అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కనబడెను.
కాబట్టి యెహోవా సెలవిచ్చునదేమనగా-వాత్సల్యముగలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్టబడును; యెరూషలేముమీద శిల్పకారులు నూలు సాగలాగుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడుండెను . ఆయన మెరయుచున్న యిత్తడి వలె కనబడెను , దారమును కొల కఱ్ఱయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను .
నేను చూడగా నలుదిశల మందిరము చుట్టు ప్రాకార ముండెను, మరియు ఆ మనుష్యుని చేతిలో ఆరు మూరల కొల కఱ్ఱయుండెను , ప్రతిమూర మూరెడు బెత్తెడు నిడివి గలది, ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని యెత్తును బార న్నర తేలెను.
ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను, ఇంక ఆయన వెయ్యిమూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను.
మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చి -నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము.
ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడువాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.