ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి.
దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడిఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పు కొనిరి.
అప్పుడు దయ్యముపట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థ పరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను.
అందుకు ప్రజలందరు విస్మయమొంది ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొను చుండిరి.
మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమ పరచిరి.
అందు కందరు విస్మయ మొంది ఇది ఎట్టి మాట ? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రా త్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదలిపోవుచున్నవని యొకనితో నొకడు చెప్పుకొనిరి .
ఆయన తన పండ్రెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి
ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషము తో తిరిగి వచ్చి ప్రభువా , దయ్యములు కూడ నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా
ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని .
ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బల మంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను ; ఏదియు మీ కెంతమాత్రమును హాని చేయదు .
అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతో షింపక మీ పేరులు పరలోక మందు వ్రాయబడి యున్నవని సంతోషించుడని వారితో చెప్పెను .