారా, నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే యున్నది అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము నర్పించుచున్నావు. ఇవన్నియు జరుగగా నేను ఊరకుండదగునా?

                                       ముగింపు

పుస్తక ప్రారంభంలో తెలియచేసిన మాటలనే క్లుప్తంగా మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పుస్తకంలో నేను హిందూ దేవీదేవతల ఉదంతాలను ప్రస్తావించింది హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి కానే కాదు. హిందూ మతోన్మాదులు వారి దేవీదేవతలను గొప్పవారిగా చూపించుకోవడానికి బైబిల్ పై బైబిల్ దేవునిపై అన్యాయపు ఆరోపణలకు పాల్పడుతుండటాన్ని బట్టే నేను ఒకవైపు నా దేవునిపై, నా గ్రంథంపై చెయ్యబడుతున్న అన్యాయపు ఆరోపణలకు సమాధానం ఇస్తూ అలానే వారు గొప్పగా ప్రస్తావిస్తున్న దేవీదేవతల అశ్లీలతనూ అనైతికనూ కూడా ప్రస్తావించవలసి వచ్చింది. ఈ విషయంలో సాధారణ హిందువులు నిందించాల్సింది నాకు అలాంటి పరిస్థితి కల్పించిన మతోన్మాదులనే. ఎందుకంటే వారే కనుక బైబిల్ పైనా బైబిల్ దేవునిపైనా అన్యాయపు ఆరోపణలు చెయ్యకుంటే నేనసలు ఈ పుస్తకమే రాసేవాణ్ణి కాను. కానీ వారు తమ దేవీదేవతల నీచ చరిత్రలను దాచిపెట్టి బైబిల్ దేవునిపై నీచపు ఆరోపణలు చెయ్యబట్టే ఆ దేవీదేవతల భాగోతాలను ప్రస్తావించాను. ఆ క్రమంలో వారికి సంబంధించిన రచనలు చదవడానికి ఎంతగా అసహ్యపడ్డానో నాకూ దేవునికీ తెలుసు. నిజానికి నేను ఆ దేవీదేవతలకు సంబధించి మరికొన్ని అసహ్యమైనవి కూడా ప్రస్తావిద్దును, కానీ ఈ పుస్తకం చదివేవారిలో కొందరు సున్నిత మనస్కులు ఉండే అవకాశం ఉంది కనుక మరీ ఇబ్బందికరంగా ఉన్నవాటిని కావాలనే దాటవేసాను. 

క్రైస్తవ సహోదరీ సహోదరులకు విన్నపం:
హిందూ మతోన్మాదులే కాదు బైబిల్ పైనా బైబిల్ దేవుని పైనా ఎవరు ఎన్నివిధాలుగా బురద చల్లాలని చూసినా మనకంటూ లేఖనాలపై అవగాహన ఉంటే ఆ ఆరోపణలకు సులభంగా సమాధానం ఇవ్వగలం. ధర్మశాస్త్రాన్ని విడిచి నడుచుచున్న భక్తిహీనుల విషయంలోనే భక్తుడైన దావీదుకు అధిక రోషం (కోపం) పుట్టినప్పుడు (కీర్తనలు 119:53) ఆ ధర్మశాస్త్రాన్ని (బైబిల్ ను) అన్యాయంగా నిందించే మతోన్మాదుల (విమర్శకుల) విషయంలో మనం మరెంత రోషంగా ఉండి వారికి గండ్రగొడ్డలితో నరికినట్టు సమాధానాలివ్వాలి? "మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును" (లూకా 21:15) అనేది ప్రభువు మనకు చేసిన వాగ్దానం. కాబట్టి లేఖనాలపై అవగాహన కలిగియుండటం ప్రతీ క్రైస్తవుని బాధ్యత అని గుర్తుంచుకోండి. అందుకై మనం ప్రతీరోజూ లేఖనాలను ధ్యానించడం, వాటికి సంబంధించిన వ్యాఖ్యానాలను పరిశీలించడం క్రమం తప్పకుండా చేస్తుండాలి. ఆ క్రమంలో hithabodha.com లోని మా బైబిల్ వ్యాఖ్యానాలు, పుస్తకాలు, వ్యాసాలు కూడా మీకు ఎంతగానో సహాయపడతాయి. ఈ విధంగా లేఖనాల విషయంలో మనం పరిణతి సంపాదించినప్పుడు విమర్శకుల అన్యాయపు లేక ఆజ్ఞానపు ఆరోపణల విషయంలో‌ మనం అభ్యంతరపడకుండడ మే కాదు అభ్యంతరపడే బలహీనులను కూడా బలపచగలం.

రోమీయులకు 15:1 కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.

1పేతురు 2:15 మీరిట్లు యుక్తప్రవర్తన గలవారై (మేలు చేయువారై), అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము.

ప్రభువు కృప మీ ఆత్మలకు తోడైయుండును గాక!

"హిందూ మతోన్మాదులు బైబిల్ పై చేస్తున్న మరికొన్ని ఆరోపణలకు సమాధానాలు"

యెహోవా దేవుడు నరబలులు కోరేవాడా?

బైబిల్ దేవునికి స్త్రీలపై వివక్ష వాస్తవమా లేక ఆరోపణా?

మోషే ధర్మశాస్త్రానికి‌ ముందు నైతిక ఆజ్ఞలు లేవా?

అంగవైకల్యం గలవారిపై బైబిల్ దేవుని వివక్ష వాస్తవమా?

ఇశ్రాయేలీయులు కనానీయులను సంహరించడం నేరమా? న్యాయమా?

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.