ఆ ఆవులు రాజ మార్గమునబడి చక్కగా పోవుచు అరచుచు , బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి .
బేత్షెమెషువారు లోయలో తమ గోధుమ చేలను కోయుచుండిరి ; వారు కన్ను లెత్తి చూడగా మందసము వారికి కనబడెను , దానిని చూచి వారు సంతోషించిరి .
ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువయొక్క పొలము లోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతిదగ్గర నిలువగా , వారు బండి యొక్క కఱ్ఱలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి .
లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులుగల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా , ఆ దినమున బేత్షెమెషు వారు యెహోవాకు దహనబలులను అర్పించి బలులను వధించిరి .
ఫిలిష్తీయుల సర్దారులు అయిదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్లిరి
అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్డోదువారి నిమిత్తము ఒకటి , గాజావారి నిమిత్తము ఒకటి , అష్కెలోను వారి నిమిత్తము ఒకటి , గాతువారి నిమిత్తము ఒకటి , ఎక్రోనువారి నిమిత్తము ఒకటి .
ప్రాకారముగల పట్టణములవారేమి పొలములోని గ్రామములవారేమి ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారుల పట్టణము లన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువయొక్క పొలములో నున్నది.
బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతముచేసి ఆ జనులలో ఏబది వేల డెబ్బది మందిని మొత్తెను . యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి .
అప్పుడు బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువ గలరు ? మనయొద్దనుండి ఆయన ఎవరి యొద్దకు పోవలెనని చెప్పి
కిర్యత్యారీము కాపురస్థులకు దూతలను పంపి -ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరల తీసికొని వచ్చిరి; మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసికొని పోవలెనని వర్తమానము పంపిరి.
కయీను గిబియా తిమ్నా అనునవి, వాటి పల్లెలు పోగా పది పట్టణములు.
దాని మామ తన గొఱ్ఱల బొచ్చు కత్త్తిరించుటకు తిమ్నాతునకు వెళ్లుచున్నాడని తామారునకు తెలుపబడెను.
సమ్సోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను.
అప్పుడు సమ్సోను తన తలిదండ్రులతోకూడ తిమ్నాతునకు పోయి, తిమ్నాతు ద్రాక్షతోటలవరకు వచ్చినప్పుడు, కొదమసింహము అతని యెదుటికి బొబ్బరించుచువచ్చెను.