ఇశ్రాయేలీయుల గోత్రము లన్నిటిని సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను .
బెన్యామీను గోత్రమును వారి యింటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మథ్రీ యింటి కూటము ఏర్పడెను . తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను . అయితే జనులు అతని వెదకినప్పుడు అతడు కనబడ లేదు .
సౌలు సంబంధులగు బెన్యామీనీయులు మూడువేలమంది; అప్పటివరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు గాపాడుచుండిరి.
కనిష్ఠుడగు బెన్యామీను అను, వారి యేలిక అచ్చట నున్నాడు. యూదా అధిపతుల పరివారమచ్చటనున్నది జెబూలూను అధిపతులును నఫ్తాలి అధిపతులును ఉన్నారు.