వారు ఇయ్యవలసినది ఏమనగా , లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అర తులము ఇయ్యవలెను . ఆ తులము యిరువది చిన్నములు . ఆ అర తులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ .
అది మీ ప్రాణము లకు పరిక్రయధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అర తులము కంటె ఎక్కువ ఇయ్య కూడదు . బీదవాడు తక్కువ ఇయ్య కూడదు .
నీవు ఇశ్రాయేలీ యుల యొద్దనుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసికొని ప్రత్యక్షపు గుడారముయొక్క సేవ నిమిత్తము దాని నియమింపవలెను . మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీ యులకు జ్ఞాపకార్థముగా నుండును .
లెక్కింపబడి ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది యైరి.
అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు.
లెక్కింపబడి ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది యైరి.