గిద్యోను చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏమాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.
మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చబోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతులును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు.
మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటినుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గముచేతను క్షామముచేతను క్షీణించుచున్నాము.
మేము ఆకాశ రాణికి ధూపము వేయగాను, ఆమెకు పానార్పణములు అర్పింపగాను, మా పురుషుల సెలవులేకుండ ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా? ఆమెకు పానార్పణములు పోయుచున్నామా? అని వారు చెప్పగా
భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.
దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయియుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనియుండిరి.
వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను
వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని ? మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను.
వారి అవివేక హృదయము అంధకారమయమాయెను ; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి .
వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు , పక్షులయొక్కయు , చతుష్పాద జంతువులయొక్కయు , పురుగులయొక్కయు , ప్రతిమాస్వరూపముగా మార్చిరి .
ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి , తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను .
అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి , సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి . యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు , ఆమేన్ .
అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను . వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి .
అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి , పురుషుల తో పురుషులు అవాచ్యమైనది చేయుచు , తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి .
మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను .
అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను , దుష్టత్వముచేతను , లోభముచేతను , ఈర్ష్యచేతను నిండుకొని , మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై
కొండెగాండ్రును అపవాదకులును , దేవద్వేషులును , హింసకులును , అహంకారులును , బింకములాడువారును , చెడ్డవాటిని కల్పించువారును , తలిదండ్రుల కవిధేయులును , అవివేకులును
మాట తప్పువారును అనురాగ రహితులును , నిర్దయులునైరి .
ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు , వాటిని చేయుచున్నారు . ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు .
ఆలాగైన ఏమందుము ? మేము వారికంటె శ్రేష్ఠులమా ? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము . యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపము నకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము .
ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు , ఒక్కడును లేడు
గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు
అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి .మేలు చేయువాడు లేడు , ఒక్కడైనను లేడు .
వారి గొంతుక తెరచిన సమాధి , తమ నాలుకతో మోసము చేయుదురు;వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది
వారి నోటి నిండ శపించుటయు పగయు ఉన్నవి.
రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి.
నాశనమును కష్టమును వారి మార్గము లలో ఉన్నవి.
శాంతి మార్గము వారెరుగరు .
వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు .
ప్రతి నోరు మూయబడునట్లును , సర్వ లోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును , ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటి నన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదుము .