శాస్త్రులును పరిసయ్యులును దేవదూషణ చేయుచున్న యిత డెవడు ? దేవుడొ క్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింప గలడని ఆలోచించు కొనసాగిరి .
పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచిసుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి.
పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతని చేత బాప్తిస్మము పొందక , తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి .
అయ్యో , ధర్మశాస్త్రోపదేశకులారా , మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొని పోతిరి ; మీరును లోపల ప్రవేశిం పరు , ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను .
ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి , ఆయన నోట నుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి ,
వదకుచు చాలసంగతులను గూర్చి ఆయనను మాటలాడింప సాగిరి .
సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.
ఆ సమయమున యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి
యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులుఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.
యెరూషలేమునుండి వచ్చిన పరిసయ్యులును శాస్త్రులలో కొందరును ఆయనయొద్దకు కూడివచ్చి
ప్రభావము ఆయనలోనుండి బయలుదేరి అందరిని స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నముచేసెను.
తాను మరుగై యుండలేదని , ఆ స్త్రీ చూచి , వణకుచు వచ్చి ఆయన యెదుట సాగిలపడి , తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో , వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజ లందరి యెదుట తెలియజెప్పెను .
గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.
పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకర మైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.
రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచకక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.
మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను;