తూరునుగూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు, హతులగుచున్నవారి కేకలును, నీలో జరుగు గొప్పవధయు ద్వీపములు విని కంపించును.
సముద్రపు అధిపతులందరును తమ సింహాసనములమీదనుండి దిగి, తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి, దిగులుపడినవారై నేలను కూర్చుండి గడగడ వణకుచు నిన్ను చూచి విస్మయపడుదురు.
వారు నిన్నుగూర్చి అంగలార్పు వచన మెత్తి ఈలాగున అందురు సముద్ర నివాసమైనదానా , ఖ్యాతినొందిన పట్ణణమా , నీవెట్లు నాశనమైతివి ? సముద్ర ప్రయాణము చేయుటవలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను , సముద్రవాసు లందరిని భీతిల్ల చేసినది ఇదే.
ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి , నీవు వెళ్లిపోవుట చూచి సముద్ర ద్వీపములు కదలుచున్నవి .
తర్షీషునకు వెళ్లుడి సముద్రతీరవాసులారా, అంగలార్చుడి.
నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై , నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి , కావున నేను నిన్ను నేలను పడవేసెదను , రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించెదను .
నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసికొనిన విస్తార దోషములచేత నీవు నీ పరిశుద్ధస్థలములను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను , అది నిన్ను కాల్చివేయును , జనులందరు చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదెగా చేసెదను .
జనులలో నిన్ను ఎరిగిన వారందరును నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు . నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు .
నా ఖడ్గమును నేను వారిమీద ఝళిపించెదను , నిన్నుబట్టి చాలమంది జనులు కలవరించుదురు , వారి రాజులును నిన్నుబట్టి భీతులగుదురు , నీవు కూలు దినమున వారందరును ఎడతెగక ప్రాణభయముచేత వణకుదురు .
దానితో వ్యభిచారముచేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహనధూమమును చూచునప్పుడు
దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు--అయ్యో, అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పువచ్చెను గదా అని చెప్పుకొందురు.