అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను.
యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.
ఆయన నే నితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింప వలెను ; ఇందునిమిత్తమే నేను పంపబడితినని వారి తో చెప్పెను .
తరువాత ఆయన యూదయ సమాజమందిరము లలో ప్రకటించుచుండెను .
ఆమె యింటికి వచ్చి , తన కుమార్తె మంచముమీద పండుకొని యుండుటయు దయ్యము వదలి పోయి యుండుటయు చూచెను.
ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలి పోయెను ; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి యుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయ లేదు .