
నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడును నీ సముఖమున నిలిచి నీ జ్ఞానసంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది.
నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనముమీద ఆసీనుడవై యుండునట్లు నీయందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగియున్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించెను అని చెప్పెను.
జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు.
వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు.
అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.
నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుటచేత మూఢులు చనిపోవుదురు.
జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.
ఆమెకు మరియ అను సహోదరి యుండెను . ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను .
మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి , ఆయనయొద్దకు వచ్చి–ప్రభువా , నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున , నీకు చింతలేదా ? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను .
అందుకు ప్రభువు–మార్తా , మార్తా , నీవనేకమైన పనులను గూర్చి విచారముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే
మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను , అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను .
ఆయన–అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.
దక్షిణదేశపు రాణి విమర్శకాలమున ఈ తరము వారితో కూడ లేచి వారిమీద నేరస్థాపనచేయును . ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యం తములనుండి వచ్చెను , ఇదిగో సొలొమోనుకంటె గొప్పవా డిక్కడ ఉన్నాడు.