గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.
గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,
ఉజ్జా కుమారుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా.
మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీయాహు సంతతిలో బెనోయును.
యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ.
మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి.
కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు.
మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు,వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీయులు.
మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమ తమ వంశావళులచొప్పున లేవి కుటుంబములు.