యెహోవా సమూయేలును పిలిచెను . అతడుచిత్తమండి నేనున్నానని చెప్పి
ఏలీ దగ్గరకు పోయి -నీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చినాననెను . అతడు-నేను పిలువ లేదు , పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను .
యెహోవా మరల సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి -చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను . అయితే అతడు నా కుమారుడా , నేను నిన్ను పిలువ లేదు , పోయి పండుకొమ్మ నెను .