అయితే ఒకడు తన పొరుగువానిమీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినయెడల వాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవలెను.
దహనబలుల నర్పించుట సమాప్తికాగా యెహూ మీరు లోపల చొచ్చి యొకడైనను బయటికి రాకుండ వారిని చంపుడని తన కావలివారితోను అధిపతులతోను చెప్పగా వారు అందరిని హతము చేసిరి. పిమ్మట కావలివారును అధిపతులును వారిని బయటవేసి , బయలు గుడియున్న పట్టణమునకు పోయి
మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని రాజు చుట్టు కాచుకొని యుండవలెను, ఎవడైనను పంక్తులలో ప్రవేశించినయెడల వాని చంపవలెను , రాజు బయలుదేరి సంచరించునప్పుడెల్ల మీరు అతనియొద్ద ఉండవలెను .
యాజకుడైన యెహోయాదా సైన్యములోని శతా ధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంప కూడదు , పంక్తుల బయటికి ఆమెను వెళ్లగొట్టుడి ; ఆమె పక్షపువారిని ఖడ్గముచేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక
ఆయన మందిరమును అపవిత్రపరచుడి , ఆవరణములను హతమైనవారితో నింపుడి , మొదలుపెట్టుడి అని సెలవిచ్చెను గనుక వారు బయలుదేరి పట్టణములోని వారిని హతము చేయసాగిరి .