అధిపతి బయట మంటపమునకు పోవుమార్గముగా ప్రవేశించి , గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా , యాజకులు దహనబలిపశువులను సమాధానబలిపశువులను అతనికి సిద్ధపరచవలెను ; అతడు గుమ్మము దగ్గర నిలువబడి ఆరాధనచేసిన తరువాత వెలుపలికి పోవును , అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయ కూడదు .
తూర్పుతట్టు చూచు పరిశుద్ధస్థలముయొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి యుండెను.
అంతట యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మముద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దానిద్వారా ప్రవేశింప కుండునట్లు ఎన్నడును తీయ బడకుండ అది మూయబడియే యుండును .
అధిపతి యగువాడు తన ఆధిపత్యమునుబట్టి యెహోవా సన్నిధిని ఆహారము భుజించునప్పుడు అతడచ్చట కూర్చుండును ; అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటపమార్గముగా బయటికి పోవలెను .
సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము , ఆయన ఆదియైయుండి మృతులలో నుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను .