రెండు బంగారపు కొమ్ములలోనుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవచెట్లకున్న రెండు కొమ్మలును ఏమిటివనియు నేనతనిని నడుగగా
అతడు నాతో-ఇవేమిటివని నీకు తెలియదా యనెను-నా యేలినవాడా, నాకు తెలియదని నేననగా
అతడు వీరిద్దరు సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడుచు తైలము పోయువారైయున్నారనెను.
అప్పుడు-నా యేలినవాడా, యివి ఏమని నేనడుగగా నాతో మాటలాడు దూత-ఇవి ఏమియైనది నేను నీకు తెలియజేతుననెను.
ఇవి ఏమిటివని నేను నాతో మాటలాడుచున్న దూతనడుగగా అతడు-ఇవి యూదావారిని ఇశ్రాయేలువారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను.
ఇదేమిటియని నేనడిగితిని. అందుకతడు-ఇది కొల, ఇది బయలువెళ్లు తూము అనెను; మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడుదురని చెప్పెను.
నా యేలినవాడా, యివేమిటియని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా
నేను దగ్గర నిలిచియున్న వారిలో ఒకని యొద్దకు పోయిఇందునుగూర్చిన నిజ మంతయు నాకు చెప్పుమని అడుగగా , అతడు నాతో మాటలాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేసెను .
ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి.
అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు ; వారు యుగ యుగములు యుగయుగాంతములవరకు రాజ్య మేలుదురు .
ఇనుప దంతములును ఇత్తిడి గోళ్లును గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలిసికొన గోరితిని ; అది యెన్నటికి భిన్నమును మిగుల భయంకరమునై , సమస్తమును పగులగొట్టుచు మింగుచు మిగిలిన దానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను .
నేను వింటినిగాని గ్రహింప లేకపోతిని -నా యేలినవాడా , వీటికి అంత మేమని నేనడుగగా
అప్పుడాయన జనసమూహములను పంపివేసి, యింటి లోనికి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిపొలము లోని గురుగులను గూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి.
పెద్దలలో ఒకడు -తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.
అందుకు నేను - అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను -వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.