
అంతట రెండవవాడు వచ్చి– అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా
అతడు–నీవును అయిదు పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను.
బోధించువా డైతే బోధించుట లోను, హెచ్చరించువా డైతే హెచ్చరించుట లోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సు తోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్త తోను, కరుణించువాడు సంతోషము తోను పని జరిగింపవలెను.
సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి మీకు తెలియజేయుచున్నాము.
ఏలాగనగా, వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను.
ఈ కృపవిషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు,