జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి.
అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఈలాగు జరిగెను.
ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు , ఒక్కడును లేడు
గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు
అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి .మేలు చేయువాడు లేడు , ఒక్కడైనను లేడు .
వారి గొంతుక తెరచిన సమాధి , తమ నాలుకతో మోసము చేయుదురు;వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది
వారి నోటి నిండ శపించుటయు పగయు ఉన్నవి.
రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి.
నాశనమును కష్టమును వారి మార్గము లలో ఉన్నవి.
శాంతి మార్గము వారెరుగరు .
వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు .
ప్రతి నోరు మూయబడునట్లును , సర్వ లోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును , ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటి నన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదుము .
దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పుతీర్చుచున్నాడు .
మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను .
అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు .
అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు.
కాగా యెహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని; నీ అన్న అహరోను నీకు ప్రవక్తగానుండును.
నీవు దేవుని నిందింపగూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు.
నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవతల యెదుట నిన్ను కీర్తించెదను.