
అంతట ఆయన వారితో కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసికొనెను.
ప్రభువు హస్తము అతనికి తోడై యుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినినవారందరును–ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సు లో ఉంచుకొనిరి.
ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్య పడుచుండగా ఆయన–ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను.
అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను.
దావీదు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను .
ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు.
జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు , బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు ; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి , నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు .