
అప్పుడతడు మూడవనాటికి సిద్ధముగా నుండుడి; ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను.
యాజకుడు -సాధారణమైన రొట్టె నాయొద్ద లేదు ; పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను .
అందుకు దావీదు -నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటినుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరముగానే యున్నారు; పనివారి బట్టలు పవిత్రములే ; ఒకవేళ మేముచేయుకార్యము అపవిత్రమైనయెడల నేమి? రాజాజ్ఞనుబట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను .
జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును.
యెహోవాను శాంతిపరచుటకై మందిరము నొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా
దేశనివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు , దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను , వారి భార్యలు ప్రత్యేకముగాను , నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను , వారి భార్యలు ప్రత్యేకముగాను ,
లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను , వారి భార్యలు ప్రత్యేకముగాను , షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను , వారి భార్యలు ప్రత్యేకముగాను ,
మిగిలిన వారిలో ప్రతి కుటుంబపువారు ప్రత్యేకముగాను , వారి భార్యలు ప్రత్యేకముగాను , ప్రలాపింతురు.
అందు కాయనఅనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు.
ఇందుచేత నేనును ఇకను నహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమై పోయెనేమో అనియు, మీ విశ్వాసమును తెలిసికొనవలెనని అతని పంపితిని.