
యెహోవా సమూయేలును పిలిచెను. అతడు–చిత్తమండి నేనున్నానని చెప్పి
ఏలీ దగ్గరకు పోయి -నీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చినాననెను. అతడు-నేను పిలువ లేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను.
యెహోవా మరల సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి -చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలువ లేదు, పోయి పండుకొమ్మ నెను.