వారాసముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి
మార్కు 4:35

ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా,

మత్తయి 8:28-34
28

ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేక పోయెను.

29

వారుఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి.

30

వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా

31

ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను.

32

ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందుల లోనికి పోయెను; ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను.

33

వాటిని మేపుచున్నవారు పారి పోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి.

34

ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి.

లూకా 8:26-39
26

వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి .

27

ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగావచ్చెను . వాడు దయ్యములు పట్టినవాడై , బహు కాలమునుండి బట్టలు కట్టు కొనక , సమాధుల లోనే గాని యింటిలో ఉండువాడు కాడు .

28

వాడు యేసును చూచి , కేకలువేసి ఆయన యెదుట సాగిలపడి యేసూ , సర్వోన్నతుడైన దేవుని కుమారుడా , నాతో నీకేమి ? నన్ను బాధ పరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలువేసి చెప్పెను .

29

ఏలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రా త్మకు ఆజ్ఞాపించెను . అది అనేక పర్యాయములు వానిని పట్టుచువచ్చెను గనుక వానిని గొలుసులతోను కాలిసంకెళ్లతోను కట్టి కావలియందుంచిరి గాని, వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవి లోనికి తరుముకొని పోయెను .

30

యేసు నీ పేరే మని వాని నడుగగా , చాల దయ్యములు వానిలో చొచ్చి యుండెను గనుక,

31

వాడు తన పేరు సేన అని చెప్పి , పాతాళము లోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింప వద్దని ఆయనను వేడుకొనెను .

32

అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను గనుక, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను .

33

అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచి పోయి పందుల లో చొచ్చెను గనుక, ఆ మంద ప్రపాతమునుండి సరస్సు లోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను .

34

మేపుచున్నవారు జరిగినదానిని చూచి , పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి .

35

జనులు జరిగినదానిని చూడవెళ్లి , యేసునొద్దకు వచ్చి , దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని , స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి .

36

అది చూచినవారు దయ్యములు పట్టినవాడేలాగు స్వస్థతపొందెనో జనులకు తెలియజేయగా

37

గెరసీనీయుల ప్రాంతములలోనుండు జను లందరు బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి . ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా , దయ్యములు వదలిపోయిన మనుష్యుడు , ఆయన తో కూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను .

38

అయితే ఆయన నీవు నీ యింటికి తిరిగి వెళ్లి , దేవుడు నీకెట్టి గొప్పకార్యములు చేసెనో తెలియ జేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను ; వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్పకార్యములు చెసెనో ఆ పట్టణ మందంతటను ప్రకటించేను .

39

జనసమూహము ఆయనకొరకు ఎదురుచూచు చుండెను గనుక యేసు తిరిగివచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి .