వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచువచ్చెను.
ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజలయెదుటనుండి తొలగింపలేదు.
మేఘస్తంభములోనుండి ఆయన వారితో మాటలాడెను వారు ఆయన శాసనములననుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి
మనుష్యుడు తన స్నేహితుని తో మాటలాడు నట్లు యెహోవా మోషే తో ముఖా ముఖిగా మాటలాడుచుండెను . తరువాత అతడు పాళెము లోనికి తిరిగి వచ్చుచుండెను . అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను ¸యౌవనస్థుడు గుడారము లోనుండి వెలుపలికి రా లేదు .
అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణా పీఠముమీద నుండియు, శాసనములుగల మందసముమీదనుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను.
మరియు ఆయన సీనాయి కొండమీద మోషే తో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములుగల రెండు పలకలను , అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను .
ఏ నరుడును నీతో ఈ కొండకు రా కూడదు ; ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడ కూడదు ; ఈ కొండ యెదుట గొఱ్ఱలైనను ఎద్దులైనను మేయ కూడదని సెలవిచ్చెను.
ప్రభువా , నామీద నీకు కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతోకూడ రావలెను . వీరు లోబడ నొల్లని ప్రజలు , మా దోషమును పాపమున
దేవుడు అబ్రాహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్దనుండి పరమునకు వెళ్లెను.
యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను.
నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను; ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో నొక పాలు నీతోకూడ భరింపవలెను.
అక్కడ యెహోవా హస్తము నామీదికి వచ్చి , నీవు లేచి మైదానపు భూమికి వెళ్లుము , అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను .