ఇశ్రాయేలీయులలో మూడు వేలమందిని ఏర్పరచుకొనెను . వీరిలో రెండు వేలమంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలు నొద్ద నుండిరి ; వెయ్యిమంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్ద నుండిరి ; మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను .
భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు.
నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడుచేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు.
గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు
వారి న్యాయాధిపతులు కొండ పేటుమీదనుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు.