అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను .
మోషే శాసనములుగల రెండు పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను . ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి ; అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడియుండెను .
ఆ పలకలు దేవుడు చేసినవి ; ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత .
ఆ ప్రజలు పెద్దకేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధ ధ్వని అని మోషే తో అనగా
అతడు అది జయ ధ్వని కాదు , అపజయ ధ్వని కాదు , సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను .
అతడు పాళెము నకు సమీపింపగా , ఆ దూడను , వారు నాట్యమాడుటను చూచెను . అందుకు మోషే కోపము మండెను ; అతడు కొండ దిగువను తన చేతుల లోనుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను .
మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసికొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీ యులచేత దాని త్రాగించెను .
అప్పుడు మోషే నీవు ఈ ప్రజలమీదికి ఈ గొప్ప పాపము రప్పించునట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను ను నడుగగా
అహరోను నా యేలినవాడా , నీ కోపము మండ నియ్యకుము . ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు .
వారుమాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము ; ఐగుప్తు లోనుండి మమ్మును రప్పించినవాడగు ఈ మోషే యే మాయెనో మాకు తెలియ దనిరి .
అందుకు నేనుఎవరియొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పితిని. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ యాయెన నెను .
ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను . వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచి పెట్టి యుండెను.
అందుకు మోషే పాళెముయొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున నున్నవారందరు నాయొద్దకు రండి అనగా లేవీ యులం దరును అతని యొద్దకు కూడివచ్చిరి .
అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుము న కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్లుచు , ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నా డనెను .
లేవీ యులు మోషే మాటచొప్పున చేయగా , ఆ దినమున ప్రజల లో ఇంచుమించు మూడు వేల మంది కూలిరి .
ఏలయనగా మోషే వారిని చూచి నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియేగాని తన సహోదరుని మీద పడియేగాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసికొనుడనెను .
మరునాడు మోషే ప్రజల తో మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ యెక్కి వెళ్లెదను ; ఒకవేళ మీ పాపము నకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను .
అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి అయ్యో యీ ప్రజలు గొప్ప పాపము చేసిరి ; వారు బంగారు దేవతను తమకొరకు చేసికొనిరి .
అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా , లేని యెడల నీవు వ్రాసిన నీ గ్రంథము లోనుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నా ననెను .
అందుకు యెహోవా యెవడు నా యెదుట పాపము చేసెనో వాని నా గ్రంథము లోనుండి తుడిచివేయుదును .
కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము . ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్లును . నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించెదనని మోషేతో చెప్పెను.
అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను .
అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశమువరకు అగ్నితో మండుచుండగా
మరియు ఆ పర్వతము అగ్నివలన మండుచున్నప్పుడు ఆ చీకటిమధ్యనుండి ఆ స్వరమును విని మీరు, అనగా మీ గోత్రముల ప్రధానులును మీ పెద్దలును నాయొద్దకు వచ్చి
మోషే తనకఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తుదేశముమీద వడగండ్లు కురిపించెను.
యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగివచ్చినందున అదంతయు ధూమమయమైయుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను.
స్పృశించి తెలిసికొనదగినట్టియు, మండుచున్నట్టియు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధ కారమునకును, తుపానుకును,