యెహోషువ మీరు వెళ్లి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పుదిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికోనుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి
గెబనివాసులగు బెన్యామీనీయులు మిక్మషులోను హాయిలోను బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను
సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మచెట్టు క్రింద దిగియుండెను , అతని యొద్దనున్న జనులు దాదాపు ఆరు వందల మంది .
ఇశ్రాయేలీయులలో మూడు వేలమందిని ఏర్పరచుకొనెను . వీరిలో రెండు వేలమంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలు నొద్ద నుండిరి ; వెయ్యిమంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్ద నుండిరి ; మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను .
ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయు లతో యుద్ధముచేయుటకై ముప్పది వేల రథములను ఆరు వేల గుఱ్ఱపు రౌతులను సముద్రపు దరినుండు ఇసుకరేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగిరి .
ఒకదాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తరపువైపునను , రెండవదాని కొమ్ము గిబియా యెదుట దక్షిణపువైపునను ఉండెను .
ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషునుండి అయ్యాలోను వరకు హతముచేయగా జనులు బహు బడలిక నొందిరి.