అంతట సమూయేలు -ఇశ్రాయేలీయు లందరిని మిస్పాకు పిలువనంపుడి ; నేను మీపక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా
వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి -యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి . మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచువచ్చెను.
అంతట ఇశ్రాయేలీయులందరు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబావరకును గిలాదు దేశమువరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను.