మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైన తుకికు, త్రోఫిమును అతనితోకూడ వచ్చిరి.
ఎరస్తు కొరింథు లో నిలిచిపోయెను . త్రోఫిము రోగియైనందున అతని మిలేతు లో విడిచివచ్చితిని .