అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను . వారు దాని తీసికొని రాగా
అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పు వేసి , యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ నీటిని నేను బాగుచేసి యున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగక పోవును . భూమియు నిస్సారముగా ఉండదు అనెను .
కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది .
అతడు పిండి కొంత తెమ్మనెను . వారు తేగా కుండలో దాని వేసి , జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను . వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను .
మరియు యెషయా అంజూరపుపండ్ల ముద్ద తీసికొని ఆ పుండుకు కట్టవలెను , అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను .