బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్యచేయు చుండెను.
కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను ; తాను బ్రదుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను .
బాలుడైన సమూయేలు ఏలీ యెదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు , ప్రత్యక్షము తరుచుగా తటస్థించుట లేదు .
తరువాత సమూయేలు ఉదయ మగువరకు పండుకొని , లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెనుగాని , భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పక పోయెను.