యెహోవా ఆ మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.
అతడు పాళెము నకు సమీపింపగా , ఆ దూడను , వారు నాట్యమాడుటను చూచెను . అందుకు మోషే కోపము మండెను ; అతడు కొండ దిగువను తన చేతుల లోనుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను .
అహరోను నా యేలినవాడా , నీ కోపము మండ నియ్యకుము . ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు .
అప్పుడు మోషే పాపపరిహారార్థబలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదకినప్పుడు అది కాలిపోయియుండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారిమీద ఆగ్రహపడి
తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు -యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితి ననగా
సమూయేలు -ఆలాగైతే నాకు వినబడుచున్న గొఱ్ఱల అరుపులును ఎడ్ల రంకెలును ఎక్కడివి ? అని అడిగెను .
అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చునదేమనగా నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలోనుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులును అప్పగింపబడుదురని రాజుతో అనగా
అందు నిమిత్తము దైవజనుడు అతనిమీద కోపగించి నీవు అయిదుమారులైన ఆరుమారులైన కొట్టిన యెడల సిరియనులు నాశనమగువరకు నీవు వారిని హతము చేసియుందువు; అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను.
కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపమునిలిచియుండకూడదు.