
చిత్తగించుము , నీవు వృద్ధుడవు , నీ కుమారులు నీ ప్రవర్తనవంటి ప్రవర్తన గలవారు కారు గనుక, సకల జనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము , అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి .
మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థనచేసెను .
అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా -జనులు నీతో చెప్పిన మాట లన్నిటి ప్రకారము జరిగింపుము ; వారు నిన్ను విసర్జింప లేదు గాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు .
వారు నన్ను విసర్జించి , యితర దేవతలను పూజించి , నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచువచ్చిన కార్యము లన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు ; వారు చెప్పిన మాటలను అంగీకరించుము .
అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము .
సమూయేలు తనను, రాజును అడిగిన జనులకు యెహోవా మాట లన్ని వినిపించి
ఈలాగున చెప్పెను -మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివా డగుననగా , అతడు మీ కుమారులను పట్టుకొని , తన రథములను తోలుటకును తన గుఱ్ఱములను కాపాడుటకును వారిని ఉంచుకొనును , కొందరు అతని రథముల ముందర పరగెత్తుదురు .
మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రా ధిపతులుగాను పంచదశా ధిపతులుగాను నియమించును ; తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధా యుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును.
మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారినిగాను పెట్టుకొనును .
మీ పొలములలోను మీ ద్రాక్షతోటలలోను ఒలీవతోటలలోను శ్రేష్ఠమైనవాటిని తీసికొని తన సేవకుల కిచ్చును .
మీ ధాన్యములోను ద్రాక్షపండ్లలోను పదియవ భాగము తీసి తన పరివారజనమునకును సేవకులకును ఇచ్చును .
మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్దభములలోను శ్రేష్ఠమైన వాటిని పట్టుకొని తన పనికొరకు ఉంచుకొనును .
మీ మందలో పదియవభాగము పట్టుకొనును, మీమట్టుకు మీరు అతనికి దాసు లవుదురు .
ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొఱ్ఱపెట్టినను యెహోవా మీ మొఱ్ఱవి నక పోవును అనెను.
అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక -ఆలాగున కాదు ,
జనములు చేయురీతిని మేము ను చేయునట్లు మాకు రాజు కావలెను , మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించుననిరి .
సమూయేలు జనులయొక్క మాట లన్నిటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను
గనుక యెహోవా -నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలు నకు సెలవియ్యగా సమూయేలు -మీరందరు మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను .
అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే , మీ దేవుడైన యెహోవా మీకు రాజైయున్నను -ఆయన కాదు , ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి .
కాబట్టి మీరు కోరి యేర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీమీద రాజుగా నిర్ణయించి యున్నాడు.
మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును .
అయితే యెహోవా మాట వి నక ఆయన ఆజ్ఞను భంగము చేసినయెడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును .
మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి .
గోధుమ కోతకాలము ఇదే గదా ? మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలిసికొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను .
సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జను లందరు యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి
సమూయేలు తో ఇట్లనిరి -రాజును నియమించుమని మేము అడుగుటచేత మా పాపము లన్నిటిని మించిన కీడు మేము చేసితివిు . కాబట్టి మేము మరణము కాకుండ నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము .
అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలముపోసి అతని ముద్దు పెట్టుకొని-యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించియున్నాడు అని చెప్పి యీలాగు సెలవిచ్చెను
బెన్యామీను గోత్రమును వారి యింటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మథ్రీ యింటి కూటము ఏర్పడెను . తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను . అయితే జనులు అతని వెదకినప్పుడు అతడు కనబడ లేదు .
కావున వారు-ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి యున్నదా అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా -ఇదిగో అతడు సామాను లో దాగియున్నాడని సెలవిచ్చెను .
వారు పరుగెత్తిపోయి అక్కడనుండి అతని తోడుకొనివచ్చిరి ; అతడు జనసమూహము లో నిలిచి నప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటె ఎత్తుగలవాడుగా కనబడెను.
అప్పుడు సమూయేలు -జను లందరిలో యెహోవా ఏర్పరచి నవానిని మీరు చూచితిరా ? జను లందరిలో అతనివంటివాడొకడును లేడని చెప్పగా , జను లందరు బొబ్బలు పెట్టుచు-రాజు చిరంజీవి యగుగాక అని కేకలువేసిరి .
తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి , ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను . అంతట సమూయేలు జను లందరిని వారి వారి ఇండ్లకు పంపివేసెను .
సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయెను . దేవునిచేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్లిరి.
జను లందరు గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధానబలులను అర్పించి , యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయు లందరును అక్కడ బహుగా సంతోషించిరి .
ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులగు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను ; యెహోవా మాట వినుము
అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయు డొక డుండెను . కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు .
అతనికి సౌలు అను నొక కుమారు డుండెను . అతడు బహు సౌందర్యముగల యౌవనుడు , ఇశ్రాయేలీ యులలో అతనిపాటి సుందరు డొకడును లేడు . అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటె ఎత్తు గలవాడు.
బెన్యామీను గోత్రమును వారి యింటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మథ్రీ యింటి కూటము ఏర్పడెను . తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను . అయితే జనులు అతని వెదకినప్పుడు అతడు కనబడ లేదు .