ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు,
మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమముచొప్పున
దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య గోమేధిక మరకతములుగల పంక్తి మొదటిది;
పద్మరాగ నీల సూర్యకాంతములుగల పంక్తి రెండవది;
గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములుగల పంక్తి మూడవది;
రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములుగల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను.
ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులుగలవై వారి పేరులచొప్పున పండ్రెండుండవలెను. ముద్రమీద చెక్కినవాటివలె వారిలో ప్రతివాని పేరు చొప్పున పండ్రెండు గోత్రముల పేరులు ఉండవలెను.
మరియు బంగారు జవలలో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరచిరి . ముద్రలు చెక్కబడునట్లు ఇశ్రాయేలీయుల పేళ్లు వాటిమీద చెక్కబడెను .
అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజముల మీద వాటిని ఉంచెను . అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను .
మరియు అతడు ఏఫోదు పనివలె బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల పంక్తులతోను సన్ననారతోను చిత్రకారుని పనిగా పతకమును చేసెను .
అది చచ్చౌకముగా నుండెను . ఆ పతకమును మడతగా చేసిరి . అది మడవబడినదై జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలది .
వారు దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి . మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది ;
పద్మరాగ నీల సూర్యకాంత మణులుగల పంక్తి రెండవది ;
గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలమునుగల పంక్తి మూడవది ;
రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది ; వాటివాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడెను .
ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేళ్ల చొప్పున , పం డ్రెండు ముద్రలవలె చెక్కబడిన వారి పేళ్ల చొప్పున , పం డ్రెండు గోత్రముల పేళ్ళు ఒక్కొక్కదానిమీద ఒక్కొక్క పేరు చెక్కబడెను.