పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతని చేత బాప్తిస్మము పొందక , తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి .
ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకు డొకడు లేచి బోధకుడా , నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను .
అందుకాయన ధర్మశాస్త్ర మందేమి వ్రాయబడియున్నది ? నీవేమి చదువుచున్నావని అతని నడుగగా
అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను , నీ పూర్ణ మనస్సుతోను , నీ పూర్ణ శక్తితోను , నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు , నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు , వ్రాయబడియున్నాదని చెప్పెను.
అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి ; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను .
అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి , అతడు అవును గాని నా పొరుగువా డెవడని యేసు నడిగెను .
అందుకు యేసు ఇట్లనెను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోపట్టణము నకు దిగి వెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను ; వారు అతని బట్టలు దోచుకొని , అతని కొట్టి కొరప్రాణముతో విడిచి
అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను . అతడు అతనిని చూచి , ప్రక్కగా పోయెను .
ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను .
అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు , అతడు పడియున్నచోటికి వచ్చి
అతనిని చూచి , అతనిమీద జాలిపడి , దగ్గరకుపోయి , నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి , తన వాహనము మీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరమర్శించెను
మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్లవాని కిచ్చి ఇతని పరామర్శించుము , నీవింకే మైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను .
కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువా డాయెనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు --అతని మీద జాలి పడినవాడే అనెను .
అందుకు యేసు నీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను .
అప్పుడు ధర్మశాస్త్రోపదేశకు డొకడు బోధకుడా , యీలాగు చెప్పి మమ్మును కూడ నిందించుచున్నావని ఆయనతో చెప్పగా
ఆయన అయ్యో , ధర్మశాస్త్రోపదేశకులారా , మోయ శక్యముకాని బరువులను మీరు మనష్యులమీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్ట రు .
అయ్యో , ధర్మశాస్త్రోపదేశకులారా , మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొని పోతిరి ; మీరును లోపల ప్రవేశిం పరు , ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను .
యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా ?
ధర్మశాస్త్రవేదియైన జేనాను అపొల్లోనును శీఘ్రముగా సాగనంపుము; వారికేమియు తక్కువ లేకుండ చూడుము.
యేసు వారి చెడుతన మెరిగివేషధారులారా, నన్నెందుకు శోధించు చున్నారు?
పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, ఆయనను శోధించుటకైపురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని ఆయన నడిగిరి.