
అతనితో ప్రయాణముచేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని యెవనిని చూడక మౌనులై నిలువబడిరి.
దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతోకూడ నున్న మనుష్యులు దాని చూడ లేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి.
కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము–ఉరిమెను అనిరి. మరికొందరు–దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి.
అందుకు యేసు–ఈ శబ్దము నాకొరకు రాలేదు, మీకొరకే వచ్చెను.