అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేసి, తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట యను తమ చెడుతనమంతటినిబట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును.
కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని, అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయకృత్యములనుబట్టి అయ్యో అని అంగలార్చుము ; ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారు కూలుదురు .
దూరముననున్న వారు తెగులుచేత చత్తురు , దగ్గర నున్నవారు ఖడ్గముచేత కూలుదురు , శేషించి ముట్టడి వేయబడినవారు క్షామముచేత చత్తురు ; ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును .
తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠముల చుట్టును ఎత్తయిన కొండ లన్నిటి మీదను సకల పర్వతముల నడి కొప్పులమీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను , పుష్టిపారిన మస్తకి వృక్షము లన్నిటి క్రిందను , తమ విగ్రహము లన్నిటికి పరిమళ ధూపమువేసిన చోటులన్నిటిలోను పడి వారి జనులు హతులై యుండు కాలమున నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు .
ఇంక కొంతసేపటికి నేను నా క్రోధమును నీమీద కుమ్మరింతును , నీమీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి , నీ సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించెదను .
యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై యున్నానని నీవెరుగునట్లు నీ యెడల కటాక్ష ముంచకయు కనికరము చూపకయు నుందును, నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపజేసెదను , నీ హేయకృత్యములు నీ మధ్య నుండనిత్తును .