ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులనర్పించిరి , విగ్రహములకు ధూపము వేసిరి.
ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు ; తూర్పు గాలిని వెంటాడుచున్నాడు ; మానక దినమెల్ల అబద్ద మాడుచు, బలాత్కారము చేయుచున్నాడు; జనులు అష్షూరీయు లతో సంధి చేసెదరు , ఐగుప్తునకు తైలము పంపించెదరు .
ఇప్పుడు వారు పాపము పెంపుచేయుదురు , తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు , అదంతయు పనివారు చేయు పనియే , వాటికి బలులను అర్పించు వారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు .
ఒకడు మరియొకనితో వాదించినను ప్రయోజనము లేదు ; ఒకని గద్దించినను కార్యము కాకపోవును ; నీ జనులు యాజకునితో జగడమాడువారిని పోలియున్నారు.
వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను.
అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైనవాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండనిమ్ము.